-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
వైరల్ పోస్ట్: జొమాటో రియాక్షన్
సాక్షి,ముంబై: నాణేనికి రెండు వైపులా అన్నట్టు సోషల్ మీడియా పుణ్యమా అని ఇబ్బందుల్లో ఉన్న చిరు వ్యాపారులకు, ఇతర బాధితులకు భారీ ప్రయోజనమే లభిస్తోంది. ఇటీవల మనవరాలి చదువుకోసం ఇల్లునే అమ్ముకున్న ఒక పెద్దాయన పట్ల నెటిజన్లు మానవత్వంతో స్పందించారు. అంతకుముందు ఢిల్లీకి చెందిన ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులకు సోషల్మీడియా ద్వారా మద్దతు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్థిక సంక్షోభంలో పడి విలవిల్లాడుతున్న ముంబైకి చెందిన ‘లిట్టీ చోఖా’ అమ్ముకుని జీవించే చిరువ్యాపారి కథనం వైరల్గా మారింది. జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది మొదలు పెట్టిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్కు భారీ స్పందన లభించింది. ప్రధానంగా ప్రముఖ ఫుడ్డెలివరీ సంస్థ జొమాటోతో పాటు, ఇతర దాతలు స్పందించిన తీరు విశేషంగా నిలిచింది.(జొమాటో వివాదం: ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్) ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది సోషల్ మీడియాలో ఈ కథనాన్ని పోస్ట్ చేశారు. వివరాలను పరిశీలిస్తే అహ్మదాబాద్కు చెందిన యోగేశ్ ముంబైలోని వెర్సోవా బీచ్లో లిట్టి చోఖా అమ్మకుని జీవనం సాగించేవాడు. స్టాల్లో రెగ్యులర్గా లీట్టీలను ఆస్వాదించే ద్వివేది మాటల సందర్బంలో యోగేశ్ కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడినట్టు తెలుసుకున్నారు. పాపులర్ లిట్టి-చోఖాను చట్నీ, బటర్, సలాడ్తో కలిపి కేవలం ఇరవై రూపాయలకు అమ్ముతున్నా కొనేవారు కరువైన పరిస్థితి. చివరికి దుకాణం కూడా మూసి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సోదరుడితోపాటు, తమ జీవనం దుర్భరంగా మారిపోయిందంటూ ఈ సందర్భంగా ద్వివేదితో వాపోయారు ఈ నష్టాలను భరించే శక్తి ఇక తనకు లేదనీ, స్టాల్ను మూసివేయడం తప్ప వేరే మార్గం లేదంటూ యోగేశ్ ఆవేదన చెందారు. దీంతో చలించిన ద్వివేది యోగేశ్కు సాయం చేయాల్సిందిగా కోరుతూ ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు దీన్ని జోమాటోను ట్యాగ్ చేస్తూ మార్చి 16 న ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. ఈ ట్వీట్ రెండు వేలకు పైగా లైక్లను సంపాదించింది. అలాగే జొమాటోలో అతడి దుకాణాన్ని నమోదు చేయాలని నెటిజన్లు కూడా అభ్యర్థించారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి ఈ ట్వీట్ను రీట్వీట్ చేశారు. జొమాటో స్పందన దీనికి జొమాటోతో పాటు కొంతమంది నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. యోగేశ్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అతని వివరాలను సేకరించేపనిలో పడింది. ప్రతిస్పందన ఆలస్యం అయినందుకు క్షమించండి. వీలైతే, దయచేసి యోగేశ్ కాంటాక్ట్ నంబర్తో పాటు, ఇతర వివరాలను తమకు అందించాలని కోరింది. దీనిపై ద్వివేది సంతోషం వ్యక్తం చేశారు. సాయం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లిట్టీ-చోఖా: బిహార్కు చెందిన వంటకం ఇది. గోధుమపిండితో చేసిన చపాతిలో పప్పులు, ఇతర మసాలాలను స్టఫ్ చేసి, నిప్పులపై కాలుస్తారు. దీన్ని నేతితోనూ, వంకాయ కూర లేదా ఆలూకూరతో కలిపి తింటారట. Hi Priyanshu, sorry for the delay in response. If possible, please help us with his contact number over a private message and our team will be reaching out to him at the earliest to assist him with the listing procedure.https://t.co/jcTFuHa5Ue — zomato care (@zomatocare) March 17, 2021 @zomatoin please help this gentleman with his endeavour!!🙏 https://t.co/0l9ZKOYI8d — manoj bajpayee (@BajpayeeManoj) March 17, 2021 -
సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ
పట్నా : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సుశాంత్ కుటుంబ సభ్యులతో భేటీ అయిన పప్పు యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు మృతిపై కుటుంబ సభ్యులు కూడా సీబీఐ విచారణకు పట్టుపడుతున్నారని తెలిపారు. ఆయన మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచుసుకుందని, హత్యా..? ఆత్మహత్యా? అనేది తేలాల్సిందని పేర్కొన్నారు. (సుశాంత్సింగ్ ఆత్మహత్య) ఇక సుశాంత్ రాజ్పూత్ మృతిపై బిహార్లోని ఆయన నివాసప్రాంతంలో ఉండే సన్నిహతులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుశాంత్ మృతిలో ఎవరికీ తెలియని కుట్రదాగి ఉందని సందేహించారు. కాగా ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై యావత్ సినీ, క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆయన మృతదేహానికి నిర్వహించిన పోస్ట్మార్టం రిపోర్టును బట్టి విచారణలో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. (తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!) -
మరోసారి భారీ ఎత్తున మాస్క్ల పట్టివేత
ముంబై : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో పెద్ద ఎత్తున మాస్క్లు పట్టుబడ్డాయి. అక్రమంగా దాచి వుంచిన కోటి రూపాయల విలువైన మాస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల నిల్వలను అరికట్టడానికి జరిపిన దాడుల సందర్భంగా అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి అందిన పక్కా సమాచారంతో ముంబై సబర్బన్ షా వేర్హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ గోడౌన్ పై దాడి చేసిన పోలీసులు సంఘటన స్థలంలో 200 బాక్సుల ఫేస్ మాస్క్లను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని, ఏజెంట్, సరఫరాదారుతో సహా ఐదుగురిపై కేసు నమోదుచేశారు. ( మహమ్మారి వెంటాడినా.. ) ఈ ఐదుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ మంజునాథ్ సింఘే తెలిపారు. ఫేస్ మాస్క్లు, శానిటైజర్లు వంటి ముఖ్యమైన వస్తువులను నిల్వ చేయడం నేరమని ఆయన అన్నారు. కాగా సోమవారం సాయంత్రం, ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ రూ. 15 కోట్ల విలువైన 25 లక్షల అధిక-నాణ్యత గల ఫేస్ మాస్క్లను పోలీసుల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ( జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ ) -
గీజర్ నుంచి విషవాయువు.. బాలిక మృతి
ముంబై : గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బొరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 5న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన ధృవి గోహిల్ (15) ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 10న మృతిచెందింది. కార్బన్ మోనాక్సైడ్ను అధికంగా పీల్చడం వల్లే ఈ ఘోరం జరగినట్లు వైద్యులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement