-
ఉమ్మడి కరీంనగర్కు వందే భారత్ రైలు..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్–2023–24 ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు, డిమాండ్లు, పనులకు ప్రాధాన్యం దక్కుతుందా..? లేదా అన్న ఉత్కంఠ మొదలైంది. ఈ ప్రాంతంలో రవాణా, పర్యాటకం, పారిశ్రామికం, మానవ వనరులతోపాటు అన్నిరంగాల్లోనూ ముందంజలో ఉంచేందుకు దోహదపడే కీలక రైల్వే ప్రాజెక్టులకు నిధులు వస్తాయా..? జాబితాలో చోటు దక్కించుకుంటాయా..? ప్రతిపాదనలు వాస్తవరూపం దాలుస్తాయా..? అని ఉమ్మడి జిల్లా వాసులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రైల్వేస్టేషన్లలో సదుపాయాల కల్పన, కొత్తగా ప్లాట్ఫారాల నిర్మాణం, కొత్త రైళ్లు, వందేభారత్ రైలు.. తదితరాలపై సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ప్రజలంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్త ఆశలు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన కొన్ని పనులతో ఇక్కడి ప్రజలో రైల్వే ప్రాజెక్టులపై ఆశలు చిగురించాయి. కాజీపేట– బల్లార్షా సెక్షన్, పెద్దపల్లి–కరీంనగర్–నిజామాబాద్ సెక్షన్లో వందేభారత్ కోసం ట్రాకులు సిద్ధం చేశారు. ట్రాకుల సామర్థ్యం పెంచడంతో 130 కి.మీ గరిష్ట వేగం నుంచి 90 కి.మీ కనిష్ట వేగంతో ఈ రూట్లలో రైళ్లు రాకపోకలు సాగించగలవు. ఇటీవల అమృత్ పథకం కింద కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లు ఎంపికయ్యాయి. ఈ పథకం కింద ప్రతీ స్టేషన్కు రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నిధులు రానున్నాయి. మనోహరాబాద్– కొత్తపల్లి (కరీంనగర్) మార్గంలో సిరిసిల్ల– సిద్దిపేట పట్టణాలను కలుపుతూ సుమారు 30 కిలోమీటర్ల దూరం బ్రాడ్గేజ్ రైల్వేట్రాక్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే బిడ్లు ఆహ్వానించింది. ఈ పనులకు రూ.440 కోట్ల మేరకు అంచనా వ్యయాన్ని కూడా రూపొందించింది. కీలక డిమాండ్లు నిజామాబాద్– పెద్దపల్లి మార్గం డబ్లింగ్ పనులకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం దక్కాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉన్న తిరుపతి– కరీంనగర్ బైవీక్లీని ట్రై వీక్లీ లేదా డెయిలీ ఎక్స్ప్రెస్గా నడపాలి. సికింద్రాబాద్–కాజీపేట– బల్లార్షా సెక్షన్లో ఉత్తరభారతదేశానికి వందేభారత్ రైలును నడపాలి. ప్రతిపాదనలు - ఇదే సమయంలో ఈ ప్రాంతం అభివృద్ధికి కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఉదయం పూట కాజీపేట వరకు నడుస్తున్న 17036 ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాదు వరకు పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. - ఉదయం పూట 17036 కాజీపేట ఎక్స్ప్రెస్ తరువాత 17011 ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ మధ్యలో 7 గంటల గ్యాప్లో ఒక్కరైలు కూడా లేదు. ఈ సమయంలో సిర్పూర్ నుంచి కాజీపేట మార్గంలో ఒక రైలు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. - సింగరేణి మెమూ ఎక్స్ప్రెస్ రైలును సిర్పూర్టౌన్లో మధ్యాహ్నం 12:10కు బదులుగా ఉదయం 10 గంటలకే ప్రారంభించాలి. ప్ర తిపాదిత తెలంగాణ సంపర్క్ క్రాంతి సూ పర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుని హైదరాబాదు నుంచి ఢిల్లీ వయా నిజామాబాదు – కరీంనగర్ – పెద్దపల్లి మార్గంలో నడపాలి. - బెలగావి నుంచి సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలుని బల్లార్షా వరకు పొడిగించాలి. కాజీపేట నుంచి కొల్హాపూర్, సూరత్, పూణెలకి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లను పెద్దపల్లి నుంచి నిజామాబాదు మార్గంలో నడపాలి. కాజీపేట నుంచి బాసరకు వయా పెద్దపల్లి– కరీంనగర్– నిజామాబాదు మీదుగా పుష్ పుల్ రైలు నడపాలి. కాజీపేట నుంచి ఆ దిలాబాద్ వయా పెద్దపల్లి– మంచిర్యాల– సిర్పూర్ కాగజ్ నగర్–బల్లార్షా మీదుగా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించాలి. - 2012లో 17011/12 ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు తరువాత కాజీపేట నుండి సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే మార్గంలో మరో రైలు రాలేదు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. కనీసం పుష్–పుల్ లేదా ఇంటర్సిటీ రైలు వేయాలన్న ఆలోచన ఇంతవరకూ చేయలేదు. ఈ మార్గం లో ఇప్పటికే 110 కిలోమీటర్ల మూడవ రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది. - ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సాయినగర్ షిరిడీ మధ్య నడుస్తోన్న వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుని కాజీపేట– సికింద్రాబాద్– నిజామాబాదు మార్గంలో బదులుగా దగ్గరి మార్గమైన కాజీపేటటౌన్– పెద్దపల్లి– నిజామాబాదు మార్గంలో దారి మళ్లించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మౌలికవసతుల కల్పన - కరీంనగర్ రైల్వే స్టేషన్లో 2, 3 ప్లాట్ఫారం నిర్మించడం - కరీంనగర్లో రైళ్ల నిర్వహణకు పిట్లైన్ ప్రతిపాదన - లింగంపేట్ జగిత్యాల రైల్వే స్టేషన్లో 2ప్లాట్ఫారాలను 24 కోచ్ల రైలు పట్టేలా విస్తరణ చేయడం (ప్రస్తుతం 12 కోచ్లకి సరిపడా ఉంది) - మల్యాల – కొండగట్టు రైల్వే స్టేషన్ని తిరిగి పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు - పెద్దపల్లి రైల్వేస్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు, 4 వ ప్లాట్ ఫారం నిర్మించడం. -
వివాహిత అనుమానాస్పద మృతి
భర్తే చంపాడు: మృతురాలి బంధువులు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన వివాహిత స్రవంతి(26) శనివారం అనుమానాస్పదస్థితిలో మరణించింది. అయితే భర్తే చంపాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు బంధువుల కథనం ప్రకారం.. కమాన్పూర్ మండలం పెంచికల్పేటకు చెందిన స్రవంతి వివాహం పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన శ్రీనివాస్తో నాలుగేళ్ల క్రితం జరిగింది. వివాహ సమయంలో రూ.6 లక్షల కట్నం ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల శ్రీనివాస్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈవిషయమై భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో గురువారం స్రవంతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పెద్దపల్లికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై కిశోర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అత్తింటివారే చంపారు: మృతురాలి తల్లిదండ్రులు తమ కూతురు స్రవంతి ఆత్మహత్య చేసుకోలేదని, భర్త శ్రీనివాస్ చంపాడని మృతురాలి తల్లిదండ్రులు మధునయ్య, లక్ష్మి ఆరోపించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందనే శ్రీనివాస్ బలవంతంగా క్రిమిసంహారక మందు తాగించాడని వారు అన్నారు. రూ.6 లక్షలు కట్నం ఇచ్చిన అదనపు కట్నం కోసం వేధించేవాడని ఈక్రమంలోనే మరో రూ.50 వేలు ముట్టజెప్పామని బోరుమన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement