-
‘చేయిచాచి రూ. 500 సాయం అడిగితే రూ. 51 లక్షలు వచ్చాయి’
ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఓ మహిళకు కుంటుంబ పోషణ భారమైంది.. పూట గడవడమే కష్టంగా మారింది.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. తప్పని పరిస్థితుల్లో కొడుకుకు చదువు చెబుతున్న టీచర్ను సాయం కోసం అర్థించింది. పిల్లల కడుపు నింపడం కోసం రూ. 500 ఉంటే ఇవ్వాలని కోరింది.. ఊహించని విధంగా ఆమె ఆకౌంట్లోకి రూ. 51లక్షలు వచ్చి చేరాయి. దీంతో ఆశ్చర్యపోయిన మహిళ ఆనందంతో కంటతపడి పెట్టుకుంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాలక్కాడ్కు చెందిన సుభద్ర అనే 46 ఏళ్ల మహిళకు ముగ్గురు కొడుకులు. ఆమె భర్త గత ఆగష్టులో మరణించాడు.. కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి మరణంతో వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మహిళ ఒక్కతే కాయాకష్టం చేసుకొని పిల్లలను సాకుతోంది. చిన్న కొడుకు రిబ్రల్ పాల్సి వ్యాధితో కదల్లేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబం గడవడానికి మరో దారి కనిపించకపోవడంతో రెండు కొడుకు అభిషేక్ చదువుతున్న పాఠశాలలోని హిందీ టీచర్ర్ రిగిజా హరికుమార్ను కొంత డబ్బు సాయం చేయాలని అడిగింది. తన ముగ్గురు పిల్లల ఆకలి తీర్చేందుకు ఓ 500 రూపాయలు ఉంటే ఇవ్వాలని దీనంగా వేడుకుంది. ఆ కుటుంబం పరిస్థితిని చూసి చలించిన ఉపాధ్యాయురాలు తన వంతు సాయంగా వెయ్యి రూపాయలు అందించింది. చదవండి: సిస్టర్హుడ్.. అత్యంత అవసరమైన బంధం అంతటితో ఆగకుండా సుభద్ర ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబాన్ని దగ్గరుండి పరిశీలించింది. ఈ క్రమంలో ఆ కుటుంబం పుట్టేడు పేదరికంలో మగ్గుతుండటం చూసింది. ఇల్లు సరిగా లేకపోవడం, పిల్లలు తినడానికి కూడా ఏం లేని స్థితిని చూసి వారికోసం ఇంకేమైనా చేయాలని ఆలోచించింది. దీంతో తన పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆదుకోవాలని కోరుతూ.. క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. దాతలు సాయంగా అందించే డబ్బు నేరుగా ఆమె అకౌంట్కు బదిలీ అయ్యేలా సుభద్ర బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది. టీచర్ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారడంతో రెండు రోజుల్లోనే వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి విరాళంగా రూ. 51 లక్షలు మహిళ బ్యాంక్ ఖాతాలోకి వచ్చాయి. దీంతో టీచర్ గొప్ప మనసును పలువురు అభినందిస్తున్నారు. ఈ విషయంపై ఉపాద్యాయురాలు గిరిజా మాట్లాడుతూ.. ‘వారి గురించి పోస్ట్ చేస్తున్నప్పుడు నా మనస్సులో రెండే ఆలోచనలు ఉన్నాయి. 1. అసంపూర్తిగా ఉన్న వారి ఇంటిని పూర్తిగా నిర్మించి మంచిగా జీవించాలి. 2. ఆ తల్లి తన పిల్లలకు ఆహారం చదువు కోసం ఎవరి ముందు చేయిచాచకూడదు. ఈ రెండింటి గురించే ఆలోచించి ఇలా చేశారు. వచ్చిన డబ్బుని ఇంటికోసం ఉపయోగించి, మిలిన దానిని వారి ఖర్చుల కోసం బ్యాంకులో జమ చేస్తాం. సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు’ అంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. చదవండి: Covid Alert: కరోనా ముప్పు ముగియలేదు.. మళ్లీ మాస్కులేద్దాం -
ఉన్నత చదువుకు డబ్బుల్లేవని ఉసురు తీసుకుంది!
సాక్షి, ములుగు: చదివేందుకు డబ్బుల్లేవనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేశ్–కవిత దంపతుల కుమార్తె సాత్విక (18)కు ఇంటర్ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేసేందుకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సీటు వచ్చింది. తల్లిదండ్రులకు డబ్బులు కట్టే స్థోమత లేకపోవడంతో స్థానికంగా కాలేజీల్లో చేర్పించాలని యోచిస్తున్నారు. మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి గడ్డి మందు తాగడంతో కుటుంబీకులు ములుగు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. తన కూతురు మృతిచెందినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశించిన తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు ఎస్సై తాజొద్దీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమానుషం: చెరువులో చేపలు పట్టారని బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టి -
ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చలేక కుమార్తెను..
బొమ్మనహళ్లి : ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తన ఏడేళ్ల కుమార్తెను హత్య చేసి తాను కూడా బలవన్మరణం చెందిన ఘటన బెంగళూరు నగర జిల్లా ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బొమ్మసంద్రలో గురువారం చోటుచేసుకుంది. కోలారుకు చెందిన విజయ్ కుమార్ (37) భార్యతో కలిసి బొమ్మసంద్రలో నివాసం ఉంటున్నాడు. వీరికి కుమార్తె సమీక్ష(7) ఉంది. గురువారం ఉదయం భార్య గార్మెంట్స్లో పనికి వెళ్లిన సమయంలో కుమార్తెను గొంతు నులిమి హత్య చేసి తాను కూడా ఉరి వేసుకున్నాడు. సాయంత్రం భార్య వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
దేశవ్యాప్తంగా మళ్లీ నగదు కొరత
-
వేధిస్తున్న నగదు కొరత
సామాజిక పింఛ¯ŒSదారుల పడిగాపులు నాలుగు రోజులకు 43 శాతమే పంపిణీ ఇంకా రూ.20 కోట్ల సొమ్ము కోసం ఎదురుచూపులు ఐదు నెలలైనా వెంటాడుతున్న నోట్ల రద్దు ప్రభావం సమన్వయంలోపంతో చుక్కలు చూపిస్తున్న అధికారులు కాకినాడ సిటీ: నెల ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పేరుతో అందజేస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి నగదు కొరత తప్పడం లేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, అభయహస్తం లబ్ధిదారులు పింఛన్ల సొమ్ము కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 5,09,912 మంది సామాజిక భద్రతా పింఛ¯ŒS లబ్ధిదారులున్నారు. వీరిలో వృద్ధులు 1,97,295 మంది, వితంతువులు 1,93,851, దివ్యాంగులు 64,791, చేనేత 9.085, కల్లుగీత కార్మికులు 3,989 మంది, అభయహస్తం లబ్ధిదారులు 40,271 మంది ఉన్నారు. వీరందరూ ప్రతినెలా వచ్చే పింఛనే ఆధారంగా కాలం వెళ్లదీస్తున్న వారే. చేతిలో చిల్లిగవ్వ లేక ఇక్కట్ల పాలవ్వాల్సిన పరిస్థితి లబ్థిదారులకు ఎదురు కాకుండా నిర్ధేశించిన తేదీలోపు పంపిణీకి ముందస్తు చర్యలు తీసుకోవాలి్సఉంది. జిల్లా ఉన్నతాధికారులు నగదు కొరతపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.. జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 5వ తేదీలోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు మండలాల వారీగా ఎంపీడీవోలు బ్యాంకుల నుంచి నగదును విత్డ్రా చేసి పంపిణీ ప్రారంభించేవారు. నోట్ల రద్దు తరువాత ఈ కష్టాలు ప్రారంభమయ్యాయి. మండలాల్లో ఎక్కడిక్కడ లబ్ధిదారులు పింఛను సొమ్ము కోసం పంపిణీ కేంద్రాలకు నాలుగు రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతున్నా చేతికి నోట్లు అందడం లేదు. చేతులెత్తేసిన బ్యాంకర్లు... నగదు కొరతతో వినియోగదారుల అవసరాలమేరకు ఏటీఎంలలో ఆయా బ్యాంకు శాఖలు నగదు పెట్టలేని దుస్థితి జిల్లాలో ఉంది. ఈ దశలో సామాజిక భద్రతా పింఛన్ల చెల్లింపులకు ఇవ్వాల్సిన రూ.55 కోట్లు సర్ధుబాటు చేయలేక బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో అధికారులు అన్నవరం దేవస్ధానం, మద్యం దుకాణాలు తదితర మార్గాల ద్వారా వచ్చిన నగదును ఆయా బ్యాంకుల నుంచి మంగళవారం నాటికి సుమారు రూ.35 కోట్ల మేర సర్దుబాటు చేయడంతో 43 శాతం మంది లబ్ధిదారులకు పింఛను సొమ్మును పంపిణీ చేయగలిగారు. ఇంకా బ్యాంకుల నుంచి రూ.20 కోట్లు వరకు రావాల్సి ఉంది. ఈ నగదు విడుదల కావాలంటే మూడు నాలుగు రోజులు పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 11 మండలాలకు ఒక్క రూపాయి విడుదల కాలేదు... జిల్లాలో 64 మండలాల్లో 11 మండలాలకు నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఆత్రేయపురం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, అదేవిధంగా యు.కొత్తపల్లి, కిర్లంపూడి, రంగంపేట, తాళ్ళరేవు, అంబాజీపేట, మల్కిపురం మండలాలకు ఆంధ్రాబ్యాంకు నుంచి విడుదల కావాల్సి ఉంది. పింఛన్ల పంపిణీ గడువు పొడిగించాం... బ్యాంకుల్లో నగదు కొరతతో ఇబ్బంది ఏర్పడింది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా వచ్చే నగదును బ్యాంకుల నుంచి తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. జిల్లాలో పింఛన్ల పంపిణీ గడువును 12వ తేదీ వరకూ పొడిగించాం. అవసరమైతే 15వ తేదీ వరకూ పంపిణీకి గడువు పెంచి లబ్ధిదారులందరికీ పింఛను సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటాం. – ఎస్.మలి్లబాబు, డీఆర్డీఏ పీడీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఆల్ సెట్... గో
ఆనందం ఆవిరై.. ఆందోళన ఆవిష్కృతమై..!
గెలవలేని యుద్ధం చేసిన పాక్
నోటు కథేంటి?
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (02-05-2024)
తప్పక చదవండి
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
Advertisement