-
రాజీనామా తర్వాత నితీష్ కుమార్ సంచలన కామెంట్స్
-
రసవత్తరంగా బీహార్ రాజకీయాలు
-
ఆచరణ సాధ్యం కాని పనుల గురించి ఎందుకు సార్.. మాట్లాడటం!!
ఆచరణ సాధ్యం కాని పనుల గురించి ఎందుకు సార్.. మాట్లాడటం!! -
వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
పట్నా: కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకివస్తే దేశంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా (స్పెషల్ కేటగిరీ స్టేటస్) కల్పిస్తామని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ఈ హోదా దక్కుతుందని, అలా జరగకపోవడానికి కారణమేదీ తనకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నితీశ్ గురువారం పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేయడం దారుణమని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దూరం చేయడం తగదని అన్నారు. బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్కుమార్ మోదీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్పై నితీశ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో వారిద్దరూ తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీతో తాము చాలాకాలం కలిసి ఉండడం తప్పేనని నితీశ్ అంగీకరించారు. ప్రత్యేక హోదా కోసం బిహార్ చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిహార్ను విభజించడం వల్ల రెవెన్యూ, గనుల ఆదాయం మొత్తం జార్ఖండ్కే వెళ్తోందని నితీశ్ కుమార్ చెబుతున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే చాలు కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా మద్దతిస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. బిహార్లో నెల రోజుల క్రితమే బీజేపీ కూటమి నుంచి బయటకువచ్చి, ప్రతిపక్షాలతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ బరిలోకి దిగుతారని జేడీ(యూ) నాయకులు ఉద్ఘాటిస్తున్నారు. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
వాళ్లంతా నాకు టచ్లోనే ఉన్నారు: చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలన సాగించలేదని లోక్జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. త్వరలోనే జేడీ(యూ)లో చీలిక వస్తుందని, ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు తనతో టచ్లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశీర్వాద్ యాత్రలో భాగంగా ఉత్తర బిహార్ జిల్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీశ్ కుమార్పై విమర్శలు గుప్పించారు. తనను దెబ్బ కొట్టేందుకే తన బాబాయ్ పశుపతి పరాస్తో చేతులు కలిపిన నితీశ్ కుమార్.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించారని ఆరోపించారు. జేడీయూలోని ఇతర నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్థిరంగా కొనసాగలేదని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని చిరాగ్ జోస్యం చెప్పారు. నితీశ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు బదులుగా.. ఎన్నికల సమయానికి ఈ పొత్తు గురించి ఆలోచిస్తానని బదులిచ్చారు. పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని నేనే: పశుపతి దివంగత కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని తానేనని, ఆయన సోదరుడు పశుపతి పరాస్ పేర్కొన్నారు. ‘‘హిందూ వారసత్వ చట్ట ప్రకారం చిరాగ్ ఆయన ఆస్తులకు వారసుడేమో గానీ, నేను మాత్రమే ఆయన రాజకీయ వారసుడిని’’ అని వ్యాఖ్యానించారు. కాగా బిహార్ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూను వ్యతిరేకిస్తూ అభ్యర్థులను రంగంలోకి దించిన చిరాగ్ పాశ్వాన్... తన నిర్ణయంతో ఆ పార్టీ ఓట్లకు గండికొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరాగ్తో విభేదించిన ఎంపీ పశుపతి ఇటీవలే ఎల్జేపీలో తిరుగుబాటు లేవనెత్తి జాతీయాధ్యక్ష పదవి చేపట్టారు. బిహార్లో ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక జేడీయూ నేత రామచంద్ర ప్రసాద్ సింగ్ (63)కు సైతం బిహార్ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement