-
‘గుంటూరు కారం’లో అది మిస్ అయింది.. ఈ టైటిల్ పెడితే బాగుండేది: పరుచూరి
మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది మహేశ్ బాబు రేంజ్ సినిమా కాదని, త్రివిక్రమ్ బలమైన కథను రాసుకోలేకపాయడనే విమర్శలు కూడా వచ్చాయి. కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెటిఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న గుంటూరు కారం చిత్రంపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ. ఇది మహేశ్ బాబు స్థాయి సినిమా కాదని, టైటిల్ కూడా అలా పెట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘350 చిత్రాలకు పైగా పని చేసిన నాకు ‘గుంటూరు కారం’ కథనం కాస్త కన్ఫ్యూజ్గా అనిపించింది.ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. రెండోసారి చూస్తే స్పష్టత ఉండొచ్చేమో. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లేతో ఆడుకున్నాడు. గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో ఇందులోని హీరో పాత్రను అలా క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ మంచి టైటిల్స్ పెడతారు. ఆయన సినిమాన్నింటిలో ఇది కొంత తేడాగా అనిపించింది. తల్లి వద్దనుకుంటే.. సంబంధిత డాక్యుమెంట్స్పై హీరో సంతకం పెడతాడా, లేదా? అనే పాయింట్ చుట్టు ఈ కథ అల్లుకున్నాడు. అయితే ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంట్ పండలేదు. అలాగే తాత మనవళ్ల సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. హీరో అమ్మను దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్ చేయలేడు, ఇబ్బంది పెట్టలేడు. సెంటిమెంట్ ప్రధానంగా సినిమాని తీద్దామనుకుంటే ఈ టైటిలే తప్పు. ‘గుంటూరు వారి అబ్బాయి’ అని పెట్టి ఉంటే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుని ఉండేవారు. గుంటూరు కారం.. పేరుకు సరిపోయేలా స్క్రీన్ప్లేని సెట్ చేశారు. సంతకం పెట్టించేందుకు హీరోయిన్.. హీరో ఇంటికొచ్చి, ప్రేమలో పడేయాలనుకుంటుంది. ఇది పాజిటివ్ దృక్పథం కాదు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్నే డెవలప్ చేసుకుంటూ వెళ్లి ఉంటే ఈ సినిమా మరో విధంగా ఉండేది. అని పరుచూరి అభిప్రాయ పడ్డాడు. -
బేబి.. క్లైమాక్స్ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
చిన్న సినిమాగా రిలీజై అఖండ విజయం సాధించిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా కథకు యూత్ బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఇదేనని చాలామంది అభిప్రాయపడ్డారు. మొత్తానికి సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాపై సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. నా గుండె ఎందుకో అదురుతోంది డైలాగ్.. 'ఊహించని ముగింపుతో వచ్చిన అందమైన ప్రేమ కథ బేబి. ఇంటర్వెల్ వచ్చేసరికి హీరోయిన్ ఓ చిన్న తప్పు చేసింది. ఈ తప్పును ప్రేమించినవాడికి చెప్పి ఉంటే సినిమా ముగింపు మరోలా ఉండేది. కానీ, ఆ తప్పును అతడితో చెప్పకుండా దాన్ని మర్చిపోయేందుకు మరో పెద్ద తప్పు చేసింది. ఏదో జరుగుతున్నట్లు నా గుండె ఎందుకో అదురుతోంది అన్న డైలాగ్తో ఏదో గండం రాబోతుందని డైరెక్టర్ ముందే హింటిచ్చాడు. సరిగ్గా అప్పుడే విరాజ్ ఎంట్రీ ఇవ్వడం.. హీరోయిన్ మేకప్ వేసుకోవడం.. తనలో మార్పులు రావడం చూపించారు. ఇంటర్వెల్లో విరాజ్కు ముద్దు.. కానీ సెకండాఫ్ ప్రారంభంలో.. హీరో ఆనంద్ ఆటో తాకట్టు పెట్టి హీరోయిన్ వైష్ణవికి కొత్త ఫోన్ కొనిస్తాడు. కానీ ఎప్పుడైతే విరాజ్ ఐఫోన్ కొనిస్తాడో అప్పుడు ఆనంద్ ఇచ్చిన మొబైల్ను డబ్బా ఫోన్ అనేస్తుంది హీరోయిన్. దీంతో అతడు ఫోన్ నేలకేసి కొట్టేస్తాడు. అతడిచ్చిన ఫోన్నే చులకన చేసింది మరి ఆటోవాడితో కలిసి జీవిస్తుందా? అన్న ప్రశ్నను మనలో రెకెత్తించారు. ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్.. హీరోయిన్ విరాజ్కు కిస్ ఇస్తుంది. కానీ సెకండాఫ్ ప్రారంభంలో తన పెదాలు కడిగేసుకుంటుంది. అంటే తాగిన మత్తులో ఆ పని చేసిందే తప్ప తన ప్రేమ మాత్రం ఆనంద్ మీదే ఉందని అర్థమవుతుంది. హీరోయిన్కు చెడ్డ సలహా.. అయితే విరాజ్ తనను వదిలేయాలంటే అతడి దగ్గరకు ఒకసారి వెళ్లి వస్తే సరిపోతుందని హీరోయిన్కు ఆమె స్నేహితురాలు చెడ్డ సలహా ఇస్తుంది. కథను ఇలా రాసుకున్న సాయిరాజేశ్ గట్స్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఈ పాయింట్తో నా సినిమా ఏమైపోతుందోనని భయపడలేదు. ధైర్యంగా రాశాడు, ధైర్యంగా తీశాడు కూడా! శారీరకంగా ఒకరికి దగ్గరైన అమ్మాయి ఇంకొకరిని ధైర్యంగా పెళ్లి చేసుకోగలదా? కానీ హీరోయిన్ అలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ క్లైమాక్స్తో సినిమా ఆడకూడదు. కానీ ఆడింది. హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది పెట్టుబడికి 7 రెట్ల డబ్బులు వసూలు చేసింది. సమాజం ఇలాగే ఉందని నమ్మారు కాబట్టే జనాలు బేబిని ఆదరించారు. హీరోయిన్ విరాజ్కు పెదాలపై కాకుండా బుగ్గపై ముద్దు పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు క్లైమాక్స్లో హీరోహీరోయిన్లు కలిసిపోయేవారు అనిపించింది. టైటిల్కు తగ్గట్లుగా హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది. రిస్కులు తీసుకుంటున్న స్క్రీన్ప్లేను కూడా జనాలు విజయవంతం చేస్తున్నారని బేబితో నిరూపితమైంది. ఏదేమైనా దర్శకుడు సాహసోపేతంగా తీశారు' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: పుష్పరాజ్ దెబ్బ.. సెకండ్ పార్ట్కు రూ.1000 కోట్ల డీల్..! -
నా వల్ల మా అన్నయ్య జైలుకు పోయేవాడు..
-
రష్మికను కేవలం పాటల కోసమే వాడుకున్నారు: పరుచూరి
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారసుడు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాపై తాజాగా ప్రముఖ సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. 'హీరోను పరిచయం చేసిన ఫస్ట్ షాట్ అద్భుతంగా ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేసిన విజయ్, వంశీలను అభినందించాలి. పెద్దింటి పేరెంట్స్కు ముగ్గురు కొడుకులు ఉంటారు. వారు ఇల్లు వదిలి వెళ్లిపోతే తిరిగి ఇంటికి తీసుకొచ్చే తమ్ముడి కథ ఇది. హీరో అమ్మచాటు బిడ్డ. కానీ నాన్న కోసం ఎంతో త్యాగం చేస్తాడు. తండ్రి బతికే అవకాశం లేదని తెలిసినప్పుడు మూడో కొడుకును తన స్థానంలో హెడ్గా కూర్చోబెడతాడు. దీంతో కోపంతో మిగతా ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. తన సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, అలాంటి వారి బారి నుంచి కాపాడాలంటే చిన్నవాడే బెటర్ అనుకుంటాడు తండ్రి. ఎందుకంటే అప్పటికే పెద్ద కొడుకు శ్రీకాంత్కు ఒకరితో ఎఫైర్ ఉంటుంది. రెండో కుమారుడు సొంత కుటుంబానికే ద్రోహం చేయాలని చూస్తాడు. 2.49 గంటల సినిమాలో ప్రేమ చాలా తక్కువగా ఉంది. పాటల కోసం రష్మికను వాడుకున్నారు. ఉమ్మడి వ్యవస్థ, కుట్రలు, కుతంత్రాలు, విడిపోవడాలు.. వీటికి ఎక్కువ నిడివి ఇచ్చారు. దాన్ని కొంచెం కట్ చేసి హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఎక్కువ చూపించి ఉంటే బాగుండేది. ఓ సీన్లో విజయ్ను చైర్మన్గా ఎన్నుకోవడానికి తక్కువ ఓట్లు పడ్డాయి. అప్పుడు విజయ్ ఓటేసేవాళ్ల తప్పులను ఎత్తిచూపడంతో వెంటనే వారు మనసు మార్చుకుని హీరోకే ఓటేస్తారు. ఆ సీన్ బాగుంది. వందమందినైనా కొట్టే హీరో తన అన్నయ్య మీద ఒక్క దెబ్బ కూడా వేయడడు. మరొకటి.. తండ్రి అనారోగ్యాన్ని తల్లికి, అన్నలకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడతాడు. అయితే ఒకానొక దశలో తండ్రి సామ్రాజ్యం కుప్పకూలేట్లుగా ఉంటే హీరో దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలను హీరో ఇంటికి తీసుకొచ్చేస్తాడు. లెవంత్ అవర్లో తండ్రి అస్థికలు నదిలో కలిపినట్లు చూపించారు. అంతా బాగుంది కానీ ఆ షాట్ చూపించకపోయుంటే బాగుండేది. అస్థికలు కలిపినట్లు కాకుండా హీరోయిన్తో హీరో పెళ్లి చేసి తండ్రి అక్షింతలు వేసినట్లు చూపించాల్సింది. ఎంతో కష్టపడ్డ హీరో తండ్రిని కాపాడుకోలేనట్లు చూపించకుండా.. 'నాన్నా.. అంతా సెట్ చేశాను. ఇక నేను తిరిగి అమెరికా వెళ్లిపోతున్నాను' అని చెప్పి ఉంటే బాగుండేది. హీరోయిన్ క్యారెక్టర్ ఇంకో పావుగంటయినా పెంచాల్సింది. అలాగే శ్రీకాంత్తో ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయి ఏమైందో చూపించలేదు? చిన్నచిన్న పొరపాట్లు మినహా సినిమా బాగుంది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి. -
అలా చేసి ఉంటే సినిమా మరింత బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' చిత్రంపై సమీక్షను వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేసి ఉంటే మరింత బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుందని.. సెకండాఫ్లో కాస్త మార్చి ఉండాల్సిందన్నారు. 18 పేజెస్ టైటిల్ విన్నప్పుడే నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూసే దాకా అవీ డైరీలోని పేజీలని ప్రేక్షకులకు తెలియదు. ఒక వ్యక్తికి తన కలల సుందరి కళ్ల ముందు కనపడితే ఎలా ఉంటుందనేదే ఈ చిత్రంలో ప్రధాన కథాంశం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే విషయాన్ని చక్కగా తెరపై చూపించారు దర్శకుడు సూర్యప్రతాప్. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..' ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన హీరో. అదే సమయంలో నందిని అనే అమ్మాయి డైరీ చదవడం.. చూడకుండానే ఆమెతో ప్రేమలో పడటం. చిన్న చిన్న ట్విస్టులతో ఫస్టాఫ్ తెరకెక్కించారు. ఫస్టాఫ్ అన్నందుకు క్షమించాలి. అందులో ప్రేమను చూపించి.. సెకండాఫ్ వచ్చేసరికి సామాజిక కోణాన్ని పరిచయం చేశారు. అయితే హీరో, హీరోయిన్స్ ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అనే సీన్స్ను కాస్తా అర్థమయ్యేలా చూపించి ఉంటే సినిమా బాగుండేది. ఈ విషయాన్ని దర్శకుడు సూర్యప్రతాప్తో చెప్పా. సమయం లేకపోవడం వల్ల కొన్ని సీన్స్ను తొలగించినట్లు చెప్పారు.'అని అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
తప్పక చదవండి
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
Advertisement