-
నోట్లరద్దుతో సీన్రివర్స్..
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో నోట్ల రద్దు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పేర్కొన్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.గతంతో పోలిస్తే ఎన్నికల్లో బ్లాక్మనీ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికల్లో భారీఎత్తున నగదు వాడకం పెరిగిపోయిందని స్వయంగా ఈసీ అత్యున్నత వర్గాలే వెల్లడించాయి. ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపలేదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ పెదవివిరిచారు. నోట్ల రద్దు అనంతరం ఎన్నికల్లో నల్లధనం వాడకం తగ్గుతుందనే అభిప్రాయం కలిగినా నగదు స్వాధీనాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నగదు పట్టుబడుతున్న సందర్భాలు ఇప్పుడే అధికంగా ఉన్నాయని రావత్ వెల్లడించారు. ఎన్నికల్లో వాడే నల్లధనంపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు, వారికి ఆర్థిక వనరులు సమకూర్చే వారికి నగదు కొరత ఎంతమాత్రం లేదన్నారు. ఎన్నికల్లో నగదు వాడకం, సోషల్ మీడియాలను నియంత్రించేలా నూతన మార్గదర్శకాలను జారీ చేసేలా న్యాయమంత్రిత్వ శాఖకు ఈసీ సిఫార్సు చేయకపోవడం బాధాకరమని ప్రధాన ఎన్నికల కమిషనర్గా గత వారం పదవీ విరమణ చేసిన రావత్ విచారం వ్యక్తం చేశారు. -
కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు, సిబ్బంది సన్నద్ధత పట్ల కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఢిల్లీ నుంచి పాల్గొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒ.పి.రావత్ ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్కుమార్ను అభినందించారు. అవసరమయినప్పుడు ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతోపాటు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, జరిగేలా చూడాల న్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, మత్తుపదార్థాలు రవాణా కాకుండా చూడాలని, ఓటర్ల అక్రమ తరలింపుపై నిఘా ఉంచాలని రావత్ ఆదేశించారు. ఇదే అంశంపై రజత్కుమార్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఇప్పటికే పటిష్టమైన నిఘా ఉంచామని, తీవ్రవాదుల కార్యకలాపాలు, మద్యం, డబ్బు తదితరాల రవాణాను నిశితంగా పరిశీలిస్తున్నామనీ, ఈ విషయంలో పొరుగు రాష్ట్రాల అధికారుల నుంచి మంచి సహకారం అందుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యంగా నక్సలైట్ల విషయంలో పోలీసుశాఖ అప్రమత్తంగా ఉందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి చెప్పారు. -
పింక్ బ్యాలెట్ కొనసాగుతుంది : సీఈసీ
సాక్షి, హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో పింక్ బ్యాలెట్ కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓం ప్రకాశ్ రావత్ స్పష్టం చేశారు. సాంకేతికత ద్వారా డూప్లికేట్ ఓటర్లను తొలగించడమనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని తాజ్ కృష్ణా హోటల్లో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని జిల్లాల టీమ్లతో సమీక్ష చేశామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ఆరోపణలు- ప్రత్యారోపణల నేపథ్యంలో పర్యవేక్షణ చర్యలు ఉండాలని, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 32574 పోలింగ్ కేంద్రాలు ఉండగా అదనంగా మరో 222 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలలో ఓట్లు లెక్కపెట్టిన తర్వాత అనుమానాలు ఉంటే వీవీప్యాట్లలో ఓట్లను టాలీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 211 పెయిడ్ న్యూస్ కేసులు.. వివిధ రాజకీయ పార్టీలతో ఓపీ రావత్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అధికార దుర్వినియోగం, ఉద్యోగుల కేసుల మీద ఇచ్చిన జీవో, టెలిఫోన్ ట్యాపింగ్, మత విద్వేషాలు, మంత్రుల పర్యటనలు వంటి పలు అంశాల మీద ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ మీద వచ్చిన ఫిర్యాదులపై స్పందించడం లేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. డబ్బులు, చీరలు, మద్యం పంపిణీ మీద కొన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన ప్రతీ పార్టీపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమాల్లో నాయకులు వాడుతున్న భాష మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామన్నారు. అదేవిధంగా డబ్బు ఖర్చు విషయంలో ఉల్లంఘనలకు పాల్పడిన అభ్యర్థుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియాలో పెయిడ్ న్యూస్ వేస్తున్నారని, పార్టీ సొంత పేపర్, ఛానెల్స్ ద్వారా విద్వేషపు ప్రచారం చేస్తున్నారంటూ వివిధ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని ఓపీ రావత్ తెలిపారు. ఈ క్రమంలో 211 పెయిడ్ న్యూస్ కేసులు వచ్చాయని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. -
ఓటర్ల జాబితాను సరిదిద్దండి!
సాక్షి, హైదరాబాద్: తప్పులతడకగా మారిన ఓటర్ల జాబితాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందునాటికి తప్పులను సరిదిద్దాలని అధికారులకు సూచించింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన కోసం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ నేతృత్వంలోని బృందం రెండోరోజు మంగళవారం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడి ఓ హోటల్లో 31 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్ల తీరుపై స్థూలంగా సంతృప్తి వ్యక్తం చేసింది. వికలాంగ, వయో వృద్ధ, మారుమూల ప్రాంతాల, మురికివాడల ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల ఏర్పాట్లపై నిరంతరం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, రోజూ పర్యవేక్షించాలని పేర్కొంది. లెక్కలు లేని నగదు జప్తుపై దృష్టి సారించాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులని, ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యత వారిదేనని స్పష్టం చేసింది. సమీక్షలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావస, బృందంలోని ఇతర అధికారులు ఉమేష్ సిన్హా, సందీప్ సక్సేనా, సందీప్ జైన్, చంద్రభూషణ్కుమార్, దిలీప్శర్మ, ధీరేంద్ర ఓజా, సుందర్ భయిల్ శర్మ, ఎస్కె రుడోలాతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ పాల్గొన్నారు. జిల్లాలవారీగా పరిశీలన కేంద్ర ఎన్నికల బృందం జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలతో ఏర్పాట్లను సమీక్షించింది. ప్రధానంగా ఓటర్ల నమోదులో వచ్చిన సాంకేతిక లోపాలు, ఈఆర్వో నెట్ వెబ్సైట్ మొరాయించడం, కొత్తగా ఏర్పాటు చేసిన మొబైల్ యాప్లు పని చేయకపోవడం, సరైన సమన్వయం లేకపోవడంపై జిల్లాల అధికారులు కేంద్ర ఈసీ బృందానికి నివేదించినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సీఈవో రజత్కుమార్పై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తొలిసారిగా వినియోగిస్తున్న వీవీ ప్యాట్లపై అవగాహన సదస్సులు పూర్తి చేశారా? అన్ని జిల్లాలకు సరిపడ సంఖ్యలో వీవీ ప్యాట్లు వచ్చాయా? వాటికి ప్రాథమిక స్థాయి పరీక్షలు పూర్తి చేశారా ? వాటిని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారా ? అనే విషయాలను కేంద్ర బృందం ఆరా తీసింది. ఏర్పాట్లను సమీక్షించేందుకు మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తామని తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తం సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సంఘం బృందం సూచించింది. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ ప్రాంతాలలో పోలీస్ బలగాలను మోహరించి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండాముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. డబ్బు, మద్యం సరఫరాలపై నిఘా పెట్టి నిరోధించాలని ఆదేశించింది. చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, ఎయిర్పోర్టు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కూడా నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల పనులను వేగవంతం చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 7 న జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలోఅధికారులు నిమగ్నమై ఉండాలని సూచించింది. అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు దాటొద్దు అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలకు మించరాదని, ప్రచారంలో అభ్యర్థి తరపున చేసే ప్రతీ ఖర్చుకు లెక్కలు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఆదేశించింది. అభ్యర్థుల ఖర్చుల లెక్కలు రోజువారీగా సమర్పించాలని, మీడియాలో ఇచ్చే ప్రకటనలపై కూడా నిఘా ఏర్పాటు చేసి దానిపై కూడా లెక్కలు వేయాలని సూచించింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి మీడియా టారిఫ్లను తెప్పించుకుని, వాటిని సరిపోల్చి లెక్కలను పకడ్బందీగా చూడాలని కోరింది. రాజకీయ పార్టీల ఎన్నికలు మేనిఫెస్టోను కూడా నిశితంగా పరిశీలించాలని సూచించింది. -
ఎన్నికల కమిషన్కు మరో మచ్చ!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలను నిర్వహించడం ఓ ముఖ్యమైన ఘట్టం. ఎవరి ఒత్తిడులు లొంగకుండా ఈ ఘట్టాన్ని సమర్థంగా నిర్వహించే అధికారాలను రాజ్యంగంలోని 324వ అధికరణం ఎన్నికల కమిషన్ను కట్టబెట్టింది. అంటే ఎన్నికల కమిషన్ పూర్తి స్వయం ప్రతిపత్తిగల సంఘం. ఎలాంటి అనుమానాలకు, పక్షపాతానికి ఆస్కారం ఇవ్వకుండా సహేతుకంగా నిర్ణయాలు తీసుకునే బాధ్యత కూడా ఎన్నికల కమిషన్కు ఉంది. కానీ ఇటీవల ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా అనుమానాస్పదమే కాకుండా వివాదాస్పదం అవుతున్నాయి. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్డ్ను శనివారం నాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్, ఆ రోజున విలేకరుల సమావేశాన్ని షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు అన్ని మీడియా సంస్థలకు ముందుగానే సమాచారాన్ని అందించింది. ఆ తర్వాత విలేకరుల సమావేశాన్ని 3.30 గంటలకు వాయిదా వేసింది. విలేకరుల సమావేశం గురించి మీడియాకు పది గంటలకు తెలియజేశామని, మీడియా అంతా రావడం కోసం సమావేశాన్ని మూడున్నర గంటలకు వాయిదా వేయాల్సి వచ్చిందని, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వివరణ ఇచ్చారు. ఆయన వివరణ ఎంత అర్థరహితమో ఇట్టే తెలిసిపోతుంది. మీడియా మిత్రులు రావడానికి రెండున్నర గంటల సమయం సరిపోదా? సరిపోదనుకుంటే ఓ అరగంటో, గంటో వాయిదా వేయాలిగానీ మూడు గంటలు వాయిదా వేయాల్సిన అవసరమే లేదు. అందుకే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సౌకర్యార్థమే విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసిన ట్లు విమర్శించింది. ఆ రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు రాజస్థాన్లోని అజ్మీర్లో ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. ప్రసంగిచారు కూడా.అదే సభలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రసంగిస్తూ.. రైతులకు ఉచిత విద్యుత్ వరాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించినట్లయితే అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అందుకని మోదీ ప్రసంగం తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలా ఎన్నికల కమిషన్ తన షెడ్యూల్ను మార్చుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు వివాదాస్పదం ఇదే మొదటి సారి కాదు. గతేడాది ఎన్నికల కమిషన్ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది. కొన్ని వారాల తేడాతో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పుడు, వాటి ఎన్నికల షెడ్యూల్ను ఒకేసారి ప్రకటించడం సంప్రదాయం. గతేడాది అక్టోబర్ 12వ తేదీన హిమాల్ ప్రదేశ్కు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఎన్నికల కమిషన్, అక్టోబర్ 25వ తేదీన గుజరాత్కు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. దాదాపు ఈ రెండు వారాల్లో మోదీ గుజరాత్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు పలు ఎన్నికల వాగ్దానాలు చేశారు. మొన్న శనివారం నాడు కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు, కర్ణాటకలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఎన్నికల కమిషన్, తమిళనాడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నవంబర్, డిసెంబర్ నెలలో తమిళనాడుకు తుపాన్లు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాసిన లేఖను పరిగణలోకి తీసుకొని వాటి షెడ్యుల్ను ప్రకటించలేదని రావత్ వివరణ ఇచ్చుకున్నారు. తుపాన్లు వచ్చే సమయంలో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలను నిర్వహించడం పెద్ద కష్టమా? రానున్న తుపాన్ల దృష్టిలో పెట్టుకొని ఎన్నికలను వాయిదా వేసిన సందర్భలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి నర్ణయమైనా ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చు. అది దాని అధికారం. తీసుకున్న నిర్ణయాలు సహేతుకంగా, నిర్వివాదాస్పదంగా ఉండేల చూసుకోవడం ముఖ్యమైన బాధ్యతన్నది విస్మరించరాదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement