-
అద్భుతంగా చర్లపల్లి రైల్వే టర్మినల్
సాక్షి, సిటీబ్యూరో: చర్లపల్లిలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రైల్వే టర్మినల్ ప్రత్యేకతలివి. ఈ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల నగరంలో పర్యటించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు గ్రీన్ఫీల్డ్ రైల్వే టర్మినళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి.. చర్లపల్లి, వట్టినాగులపల్లిలో ఈ తరహా టర్మినళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిలో నాలుగో టర్మినల్ నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రూ.360 కోట్ల అంచనా వ్యయంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్న ఈ టర్మినల్ కోసం రైల్వే శాఖ ఇప్పటికే రూ.30 కోట్లు కేటాయించింది. తాజాగా రైల్వే మంత్రి ప్రకటన నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ పర్యావరణహిత టర్మినల్ను అంతర్జాతీయ హంగులతో నిర్మించేం దుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ► స్టేషన్ చుట్టూ గ్రీన్ఫీల్డ్ (పచ్చని పరిసరాలు) అభివృద్ధి చేస్తారు. కాలుష్యానికి తావులేకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తారు. బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. ► స్టేషన్ అంతటా సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తారు. సోలార్ విద్యుత్కు అధిక ప్రాధాన్యం. ► భూగర్భ జలాల పెంపు, వాననీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. వాటర్ రీసైక్లింగ్ యూనిట్లూ ఏర్పాటు చేస్తారు. ► కాగిత రహిత స్టేషన్గా అభివృద్ధి చేస్తారు. టికెట్ వివరాలు ప్రయాణికులకు ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తారు. ► రైళ్ల రాకపోకల వివరాలు, ఇతర ప్రకటనలు ప్రయాణికులు తెలుసుకునేందుకు ప్రతీ ప్లాట్ఫామ్లో డిస్ప్లే బోర్డులు ఉంటాయి. ► ఎంటర్టైన్మెంట్, షాపింగ్, విశ్రాంతి గదులు తదితర సదుపాయాలు ఉంటాయి. -
రైల్వే అధికారుల ఉరుకులు పరుగులు
ప్రధానితో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పర్యటన అభివృద్ధి పనులు సిద్ధం చేయాలని ఢిల్లీ నుంచి హుకుం పాత హామీల్లో అమలుకాని వాటిని ప్రారంభించాలని అధికారుల నిర్ణయం హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావటం అంటే ఇదే... ఉన్నట్టుండి రోజున్నర పాటు రైల్వేశాఖ మంత్రి హైదరాబాద్లో ఉండాల్సి రావటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులకు చిక్కులొచ్చి పడ్డాయి. అనుకోకుండా రైల్వేమంత్రి ఓ రాత్రి హైదరాబాద్లో ఉండాల్సి రావటంతో ఆయన కోసం కొత్తగా ‘అభివృద్ధి కార్యక్రమా’న్ని వెతుక్కోవాల్సిన అగత్యం అధికారులకు ఏర్పడింది. దీంతో ఇప్పటికిప్పుడు ఏం పనిని సిద్ధంచేయాలో తెలియక అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈనెల 8న దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ సంఘ్ స్వర్ణోత్సవాల్లో రైల్వే మంత్రి పాల్గొనాలి. కానీ కేసీఆర్ విజ్ఞాపన మేరకు ఈ నెల 7న ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఆయన ప్రారంభోత్స వాల్లో సికింద్రాబాద్-సిద్దిపేట-కరీంనగర్ రైల్వేలైను శంకుస్థాపన కూడా ఉంది. దీంతో ప్రధాని వెంట రైల్వే మంత్రి కూడా ఆ రోజు రావాల్సి వచ్చిం ది. దీంతో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ నుంచి అధికారులకు సమాచారం అందింది. దీంతో పాత హామీల్లో అమలుకాని వాటిని దుమ్ముదులిపి ప్రారంభించాలని నిర్ణయించారు. -
యూపీలో ఘోరం
- స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు - 8 మంది చిన్నారుల మృతి - వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భదోహి : ఉత్తరప్రదేశ్లో సోమవారం ఓ స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టడంతో 8 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 14 మంది పిల్లలు గాయపడ్డారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద సోమవారం డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యాన్ను నడపడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘోసియా టౌన్షిప్లోని టెండర్హార్ట్ పాఠశాలకు చెందిన మినీ బస్సు సమీప ఆరు పల్లెల్లో 6-14 ఏళ్ల వయసు చిన్నారులను రోజూ పాఠశాలకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం చిన్నారులతో బయల్దేరింది. కటక్-మధోసింగ్ స్టేషన్ల నడుమ ఉన్న రైల్వే గేట్ నంబర్ 26 వద్దకు మినీ బస్సు చేరుకుంది. అక్కడ వారణాసి-అలహాబాద్ ప్యాసింజర్ రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్న వ్యాను డ్రైవర్.. రైలు వస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు. గేట్మిత్ర ఎర్రజెండా చూపి హెచ్చరించినా ఫలితం లేకపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గేట్ను క్రాస్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాడు. చూస్తుండగానే రైలు వ్యాన్ను ఢీకొంది. వ్యాను సమీపంలోని పొలంలో ఎగిరిపడింది. గాయపడ్డ చిన్నారులు, డ్రైవర్ను ఆస్పత్రిలో చేర్పించారు. రఘటనపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.20 వేల చొప్పున ప్రకటించారు. బిహార్లో 10 మంది మృతి ముజాఫర్పూర్: బిహార్లోని ముజాఫర్ఫూర్ జిల్లా జాఫా గ్రామం వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ఆటో ఢీకొని 10 మంది దుర్మరణం చెందారు. -
‘వాతావరణం’ అనుకూలించ లేదట!
అందుకే రైల్వే మంత్రి రాలేదట.. రైల్వే జోన్ ప్రకటనపై సరికొత్త ఎత్తుగడ మరోసారి విశాఖ వాసులకు దగా విశాఖపట్నం: చిన్నపాటి వర్షం వస్తే చాలు.. చిన్నపిల్లలు దానిని ఆసరాగా తీసుకుని బడికె ళ్లడం మానేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి రైల్వే జోన్పై ప్రకటన నుంచి తప్పించుకోవడానికి ఆ వర్షాన్నే ఆసరాగా చేసుకున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే జోన్పై ప్రకటన చేస్తారంటూ నానా హంగామా చేశారు. ఆయన విశాఖ రావడమే తరువాయి అన్నంతగా ప్రచారం సాగించారు. దీంతో తమ చిరకాల కల నిజంగా సాకారమవుతుందని విశాఖ వాసులు తెగ సంబరపడ్డారు. ఇంతలో 24 గంటలైనా గడవక ముందే వారి పర్యటన రద్దయిపోయింది. అందుకు వర్షాలు, వాతావరణం అడ్డుపడ్డాయన్నమాట! పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్రలో తేలికపాటి వానలే కురుస్తున్నాయి. ఆవర్తనమంటే అల్పపీడనం కన్నా బలహీనంగా ప్రభావం చూపుతుంది. ఈదురుగాలులు, పెనుగాలులకూ ఆస్కారమివ్వదు. ప్రశాంత వాతావరణంతో వానలు కురుస్తాయి తప్ప ఎలాంటి అనర్థాలకు తావివ్వదు. భారీ వర్షాలూ కురవవు. విమాన సర్వీసులూ రద్దు కావు.. కాలేదు. కానీ బంగాళాఖాతంలో ఆవర్తనంతో తలెత్తిన వాతావరణ పరిస్థితుల వల్ల ఈనెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్ ప్రభుల విశాఖ పర్యటన రద్దయినట్టు అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వాస్తవానికి విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదన్న విషయం ఇప్పటికే పలుమార్లు రుజువయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనీ తేటతెల్లమయింది. ఇంతలో సాక్షాత్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభు కొత్తగా మన రాష్ట్రం నుంచే రాజ్యసభకు ఎన్నికవడంతో రైల్వే జోన్కు మోక్షం కలుగుతుందని అంతా ఆశపడ్డారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, టీడీపీ నేతలు సురేష్ ప్రభు విశాఖ వస్తున్నారని, జోన్పై ఆయన ఇక్కడే అనుకూల ప్రకటన చేస్తారని ఊదరగొట్టారు. పత్రికలు, టీవీ చానళ్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఈసారి నెపాన్ని వర్షం, వాతావరణంలపైకి నెట్టేసి రైల్వే మంత్రి తన పర్యటనను రద్దు చేసుకుని తప్పించుకున్నారు. రైల్వే జోన్ ఆశలపై నీళ్లు చల్లారు. విశాఖ వాసుల్ని మరోసారి దగా చేశారు. మోకాలికీ, బోడి గుండుకూ ముడిపెట్టారన్న సామెతను నిజం చేస్తున్నారంటూ జనం నిట్టూరుస్తున్నారు. -
‘రాజధాని’ మిస్సైతే..‘మహారాజా’ స్వాగతం
న్యూఢిల్లీ: రాజధాని రైళ్లలో టికెట్ తీసుకున్నా.. చివరి నిమిషం వరకు బెర్తు ఖరారు కాని ప్రయాణికులకు శుభవార్త. రాజధాని రైలు ప్రయాణం మిస్సైందనే చింత అక్కర్లేదు. ఇలాంటి ప్రయాణికులకు మహారాజా (ఎయిర్ ఇండియా మస్కట్) స్వాగతం పలకనున్నాడు. రాజధాని టికెట్ ఖరారు కాని ప్రయాణికులు కొంతమొత్తం అదనంగా చెలిస్తే వీరిని ఎయిర్ ఇండియా విమానంలో గమ్యస్థానానికి చేర్చేలా.. ఐఆర్సీటీసీ, ఎయిర్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. వారం రోజుల్లోనే ఈ సదుపాయం మొదలుకానుందని సమాచారం. అయితే రాజధాని ఏసీ ఫస్ట్క్లాస్ ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని.. సెకండ్, థర్డ్ ఏసీ ప్రయాణికులు రూ.2వేల వరకు చెల్లిస్తే సరిపోతుందని ఎయిర్ ఇండియా చీఫ్ అశ్వని లొహానీ తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాలకు విమాన సేవలు మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, వెయిటింగ్ లిస్టులో, ఆర్ఏసీలో ఉన్న ప్రయాణికులు 139కు డయల్ చేసి తమ టికెట్ను రద్దుచేసుకోవచ్చని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఢిల్లీలో తెలిపారు. అయితే రైలు బయలుదేరేందుకు 4 గంటల ముందు వరకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement