-
అజారుద్దీన్పై మరో కేసు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్పై మరో కేసు నమోదైంది. అజహార్ నేతృత్వంలోని గత హెచ్సీఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) సీఈఓ సునీల్ కాంతే ఇవాళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజహార్ అండ్ టీమ్.. 2020-2023 మధ్యలో జిమ్ వస్తువుల కొనుగోలు, క్రికెట్ బాల్స్ కొనుగోలు, అగ్ని ప్రమాద సామాగ్రి కొనుగోలు, బకెట్ చైర్స్ కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడిందని సునీల్ కాంతే ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారణ అయినట్లు ప్రస్తావించారు. ఫిర్యాదును పరిశీలించిన ఉప్పల్ పోలీసులు అజార్ అండ్ టీమ్పై కేసు నమోదు చేశారు. కాగా, కొద్ది రోజుల కిందట జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్పై అనర్హత వేటు పడింది. దీంతో అజహార్ రానున్న హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
అజారుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! ఇక మర్చిపోవాల్సిందే!
HCA Elections- Setback for Azhar: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలింది. హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలంటూ అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధులియాలతో కూడిన బెంచ్ ఈ వ్యవహారంపై విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి హెచ్సీఏలో చక్రం తిప్పాలనుకున్న అజారుద్దీన్ ఆశలకు గండిపడింది. కాగా అక్టోబరు 20న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించడంపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతడికి భంగపాటు ఎదురైంది. సుప్రీంకు చేరిన పంచాయితీ 2019లో అజారుద్దీన్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే, అజారుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో హెచ్సీఏ కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రిటైర్డ్ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రిటైర్డ్ ఐఏఎస్ విఎస్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరుగనుంది. అందుకే అనర్హత వేటు ఇదిలా ఉంటే.. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే.. డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నందున(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) అజారుద్దీన్పై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో కూడిన ఏకసభ్య కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంను ఆశ్రయించగా అతడికి నిరాశే ఎదురైంది. ఈసారికి మర్చిపోవాల్సిందే ఈ విషయంపై స్పందించిన అజారుద్దీన్ సన్నిహిత వర్గాలు.. ‘‘ఒకవేళ అక్టోబరు 31 తర్వాత ఓటర్ల లిస్టులో అజర్ పేరును చేర్చాలని న్యాయస్థానం ఆదేశించినా ఉపయోగం ఉండదు. అయితే, అతడికి వ్యతిరేకంగా కొందరు పన్నిన కుట్రను బయటపెట్టేందుకు... అజారుద్దీన్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అతడికి ఎలాంటి అన్యాయం జరిగిందనే విషయం బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాయి. చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్కప్ జట్టులో! -
Asia Cup 2023 IND VS NEP: అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లి
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్తో ఇవాళ (సెప్టెంబర్ 4) జరుగుతున్న మ్యాచ్లో ఆసిఫ్ షేక్ క్యాచ్ పట్టడం ద్వారా కోహ్లి మల్టీ నేషనల్ వన్డే టోర్నమెంట్లలో 100 క్యాచ్లను పూర్తి చేశాడు. భారత మాజీ సారధి మొహమ్మద్ అజహారుద్దీన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నాన్ వికెట్కీపర్గా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. What a catch by Virat Kohli ♥️#ViratKohli𓃵 #IndvsNep pic.twitter.com/Ak5MqYKNOP — ViIRAT FAN (@ViiratF18775) September 4, 2023 నేపాల్ ఇన్నింగ్స్ 30వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో విరాట్ ఈ క్యాచ్ను అందుకున్నాడు. అంతకుముందు కోహ్లి ఓసారి ఆసిఫ్ షేక్ అందించిన సునాయాస క్యాచ్ను జారవిడిచాడు. హాఫ్ సెంచరీ సాధించి క్రీజ్లో పాతుకుపోయిన ఆసిఫ్ (58; 8 ఫోర్లు) వికెట్ దక్కడంతో టీమిండియాకు బ్రేక్ లభించినట్లైంది. Ravindra Jadeja on fire - 3 wickets for him! What a catch at slips by captain Rohit Sharma. pic.twitter.com/qhn0bC5qnI — Mufaddal Vohra (@mufaddal_vohra) September 4, 2023 ఇదిలా ఉంటే, వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న భారత్-నేపాల్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కుషాల్ భుర్టెల్ (38), ఆసిఫ్ షేక్లు నేపాల్కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 65 పరుగులు జోడించారు. అనంతరం రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి నేపాల్ను దెబ్బకొట్టాడు. జడ్డూ స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను మ్యాచ్లోకి తెచ్చాడు. 39 ఓవర్ల తర్వాత నేపాల్ స్కోర్ 183/6గా ఉంది. దీపేంద్ర సింగ్ (28), సోంపాల్ కామీ (15) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 3, సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. -
‘కర్ణాటక’ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్గా టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు మొత్తం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ బుధవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇందులో ఇద్దరు తెలంగాణ నాయకులకు అవకాశం లభించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ను కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. ఇప్పటికే ఎనిమిది మంది రాష్ట్ర నాయకులను కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పరిశీలకులుగా నియమించింది. చదవండి: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆమెకు చోటు! కాగా, బుధవారం బెంగళూరులోని రాడిసన్ హోటల్లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్లుగా నియమించిన వారితో పాటు కర్ణాటక సరిహద్దు జిల్లాలకు చెందిన తెలంగాణ జిల్లాల నాయకత్వాన్ని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. చదవండి: TSRTC: వినూత్న ప్రయోగం.. సర్ అనండి.. సర్రున అల్లుకుపొండి -
కథ కంచికి.. హెచ్సీఏకు తగిన శాస్తి
వెంకటపతిరాజు, మహ్మద్ అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇలా ఆణిముత్యం లాంటి క్రికెటర్లను దేశానికి అందించిన ఘనత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ది(హెచ్సీఏ). అలాంటి హెచ్సీఏ ఇవాళ అంతర్గత కుమ్ములాటలు, చెత్త రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయింది. ఇంత జరుగుతున్నా బీసీసీఐ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హెచ్సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ సుప్రీం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీ హెచ్సీఏ వ్యవహరాలను చూసుకుంటుందని తెలిపింది. ఇన్నాళ్లుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన హెచ్సీఏ కథ చివరికి ఇలా ముగిసింది. టాలెంటెడ్ ఆటగాళ్లను పట్టించుకోకుండా ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారినే ఆడించడం హెచ్సీఏలో కామన్గా మారిపోయింది. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలోనూ హైదరాబాద్ జట్టు దారుణ ప్రదర్శనను కనబరిచింది. నాలుగు రోజుల మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి నిండా ఒక్కరోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేక.. సరిగా బౌలింగ్ చేయలేక చేతులెత్తేస్తున్నారు. టోర్నీలో ఆరు మ్యాచ్ల్లో ఐదింటిలో పరాజయం.. ఒక మ్యాచ్ డ్రాతో ఒక్క పాయింటుతో గ్రూప్-బి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. రంజీలో పాల్గొన్న మిగతా రాష్ట్రాల జట్లు ఆటలో ముందుకు వెళుతుంటే.. హెచ్సీఏ మాత్రం మరింత వెనక్కి వెళుతుంది. పాలకుల అవినీతి పరాకాష్టకు చేరడమే హైదరాబాద్ క్రికెట్ దుస్థితికి ప్రధాన కారణమన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్కు టికెట్ల అమ్మకంపై జరిగిన రగడ హెచ్సీఏలోని అంతర్గత విబేధాలను మరోసారి బహిర్గతం చేసింది. హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ సహా మిగతా కార్యవర్గ సభ్యులు మధ్య తలెత్తిన విబేధాలతో ఆటను సరిగా పట్టించుకోవడం లేదని భావించిన సుప్రీం కోర్టు పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు జిస్టిస్ కక్రూ, డీజీపీ అంజనీ కుమార్, వెంకటపతిరాజు, వంకా ప్రతాప్లతో తాత్కాలిక కమిటీని నియమించింది. అయినప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా హెచ్సీఏ పరిస్థితి ఉంది. పైగా వంకా ప్రతాప్ కమిటీ బాధ్యతల్లోనే గాకుండా జట్టు సెలక్షన్ కమిటీలోనూ వేలు పెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. హెచ్సీఏ అకాడమీ డైరెక్టర్గా వంకా ప్రతాప్ నెలకు రూ. 3 లక్షలు జీతం తీసుకుంటున్నప్పటికి.. పర్యవేక్షక కమిటీకి హాజరైనందున తనకు రూ. 5.25 లక్షలు ఇవ్వాలని హెచ్సీఏకు విజ్ఞప్తి చేశాడు. తన స్వప్రయోజనాల కోసం హెచ్సీఏను వంకా ప్రతాప్ భ్రష్టు పట్టిస్తున్నారని కొంతమంది పేర్కొన్నారు. మాజీ ఆటగాళ్లు పరిపాలకులుగా ఉంటే హెచ్సీఏ కాస్త గాడిన పడుతుందని భావించారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు సగటు క్రికెట్ అభిమానులను ఆవేదన కలిగించాయి. ఇంత జరుగుతున్నా బీసీసీఐ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడం సగటు అభిమానిని ఆశ్చర్యానికి గురి చేసింది. త్వరలో హెచ్సీఏ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరగాలని కొంతమంది హెచ్సీఏ ప్రతివాదులు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) కథ కంచికి చేరింది. సుప్రీంకోర్టు హెచ్సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై ఏకసభ్య కమిటీ హెచ్సీఏ వ్యవహారలన్నీ చూసుకుంటుందని సుప్రీం పేర్కొంది. చదవండి: అజారుద్దీన్కు చుక్కెదురు.. హెచ్సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్
ఈ వ్యాయామాలతో కొవ్వు కరిగి స్లిమ్గా అవ్వుతారు!
గాంధీ మార్గంలో ప్రచారం.. భేష్ అంటున్న జనం!
Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి
డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే ఏమిటి? ఎలా ఎదుర్కోవాలి?
బ్లాక్ డ్రెస్లో అప్సరసలా.. మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement