-
మెర్సీ ప్లీజ్!
‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్’’ అని అడుగుతోంది డాక్టర్ పార్వతీ కుమారి. జార్ఖండ్లోని చిన్న నగరం ధన్బాద్. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి. కళ్లు తెరిచింది కానీ.... స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్ కంటి డాక్టర్కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు. పీహెచ్డీ దాకా... అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్రామ్ కాలేజీలో ఎమ్.ఏ. చేసింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్ఎఫ్గా సెలక్ట్ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది. పుంజుకునేలోపే... కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి. కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మినెంట్ చేసే సమయం వచ్చింది. తాను కూడా పర్మినెంట్ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది. ‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది? -
గణేష్ ఉత్సవాల్లో విషాదం.. స్టేజ్పైనే కుప్పకూలాడు
వైరల్: మనిషి జీవితం.. ఈరోజుల్లో నీటి బుడగలా మారిపోయింది. సీసీ కెమెరాలు, సెల్ఫోన్ రికార్డింగ్ల వల్ల.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు చాలామట్టుకు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు నాటక సమయంలోనే స్టేజ్పై కుప్పకూలి కన్నుమూశాడు. గణేష్ ఉత్సవాల సందర్భంగా.. యోగేష్ గుప్తా అనే ఆర్టిస్ట్ పార్వతి దేవి గెటప్ వేసి నాటకంలో పాల్గొన్నాడు. నాటకంలో భాగంగా నృత్యం చేసిన యోగేష్.. ఉన్నట్లుండి కింద పడిపోయాడు. అదీ నాటకంలో భాగమే అనుకుని పొరపడిన శివుడి పాత్రధారి యువకుడు.. దగ్గరగా వచ్చి లేపబోయాడు. కానీ, యోగేష్లో చలనం లేదు. దీంతో నిర్వాహకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే యోగేష్ గుండెపోటు మృతి చెందినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజలుగా ఇలాంటి ఆకస్మిక మరణాలకు సంబంధించిన ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మలయాళం దిగ్గజ గాయకుడు ఎడవ బషీర్ సైతం ఇలాగే మే 28వ తేదీన అలపుజ్జాలో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి మృతి చెందారు. అలాగే.. ఈ ఏడాది జూన్లో ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. ప్రదర్శనలో ఇబ్బందిగా ఫీలై.. ఆ తర్వాత గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వీళ్లే కాదు.. చాలా చోట్ల ఇలా మరణించిన ఘటనల తాలుకా వీడియోలు వైరల్ కావడం చూశాం. #WATCH | One more youth died with cardiac arrest..! Youth named #YogeshGupta who was performing the role of Maa Parvati during a Jagran in Bishnah Tehsil of #Jammu collapsed while dancing and died. He suffered a cardiac arrest. pic.twitter.com/dMRsy8M7up — Subodh Kumar (@kumarsubodh_) September 8, 2022 -
అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే ఆకలి ఎందుకు ఉంటుంది ?
కైలాసంలో పరమశివుడు ప్రగాఢ ధ్యానంలో లయించి ఉన్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పార్వతీదేవి ఏదో ఆటగా శివుని కళ్ళు మూసి ఆనందపడింది. పరమేశ్వరుని కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. అందువలన తక్షణమే అంధకారం సమస్త లోకాలను అలముకుంది. జనులు తల్లడిల్లి పోయారు. అది చూసి పరమశివుడు " దేవీ! ఏం పని చేశావు నువ్వు? అదిగో! లోకులం దరూ అంధకారంలో కొట్టుమిట్లాడుతున్నారు, గమనించావా?" అన్నాడు. అంతా చీకటి మయం కావడంతో నానా ఇబ్బందులు పడడం పార్వతీదేవి కళ్ళారా చూసింది.ఆమె బాధ పడింది. " నాథా! తెలియక చేసిన నా అపరాధాన్ని క్షమించండి. ఈ అంధకారం పోయి వెలుతురు వచ్చే మార్గం చూడండి " అంది పార్వతిదేవి. వెంటనే శివుడు తన పాలనేత్రం తెరిచాడు. జగమంతా వెలుతురుతో నిండి పోయింది. భూలోకంలో ప్రజలు తమ దిన చర్యలో పడ్డారు. పార్వతీదేవి తను తప్పు పని చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోనెంచి తను కొంతకాలం తపస్సు చేస్తానంటు భర్త అనుమతి కోరింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీవు లోకమాతవు నీకు పాపం అంటదు. తపస్సుకి వెళ్ళనవసరం నీకు లేదు అని అన్నాడు. ఆమె భర్తతో ఏకీభవించలేదు. దేవతలైనా మనుషులైనా తప్పుకు ప్రాయశ్చిత్తం అవసరమే. ఆ ధర్మమాన్ని మనమే అతిక్రమిస్తే లోకులు మనలనే అనుసరిస్తారు, పాపం పెరిగి పోతుంది అంది హిమరాజతనయ. పార్వతీదేవి భర్త అనుమతి తీసుకుని ఆకాశ మార్గానికి దక్షిణ దిశకు బయలు దేరింది. కాశినగరం మీదుగా వెళ్తూ ఉంటే భూలోకవాసులు ఆకలితో అలమ టించడం ఆమె కంట పడింది. రెండు సంవత్సరాలుగా వర్షాలు లేని కారణంగా క్షామం నెలకొని ఉంది. వారి ఆకలి బాధ చూడలేక అక్కడ దిగి ఒక భవనాన్ని నిర్మించుకొని అన్నపూర్ణ అన్న పేరుతో వంటలు వండి వారికి కడుపు నిండుగా భోజనాలు పెట్టసాగింది. కాశిరాజుకి ఈ విషయం తెలిసి ఎవరీ అన్నదాత అని ఆశ్చర్యపోయాడు. అతని కోశాగారంలో బంగారం, వెండి అమూల్య రత్నాలు నాణేలు ఉన్నాయి. కొందామన్నా ఆహార దినుసులు అంగళ్ళలో లేవు. కాశిరాజు ఆ మాతృమూర్తిని చూడాలని వెళ్ళాడు. కోరినంత ధనం ఇస్తాను, ధాన్యాదులు ఇవ్వమంటాడు. ఆమే నేను అమ్మడానికి రాలేదు.మీరందరు నా సంతానం. మీ ఆకలి బాధ తీర్చడానికి వచ్చాను. నువ్వూ పంక్తిలో కూర్చుని తిను అంది ఆమె. " అమ్మా ! మీరు సామాన్య మానవమాత్రులు కారు. చెప్పండి మీరే దేవతో " అన్నాడు రాజు. ఆమె నిజ అవతారం దాల్చి నేను అన్నపూర్ణను అంది. "అమ్మా! అన్నపూర్ణేశ్వరీ! మీరు స్థిరంగా కాశినగరంలో ఉండిపోవాలని నా ప్రార్ధన" అన్నాడు. అది సాధ్యం కాదు నేను తపస్సు కని కైలాసం నుంచి వస్తున్నాను. కొంత కాలం తరువాత పరమేశ్వరునితో పాటు వచ్చి వుంటాను. ఇక మీదట కాశి నగరంలో కరువుకాటకాలు ఉండవు అంటూ అన్నపూర్ణ అంతర్ధానమైంది. అప్పుడే అక్కడ వర్షం మొదలైంది. అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే ఆకలి ఎందుకు ఉంటుంది? -గుమ్మా ప్రసాద రావు చదవండి: అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఉత్తరాయణంలో ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు? -
ఫుటేజ్ను తీయించే వరకు విశ్రమించను
బేబీగా ఎవరికి కనిపిస్తాం? అమ్మానాన్నకే కదా! చిన్నప్పుడే కాదు, ఇప్పుడూ. ఆ ఫొటోలు బైట పెడతామా? గర్ల్స్ మీకే..! ‘ఒక స్మైల్ రా కన్నా..’ అనగానే.. స్టిల్ ఇచ్చేయకండి. వీడియోలోకి వెళ్లిపోకండి. బాయ్ఫ్రెండ్ మంచివాడే. అమ్మానాన్న అయితే కాడు. అనుమానిస్తే ఏం పోయింది? నమ్మితేనే కదా ఏదైనా! ఇంటర్నెట్ను.. మీ.. బేబీ అల్బమ్ కానివ్వకండి. అమ్మానాన్న జాగ్రత్త. ఐదేళ్ల ‘లా’ కోర్సు నాలుగో సంవత్సరంలో ఉన్న సోనా అబ్రహాం ఆరేళ్లుగా ఇంటర్నెట్ నుంచి తన వీడియో క్లిప్పులను తీయించడం కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. 2013లో పద్నాలుగేళ్ల వయసులో ఆమె నటించిన ‘ఫర్ సేల్’ అనే మలయాళీ చిత్రంలోని రేప్ సీన్ వీడియో క్లిప్పులు అవి! ఒక మైనరు బాలికపై కొందరు అత్యాచారం చేస్తారు. దానిని వీడియోలో చిత్రీకరించి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అది చూసి ఆ బాలిక అక్క ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదీ ఆ సినిమా కథ. మైనరు బాలిక పాత్రను సోనా వేసింది. ఆ సీన్ని హ్యాండ్ కెమెరాతో ప్రైవేట్గా షూట్ చేశారు. సినిమాలో పది సెకన్లు ఉంటుంది. ‘‘అవసరం అయినంత వరకే వాడుకుని మిగతా ఫుటేజ్ని డిలీట్ చేస్తాం’’ అని డైరెక్టరు, నిర్మాత చెప్పారు. సోనా నమ్మింది. సోనా తల్లిదండ్రులూ నమ్మారు. ఏడాది తర్వాత ఆ ఫుటేజ్ (సినిమాలో వాడగా మిగిలిన భాగాలు) యూట్యూబ్లో ప్రత్యక్షం అయింది! అంటే వాళ్లు డిలీట్ చేయలేదు. పైగా లీక్ చేశారు. యూట్యూబ్ నుంచి పోర్న్ సైట్కు కూడా ఫుటేజ్ చేరిపోయింది! సోనా వణికిపోయింది. తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు తల్లడిల్లిపోయారు. కూతుర్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దురదృష్టం.. ఇప్పటికీ ఆ క్లిప్పులు నెట్లో ఎక్కడో ఒక చోట పైకి లేస్తూనే ఉన్నాయి. సోనాకు ఒకటి అర్థం అయింది. మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలను పోలీసు వ్యవస్థ కూడా ఆపలేకపోతోందని. అయినా నిస్పృహ చెందలేదు. ‘‘ఆనవాళ్లు కూడా లేకుండా క్లిప్పును తీయించేవరకు నేను విశ్రమించను’’ అని అంటున్నారు. అమ్మానాన్న ఆవేదన తీర్చడం ముఖ్యం అనుకుంది. ∙∙ ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ సంస్థ చేపట్టిన ‘రెఫ్యూజ్ ది అబ్యూజ్’ అనే ప్రచారోద్యమం కోసం.. టీనేజ్లో తనకు జరిగిన ఆ నమ్మకద్రోహం గురించి సోనా బహిర్గతం చేసినప్పుడు గానీ ఈ విషయం బయటికి రాలేదు. ఇంతకాలం సోనా ఒంటరిగానే పోరాడుతూ వస్తున్నారు. పోలీసులు కూడా చేసిందేమీ లేదు. వీడియో క్లిప్పులు లీక్ అయ్యేలా అలక్ష్యాన్ని ప్రదర్శించిన ఆ నిర్మాత, దర్శకుడు తేలిగ్గానే తప్పించుకున్నారు. సోనా తల్లిదండ్రులు 2014లో ఎర్నాకుళం సిటీ పోలీస్ కమిషనర్ను కలిసి కూతురి షూటింగ్ ఫుటేజ్ యూట్యూబ్లో రాకుండా చేయమని వేడుకున్నారు. యూట్యూబ్కి కమిషనర్ లెటర్ పెట్టినట్లున్నారు. తాత్కాలికంగా అయితే డిలీట్ అయింది. ఆ వెంటనే పోర్న్ సైట్లలోకి, సోషల్ మీడియాలోకి వ్యాపించింది! సోనాకు డైరెక్టర్ రేప్ సీన్ను వివరిస్తున్న ఆడియో కూడా ఆ వీడియోకు జత అయి ఉంది. దాంతో అది మామూలు సినిమాకు కాకుండా.. పోర్న్ కోసం చేసిన షూటింగ్లా ఉంది. టెన్త్ నుండి ఇంటర్కు ఆమెతో పాటు ఆ క్లిప్పులు కూడా వచ్చి జాయిన్ అయ్యాయి! ‘తనే ఆ వీడియోలో ఉంది’ అనే గుసగుస క్లాస్ రూమ్లో, కాలేజ్లో ఏదో ఒక మూల నుంచి వినిపించేది. గట్టి అమ్మాయి కాబట్టి తట్టుకుని నిలబడింది. ‘‘నమ్మకద్రోహం చేసిన వాళ్లది నేరం అవుతుంది తప్ప, నమ్మి మోసపోయిన వాళ్లది కాదు’’ అని అమ్మానాన్న సోనాను ఊరడిస్తూనే ఉన్నారు. వాళ్లిచ్చిన మానసిక స్థైర్యంతో చదువు మీద దృష్టి పెట్టింది. ‘లా’ చదువుతూనే నటిగా, మోడల్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా గుర్తింపు సంపాదించింది. ఆ గుర్తింపు ఆమె ‘గతానికి’ భవిష్యత్తు లేకుండా చేసింది. క్లిప్పుల గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. అయితే తను మాత్రం సైబర్ నేర ప్రపంచాన్ని ఊరికే వదిలిపెట్టదలచుకోలేదు. అమాయకులైన ఎందరో అమ్మాయిలను వలలో పడకుండా చేయడానికి, పడితే బయటికి రప్పించడానికి న్యాయశాస్త్రాన్ని ఒక పదునైన ఆయుధంగా మలచుకోబోతున్నారు. ఆమె కేసు ఇప్పుడు హైకోర్టులో ఉంది. కేరళ ఉమన్ కమిషన్ ఆమెకు అండగా ఉంది. కేరళ పోలీస్ హై టెక్ సెల్ ఇంటర్నెట్ నుంచి సోనా క్లిప్పులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ఇప్పుడు న్యాయ విద్యార్థిని మాత్రమే. బాలికలు, మహిళలకు సైబర్ అకృత్యాల నుంచి గట్టి రక్షణ కంచెను నిర్మించబోతున్న భవిష్యత్ న్యాయవాది. తన తల్లిదండ్రుల్లా ఇంకొకరు మానసిక క్షోభ పడకూడదని తీర్మానించుకున్న అమ్మాయి. పోరాటం ఆపను మొదట నా వీడియోలు నెట్లో కనిపించినప్పుడు నా జీవితం ముగిసినట్లే అనిపించింది. అందరూ నన్నే చూస్తూ, నా గురించే మాట్లాడుకుంటున్నారన్న భావన! ‘నాకిలా కావలసిందే’ అనుకున్నాను. నన్ను దోషిగా భావించుకున్నాను. తర్వాత ఆలోచిస్తే, ఇందులో నేను చేసిన తప్పేముంది అనిపించింది. ‘తల వంచుకోవలసింది, అవమాన పడవలసిందీ నేను కాదు’ అనుకున్నాను. న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను. నా కోసమే కాదు, నాలా మోసపోతున్న అమ్మాయిల కోసం కూడా. – సోనా అబ్రహాం అభినందనలు సోనా సోనా.. జీవితం నరకప్రాయం అవడం అంటే ఏమిటో నేను ఊహించగలను. అమ్మాయిల్ని నిరంతరం ఇలాంటి నరకాలు వెంటాడుతూనే ఉంటాయి.. మన ప్రమేయం ఏమీ లేనివి, నమ్మి మోసపోయినందుకు అనుభవించేవీ! మన ధైర్యమే మన పోరాట శక్తి. నువ్వు ఒక్కరివి, ఒంటరివి కాదు. నీ వైపు నేనున్నాను. నువ్వు చూపుతున్న మనోబలానికి సాటి మహిళగా అభినందనలు, ధన్యవాదాలు. – నటి పార్వతి -
జాతరను తలపిస్తున్న పార్వతి బ్యారేజి ప్రాంతం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement