-
బెంగళూరు రాప్టర్స్దే పీబీఎల్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) చరిత్రలో టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా బెంగళూరు రాప్టర్స్ జట్టు నిలిచింది. గచ్చి బౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ జట్టు 4–2తో తొలిసారి ఫైనల్ చేరిన నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టును ఓడించింది. తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ 14–15, 15–9, 15–3తో లీ చెయుక్ యియు (వారియర్స్)పై నెగ్గి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పురుషుల డబుల్స్ మ్యాచ్లో బొదిన్ ఇసారా–లీ యోంగ్ డే (వారియర్స్) జంట 15–11, 13–15, 15–14తో అరుణ్ జార్జి–రియాన్ అగుంగ్ సపుత్రో (బెంగళూరు) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్ను వారియర్స్ ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో తై జు యింగ్ (బెంగళూరు) 15–9, 15–12తో మిచెల్లి లీని ఓడించింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నాలుగో మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో చాన్ పెంగ్ సూన్–ఎమ్ హై వన్ (బెంగళూరు) ద్వయం 15–14, 14–15, 15–12తో గారగ కృష్ణప్రసాద్–కిమ్ హా నా (వారియర్స్) జోడీపై నెగ్గింది. ఈ మ్యాచ్ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరిదైన ఐదో మ్యాచ్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టు గెలిచినా తుది ఫలితం మారే అవకాశం లేకపోవడంతో దానిని నిర్వహించలేదు. విజేత బెంగళూరు జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 3 కోట్లు ప్రైజ్మనీగా లభించాయి. రన్నరప్ నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీఫైనల్స్లో ఓడిన పుణే సెవెన్ ఏసెస్, చెన్నై సూపర్ స్టార్స్ జట్లకు రూ. 75 లక్షల చొప్పున ప్రైజ్మనీ దక్కింది. లీగ్ దశలో నిలకడగా ఆడిన హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డికి ‘ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ పురస్కారం లభించింది. తై జు యింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాద్ హంటర్స్కే చెందిన ప్రియాన్షు రజావత్కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు దక్కింది. -
సెమీస్లో బెంగళూరు రాప్టర్స్
నేడు జరిగే తొలి సెమీఫైనల్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్తో చెన్నై సూపర్స్టార్స్ జట్టు; శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో పుణే సెవెన్ ఏసెస్తో బెంగళూరు రాప్టర్స్ జట్టు తలపడతాయి. ఆదివారం ఫైనల్ జరుగుతుంది సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు జట్టు 5–0తో అవధ్ వారియర్స్పై ఘనవిజయం సాధించింది. గెలిచిన జట్టే ముందంజ వేసే ఈ మ్యాచ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్, బ్రైస్ లెవెర్డెజ్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టారు. ‘ట్రంప్’ మ్యాచ్లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ నెగ్గడంతో రాప్టర్స్ రెండు ‘ట్రంప్’ మ్యాచ్ల్లోనూ గెలిచి సెమీస్ దారిని సులభతరం చేసుకుంది. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ వారియర్స్, చెన్నై సూపర్స్టార్స్, పుణే సెవెన్ ఏసెస్ సెమీస్ చేరాయి. పురుషుల డబుల్స్తో మొదలైన ఈ పోరులో అరుణ్ జార్జి–రియాన్ అగుంగ్ సపుట్రో (రాప్టర్స్) జోడీ 15–14, 7–15, 11–15తో సంగ్ హ్యూన్–షిన్ బెక్ చియోల్ (అవధ్) ద్వయం చేతిలో కంగుతింది. అయితే అవధ్ ‘ట్రంప్’ పోరులో జయరామ్ 9–15, 9–15తో లెవెర్డెజ్ (రాప్టర్స్) చేతిలో ఓడిపోవడంతో వచ్చిన పాయింట్ కూడా చేజారింది. మహిళల సింగిల్స్లో తై జు యింగ్ (రాప్టర్స్) 15–12, 15–12తో బీవెన్ జాంగ్ (అవధ్)పై నెగ్గింది. అనంతరం రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోగా సాయిప్రణీత్ (రాప్టర్స్) 15–11, 15–13తో విన్సెంట్ (అవధ్)ను ఓడించి జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 4–0తో అవధ్పై గెలుపును ఖాయం చేసుకుంది. ఇక ఆఖరి మిక్స్డ్ డబుల్స్ పోరులో చన్ పెంగ్ సూన్– ఇయోమ్ హి వోన్ (రాప్టర్స్) జోడీ 7–15, 15–12, 15–11తో సంగ్ హ్యూన్–క్రిస్టీనా పెడర్సన్ (అవధ్) జంటపై గెలిచింది. -
హైదరాబాద్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ హంటర్స్ 4–3తో ముంబై రాకెట్స్పై గెలి చింది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్ మ్యాచ్ల్లో ఓడి 0–3తో వెనుకబడ్డ హైదరాబాద్కు సింధు తన విజయంతో ఊరట కలిగించింది. మహిళల సింగిల్స్లో సింధు 15–5, 15–10తో శ్రేయాన్షి (ముంబై)పై గెలిచింది. ఇందులో సింధు ‘ట్రంప్ కార్డు’తో ఆడటంతో జట్టుకు రెండు పాయింట్లు లభించాయి. అనంతరం పురుషుల రెండో సింగిల్స్లో ప్రియాన్షు (హైదరాబాద్) 15–13, 15–9తో లీ డాంగ్ కెయున్ (ముంబై)పై సంచలన విజయం సాధించడంతో... ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే మిక్స్డ్ డబుల్స్లో ఇవనోవ్–సిక్కి రెడ్డి (హైదరాబాద్) ద్వ యం 15–8, 15–8 కిమ్ స రంగ్–పియా జెబదియా (ముంబై) జోడీపై గెలుపొంది హైదరాబాద్ను విజేతగా నిలిపింది. సిక్కి రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించింది. -
సెమీస్లో నార్త్ ఈస్టర్న్, చెన్నై సూపర్ స్టార్స్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో చెన్నై సూపర్ స్టార్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ స్టార్స్ 4–3తో అవధ్ వారియర్స్పై విజయం సాధించింది. దాంతో 19 పాయింట్లు సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమంగా ఉన్న సమయంలో... విజేతను నిర్ణయించే మ్యాచ్ అయిన మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–జెస్సికా (చెన్నై) ద్వయం 15–11, 13–15, 15–14తో క్రిస్టీనా–కొ సుంగ్ హ్యూన్ (అవధ్) జంటపై అద్భుత విజయాన్ని సాధించింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ 5–0తో పుణే సెవెన్ ఏసెస్పై ఘనవిజయం సాధించింది. దాంతో 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలవడంతో పాటు సెమీఫైనల్కు అర్హత సాధించింది. నేటి మ్యాచ్లో ముంబై రాకెట్స్తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
మళ్లీ ఓడిన సింధు
సాక్షి, హైదరాబాద్: సొంత గడ్డపై హైదరాబాద్ హంటర్స్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్లో సింధు 15–11, 13–15, 9–15తో తై జు యింగ్ (బెంగళూరు రాప్టర్స్) చేతిలో ఓడింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్–5లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ హంటర్స్ 0–3తో బెంగళూరు రాప్టర్స్ చేతిలో ఓడింది. తొలి గేమ్లో సత్తా చాటిన సింధు... తర్వాతి రెండు గేమ్ల్లో విఫలమై పరాజయం పాలైంది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్లో బెన్ లేన్–వ్లాదిమిర్ ఇవనోవ్ (హైదరాబాద్) ద్వయం 13–15, 15–9, 12–15తో పెంగ్ సూన్ చాన్–రియాన్ అగుంగ్ సపుర్తో (బెంగళూరు) జోడీ చేతిలో ఓడింది. అనంతరం జరిగిన పురుషుల తొలి సింగిల్స్లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన హైదరాబాద్ ప్లేయర్ సౌరభ్ వర్మ 12–15, 15–10, 6–15తో బ్రైస్ లెవెర్డెజ్ (బెంగళూరు) చేతిలో ఓడాడు. పీబీఎల్ నిబంధనల ప్రకారం ‘ట్రంప్ కార్డు’ వాడిన ఆటగాడు ఓడితే... అతని జట్టుకు ఒక పాయింట్ను పెనాల్టీగా విధిస్తారు. దాంతో హైదరాబాద్ (–1)–2తో వెనుకబడింది. మిక్స్డ్ డబుల్స్లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన పెంగ్ సూన్ చాన్–యోమ్ హే వోన్ (బెంగళూరు) జోడీ 13–15, 11–15తో వ్లాదిమిర్ ఇవనోవ్–సిక్కిరెడ్డి (హైదరాబాద్) ద్వయం చేతిలో ఓడింది. చివరగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్లో డారెన్ లియూ (హైదరాబాద్) 11–15, 6–15 తో సాయి ప్రణీత్ (బెంగళూరు)చేతిలో ఓడాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement