-
జియోఫోన్ ప్రైమా సేల్స్ షురూ - ధర రూ.2,599 మాత్రమే!
ముంబై: కై–ఓఎస్ ప్లాట్ఫామ్ ఆధారిత 4జీ స్మార్ట్ఫోన్ కీప్యాడ్తో జియోఫోన్ ప్రైమా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. రిటైల్ స్టోర్స్తో పాటు రిలయన్స్ డిజిటల్డాట్ఇన్, జియోమార్ట్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా విక్రయాలు ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 2,599గా ఉంటుంది. 2.4 అంగుళాల డిస్ప్లే స్క్రీన్, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ, 23 భాషలను సపోర్ట్ చేయడం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఫీచర్ ఫోన్ తరహాలోనే ఉన్నా వీడియో కాలింగ్, ఫొటోల కోసం డిజిటల్ కెమెరాలు, జియోటీవీ, జియోసినిమా వంటి ఎంటర్టైన్మెంట్ సర్వీసులు, జియోపే లాంటి యూపీఐ చెల్లింపుల విధానం మొదలైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి. -
అప్పుడు వాట్సాప్.. ఇప్పుడు మెసేజ్లు! బ్లాక్ చేస్తున్న ప్రముఖ బ్యాంకు..
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ (HSBC Holdings Plc).. తమ ఉద్యోగులు ఆఫీస్ మొబైల్ ఫోన్ల నుంచి మెసేజ్లు పంపే వీలు లేకుండా కట్టడి చేస్తోంది. అనధికారిక కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించడంపై రెగ్యులేటరీ సంస్థలు ఇటీవల చర్యలు చేపట్టిన నేపథ్యంలో హెచ్ఎస్బీసీ తమ సిబ్బందిని ఆఫీస్ ఫోన్లలో సందేశాలు పంపకుండా బ్లాక్ చేస్తోంది. కంపెనీ ఉద్యోగులకు జారీ చేసిన ఫోన్లలో మెసేజ్ ఫంక్షన్ను డిసేబుల్ చేసే ప్రక్రియలో ఉందని విషయం తెలిసిన కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. అంటే బ్యాంకు సిబ్బంది తమ ఆఫీస్ ఫోన్ల నుంచి సందేశాలను పంపలేరు, స్వీకరించలేరు. కాగా హెచ్ఎస్బీసీ ఇప్పటికే సిబ్బంది వర్క్ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించకుండా బ్లాక్ చేసింది. అయితే కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. వారు తమ వర్క్ ఫోన్ల నుంచి మెసేజ్లు పంపించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల వ్యక్తిగత ఫోన్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఆమోదించిన కమ్యూనికేషన్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు హెచ్ఎస్బీసీ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. సమాచారాన్ని పంచుకోవడానికి ట్రేడర్లు, డీల్మేకర్లు ఫోన్లు, సిస్టమ్లను ఎలా ఉపయోగిస్తున్నారు.. వారి యజమానులు వీటిని ఎలా ట్రాక్ చేస్తున్నారన్న దానిపై నియంత్రణ సంస్థలు పరిశోధిస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. వాల్ స్ట్రీట్లోని కొన్ని అతిపెద్ద బ్యాంకులలో మార్కెట్ మానిప్యులేషన్కు సంబంధించిన అధిక ప్రొఫైల్ కేసుల తర్వాత ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడమే లక్ష్యంగా రెగ్యులేటరీలు ఈ చర్యలు చేపట్టాయి. వందల కోట్ల జరిమానా వాట్సాప్తో సహా అనధికారిక మెసేజింగ్ యాప్లలో ఉద్యోగుల కమ్యూనికేషన్లను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు గానూ హెచ్ఎస్బీసీ ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ రెగ్యులేటరీ సంస్థకు పెద్ద మొత్తంలో జరిమానా కట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్కు 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 250 కోట్లు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు మరో 15 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 124 కోట్లు) చెల్లించింది. -
5జీ ఫోన్లపై ఆసక్తికర సర్వే.. ఎంత మంది అప్గ్రేడ్ అయ్యారు?
న్యూఢిల్లీ: దేశీయంగా అల్ట్రా హై–స్పీడ్ టెలికం సర్వీసుల వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో 5జీ స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి నుంచి డిసెంబర్ ఆఖరులోగా 3.1 కోట్ల మంది స్మార్ట్ఫోన్ యూజర్లు 5జీ ఫోన్లకు అప్గ్రేడ్ కానున్నారు. ప్రస్తుతం 5జీ హ్యాండ్సెట్ యూజర్ల సంఖ్య 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. స్వీడన్కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వినూత్నమైన, వైవిధ్యమైన 5జీ కనెక్టివిటీ సేవల కోసం కాస్త ఎక్కువ చెల్లించేందుకు కూడా కస్టమర్లు సిద్ధంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్లో దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. టెలికం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ గత కొద్ది నెలలుగా వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవలి ఊక్లా నివేదిక ప్రకారం 5జీ సేవల ఆవిష్కరణతో భారత్లో మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. స్పీడ్టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో జపాన్, బ్రిటన్, బ్రెజిల్ను కూడా దాటేసి, 72 స్థానాలు ఎగబాకి భారత్ 47వ ర్యాంకుకు చేరుకుంది. 5జీని ప్రవేశపెట్టాక భారత్లో స్పీడ్ 3.59 రెట్లు పెరిగింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు.. మనకన్నా ముందు నుంచే 5జీ సేవలను వినియోగిస్తున్న అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే భారత్లో యూజర్లు సగటున వారానికి రెండు గంటలు ఎక్కువ సమయాన్ని 5జీ సర్వీసులపై వెచ్చిస్తున్నారు. 5జీని ముందుగా అందుబాటులోకి తెచ్చిన మార్కెట్లతో పోలిస్తే భారత్లో 5జీపై సంతృప్తి స్థాయి అధికంగా ఉంది. 15 శాతం మంది వినియోగదారులు తమ 5జీ ప్లాన్లకు వీడియో ఆన్ డిమాండ్, గేమింగ్, మ్యూజిక్ వంటి అప్లికేషన్స్ను జోడించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వీసుల కోసం 14 శాతం ప్రీమియం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. నెలాఖరు వచ్చేసరికి 31 శాతం మంది 5జీ యూజర్లే తమ ప్లాన్లలో లభించే డేటాను పూర్తిగా వినియోగిస్తున్నారు. 58 శాతం మంది యూజర్ల ఖాతాల్లో 30 జీబీ పైగా డేటా మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ ధోరణులకు అనుగుణంగా డేటా వ్యూహాలను టెల్కోలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. -
వాళ్ళ లక్ష్యం చాట్ GPT యూజర్స్ భయపెడుతున్న కొత్త మాల్ వేర్స్.!
-
భారీ నష్టాల్లో శ్యాంసంగ్..రికార్డు స్థాయిలో పడిపోయిన సేల్స్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు
కొత్తిల్లు కొన్న రజనీ కూతురు.. గృహప్రవేశ వేడుక
పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!
చేజారిన కెప్టెన్సీ.. ఎట్టకేలకు మౌనం వీడిన రోహిత్ శర్మ
సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ
అందుకే ‘ఓటుకు నోటు’ విచారణ బదిలీ కోరుతున్నాం
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు
తప్పక చదవండి
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
Advertisement