-
రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్
ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీయ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ చైర్మన్ 'పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్' (Prithvi Raj Singh Oberoi) ఈ రోజు కన్నుమూశారు. 1939లో సిమ్లాలో మొదలైన ఒబెరాయ్ హోటల్స్ ప్రస్థానం ప్రస్తుతం ఏడు దేశాలకు విస్తరించింది. దీని వెనుక ఒబెరాయ్ కృషి ఏమిటి, ఆయన సంపద ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈస్ట్ ఇండియా హోటల్స్ బాధ్యతలు 1929లో జన్మించిన 'ఒబెరాయ్' పాఠశాల విద్యను డార్జిలింగ్లోని సెయింట్ పాల్స్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికా, స్విట్జర్లాండ్ దేశాల్లో ఉన్నత చదువుకులు చదువుకున్నాడు. తన తండ్రి 'మోహన్ సింగ్ ఒబెరాయ్' మరణం తరువాత 'ఈస్ట్ ఇండియా హోటల్స్' (East India Hotels) బాధ్యతలను స్వీకరించారు. ఆ తరువాత దీనిని ప్రపంచ దేశాలకు విస్తరించడం మొదలుపెట్టారు. ఒక్క ఆలోచన నిజానికి పర్యాటకులు ఒక దేశాన్ని సందర్శిస్తున్నారంటే.. వారికి బస చేసుకోవడానికి తప్పకుండా అనువైన హోటల్స్ కావాలి. ఈ విషయాన్ని గ్రహించిన 'ఒబెరాయ్' లగ్జరీ హోటల్స్ ప్రారంభించారు. 1939లో సిమ్లాలో ఒబేరాయ్ హోటళ్ల ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు ఏడు దేశాల్లో హాస్పిటాలిటీ రంగంలో (ఆతిధ్య రంగం) తిరుగులేని వ్యక్తిగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. రెండు హోటళ్లతో ప్రారంభమై తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఒబెరాయ్ గ్రూప్ 1934లో కేవలం రెండు హోటళ్లతో ప్రారంభమైంది. మన దేశంలో మొదటి ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభించిన ఘనత ఒబెరాయ్ గ్రూప్దే కావడం విశేషం. ఈ ఘనత పీఆర్ఎస్ ఒబేరాయ్ సొంతమే. పీఆర్ఎస్ ఒబెరాయ్ 2013 వరకు ఈఐహెచ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టి హాస్పిటాలిటీ రంగంలో దినదినాభివృద్ధి చెందాడు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ రంగంలో గుర్తింపు పొందిన పీఆర్ఎస్ ఒబెరాయ్ గత ఏడాది మే 03న ఈఐహెచ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం పీఆర్ఎస్ ఒబేరాయ్ కొడుకు 'విక్రమ్ ఒబెరాయ్' ఈఐహెచ్ బాధ్యతలు స్వీకరించారు. మొత్తం సంపద (నెట్వర్త్) బికీగా ప్రసిద్ధి చెందిన పీఆర్ఎస్ ఒబెరాయ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2008లో దేశ రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన 'పద్మవిభూషణ్'తో గౌరవించింది. ఫోర్బ్స్ ప్రకారం పీఆర్ఎస్ ఒబెరాయ్ సంపద రూ. 3829 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ఈ కారు కొనే డబ్బుతో ఫ్లైటే కొనేయొచ్చు - ధర తెలిస్తే అవాక్కవుతారు! కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా విస్తరించిన ఒబెరాయ్ హోటల్స్ ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, జమ్మలమడుగు, విశాఖపట్టణ ప్రాంతాల్లో ఒబెరాయ్ హోటల్స్ కోసం శంకుస్థాపన చేశారు. ఇవన్నీ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. -
ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, రిసార్ట్స్ ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్(94) మంగళవారం ఉదయం అనారోగ్యం కారణంతో కన్నుమూశారు. 2002లో అతను తన తండ్రి మోహన్ సింగ్ ఒబెరాయ్ మరణం తర్వాత ఐఈహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2013 వరకు సంస్థ సీఈఓగా కొనసాగారు. మే 2022 వరకు పృథ్వీ రాజ్ సింగ్ ఈఐహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తన పదవిని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన మేనల్లుడు అర్జున్ సింగ్ ఒబెరాయ్ను ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నియమించారు. ఒబెరాయ్ ఆరోగ్యం కోసం ఎక్కువ సమయం కేటాయించేవారని ఆయన కుమారుడు ఒబెరాయ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఒబెరాయ్ తెలిపారు. పృథ్వీ రాజ్ సింగ్ ఇండియా, యూకే, స్విట్జర్లాండ్లో చదువు పూర్తిచేశారు. 1967లో దిల్లీలో ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ని స్థాపించారు. టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో చేసిన సేవలకు గాను 2008లో ఒబెరాయ్కు పద్మవిభూషణ్ లభించింది. 2008లో బిజినెస్మ్యాన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. లగ్జరీ హోటళ్లలో కలిస్తున్న వసతులకుగాను 2010లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. నవంబర్ 2010లో కార్పొరేట్ హోటలియర్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు గెలుచుకున్నారు. ఫిబ్రవరి 2013లో ది ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ద్వారా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 2015లో సీఎన్బీసీ టాప్ 15 భారతీయ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా ఎంపికయ్యారు. -
Top 10 Most Expensive Hotels In India: భారత్లో ఖరీదైన హోటల్స్ - చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి! (ఫొటోలు)
-
ఆతిథ్యానికి అందలం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రం.. పర్యాటక రంగం అభివృద్ధిలోనూ వేగంగా ముందుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికతో రాష్ట్రంలో పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. లగ్జరీ విల్లాలు, 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటుతో పర్యాటకులను ఆకర్షించడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. సులభతర వాణిజ్యంలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తోంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో ఒప్పందం కుదిరిన ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇందులో విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు), గండికోటలో నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే పిచ్చుకలంక, హార్సిలీహిల్స్లో కూడా ఒబెరాయ్ నిర్మాణాలకు ఒప్పందాలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఒక్క ఒబెరాయ్ సంస్థల ద్వారానే సుమారు 10,900 మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. తాజాగా విశాఖలో మేఫెయిర్, తిరుపతిలో ఎంఆర్కేఆర్ (హయత్) సంస్థల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపింది. వీటికి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ వెంటనే స్థలాలను సైతం కేటాయించింది. తిరుపతిలో 5 స్టార్ హోటల్ ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఏటా 30 నుంచి 40 మిలియన్ల యాత్రికులు వస్తుంటారు. దీనికి తోడు చెన్నై – తిరుపతి – నెల్లూరు పారిశ్రామిక హబ్ కూడా ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో తిరుపతిలోని పేరూరులో 5 స్టార్ లగ్జరీ హోటల్ నిర్మాణానికి హైదరాబాద్కు చెందిన ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ ( హయత్ గ్రూప్) ముందుకొచ్చింది. రూ.218 కోట్ల పెట్టుబడితో 1550 మందికిపైగా ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించింది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.230.08 కోట్ల ఆదాయం లభించనుంది. ఇందులో సుమారు 144 గదులు (స్టాండర్డ్, సుపీరియర్, డీలక్స్, సూట్స్), అత్యాధునిక రెస్టారెంట్, కాన్ఫరెన్స్, బ్యాంకెట్ హాల్, వివాహాలు, ఎగ్జిబిషన్లకు ప్రత్యేక వేదిక, హెల్త్ హబ్ ఇతర ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి. విశాఖలో రూ.525 కోట్లతో విల్లాల సముదాయం విశాఖపట్నానికి సమీపంలోని అన్నవరం వద్ద మేఫెయిర్ సంస్థ (భువనేశ్వర్) అత్యాధునిక లగ్జరీ రిసార్ట్ను అభివృద్ధి చేయనుంది. సుమారు 40 ఎకరాల్లో రూ.525 కోట్లతో 250 రిసార్టులను నిర్మిస్తుంది. దీని ద్వారా 1,750 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.852.40 కోట్లు ఆదాయం లభిస్తుంది. ఇందులో భారీ కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్, మినీ గోల్ఫ్ కోర్సు, 4,500 మంది కూర్చునేలా బ్యాంకెట్ హాల్, మరో 10 చిన్న బ్యాంకెట్ హాళ్లు, ఓపెన్ స్కై బ్యాంకెట్ హాల్, షాపింగ్ మాల్స్ ఉంటాయి. రూ.69.37 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తొలి దశలో భాగంగా విశాఖపట్నంలోని అన్నవరం, పేరూరు, గండికోట గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. సుమారు రూ.69.37 కోట్లతో గ్రామాల్లో పెద్ద రహదారులను కలుపుతూ రోడ్ల నిర్మాణం, నీటి సౌకర్యం మెరుగుదల, ప్రత్యేక విద్యుత్ లైన్లు, అత్యాధునిక మురుగు పారుదల వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. వీటికి త్వరలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించనుంది. సీఎం జగన్ బ్రాండింగ్తోనే పెట్టుబడులు సీఎం జగన్ బ్రాండింగ్తో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి హోటల్ రంగ సంస్థలు వస్తున్నాయి. ఒబెరాయ్తో పాటు మేఫెయిర్, హయత్ గ్రూప్ల హోటళ్లు, లగ్జరీ విల్లాల నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇచ్చాం. పర్యాటకంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పనే ఈ ప్రాజెక్టుల లక్ష్యం. జీఐఎస్లో కుదిరిన ప్రతి ఒప్పందాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకొస్తాం. తిరుపతి, విశాఖ, గండికోటను ప్రపంచ పటంలో మరింత ఉన్నతంగా నిలబెడతాం. పర్యాటకానికి అవకాశాలుండే ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. తద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షిస్తాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి -
ఇక గ్లోబల్ గండికోట
ప్రస్తుతం దేశంలో పర్యాటకం కీ రోల్ పోషిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక దార్శనికతతో తన డైనమిక్ లీడర్షిప్తో సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. ఇందులో మమ్మల్ని భాగస్వాములను చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రపంచ స్థాయి సెవెన్ స్టార్ రిసార్ట్స్ను, మంచి రూమ్స్, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తాం. ఏపీలో హోటల్స్ స్థాపించడం వల్ల ఇక్కడి వారికి ఉపాధి ఇవ్వగలుగుతాం. ప్రఖ్యాతిగాంచిన ఈ గండికోటలో మంచి సౌకర్యాలతో లగ్జరీ సెవెన్ స్టార్ రిసార్ట్ను ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, వైజాగ్లో కూడా హోటల్స్ను ప్రారంభిస్తాం. 2025కు ఈ హోటల్స్ ప్రారంభమవుతాయి. – విక్రమ్సింగ్ ఒబెరాయ్, ఒబెరాయ్ హోటల్స్ సీఈవో సాక్షి ప్రతినిధి, కడప: గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిల్చుకునే మన గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోటలో ఆదివారం ఆయన ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తిరుపతి, విశాఖపట్నం ఒబెరాయ్ హోటల్స్కు కూడా వర్చువల్గా శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. దేవుడి దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. ఒక్కరోజే గండికోట, విశాఖపట్నం, తిరుపతితో కలిపి మూడు చోట్ల ఒబెరాయ్ హోటళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు జరగడం సంతోషకరం అని చెప్పారు. ఒబెరాయ్ లాంటి గ్రూపు ఇక్కడకు వచ్చి.. సూపర్ లగ్జరీ సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతోందన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద గ్రూపులు వచ్చి ఇలాంటి హోటల్స్ కడితే గండికోట గ్లోబల్ టూరిజం మ్యాప్లోకి చేరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల వైఎస్సార్ జిల్లా, గండికోట రెండూ అంతర్జాతీయంగా చోటు దక్కించుకుంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ కార్ల్ లో నూటెక్ బయోసైన్సెస్ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఉద్యోగావకాశాలు విస్తృతం ఇక్కడ ఒబెరాయ్ హోటల్ రావడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ఈ హోటల్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 500 నుంచి 800 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒబెరాయ్ ప్రాజెక్టు అనేది మిగిలిన ప్రాజెక్టులు రావడానికి ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది. గండికోటలో ఇలాంటి గ్రూపు ప్రాజెక్టులు రావడానికి ఇంకా అవకాశం ఉంది. ఒబరాయ్ లాంటి ఇంకో గ్రూపుని తీసుకొచ్చే కార్యక్రమం ముమ్మరంగా చేస్తాం. ► ఇంతకుముందు విక్రమ్ ఒబెరాయ్తో మాట్లాడుతూ ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ పెట్టే ఆలోచన చేస్తే హోటల్కు మంచిదని, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని.. ఈ హోటల్ను ఒక గోల్ఫ్ రిసార్ట్గా దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పాను. ఆ దిశగా అడుగులు వేసేలా ఆలోచన చేస్తామన్నారు. ► విక్రమ్ ఒబెరాయ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రాజెక్టు రావడానికి శాయశక్తులా కృషి చేసిన చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్రెడ్డి నుంచి పర్యాటక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సహా ప్రతి ప్రభుత్వ అధికారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టుకు మీ అందరి సహకారం చాలా అవసరం. ఈ కంపెనీ మన గురించి బయట గొప్పగా మాట్లాడితే ఇంకా నాలుగు కంపెనీలు ఇక్కడకు వచ్చే పరిస్థితి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ► ఏవైనా చిన్న చిన్న అంశాలుంటే కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. మనం ఎంత సహకారం అందిస్తే మన జిల్లా ప్రతిష్ట అంతగా పెరిగి అంత ఎక్కువ పరిశ్రమలు వస్తాయి.. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడి పెడతారు. మీ సోదరునిగా అందరికీ ఇదే నా విజ్ఞప్తి. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ పనులు ► జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలని కలులు కన్నాం. మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలని దశాబ్దాలుగా కన్న కలను నిజం చేస్తూ గతేడాది జిందాల్ గ్రూపుతో కలిసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. ఇందుకు సంబంధించిన వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్కు ఈ నెలలోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తుంది. ఆ తర్వాత రెట్టించిన వేగంతో పనులు జరుగుతాయి. ► రేపు కొప్పర్తిలో డిక్సన్ కంపెనీకి సంబంధించిన ప్లాంట్కు ప్రారంభోత్సవం చేస్తున్నాం. కొప్పర్తిలో డిక్సన్ గ్రూపు 1000కి పైగా ఉద్యోగాలు ఇచ్చింది. మరో రెండు నెలల్లో ఇంకో 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఛానల్ ప్లే అనే మరో కంపెనీ హోం ఆడియో సిస్టమ్స్ తయారు చేస్తుంది. రేపు కొప్పర్తిలో ఆ కంపెనీతో ఎంఓయూపై సంతకాలు చేయనున్నాం. ఈ కంపెనీ ద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ► ఎల్ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్ ప్రొడక్టస్ తయారు చేసే టెక్నో డామ్ ఇండియా అనే మరో కంపెనీతో కూడా రేపు ఎంఓయూ చేయబోతున్నాం. ఈ కంపెనీ ద్వారా మరో 200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వైఎస్సార్ జిల్లాకు ఇంకా మంచి చేయాల్సిన అవసరం, మంచి జరిగే రోజులు చాలా ఉన్నాయి. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా చేసే పరిస్థితులు, అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!
YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు
Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
ట్విస్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ!
గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?
నితీశ్ రెడ్డి మెరుపులు..సన్రైజర్స్ అనూహ్య గెలుపు (ఫొటోలు)
AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
- సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement