-
మంత్రి అయ్యన్న ఆరోపణల్లో వాస్తవం లేదు: కలెక్టర్
సాక్షి, విశాఖపట్నం: మెడ్టెక్ పార్కు భూసేకరణకోసం పరిహారం చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ చెప్పారు. భూసేకరణ, లబ్ధిదారుల ఎంపిక, పరిహారం చెల్లింపు నిబంధనలకనుగుణంగానే జరిగిందన్నారు. ఐదుసార్లు గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగానే లబ్ధిదారుల జాబితాను తయారుచేశామని, ఎక్కడా అవకతవకలు జరగలేదని చెప్పారు. ఎక్కడా సెంటు ప్రభుత్వ భూమిని.. ప్రభుత్వానికే అమ్మిన దాఖలాల్లేవన్నారు. ఎవరైనా అనర్హులు పరిహారం పొందినట్టు నిరూపిస్తే వారినుంచి రికవరీ చేయడమేకాదు.. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మెడ్పార్క్ భూపరిహారం పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ మంత్రి అయ్యన్న సిట్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో శనివారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. -
డబ్బుల కోసం ఆ మాత్రం నిలబడలేరా?
ప్రజల ఇబ్బందులపై మంత్రి అయ్యన్న చోడవరం: పాత నోట్ల రద్దు, బంగారంపై ట్యాక్స్ వ్యవహారంలో మీడియా అనవసరంగా అపోహలు సృష్టిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా చోడవరంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి సినిమా టికెట్ల కోసం 4 గంటలు లైన్లలో నిలబడే జనం.. అవసరమైన డబ్బుల కోసం గంటసేపు బ్యాంకుల వద్ద నిలబడలేరా? అంటూ ప్రశ్నించారు. బంగారంపై విధించిన నిబంధనల వల్ల ధనికులైన 20 శాతం మందే ఇబ్బంది పడతారని, సామాన్య ప్రజలకు ఏ ఇబ్బందీ ఉండదని చెప్పారు. -
16 కోట్లు.. 20 రోజులు
మార్చి నెలాఖరు గడువు దగ్గర పడటంతో హడావుడిగా నిర్మాణాలు 11 నెలలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు 20 రోజుల్లో రూ. 16 కోట్లకు టార్గెట్ పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యతకు తిలోదకాలు మార్చి నెలాఖరులోగా ఉపాధి హామీ, ఆర్థిక సంఘ నిధులు ఖర్చు చేయాలన్న నిబంధనవల్ల అధికారులు ఆదరాబాదరాగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చాలాచోట్ల వారి పర్యవేక్షణ లేకుండా జరగడం వల్ల నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇదీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇలాకాలో పరిస్థితి. నర్సీపట్నం: నర్సీపట్నం డివిజన్లో ఉపాధిహామీ, 13, 14 ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. మార్చి నెలాఖరులోగా పూర్తిచేయకుంటే నిధులు రద్దయ్యే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. ఆదర్శ గ్రామాలే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోట్లు కేటాయించడం తెలిసిందే. 20 రోజుల్లో ఎలా పూర్తి? నర్సీపట్నం డివిజన్లో పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ పథకం, 13,14వ ఆర్థిక సంఘం నుంచి 675 పనులకు రూ.22.7 కోట్లు మంజూరయ్యాయి. 11 నెలల వ్యవధిలో రూ.6 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా రూ.16.7 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోపు పనులు పూర్తి చేయించడానికి అధికారులు హైరానా పడుతున్నారు. ఏడాది కాలంగా పనులు పూర్తి చేయలేని అధికారులు స్వల్ప వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి హెచ్చరించినా.. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను నిర్ధేశించిన సమయానికి ఖర్చు చేయకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యే నిధులపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన నిధులను వచ్చే ఏడాది విడుదలయ్యే నిధుల్లోచూపించే అవకాశం ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో నిధులు సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేవలం 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయకపోవటం వారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. కానరాని నాణ్యత నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేసేందుకు అధికారులు ఆదరాబాదరాగా పనులు చేపట్టడంతో వీటిలో నాణ్యత లోపించే అవకాశం లేకపోలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల్లో చాలామంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు. వారంతా అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు జరిపించేస్తున్నారు. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ఆగమేఘాల మీద నిర్మాణాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం పనులు: 675 ఏడాదికి కేటాయించిన నిధులు: రూ.22.7కోట్లు 11 నెలల్లో పూర్తయినవి: రూ.6 కోట్ల విలువైన పనులు 20 రోజుల్లో పూర్తికావాల్సినవి: రూ.16.7కోట్ల విలువైన పనులు లక్ష్యాన్ని అధిగమిస్తాం ఇసుక కొరత వల్ల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడింది. సాధ్యమైనంత వరకు మార్చి నెలాఖరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం. - కె.ప్రభాకర్రెడ్డి, ఈఈ, పంచాయతీరాజ్ నర్సీపట్నం డివిజన్ -
అయ్యన్న మరిచిన అరణ్య రోదన!
⇒పెదగంగవరం గిరిజనేతరుల సమస్యపై ఏడాది క్రితం మంత్రి వాగ్దానం ⇒సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ఆస్కారం లేకపోవడంపై విస్మయం ⇒ఇప్పటికీ బాధితులు పశువుల పాకల్లో తలదాచుకుంటున్న వైనం ⇒ఏళ్ల తరబడీ పరిష్కారం కాని సమస్య ‘ఇలాంటి సమస్య దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా చూడ లేదు.. వినలేదు. కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నా, ఇన్ని హక్కులు ఉండి కూడా మీ భూముల్లో మీరు పక్కా ఇళ్లు నిర్మించు కోకుండా అడ్డుపడటం దారుణం.. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, అసెంబ్లీ దృష్టికి కూడా తీసుకె ళ్లి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తా.. అది కూడా నా హయాంలోనే పరిష్కారమయ్యేలా ప్రత్యేక చొరవ చూపుతా.. ఇటువంటి పరిస్థితి రావడం దారుణం’.. ఏడాది కిందట అనంతగిరి మండలం పెదగంగవరం గ్రామానికి చెందిన గిరిజనేతరుల సమస్య విన్న మంత్రి అయ్యన్న పాత్రుడి స్పందన ఇది. దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ బుచ్చింపాలెం గ్రామంలో నిర్మించిన మినీ రిజర్వాయర్ ప్రారంభానికి పెదగంగవరం మీదుగా గత ఏడాది ఫిబ్రవరి 27న వచ్చిన మంత్రి అయ్యన్న పాత్రుడిని పెదగంగవరం గ్రామస్తులు అడ్డుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పటికి సుమారు నెల రోజులు క్రితం ఇళ్లు అగ్నికి ఆహుతై పశువుల పాకల్లో తలదాచుకుంటున్న గ్రామస్తుల దుస్థితిని చూసి మంత్రి అయ్యన్న చలించిపోయారు. సమస్య పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్తానని.. పరిష్కరించే వరకు వెనుకాడేది లేదని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది దాటిపోయింది. మంత్రి గారిని గ్రామస్తులు కలుస్తూనే ఉన్నారు.. ఇప్పటికీ సమస్య అలాగే ఉంది. దేవరాపల్లి: ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్య పరిష్కారానికి మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక దారి చూపిస్తారని పెదగంగవరం గ్రామస్తులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఏడాది కిందట మంత్రి గ్రామానికి వచ్చి అక్కడి గిరిజనేతరుల దుస్థితిని చూసి గ్రామ పెద్దలు ఫోన్ నంబర్లును తీసుకోవడంతో పాటు, తన ఫోన్ నంబర్ను కూడా గ్రామ పెద్దలకు ఇచ్చి తరుచూ కలు స్తూ ఉండాలని సూచించారు. అప్పటి నుండి గ్రామస్తులు పలుమార్లు మంత్రిని కలిశారు. మంత్రి హామీ ఇచ్చి ఏడాది గడిచినా పరిష్కార మార్గం కనిపించకపోవడంతో గ్రామస్తులు కలవరడుతున్నారు. సమస్య ఇదీ.. అనంతగిరి మండలం పెదగంగవరం గిరిజన గ్రామంలో గిరిజనేతరులైన సుమారు 300 కుటుంబాలు గ్రామం ఏర్పడిన 1847 నుండి నివాసం ఉంటున్నారు. వీరు పూర్వీకుల నుండి సంక్రమించిన భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక్కడి కొందరు గిరిజనులు, గిరిజన సంఘాల నాయుకులు 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులైన మీకు ఎటువంటి హక్కులు ఉండవని సమస్యను లేవెనెత్తడంతో అప్పటి నుండి గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదం నెలకొంది. దీనిపై గిరిజనేతరులు మాత్రం 1/70 చట్టం ప్రకారం 1963 ముందు కంటే గిరిజన ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనేతరులకు కూడా గిరిజనలతో సామాన హక్కులు ఉంటాయని, ఈ మేరకు 2/70 చట్టాన్ని జారీ చేశారని చెబుతున్నారు. దీని ప్రకారం తమకు గతంలో అధికారులు సెటిల్మెంట్ పట్టాలను, పాసు పుస్తకాలను, పట్టాదారు పుస్తకాలను జారీ చేశారని తెలిపారు. పక్కా ఇళ్లకు నోచుకోని వైనం గత ఏడాది జనవరి 17న గ్రామంలో గిరిజనేతరుల 29 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. జన్మభూమిలో ఇళ్లు మంజూరైనా గిరిజన సంఘాల నాయుకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి అన్ని హక్కులు ఉన్న తమకు ఎల్పీసీలు ఇవ్వడం లేదని గిరిజనేతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాజ్యం కోర్టు పరిధిలో ఉంది. అన్నదమ్ముళ్లా ఉంటున్నాం.. గిరిజనులు, గిరిజనేతరులమైన తామంతా పూర్వీకుల నుండి అన్నదమ్ముళ్లా కలిసి మెలిసి ఉంటున్నాం.. కొందరు గిరిజన సంఘాల నాయకులు లేని సమస్యను సృష్టించి రాద్దాంతం చేస్తున్నారు.. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా పూర్తి భాద్యత ప్రభుత్వమే వహించాలి. చివరగా మంత్రి అయ్యన్నపైనే ఆశలు పెట్టుకున్నాం. ఆయన చొరవ తీసుకుంటే ఇచ్చిన హామీ మేరకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. - కె.వి.రమణ, శ్రీరామా నాన్ ట్రైబుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి, పెదగంగవరం అన్ని పత్రాలు ఉన్నా హక్కు లేదంటున్నారు నా చిన్న నాటి నుండి గ్రామంలో నివాసం ఉంటున్నాను. మా భూములకు పాసు పుస్తకాలతో పాటు అన్ని పత్రాలు ఉన్నా పక్కా ఇళ్ళు నిర్మించుకోకుండా అడ్డుకోవడం అన్యాయం. పూరిళ్లు కాలిపోయి ఏడాది దాటిపోతున్నా.. వాటి స్థానంలో పక్కా ఇళ్లతో పాటు స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డు నిర్మించుకోకుండా అడ్డుకోవడం అత్యంత దారుణం. పశువుల పాకల్లో నివాసం ఉంటున్నాం. మేము బతికి ఉండగానే మంత్రి అయ్యన్న సమస్య పరిష్కరించాలి. - కొట్టాన అచ్చన్న, గిరిజనేతర వృద్ధుడు. -
మద్దతు ధర మాటేమిటి?
మంత్రి అయ్యన్నను నిలదీసిన చెరకు రైతులు అడ్డుకున్న ఎమ్మెల్యే రాజు ఆందోళన వ్యక్తం చేసిన అన్నదాతలు బుచ్చెయ్యపేట: టన్ను చెరకుకు మద్ధతు ధర ఎంత..గతేడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకు, దవ్వ డబ్బులు ఎప్పుడిస్తారంటూ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును పలువురు చెరకు రైతులు నిలదీశారు. ఆదివారం బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రిని ‘గోవాడ’ రైతులు చుట్టుముట్టారు. క్రషింగ్ ప్రారంభమై నెలన్నర గడిచిపోయినా ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మంత్రి వివరణ ఇచ్చేలోపే చోడవరం ఎమ్మేల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కల్పించుకుని ఇది సమయం కాదని తర్వాత మాట్లాడుదామని రైతులను వారించడంతో పలువురు తీవ్ర ఆగ్రహం చెందారు. మిల్లుకు గతేడాది సరఫరా చేసిన చెరకుకు సంబంధించి బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. సర్కారు విధానాలతో ఏలా బతకాలని వాపోయారు. టీడీపీ అధికారంలో లేనప్పుడు గోవాడ ఫ్యాక్టరీని తమకు అప్పగిస్తే టన్నుకు రూ.3500 ధర చెల్లిస్తామంటూ రోడ్డేక్కి ఆందోళనలు చేపట్టిన ఎమ్మేల్యే ప్రస్తుతం మద్దతు ధర గురించి ప్రశ్నిస్తే నోరు నొక్కడం శోచనీయమని పేర్కొన్నారు. గోవాడ ఫ్యాక్టరీలో రూ.16 కోట్లకుపైగా అవినీతి చోటుచేసుకుందన్న వాదన నేపథ్యంలో విచారణ జరుగుతుండగా ఎమ్మేల్యే రైతులను వారించడంపై విస్మయం వ్యక్తం చేశారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement