-
ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్ ఉంటేనే ప్రవేశం
ముంబై: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై హెల్మెట్ లేకుండా ప్రవేశం లభించదు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ద్విచక్రవాహనాల్లో వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. లేనట్లయితే ప్రవేశం లభించదు. కొంతకాలంగా రహ దారులపై జరిగే ప్రమాదాలలో అత్యధికంగా ద్విచక్రవాహనాలే ప్రమాదానికి గురవుతున్నాయి. దీంతో ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మందికి తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధగా కొన్ని సూచనలు చేసింది. హైకోర్టు చేసిన సూచనల మేరకు రాష్ట్ర రవాణా శాఖ జనజాగృతి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ‘ఎన్నో జన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ హెల్మెట్ ధరించడం విషయంలో అనుకున్న ఫలితాలు రావడం లేదనీ, అందుకు ఇకనుంచి కఠినమైన చర్యలు చేపట్టాలనీ నిర్ణయించినట్లు రవాణా శాఖ కమిషనర్ అవినాశ్ డాక్టె తెలిపారు. హెల్మెట్ లేని వారెవ్వరినీ ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించకూడదనీ, ఉన్నతాధికారులైనా, సామాన్యులైనా అందరికీ ఈ నియమం వర్తిస్తుందన్నారు. చదవండి: (సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గొర్రెల కాపరి..) ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు, జన చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా హెల్మెట్ ధారణ విషయంలో నిర్లక్ష్యం వహించే ద్విచక్రవాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామనీ అవినాష్ డాక్టె వెల్లడించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని పరిపాలనా శాఖకు చెందిన అన్ని ఆఫీసుల్లో, విద్యా సంస్థల్లో, ఇతర విభాగాలకు చెందిన కార్యాలయాల్లో కూడా హెల్మెట్ తప్పని సరిగా ధరించాలనే నియమాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి -
వాట్సాప్ మెసేజ్: సిటీలో హెల్మెట్ అవసరం లేదా?
"నగరవాసులకు శుభవార్త.. నగరపరిధిలో ప్రయాణించే వాహనదారులు ఇక మీదట బైకులపై హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఈమేరకు దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీలను కోర్టు వ్యతిరేకించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్కు హెల్మెట్ వాడకం తప్పనిసరేమీ కాదని తేల్చి చెప్పింది." "కనీస రక్షణ అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర, జిల్లాల హైవేలపై మాత్రం హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని తీర్పునిచ్చింది. నగర పరిధుల్లో మాత్రం హెల్మెట్ ధరించాలా? వద్దా? అన్నది కేవలం పౌరుల వ్యక్తిగత ఇష్టమని వెల్లడించింది. ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీ బండి ఆపి మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని అడిగితే నేను పలానా మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని వారికి చెప్పొచ్చు. దీంతో వారు మీపై ఎలాంటి జరిమానా వేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి" అంటూ ఓ మెసేజ్ వాట్సాప్లో తెగ వైరల్ అవుతోంది. ఇకపై హెల్మెట్ లేకున్నా నో ఫైన్ అంటూ జనాలు దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ చేస్తున్నారు. అయితే మీరు మాత్రం దీన్ని నమ్మి హెల్మెట్ లేకుండా వెళ్లారంటే చలానా బారిన పడటం ఖాయం. ఎందుకంటే ఇది పూర్తిగా ఓ ఫేక్ న్యూస్. ఈ అసత్య ప్రచారానికి తోడు దాని కింద ఫోన్ నెంబర్లు జోడించారు. అందులో ఒక నంబర్ కలవగా అది న్యాయవాది దేవేంద్ర ప్రతాప్ సింగ్దే కావడం గమనార్హం. అయితే అతడు దీనిపై స్పందిస్తూ ఈ మెసేజ్కు, తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పాడు. ఎవరో కావాలనే తన పేరు మీద ఈ వదంతులు సృష్టించారని, దీన్ని ఎవరూ నమ్మొద్దని సూచించాడు. కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వవని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఫేక్ న్యూస్ను ఎవరూ నమ్మవద్దని, దీన్ని అస్సలు ఫార్వర్డ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: వైరల్: ఎప్పుడైనా ఎగిరే వడాపావ్ తిన్నారా?! పోలీస్ అధికారి సాహసం..స్పైడర్మ్యాన్ అంటూ ప్రశంసలు -
నో హెల్మెట్.. నో పెట్రోల్
ఆదిలాబాద్టౌన్: హెల్మెట్ ప్రాణానికి రక్షణ. హెల్మెట్ ధ రించి ప్రమాదాలకు గురైన వారిలో చాలా మందివరకు బతికి బయటపడ్డారు. ఎన్నో సందర్భాల్లో హెల్మెట్ ధరిస్తే బతికుండేవాడేమోనని సంఘటన స్థలాల్లో ప్రజలు చర్చించుకోవడం కనిపిస్తోంది. ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో హెల్మెట్ వాడేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో సైతం జిల్లాలో నో హెల్మెట్.. నోపెట్రోల్ అమలు చేసినా కొన్ని రోజులకే పరిమితమైంది. 2021 జనవరి 1 నుంచి మరోమారు ఈ శాఖల ఆధ్వర్యంలో నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 2016 జూన్2 నుంచి జిల్లాలో నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. వాహనదారులు హెల్మెట్లు ధరిస్తేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోసేవారు. ఆ తర్వాత కలెక్టర్, రవాణా, పోలీసు శాఖలో ఉన్నతాధికారులు బదిలీలు కావడంతో మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులు హెల్మెట్ లేకుండా వచ్చినా బంక్ యజమానులు పెట్రోల్ పోశారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు పట్టించుకోకపోవడంతో కార్యక్రమం నిలిచిపోయింది. తాజాగా రవాణా శాఖ డీటీసీ, ఎస్పీ 2021 జనవరి 1 నుంచి నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమానికి మరోసారి ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ల యజమానులతో సమావేశాలు నిర్వహించి చర్చిస్తున్నారు. హెల్మెట్ లేనిదే ఏ ఒక్క వాహనదారుడికి పెట్రోల్ పోయవద్దని సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆయా ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవచ్చని సూచిస్తున్నారు.ఈ ఏడాది జిల్లాలో 78 ద్విచక్రవాహన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 43 మంది మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇవేకాకుండా చిన్నచిన్న ప్రమాదాలు వందల్లో జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. జనవరి 1 నుంచి అమలు చేస్తాం నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమాన్ని 2021 జనవరి 1 నుంచి అమలు చేస్తున్నాం. ఇప్పటికే ప్రజలు, వాహనదారులకు వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలోని పెట్రోల్బంక్ యజమానులతో సైతం చర్చించాం. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు, రవాణా శాఖ సంయుక్తంగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 2016లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అప్పట్లో వివిధ కారణాలతో ఈ కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది. ఈసారి మాత్రం పకడ్బందీగా అమలు చేస్తాం. దీనికి ప్రజలంతా సహకరించాలి. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ -
కిరాక్ ఆన్సర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసు
సాక్షి, హైదరాబాద్: ఫొటో చూసి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అని భ్రమపడ్డారా.? మీరే కాదండోయ్.. తెలంగాణ పోలీసులు కూడా అలానే భావించారు. అంతేనా.. వారికి ఆన్లైన్లో చలానా కూడా విధించారు. ఇది చూసి వాహనదారుడు షాకయ్యాడు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టుగా అది ట్రిపుల్ రైడ్ కానే కాదు. ముందు వేరే వాహనంపై వెళ్తున్న వ్యక్తి సరిగ్గా ఇతని వాహనాన్నే నడుపుతున్నట్టుగా అనిపించడంతో పోలీసులు చలానా జారీచేశారు. కానీ కాస్త పరిశీలించి చూస్తే అది అబద్ధమని రుజువైంది. చేయని తప్పుకు చలానా విధిస్తారా అంటూ సదురు వాహనదారుడు పోలీసులపై మండిపడ్డాడు. సరిగ్గా చూడండి. మీకే తెలుస్తుంది వాహనంపై ముగ్గురున్నామా? లేక ఇద్దరున్నామా..? అంటూ పోలీసులనే ప్రశ్నించాడు. ఈ దెబ్బకు పోలీసులు తొలుత నాలుక్కరుచుకున్నారు. ఆ తర్వాత అతనికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ‘మీ అభ్యర్థనను స్వీకరించాం. ఆ చలానాను ట్రిపుల్ రైడింగ్ నుంచి హెల్మెట్ పెట్టుకోనందుకుగా మార్చుతున్నాం’ అంటూ సమాధానమిచ్చారు. మీరు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించారని, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి.. ఎప్పుడూ హెల్మెట్ ధరించండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఇది చూసిన సోషల్మీడియా జనాలు పాపం.. ఆ వ్యక్తి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది అని సెటైర్స్ వేసుకుంటున్నారు. -
నో హెల్మెట్..నో పెట్రోల్
కలెక్టర్ వినయ్చంద్ ఆదేశం ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానాన్ని అన్ని పెట్రోల్ బంకుల్లో అమలు చేయాలని కలెక్టర్ వి.వినయ్చంద్ ఆదేశించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రహదారి భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై ఆర్అండ్బీ ఎస్ఈ, డీఎస్పీలు, ఎంవీఐలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి నివేదిక అందించాలని చెప్పారు. జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదం జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై ఉన్న బొల్లాపల్లి, టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రెస్టు రూమ్లు, లైటింగ్, తాగు నీరు వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయమూర్తికి రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. షార్ట్ ఫిల్మ్ తయారు చేయాలి జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్ తయారు చేసి థియేటర్లలో ప్రదర్శించి ప్రజలకు అవగాహన కలిగించాలని వినయ్చంద్ సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో వాహనదారులను పరీక్షించేందుకు ప్రతి మునిసిపాలిటీలో రెండు బ్రీత్ ఎనలైజర్స్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. అద్దంకి–నార్కట్పల్లి జాతీయ రహదారి వద్ద మేదరమెట్ల కొండ ప్రాంతాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ, పోలీసు అధికారులు పరిశీలించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ సత్యఏసుబాబు, రవాణశాఖ డిప్యూటీ కమిషనర్ సుబ్బారావు, ఆర్టీసీ ఆర్ఎం ఆదాం సాహెబ్, ఆర్అండ్బీ ఎస్ఈ నాగమల్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ నాయుడు, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నాగరాజు, డీసీఆర్బీ డీఎస్పీ మరియదాసు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement