-
మంత్రి వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
అనంతపురం : అనంతపురం టీడీపీలో గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గొడవ తలెత్తగా ధర్మవరంలో ఉద్రికత్త వాతావారణం నెలకొంది. ఈ విషయంపై ఎమ్మెల్యే సూరి తన వర్గీయులతో సహా వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి మంత్రి పరిటాల వర్గీయులపై ఫిర్యాదుచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ... డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. టీడీపీలో చిన్న చిన్న గొడవలు సహజమేనని, అయితే ఆ గొడవలను ఒక కుటుంబంలా సర్దుబాటు చేసుకుంటామని ఎమ్మెల్యే వరదాపురం సూరి అన్నారు. మంత్రి సునీత వర్గీయులు చేపట్టిన విద్యుత్ కేబుల్ పనులను ఆ పార్టీ ఎమ్మెల్యే సూరి వర్గానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. దీంతో పరిటాల, సూరి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గీయులు పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పరిటాల వర్గీయులకు గాయాలయ్యాయి. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. -
ధర్మవరంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య మరో వివాదం చెలరేగింది. పరిటాల వర్గీయులు చేపట్టిన విద్యుత్ కేబుల్ పనులను ఎమ్మెల్యే సూరి వర్గంవారు అడ్డుకున్నారు. దీంతో పరిటాల, సూరి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు పరిటాల వర్గీయులకు గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా సూరి వర్గీయులు పోలీసుల ద్వారా కేబుల్ పనులను ఆపేందుకు యత్నించారు. దీంతో పోలీసులతో మంత్రి పరిటాల వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. కేబుల్ పనులు కొనసాగించి తీరుతామని పరిటాల వర్గీయులు స్పష్టం చేశారు. -
ధర్మవరంలో కొనసాగుతున్న 144 సెక్షన్
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో పోలీసు నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. దీపావళిని పురస్కరించుకుని మంత్రి పరిటాల సునీత వర్గీయులు పట్టణంలో ఏర్పాటు చేసిన పోస్టర్లో స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ ఫొటో లేకపోవటంతో బుధవారం ఆయన వర్గీయులు గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో డీఎస్పీ వేణుగోపాల్ 144వ సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి పట్టణంలో 120 మంది పోలీసు సిబ్బంది పహారా కాశారు. గురువారం ఉదయం ప్రశాంత పరిస్థితులు ఏర్పడటంతో ఇద్దరు సీఐలు, 20 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల నిర్వహణలో ఉన్నారు. నవంబర్ 2వ తేదీ వరకు 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని డీఎస్పీ తెలిపారు. -
పరిటాల సునీత వర్సెస్ ఎమ్మెల్యే సూరి
ధర్మవరంలో ఫ్లెక్సీ పంచాయితీ సునీత ఫ్లెక్సీని తొలగిచేందుకు సూరి అనుచరుల యత్నం అడ్డుకున్న పరిటాల వర్గం పోలీసు స్టేషన్ ఎదుటే ముష్టియుద్ధం పట్టణంలో ఉద్రిక్తత, 144 సెక్షన్ అమలు టీడీపీలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఇన్నాళ్లూ చాపకింద నీరులా దాగి ఉన్న తమ్ముళ్ల అసహనం బుధవారం ధర్మవరంలో జరిగిన ఘటనతో బట్టబయలైంది. కేవలం ఓ ఫ్లెక్సీ కోసం మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) అనుచరులు బాహాబాహీకి దిగడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్మవరం : స్థానిక పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ల ఫొటోలతో బత్తలపల్లి మండలం గంటాపురానికి చెందిన జగ్గు అనే టీడీపీ నాయకుడు ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. అయితే ఆ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ ఫొటో వేయించలేదు. ఇది చూసిన ఎమ్మెల్యే అనుచరులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ నాయకుడు ఫొటో లేని ఫ్లెక్సీ అక్కడ ఉంచరాదని భావించి దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడే ఉన్న గంటాపురం, సి.బత్తలపల్లి, ఓబుళనాయునిపల్లి గ్రామాలకు చెందిన పరిటాల వర్గీయులు ఫ్లెక్సీ తొలగింపును అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలవారు తమ అనుచరులను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించుకున్నారు. దీంతో భారీఎత్తున జనాలు గుమికూడారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు మరోసారి మంత్రి ఫ్లెక్సీలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలవారు పోలీసుల ఎదుటే ముష్టి యుద్ధానికి దిగారు. ఒకరి చొక్కాలు ఒకరు చించుకొని, పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరీ వర్గీయులు ఫ్లెక్సీని కొంతమేర చించేశారు. దీంతో పరిటాల వర్గీయులు ఫ్లెక్సీ ఎదుటే ౖబైఠాయించారు. ‘తాము ఇక్కడే కాపలాగా కూర్చుంటాం, ఎవరు వస్తారో చూస్తాం’ అంటూ ఫ్లెక్సీ ఎదుటే బైఠాయించారు. ఈ ఘర్షణ పెద్దది కావడం... జనం భారీగా గుమిగూడడంతో ఏం జరుగుతుందో తెలియక పట్టణవాసులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రేక్షక పాత్రలో పోలీసులు పోలీసు స్టేషన్ ఎదుటే అధికార పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో...పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ డివిజన్ పరిధిలోని పోలీసులందరినీ ధర్మవరానికి పిలిపించారు. అయినప్పటికీ ఇరువర్గాల వారూ అధికార పార్టీ నేతలే కావడంతో ఎవరికీ ఏమీ చెప్పలేక పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. దీంతో రెచ్చిపోయిన సునీత, సూరి వర్గం పోలీసుల ఎదుటే వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే స్థానిక కళాజ్యోతి సర్కిల్లో ఏర్పాటు చేసిన మరో ఫ్లెక్సీకి వరదాపురం సూరి వర్గీయులు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వారి మాట పట్టించుకోలేదు. పట్టణంలో 144 సెక్షన్ ఫ్లెక్సీ వివాదం తీవ్రమైన నేపథ్యంలో డీఎస్పీ వేణుగోపాల్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గురువారం కూడా 144 సెక్షన్ కొనసాగుతోంది. అలాగే పరిటాల సునీత ఫ్లెక్సీలకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement