-
ఎమ్మెల్యే చెన్నమనేనికి ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు ఆరు వారాలపాటు సస్పెండ్ చేసింది. దీనిపై మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టంచేసింది. రమేష్ జర్మన్ దేశ పౌరుడని, ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గతంలో విచారించింది. -
ఎమ్మెల్యే పౌరసత్వం కేసులో గడువు పెంపు
రాజన్న సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తేల్చేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరోసారి గడువు ఇచ్చింది. రమేష్ జర్మన్ దేశ పౌరుడని, ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గతంలో విచారించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రానికి అప్పట్లో మూడు నెలల గడువు ఇచ్చింది. గడువు ముగియటంతో మరోసారి విచారణకు రాగా మరో మూడు నెలల సమయం పొడిగించాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
చెరువులు ‘ఇరిగేషన్’కు అప్పగించొద్దు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం పూర్తయ్యాక చెరువుల నిర్వహణ బాధ్యతను నీటిపారుదల శాఖకు అప్పగిస్తే అవి మళ్లీ నాశనమయ్యే ప్రమాదం ఉంటుందని టీఆర్ఎస్ సభ్యుడు చెన్నమనేని రమేశ్ అన్నారు. గురువారం పద్దులపై చర్చలో భాగంగా మిషన్ కాకతీయపై ఆయన శాసనసభలో ప్రసంగించారు. చెరువులపై ఆధారపడే కులవృత్తులవారి సం ఘాలు, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో వాటి నిర్వహణ ఉండాలని, ఇతర ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో కూడిన కమిటీలతో సమష్టి నిర్వహణలోనే అవి వర్ధిల్లుతాయని పేర్కొన్నారు. -
పౌరసత్వం కేసులో తీర్పు అమలు ఆపండి
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: భారతీయ పౌరసత్వం లేని కారణంగా ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా తనకు నెల రోజులు గడువు ఇవ్వాలని కోర్టుకు ఆ పిటిషన్లో విన్నవించారు. తన వాదన వినకుండానే ఈ తీర్పు వెలువరించారని, దాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం జర్మనీలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement