-
నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి. కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అర్భన్ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బి సుబ్బారావు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ జె విద్యుల్లత, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. సీఎం ఆదేశాలు ఇవే.. ►వర్షాకాలం ముగిసి పనుల సీజన్ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి. ►త్వరగా రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. ►నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ►సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్ చేసి వినియోగించేలా చూడాలి. ►విశాఖ నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►భవిష్యత్తులో జనాభా పెరుగుతున్నందున పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ►ముడసర్లోవ పార్క్ అభివృద్ధి, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ లెవల్ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. ►విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనులను వేగతవంతం చేయాలి. ►కన్వెన్షన్ సెంటర్, గ్రీనరీ పనులను వేగవంతం చేయాలి. ►విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ►కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణగోడ వద్ద సుందరీకరణ చేపట్టాలి. ►జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి. ►ప్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఎస్టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం తెస్తున్న అత్యాధునిక యంత్రాలను సద్వినియోగం చేయాలన్నారు. -
పట్టణ మాస్టర్ ప్లాన్లకు ఏకరూప మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ తయారీ, అమలు ఏకరీతిన ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకీకృత విధానం పాటించేలా పలు సూచనలతో ప్రభుత్వం జీవో నంబర్ 66 జారీ చేసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో రాష్ట్రంలో పట్టణీకరణను పెంపొందించేలా ఈ జీవోలో మార్గదర్శకాలు పొందుపరిచింది. వాస్తవానికి డెవలప్మెంట్ అథారిటీలు పరిమిత సాంకేతిక నైపుణ్యంతో మాస్టర్ ప్లాన్లను తయారు చేస్తుండటంతో ప్రాదేశిక ప్రణాళిక నాణ్యత సరిగా ఉండడంలేదు. పైగా డెవలప్మెంట్ అథారిటీల మాస్టర్ ప్లాన్ల తయారీలో మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అనుసరించడంలేదు. రిపోర్టింగ్ ఫార్మాట్స్, శాటిలైట్ ఇమేజ్ క్వాలిటీ, ఆర్ఎఫ్పీ ప్రిపరేషన్, కన్సల్టెన్సీ చార్జీల ఫిక్సింగ్, కన్సల్టెంట్లు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ పాత్ర, బాధ్యతలతో కూడిన మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకరూపత ఉండడంలేదు. దాంతో రాష్ట్రంలోని 123 పట్టణ ప్రాంతాలు (యూఎల్బీలు), 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)ల్లో ఏకీకృత మాస్టర్ ప్లాన్ ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ప్రస్తుతం ఆయా విభాగాల్లోని మాస్టర్ ప్లాన్లు ఏ దశలో ఉన్నాయో అవన్నీ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూపొందించాలని యూడీఏ, యూఎల్బీలను ఆదేశించింది. అభ్యర్థనలు, మ్యాప్ తయారీ, సర్వే, ఫీల్డ్ డేటా సేకరణ, మాస్టర్ ప్లాన్ నివేదిక, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కోసం సాంకేతిక ఆమోదం, మాస్టర్ప్లాన్ ప్రచురణ, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల స్వీకరణ, తుది మాస్టర్ ప్లాన్, మ్యాప్ తయారీకి ప్రభుత్వం నుంచి సాంకేతిక ఆమోదం, మంజూరు కోసం ప్రభుత్వానికి సమర్పణ వంటి అంశాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
2020–21 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలో చేసిన పనులివే
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం కరోనా మహమ్మారి, లాక్డౌన్ వంటి పరిస్థితుల్లో సైతం జీహెచ్ఎంసీ బాగా పనిచేసిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లాక్డౌన్ను అనువుగా మలచుకొని రోడ్లు, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేశారని ప్రశంసించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చేయబోయే పనుల్లో నగరానికి వరదముంపు నివారణ చర్యల్లో భాగంగా రూ.858.32 కోట్లతో 49 నాలాల అభివృద్ధి పనుల్ని 15 ప్యాకేజీల కింద చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.240 కోట్లతో జవహర్నగర్లో చెత్త నుంచి వెలువడే హానికర ద్రవాల (లీచెట్) శుద్ధి పనుల్ని చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మరో 11 కి.మీ.లింక్ రోడ్లు (రూ.275 కోట్లు)18 ఎఫ్ఓబీలు పూర్తికాగలవని పేర్కొన్నారు. 90 చెత్త సేకరణ, తరలింపు కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన మునిసిపల్ శాఖ వార్షిక నివేదికలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీలో చేసిన పనుల్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటిలోని ముఖ్యాంశాలు ఇవీ.... ► రూ.184 కోట్లతో దుర్గంచెరువుపై కేబుల్ బ్రిడ్జి. ►ప్రాజెక్టు పనుల కింద రూ.503.28 కోట్ల విలువైన 10 రోడ్డు ప్రాజెక్టులు పూర్తి . ►జీడిమెట్లలో రోజుకు 500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నిర్మాణ, వ్యర్థాల కూల్చివేతల ప్లాంట్ ఏర్పాటు. ►దక్షిణభారత దేశంలోనే మొదటిసారిగా 19.8 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని ద్వారా ఇప్పటి వరకు 109.23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ►జవహర్నగర్లో 135 ఎకరాల్లోని 12 మిలియన్ టన్నుల వ్యర్థాలను శాస్త్రీయంగా క్యాప్ చేయడం జరిగింది. దీని వ్యయం రూ.144 కోట్లు. ►టీడీఆర్ ద్వారా జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం తగ్గింది. 2020–21లో 129 టీడీఆర్ ధ్రువపత్రాలు జారీ. ►టీఎస్ బీపాస్ ద్వారా బల్దియా పరిధిలో 11,538 భవనాలకు నిర్మాణ అనుమతుల ద్వారా రూ.797.13 కోట్ల ఆదాయం వచి్చంది. ►అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా 2.53 కోట్ల భోజనాల పంపిణీ. ►16 గ్రీన్ఫీల్డ్ లింక్రోడ్లు (13.56 కి.మీ.) వినియోగంలోకి వచ్చాయి. వ్యయం రూ.154 కోట్లు. ►నాలా నెట్వర్క్ బలోపేతానికి ఎస్ఎన్డీపీ ఏర్పాటు. ►కరోనా..లాక్ డౌన్ సమయాన్ని సది్వనియోగం చేసుకొని 9 నెలల్లో జరగాల్సిన పనులు 2–3 నెలల్లోనే పూర్తి. ►సీఆర్ఎంపీ ద్వారా 383.44 కి.మీ.ల రోడ్ల రీకార్పెటింగ్. అందుకైన వ్యయం రూ.457 కోట్లు. ►ఇతరత్రా నిర్వహణ పనులు 10,670 మంజూరుకాగా, 5850 పనుల్ని రూ.1020.41 కోట్లతో పూర్తిచేసినట్లు తెలిపారు. ► ఉప్పల్, ఏఎస్రావునగర్, ఐడీపీఎల్ వద్ద మూడు ఎఫ్ఓబీలు పూర్తి. జలమండలి పరిధిలో.. ►2 వేల చ.కి.మీ పరిధిలో విస్తరించిన నగరానికి నిత్యం జలమండలి 522.87 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. ►నగరంలో నిత్యం వెలువడుతున్న 1950 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో 772 మిలియన్ లీటర్ల మురుగు నీటిని సమర్థవంతంగా శుద్ధి చేస్తోంది. ► జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం పొందేందుకు ఇప్పటివరకు 4.1 లక్షల మంది తమ ఆధార్ కార్డులను క్యాన్నెంబర్లకు అనుసంధానం చేసుకున్నారు. ఈ పథకంతో 9.7 లక్షల వినియోగదారులకు లబ్ది చేకూరనుంది. ►వేసవిలో కృష్ణా మూడు దశల పథకాలకు అవసరమైన తాగునీటిని సేకరించేందుకు రూ.1450 కోట్లతో సుంకిశాల భారీ ఇన్టేక్వెల్ పనులకు శ్రీకారం చుట్టారు. ►సమగ్ర మురుగునీటి మాస్టర్ప్లాన్ కింద నగరవ్యాప్తంగా 62 ఎస్టీపీలు నిర్మించాలని సంకలి్పంచారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1257 మిలియన్ లీటర్ల శుద్ధి సామర్థ్యంతో 31 ఎస్టీపీలను ప్రతిపాదించారు. తొలివిడతగా రూ.1280 కోట్ల అంచనావ్యంతో 17 ఎస్టీపీల నిర్మాణం పనులు చేపట్టారు. దీంతో కూకట్పల్లి,కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిళ్లకు మురుగు కష్టాలు తీరనున్నాయి. మెట్రోరైలు.. ►నగరంలో 69 కి.మీ మార్గంలో రూ.21 వేల కోట్ల అంచనావ్యయంతో మెట్రో ప్రాజెక్టును పూర్తిచేశారు. గత నాలుగేళ్లుగా సుమారు రూ.18.34 కోట్ల మంది మెట్రో రైళ్లలో జరీ్నచేశారు. నాణ్యమైన భద్రతా ప్రమాణాలతో మెట్రో సేవలు అందిస్తోంది. డిజిటల్ టెక్నాలజీని మెట్రో సమర్థవంతంగా అమలు చేస్తోంది. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ►రూ.34 లక్షల వ్యయంతో గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు,హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 55 కి.మీ మూసీ ప్రవాహ మార్గంలో నది సరిహద్దులు,బఫర్ జోన్ ఏర్పాటుకు వీలుగా సర్వే పూర్తిచేశారు. ►రూ.4.59 కోట్లతో నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేశారు. ►మూసీ తీరాల వెంట రూ.95 లక్షలు ఖర్చు చేసి ఫాగింగ్ చేపట్టారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో.. ►పీపీపీ విధానంలో బాటసింగారంలో 40 ఎకరాల స్థలంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేశారు. సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో పార్కును నిర్మించారు. సుమారు 500 ట్రక్కులకు పార్కింగ్ వసతి, డార్మెటరీలు ఏర్పాటు చేశారు. ►కోకాపేట్లో 533 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ఫీల్డు డెవలప్ మెంట్ ఏరియాగా అభివృద్ధి చేసేందుకు రూ.265 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ పనులు 18 నెలల్లో పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. ►రూ.61.8 కోట్ల వ్యయంతో ఉప్పల్, మెహిదీపట్నంలలో స్కైవాక్ల నిర్మాణం పురోగతిలో ఉంది. ►ఉప్పర్పల్లి పీవి ఎక్స్ప్రెస్వే వద్ద అప్ అండ్ డౌన్ ర్యాంప్ నిర్మాణాన్ని రూ.36 కోట్లతో పూర్తిచేశారు. ►బాలానగర్ వద్ద రూ.387 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్ను పూర్తిచేశారు. ►ఉప్పల్, ఏఎస్రావునగర్, ఐడీపీఎల్ వద్ద 3 ఫుట్ఓవర్ బ్రిడ్జీల పనులు పూర్తిచేశారు. ►నగరంలో 158 కి.మీ మేర విస్తరించిన ఉన్న ఓఆర్ఆర్కు రెండు వైపులా గ్రోత్కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ఔటర్పై హైవే ట్రాఫిక్ నిర్వహణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ►ఓఆర్ఆర్పై 136 కి.మీ మార్గంలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు పని చురుకుగా సాగుతుంది. ► రూ.24.5 కోట్లతో ఔటర్రింగ్రోడ్డు సుందరీకరణ పనులు చేశారు. ►ఏడాదిగా హుస్సేన్సాగర్, దుర్గంచెరువు, సరూర్నగర్, సఫిల్గూడా, కటోరా హౌజ్, కాప్రాలోని రెండు చెరువులను ప్రక్షాళన చేశారు. ► ఔటర్వెంట రూ.47 కోట్లతో ఆటోమేటెడ్ బిందు సేద్యాన్ని చేపట్టారు. -
‘ఆ రెండు రోజులు సచివాలయ పరీక్షలకు బ్రేక్’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల నిర్వహణకు రెండు రోజుల అంతరాయం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 1-8 వరకు సచివాలయ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే 2వ తేదీన వినాయక చవితి, 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉండటంతో ఆ రెండు రోజులు పరీక్షలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. మిగతా ఆరు రోజుల్లో.. రోజుకు రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,35,614 మంది పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఇందుకోసం 406 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఉదయం 10గంటల నుంచి 12:30గంటల వరకు.. మధ్యాహ్నం 2:30గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో ముగ్గురు నోడల్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్లో పరీక్షా పేపర్లు భద్రపరుస్తున్నామని వినయ్ చంద్ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక గెజిటెడ్ అధికారిని నియమించామని.. పరీక్ష పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగులు కొరకు మరో 50 నిమిషాలు అదనంగా సమయాన్ని కేటాయిస్తున్నామని తెలిపారు. కంట్రోల్ రూముల్లో టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విశాఖ కలెక్టరేట్కు సంబంధించి 0891-2590100, 0891-2590102, 180042500002, విశాఖ జీవీఎంసీకి సంబంధించి 0891-2869131,180042500009 నెంబర్లతో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు జరిగే రోజు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. విశాఖ సిటీతో పాటు రూరల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష రాసేవారు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు వినయ్ చంద్. (చదవండి: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు) -
గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు మరో వారం మాత్రమే ఉండటంతో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ విజయ్ కుమార్ అభ్యర్థులకు పలు కీలకమైన సూచనలు చేశారు. పరీక్ష రాసే గంట ముందే అభ్యర్ధులు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని సూచించారు. ‘సాక్షి’ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు. (చదవండి : సచివాలయ ఉద్యోగ పరీక్షలకు తేదీల ఖరారు) పరీక్షహాల్లోకి సెల్ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించేది లేదని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. హాల్టికెట్, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తెచ్చుకోవాలని చెప్పారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, దళారీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల 478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, దాదాపు 22 లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు కూడళ్లలో, బస్టాండ్లలో రూట్మ్యాప్లు ఏర్పాటు చేయనున్నామని విజయ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు తెలుసుకోవాల్సినవి.. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం పరీక్ష రాయనున్న 12.5 లక్షల మంది సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం పరీక్ష రాయనున్న 3 లక్షలమంది ఉదయం 10గంటల నుంచి 12:30 వరకు పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి 5గంటల వరకు పరీక్ష ఆన్లైన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి 150ప్రశ్నలకు.. 150 మార్కులు పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది నాలుగు తప్పులకు ఒక మార్కు పోతుంది రెండు భాషాల్లో ప్రశ్నాపత్రం టెక్నికల్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ హాల్టికెట్, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తీసుకురావాలి పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఏర్పాట్లు కూడళ్లు, బస్టాండ్లలో రూట్మ్యాప్లు, హెల్ప్డెస్క్లు మాల్ప్రాక్టీస్కు పాల్పడితే కస్టడీలోకి తీసుకుంటాం పరీక్షా కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement