-
వామ్మో చైనా ఇన్ఫెక్షన్
వాషింగ్టన్: చైనాలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని కొత్త రకం బ్యాక్టీరియల్ నిమోనియా దేశమంతటా శరవేగంగా వ్యాపిస్తుండటం మరింత భయోత్పాతానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. చైనాకు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించాలని ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు లేఖ రాశారు. -
ఘన ఇంధన బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాం
సియోల్: మొట్టమొదటిసారిగా ఘన ఇంధనాన్ని వినియోగించి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తరకొరియా శుక్రవారం ప్రకటించింది. వేగంగా ప్రయాణించే కొత్త రకం క్షిపణిని ఆ దేశం గురువారం ప్రయోగించినట్లు దక్షిణకొరియా, జపా¯Œ పేర్కొనడం తెలిసిందే. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోని వేదికపై నుంచి చేపట్టిన ఈ ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్, ఆయన భార్య, కుమార్తె, సోదరి తిలకించినట్లు అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఈ క్షిపణి మూడు దశలుగా ప్రయాణించి, లక్ష్యాన్ని ఛేదించినట్లు వివరించింది. ఇప్పటి వరకు ద్రవ ఇంధనంతో పనిచేసే క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా తాజాగా ఘన ఇంధనం వాడినట్లు ప్రకటించడం ముందడుగేనని నిపుణులంటున్నారు. అమెరికాను నేరుగా భయపెట్టే అణ్వాయుధాలను సమకూర్చుకోవాలనే లక్ష్యంలో ఇది పురోగతిగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ తాజా క్షిపణి సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది ప్రయాణించిన దూరం, ఎత్తు, తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఎలా ఛేదించింది, వార్ హెడ్ అమరిక వంటి వివరాలను వెల్లడించకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. -
Poliovirus: పోలియో వైరస్లో కొత్త టైప్ గుర్తింపు
దాదాపు కనుమరుగు అయ్యిందనుకుంటున్న పోలియో వైరస్.. కొత్త వేరియెంట్ రూపంలో మళ్లీ తెర మీదకు వచ్చింది. పోలియో వైరస్లో వీడీపీవీ2 రకాన్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఇందుకు సంబంధించిన కేసులేవీ అధికారికంగా నమోదు కావడం భారీ ఊరట ఇచ్చే అంశం. లండన్లోని మురుగు నీటి నమునాలో ఈ కొత్త వేరియెంట్ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. టీకాల నుండి తీసుకోబడిన ఈ రకమైన పోలియోవైరస్ టైప్ను గుర్తించామని బ్రిటిష్ ఆరోగ్య ప్రతినిధులు సైతం బుధవారం ధృవీకరించారు. ప్రస్తుతానికి ఈ వేరియెంట్ బారిన పడినట్లు ఏ కేసు నమోదు కాలేదని, ఈ వేరియెంట్పై మరింత విశ్లేషణ జరుగుతోందని బ్రిటిష్ ప్రతినిధులు తెలిపారు. ‘‘వైరస్.. పర్యావరణ నమూనాల నుండి మాత్రమే వేరు చేయబడింది. కానీ, పక్షవాతం యొక్క సంబంధిత కేసులు ఏవీ కనుగొనబడలేదు అని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్వో. అయితే పోలియో వైరస్ ఏ టైప్, వేరియెంట్లో, ఏ రూపంలో ఉన్నా.. పిల్లలకు ప్రమాదమేన’’ని హెచ్చరించింది. పోలియోను అరికట్టేందుకు దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. 1988 సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుత కాలంలో 99 శాతం కేసులు తగ్గాయి. దాదాపు 125 దేశాల్లో.. 3,50,000 కేసులు మాత్రమే గుర్తించబడ్డాయి. ప్రమాదకరమైన పోలియో వైరస్ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్లో మాత్రం ఇంకా మనుగడలో ఉంది. ఇక భారత దేశం పోలియో రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో ప్రకటించింది. కానీ ఈ మధ్యే కోల్కతాలో పోలియో వైరస్ నూతన రూపాంతరాన్ని గుర్తించారు. యునిసెఫ్ (UNICEF)తో కలిసి నిర్వహించిన అధ్యయనంలో పోలియో వైరస్ రూపాంతరం బయటపడింది. పశ్చిమ బెంగాల్లో చివరిసారిగా.. హౌరాలో 2011లో పన్నెండేళ్ళ బాలికకు పోలియో వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆ తర్వాత UNICEFతో కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనాల్లో తాజాగా ఈ వైరస్ రూపాంతరం కనిపించింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న బాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, టీకాలు వేయించడం.. పోలియో బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకునే మార్గాలు. చదవండి: వేల సంఖ్యలో కోవిడ్ కేసులు.. మరో వేవ్కు సంకేతమా? -
Red Globe Grapes: ప్రయోగం ఫలించింది..
శింగనమల(అనంతపురం జిల్లా): రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి, ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రైతులు సైతం పంటల సాగులో నూతన పంథాను అవలంబిస్తున్నారు. కొత్త రకం పంటల సాగుపై దృష్టి సారించి.. జిల్లాలోనే కాక పొరుగున ఉన్న రాష్ట్రాల్లోనూ ఆ తరహా పంటలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల మండలం గుమ్మేపల్లికి చెందిన రైతు చంద్రప్రకాష్రెడ్డి (బాబు) సరికొత్త ద్రాక్ష రకాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగదశలోనే ఆశించిన ఫలితాన్ని సాధించారు. చదవండి: ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు రెడ్గ్లోబ్ ద్రాక్ష పంట ఆస్ట్రేలియా రకం రెడ్ గ్లోబ్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాకే పరిమితమైన రెడ్ గ్లోబ్ రకం ద్రాక్షకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ద్రాక్ష రకాన్ని సాగు చేస్తే ఎలా ఉంటుందని రైతు చంద్రప్రకాష్ రెడ్డి భావించారు. అనుకున్నదే తడవుగా రెడ్ గ్లోబ్ సాగు చేస్తున్న రైతుల గురించి ఆరా తీస్తూ కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి వెళ్లారు. అక్కడ ఓ రైతు సాగు చేస్తున్న రెడ్ గ్లోబ్ ద్రాక్షను పరిశీలించారు. 2019లో రూట్స్ తీసుకొచ్చి నాటారు. 2020లో రెడ్గ్లోబ్ అంటు కట్టించారు. ఒక్కొక్క అంటుకు రూ.150 చొప్పున ఖర్చు పెట్టారు. మొత్తం ఆరు ఎకరాల్లో ఆరు వేల అంటు మొక్కలు నాటారు. పందిరి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఎకరాకు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లోనే పండే ఈ రకం పంట జిల్లా వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందో.. లేదోననే అనుమానాలు ఉండేవి. అయితే అనూహ్యంగా పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం కోత దశకు వచ్చింది. ఓ ప్రయోగం చేద్దామనుకున్నా.. రెడ్ గ్లోబ్ ద్రాక్ష రకం గురించి తెలియగానే ఎలాగైనా ఈ పంట సాగు చేయాలని అనుకున్నా. చిక్కబళ్లాపురంలో ఈ పంట సాగు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికెళ్లి చూశాను. ఎర్ర నేలలు అనుకూలమని తెలిసింది. దీంతో నాకున్న 50 ఎకరాల్లో ఓ ఐదు ఎకరాల్లో ప్రయోగం చేద్దామని అనుకున్నా. అంటు మొక్కలు తీసుకొచ్చి ఆరు ఎకరాల్లో నాటాను. పశువుల పేడ ఎరువు వాడాను. దిగుబడి ఆశించిన దాని కన్నా ఎక్కువగానే ఉంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అనుకుంటున్నా.ఈ లెక్కన తొలి కోతలో పెట్టుబడులు చేతికి వస్తే.. ఆ తర్వాత వరుస లాభాలు ఉంటాయి. ఆరు నెలల పాటు పంట కోతలు ఉంటాయి. సాధారణంగా మార్కెట్లో రెడ్ గ్లోబ్ ద్రాక్ష కిలో రూ.300 నుంచి రూ.500 వరకు ధర పలుకుతోంది. అయితే జిల్లాలో సరైన మార్కెటింగ్ వసతి లేకపోవడంతో ముంబయి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని మార్కెట్కు తరలిస్తున్నా, కిలో రూ.180 నుంచి అమ్ముడుబోతోంది. – చంద్రప్రకాష్రెడ్డి, రైతు, గుమ్మేపల్లి, శింగనమల మండలం -
ఏపీలో ఎన్440కే వైరస్ లేదు.. ప్రజలను భయపెట్టొద్దు
సాక్షి, విజయవాడ: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయొద్దని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ఎన్440కే వైరస్పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఈ వైరస్ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని ఆయన వెల్లడించారు. ‘‘ప్రతీ నెలా సీపీఎంబీకి 250 నమూనాలు పంపుతాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల నుండి నమూనాలను జన్యు శ్రేణి పరీక్షల కోసం సీసీఎంబీ హైదరాబాద్కి పంపిస్తున్నారు. ఎన్ 440కె (బి.1.36) వైరస్ దక్షిణ భారత దేశం నుండి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. 2020 జున్, జూలై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. దాని ప్రభావం గత డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కనిపించింది. కానీ మార్చి నెలలో అది పూర్తిగా అంతర్థానమైంది, ఇప్పుడు దాని ప్రభావం చాలా స్వల్పం. ప్రస్తుతం బి1.167, బి.1 వైరస్ స్ట్రెయిన్ల ప్రభావం దక్షిణ భారత దేశంపై ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల్లో ఏప్రిల్ నెల డేటాను పరిశీలించినప్పుడు నిర్థారణ జరిగింది. ఇది అధిక ఇన్ఫెక్షన్ కారకంగాను, యువతలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏపీడేమియోలాజికల్లో కూడా బి.1.617ని ఇండియాలో గుర్తించినట్టు పేర్కొన్నారు. ఎన్ 440కే వేరియంట్ కోసం డబ్ల్యూహెచ్వో ఎక్కడా ప్రస్తావించలేదని’’ జవహర్రెడ్డి వివరించారు. ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తున్నట్టు దీని ప్రభావం ఉంటే ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్వో గుర్తించకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మీడియాలో శాస్త్రీయమైన అంశాలపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని కేఎస్ జవహర్రెడ్డి అన్నారు. చదవండి: ఏపీలో కొత్త రకం వైరస్ లేదు YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా.. -
వామ్మో.. పొరుగు దేశంలో కొత్త రకం కరోనా
కొలంబో: గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీలంక వైద్య నిపుణులు తెలిపారు. మునుపటి కరోనాతో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం, వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇది గాల్లో దాదాపు గంట సేపు పైనే మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే చెప్పారు. ఇటీవల దేశంలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కువ యువత కరోనా బారిన పడుతున్నారని అన్నారు. అయితే రాబోయే 2-3 వారాలలో తరువాతే నిజమైన పరిస్థితి బయటపడుతుందని ఆయన అన్నారు. శ్రీలంకలో కోవిడ్ నివారణ కోసం అక్కడి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది మే 31 వరకు అమలులో ఉండనుంది. శ్రీలంక కూడా అనేక దేశాల మాదిరిగానే , కరోనా కేసుల సంఖ్యను నివారించలేకపోతోంది. ప్రస్తుత శ్రీలంకలో కేసుల సంఖ్య 99,691 ఉండగా, 638 మరణాలు నమోదయ్యాయి. కేసుల పెరుగుతున్ననేపథ్యంలో రోగులకు చికిత్స చేయడానికి ఆస్పత్రుల్లో తగినంత వైద్యం సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని, అయితే వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య మార్గదర్శకాలను పాటించడం చాలా ముఖ్యం అని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అసేలా గుణవర్ధన అన్నారు. ( చదవండి: Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా? ) -
కళ్లు చెబుతాయ్.. చేతివేళ్లు రాస్తాయ్
కోస్గి (కొడంగల్): అందరికీ తెలిసి ఎక్కడైన మనుషులు నోటితోనే మాట్లాడతారు. కానీ కోస్గి మున్సిపాలిటీ విలీన గ్రామం పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కళ్లు, చేతి వేళ్లు మాట్లాడతాయి. కళ్లు, చేతి వేళ్లు మాట్లాడటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు నమ్మిన, నమ్మకపోయిన ఇది నిజం. పాఠశాలలో తెలుగు పండిత్గా పనిచేస్తున్న హన్మంతు ఎలాగైన తన విద్యార్థులకు కొత్త విధానంలో బోధన చేసి ప్రత్యేకతను చాటుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు గతంలో రాజుల పాలనలో కళ్లతోపాటు చేతివేళ్లతో సైగలు చేసే భాష ఉండేదని పురాణాల్లో ఉండటంతోపాటు గతేడాది ప్రపంచ తెలుగు మహాసభల్లో ఖమ్మం విద్యార్థులు కళ్లతో, చేతి వేళ్లతో సైగల ద్వారా అక్షరాలను, లెక్కలు చేసే విధానం ప్రదర్శించారు. ఇదే ప్రేరణగా తెలుగు ఉపాధ్యాయుడు హన్మంతు తనదైన శైలిలో ఈ భాషను నేర్పేందుకు సిద్ధమై పాఠశాలలో చురుకైన ఇద్దరు విద్యార్థుల్ని ఎన్నుకున్నాడు. రమాదేవి, సంతోష అనే ఇద్దరు విద్యార్థుల్ని ఎంపిక చేసుకొని రోజు విరామ సమయం, భోజన సమయాల్లో నేత్రావదానం, గణితావధానం నేర్పించాడు. మొదట ఒక్కో అక్షరానికి ఒక్కో సైగ, ఒక్కో అంకెకు ఒక్కో చేతి వేళ్ల భంగిమ నేర్పించాడు. నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థులు నూతన విద్యలో సంపూర్ణతను సాధించారు. -
అంతా‘ కొత్త’గా
రెండు రాష్ట్రాలతో కొత్తగూడెం సరిహద్దు రెండు రాష్ట్రాల నుంచి ఒకటికి తగ్గిన ఖమ్మం కొత్తగూడెం పరిధిలోకే ప్రధాన పరిశ్రమలు విస్తీర్ణంలో రాష్ట్రంలోనే గూడెం పెద్ద జిల్లా వాణిజ్య కేంద్రంగానే మిగలనున్న ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం : డ్రాఫ్ట్ నోటిఫికేషన్తో జిల్లా రెండుగా విడిపోతోంది. పోలవరం ముంపు మండలాల విలీనం తర్వాత జిల్లాకు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అయితే కొత్తగూడెం జిల్లాగా ఏర్పడుతుండటంతో ఇప్పుడు ఈ జిల్లాకు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దున ఉంటాయి. ఖమ్మంకు ఆంధ్రప్రదేశ్తోనే సరిహద్దు ఉంటుంది. ఖమ్మం జిల్లాలోకి 22 మండలాలు, భద్రాద్రి జిల్లాలోకి 18మండలాలను చేరుస్తూ ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగూడెం జిల్లాకుS పూర్తిగా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ మండలాలున్నాయి. ఖమ్మం జిల్లా పరిధిలో ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి, కామేపల్లి మండలాలతోపాటు పెనుబల్లిలోని కొన్ని గ్రామాలు ఏజెన్సీ గ్రామాలుగా ఉన్నాయి. అయితే వీటి పాలన భద్రాచలం ఐటీడీఏ పరిధిలోకి వస్తుందా.. ? కొత్తగా ఖమ్మం జిల్లా పరిధిలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తారా..? అనే దానిపై నిర్ణయం జరగలేదు. వాజేడు, వెంకటాపురం, చర్ల సరిహద్దులో ఛత్తీస్గఢ్, చివరన భూపాలపల్లి జిల్లా.. ఇల్లెందు సరిహద్దులో మహబూబాబాద్ జిల్లా.. సుజాతనగర్ సరిహద్దులో ఖమ్మం జిల్లాలు కొత్తగూడెం జిల్లాకు సరిహద్దులో ఉంటాయి. ఖమ్మం జిల్లాకు జూలూరుపాడు సరిహద్దులో కొత్తగూడెం జిల్లా.. నాయకన్గూడెం సరిహద్దులో సూర్యాపేట జిల్లా.. ఖమ్మం అర్బన్ మండలం సరిహద్దులో మహబూబాబాద్ జిల్లా సరిహద్దుగా ఉంటాయి. ప్రధాన పరిశ్రమలకు నెలవు ‘గూడెం’... జిల్లాల పునర్విభజన నేపథ్యంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, భారజల కర్మాగారం, ఎన్ఎండీసీ, ఐటీసీ, వంటి పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కొత్తగూడెం జిల్లాలోకే రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహాయిస్తే ఇన్ని పరిశ్రమలున్న జిల్లాగా కొత్తగూడెం గుర్తింపు పొందనున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిశ్రమల కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేసే అవకాశముంది. విస్తీర్ణం దృష్ట్యా కూడా కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవనున్నది. 8,044.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. 11,38,910 మంది జనాభాతో ఉన్న కొత్తగూడెం వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. ఈ జిల్లా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రంగా నిలిచే అవకాశం ఉంది. ఈ జిల్లాలో అటవీ విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉంది. వాణిజ్య కేంద్రంగా ఖమ్మం.. ఖమ్మం ఇక వాణిజ్య కేంద్రంగానే మిగలనుంది. ఇక్కడ గ్రానైట్ ముఖ్య పరిశ్రమగా కొనసాగుతోంది. అలాగే ఆస్పత్రులు, బంగారు షాపులు, పత్తి, మిర్చి వంటి వ్యాపారం ఇక్కడ కోట్ల రూపాయల్లో సాగుతోంది. మూడు జిల్లాల పరిధిలోని రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తమ పంటలను విక్రయిస్తుంటారు. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా పత్తి, మిర్చి వంటి పంటలు ఎగుమతి అవుతుంటాయి.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
Advertisement