-
ఉపఎన్నిక సందడి షురూ
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ * శోభమ్మ కుమార్తెగా ఈమెకు మంచి పేరు * గత ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర * ఆళ్లగడ్డలో అత్యధిక సార్లు భూమా కుటుంబానిదే విజయం * సెంటిమెంట్కు టీడీపీ కట్టుబడి ఉంటుందా? సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందడి ప్రారంభమైంది. ఈ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ పేరును గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. ఈమె నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె. గత ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఓటుతో భూమా కుటుంబానికి అండగా నిలవాలని విస్తృత ప్రచారం చేశారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,20, 812 ఓట్లు ఉండగా శోభా నాగిరెడ్డికి 1,72, 908 వచ్చాయి. సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డికి 74,180 ఓట్లు పోలయ్యాయి. శోభా నాగిరెడ్డి 92,108 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆమె పోలింగ్ కంటే ముందే మృతి చెందడంతో తిరిగి ఉప ఎన్నిక అనివార్యమైంది. రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 14 నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించాలని, వచ్చే నెల 8వ తేదీన పోలింగ్ జరపాలని ఆదేశించింది. వచ్చే నెల 12వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. అయితే ఈ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. నందిగామ ఉపఎన్నికలో మానవతా దృక్పథంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి విరమించుకుంది. ఆళ్లగడ్డలో టీడీపీ అదే విధంగా వ్యవహరించనుందో లేదో తెలియాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఆళ్లగడ్డ ఎన్నికల్లో అత్యధిక పర్యాయాలు భూమా కుటుంబమే విజయం సాధిస్తూ వచ్చింది. ఈ నియోజకవర్గం 1962లో ఐదు మండలాలతో ఏర్పాటైంది. 2009లో పునర్విభజనతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గోస్పాడు మండలాన్ని నంద్యాలకు కలిపారు. కోవెలకుంట్ల నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలను ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కలిపారు. వీటితోపాటు శిరివెళ్ల, రుద్రవరం, చాగలమర్రి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి మొత్తం 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా శోభా నాగిరెడ్డి అత్యధికంగా ఐదు సార్లు విజయం సాధించారు. గంగుల ప్రతాపరెడ్డి మూడుసార్లు, ఎస్వీ సుబ్బారెడ్డి, గంగుల తిమ్మారెడ్డి, భూమా నాగిరెడ్డి రెండు సార్లు విజయకేతనం ఎగురవేశారు. అసెంబ్లీకి జరిగిన ప్రతి ఎన్నికలోనూ శోభా నాగిరెడ్డి విజయం సాధించడం గమనార్హం. మొదటి నుంచి ఆళ్లగడ్డలో భూమా, గంగుల గ్రూపుల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతూ వచ్చింది. పార్టీలకతీతంగా గ్రూపు రాజకీయాలకు ఆళ్లగడ్డకు ప్రత్యేకత ఉంది. -
ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా అఖిల
హైదరాబాద్: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దివంగత నేత భూమా శోభా నాగిరెడ్డి, ప్రస్తుత పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డిల కు మార్తె భూమా అఖిలను పేరును పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. ఆయన గురువారం తన నివాసంలో పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, భూమా నాగిరెడ్డితో చర్చ లు జరిపి వారి సమక్షంలో అఖిల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు చేయడం కోసం జగన్ పార్టీలోని సీనియర్ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో ఒక ద్విసభ్య కమిటీని నియమించారు. ముగిసిన వాదనలు: ఆళ్లగడ్డ ఎన్నిక వ్యవహా రానికి సంబంధించి గురువారం హైకోర్టులో దా దాపుగా వాదనలు ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూ డిన ధర్మాసనం మూడు రోజులుగా చేసిన వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలని పిటిషనర్లను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పోటీపై సీఎం సమాలోచన: ఆళ్లగడ్డలో వచ్చేనెలలో జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి గంగుల ప్రభాకర్రెడ్డితో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రభాకర్రెడ్డి గురువారం సచివాల యంలో కలిశారు. ఉప ఎన్నికలో పార్టీ పోటీచేస్తుందని, పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని చంద్రబాబు చెప్పారని ప్రభాకర్రెడ్డి అనంతరం తనను కలసిన విలేకరులతో చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్...
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
స్టేషన్ మాస్టర్కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement