-
20 నుంచి అంతర్జాతీయ వ్యాయామ విద్య సెమినార్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామ విద్య డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి అంతర్జాతీయ సెమినార్ జరుగనుంది. ‘వ్యాయామ విద్య, స్పోర్ట్స్ సైన్స్’లలో నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో కూలంకషంగా చర్చించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మూడు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 600 మంది క్రీడాధికారులు ఇందులో పాల్గొననున్నారు. వీరితో పాటు వ్యాయామ విద్య ప్రొఫెసర్లు, స్పోర్ట్స్ సైంటిస్టులు, కోచ్లు, ట్రెయినర్లు, స్పోర్ట్స్ డాక్టర్లు, వ్యాయామ విద్య స్కాలర్లు, టీచర్లు ఈ సదస్సుకు హాజరై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమెరికా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగరాజు, నిజాం కాలేజి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బి. లక్ష్మయ్య , విశాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు . -
ఆటలకో పీరియడ్: సీబీఎస్ఈ ఆదేశం
న్యూఢిల్లీ: తన అనుబంధ పాఠశాలలన్నీ వచ్చే సంవత్సరం నుంచి విధిగా రోజూ క్రీడలకే ఒక పీరియడ్ కేటాయించాలని సీబీఎస్ఈ ఆదేశించింది. 9–12 తరగతి విద్యార్థుల్లో శారీరక, మానసిక ఉల్లాసం నింపేలా ఆటలు ఆడించాలని సూచిస్తూ 150 పేజీల మార్గదర్శకాలను విడుదల చేసింది. హెల్త్, ఫిజికల్ విద్య(హెచ్పీఈ)ని అకడమిక్స్లో భాగం చేస్తూ రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం..పాఠశాలల్లో రోజూ జరిగే ఆటల పీరియడ్లో విద్యార్థులంతా మైదానానికి వెళ్లి, బోర్డు పేర్కొన్న జాబితాలోని ఏదో ఒక ఆట లేదా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అందులో విద్యార్థులకు ఇచ్చే గ్రేడ్లను పాఠశాలలు సీబీఎస్ఈ వెబ్సైట్లో పొందుపర్చాలి. విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరవ్వాలంటే హెచ్పీఈలో పాల్గొనడం తప్పనిసరి. అయితే ఇలా వచ్చే గ్రేడ్లను ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కులకు కలపరు. -
టీఆర్టీ దరఖాస్తుల్లో సవరణకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరోసారి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని, ఇకపై మళ్లీ అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల దరఖాస్తుల్లో అభ్యర్థులు తమ జిల్లా విషయంలో పొరపాట్లు చేశారని దీంతో వారికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని పేర్కొంది. ఆ సమయంలోనూ చాలా మంది మళ్లీ పొరపాట్లు చేశా రని తెలిపింది. 31 జిల్లాల ప్రకారం చేసిన దరఖాస్తుల్లోనూ పొరపాట్లు చేశారని వెల్ల డించింది. మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని తెలిపింది. -
వ్యాయామ విద్యను విస్తరించాలి
జాతీయ సదస్సులో హెచ్సీఏ అధ్యక్షుడు వివేక్ వ్యాఖ్య ఉస్మానియా యూనివర్సిటీ: ఆరోగ్యంతో పాటు చురుగ్గా ఉండేందుకు వ్యాయామ విద్యను మరింత విస్తరించాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు వివేక్ అన్నారు. శనివారం ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ‘ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్–2017’ అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఓయూ వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అధ్యక్షత వహించగా, వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా వ్యాయామ విద్య విస్తరించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల్లో వ్యాయామ విద్యపై ఆసక్తిని పెంచాలన్నారు. విశ్వవిద్యాలయాల కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. హెచ్సీఏ తరఫున ఓయూ క్యాంపస్లో ఆధునిక హంగులతో క్రికెట్ పిచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఓయూలో సింథటిక్ ట్రాక్ను కూడా నిర్మిస్తామని చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, పది దేశాల నుంచి 450 ప్రతినిధులు హాజరయ్యారని సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ చెప్పారు. అధ్యాపకులు, పరిశోధన విద్యార్థుల నుంచి 300 పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు చెప్పారు. అనంతరం సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, వ్యాయామ విద్య వీసీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
విజేతలు రమేశ్, తేజస్వి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్లో ఆదివారం జరిగిన సమ్మర్ రోడ్ రన్ పోటీల్లో రమేశ్, తేజస్వి విజేతలుగా నిలిచారు. అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పురుషుల 5కె రన్లో సికింద్రాబాద్ పీజీ కాలేజ్కి చెందిన రమేశ్ 15 నిమిషాల 55.7 సెకన్లలో పరుగు పూర్తి చేసి టైటిల్ సాధించాడు. ఈ పోటీల్లో సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థకు చెందిన పవన్ తేజ (16ని.00.9 సెకన్లు), జెడ్పీహెచ్ఎస్ మేకగూడకి చెందిన శ్రీనివాస్ (16ని.00.9 సెకన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల 5కె రన్లో పి.తేజస్వి (సెయింట్ పాయిస్–25ని.02.1 సెకన్లు) విజేతగా నిలిచింది. హిమబిందు (రెడ్డి కాలేజ్–26ని.03.2 సెకన్లు), నిత్య (జేజీఎస్–26ని.20.1 సెకన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ లయన్ శ్రీనివాస్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఇతర విభాగాల ఫలితాలు: బాలురు: అండర్–16 5కె: 1. అజయ్కుమార్ ( (డీఎల్ఎస్–17ని.56.3 సెకన్లు), 2. రాయుడు (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ, 18.01.1), 3. సుమిత్ (హైదరాబాద్,18.04.3). అండర్–13 (2.5 కి.మీ): 1. రమేశ్ సింగ్ (ఆర్మీ స్కూల్, 9.18.1), 2. చిన్నయ్య (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 9.29.3), 3. రంజిత్ కుమార్ (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 9.32.2). అండర్–10 (1.5 కి.మీ): 1. నందు ( జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.35.6), 2. భార్గవ్ (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.36.7), 3. రాజేశ్ (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.45.2). మాస్టర్ పురుషులు (2.5 కి.మీ): 1. సంజయ్ కుమార్ (లయన్స్ క్లబ్ ,12.14.1), 2. స్వాములు (12.45.9), 3. సుందర్ రాజన్ (ఎస్బీఐ, 14.12.6). బాలికలు: అండర్–16 (5 కి.మీ): 1. కీర్తి (రైల్వే జూనియర్ కాలేజ్, 20.59.1), 2. సౌజన్య (ఎస్జీబీహెచ్ఎస్, 21.59.1), 3. జువేరియా (హైదరాబాద్, 22.24.6); అండర్–13 (2.5 కి.మీ): 1. తస్లీమా (తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, 10.22.1), 2. యువిక (కెన్నడీ వీబీ, 10.29.1), 3. పి. శ్రేయ (మమత హెచ్ఎస్, 11.10.5); అండర్–10 (1.5 కి.మీ): 1. తేజస్వి (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.58.1), 2. శిరీష (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.59.6), 3. శ్రేయ (హైదరాబాద్, 9.44.7). మాస్టర్ మహిళలు: (2.5 కి.మీ) 1. రూప (14.01.1), 2. సునీత (హైదరాబాద్, 15.00.3), 3. సుబ్బలక్ష్మి (16.10.1).
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement