-
ఏకమొత్తంగా రుణమాఫీకి నిధులు!
♦ వచ్చే బడ్జెట్లో కేటాయించేందుకు పరిశీలన: మంత్రి పోచారం ♦ సూక్ష్మ సేద్యానికి రూ. 2,500 కోట్ల నాబార్డు నిధులు ♦ ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో హైదరాబాద్లో మెగా డెయిరీ ♦ పాల ప్రోత్సాహకానికి రూ. 100 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఏకమొత్తంగా రైతు రుణమాఫీ సొమ్మును బ్యాంకులకు చెల్లించేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెండు రోజులుగా వ్యవసాయ, పశుసంవర్థక శాఖలు, వాటి అనుబంధ రంగాల బడ్జెట్ రూపకల్పనపై మంత్రి కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అయితే రుణమాఫీని ఒకేసారి చెల్లించే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. బడ్జెట్ను వాస్తవానికి తగ్గట్లు రూపకల్పన చేస్తామన్నారు. అనవసర పథకాలు, పద్దులను తొలగించి అవసరమైన వాటికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి 871 పద్దులున్నాయని... వాటిల్లో 50% పైగా నిరుపయోగంగా ఉన్నాయని గుర్తించామన్నారు. ప్రణాళిక బడ్జెట్ను పెంచాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వ్యవసాయ ప్రణాళిక బడ్జెట్ పెరిగే అవకాశం ఉందన్నారు. 2016-17లో ఉద్యాన కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. వారంలోగా కార్పొరేషన్ విధివిధానాలు ఖరారు చేసి సీఎం వద్దకు ఫైలు పంపిస్తామన్నారు. రాష్ట్రంలో క్లస్టర్లను ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ పరిధిలో ఎన్ని కూరగాయలు, సుగంధద్రవ్యాలు అవసరమో నిర్ణయించి ఆ ప్రకారం పండిస్తామన్నారు. సూక్ష్మసేద్యం, పాలీహౌస్ల కోసం నాబార్డు నుంచి రూ.2,500 కోట్లు తీసుకుంటామన్నారు. పోలండ్, డెన్మార్క్ల్లో పర్యటన ప్రస్తుతం 6.65 లక్షల హెక్టార్లలో కూరగాయలు పండిస్తున్నామని... భవిష్యత్తులో మరో 4.40 లక్షల హెక్టార్లలో పండిస్తామని పోచారం తెలిపారు. ఉద్యాన కార్పొరేషన్ ద్వారా 200 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పోలండ్, డెన్మార్క్ దేశాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఉన్నాయని... ఉత్పత్తి అయిన ప్రతీ పంటను ప్రాసెస్ చేయడం ద్వారా రైతుకు అదనపు లాభం చేకూర్చుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు ముందే ఆ దేశాల్లో పర్యటించి అక్కడి నుంచి అవసరమైన యంత్రాలను కొనుగోలు చేస్తామన్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహక పథకాన్ని రద్దు చేయబోమన్నారు. 25 లీటర్ల సీలింగ్ పెట్టామన్నారు. అయితే మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ తదితర డెయిరీలు కూడా ప్రోత్సాహకాన్ని కోరుతున్నాయని... దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. వచ్చే బడ్జెట్లో రూ.100 కోట్లకు పైగా పాల ప్రోత్సాహకానికి కేటాయిస్తామన్నారు. ప్రైవేటు డెయిరీల్లో కొన్నింటిలో యూరియా కలిపిన పాలు అమ్ముతున్నారన్న ప్రచారం నేపథ్యంలో విజయ డెయిరీని బలోపేతం చేసి పాల సేకరణను పెంచుతామన్నారు. అందుకోసం ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న మెగా డెయిరీని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి రూ.400 కోట్లు కేటాయిస్తామన్నారు. అలాగే జిల్లాల్లోనూ విజయ డెయిరీ యూనిట్లను బలోపేతం చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యానశాఖలో 600 పోస్టుల నియామకం చేస్తామన్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ చేపడతామన్నారు. -
అన్నీ అదే ఖాతాలో వేస్తారా?
* రైతుల ఆత్మహత్యలన్నీ పంటలు ఎండిపోవడం వల్లే జరగడం లేదు: మంత్రి పోచారం * కుటుంబ కలహాలు, సమస్యలతోనూ ఆత్మహత్యలు సాక్షి, హైదరాబాద్: కుటుంబ సమస్యలు, తగాదాల వల్ల కూడా కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వాటన్నింటినీ రైతుల ఆత్మహత్యలుగా చూపడం తగదని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అలాగని అప్పు లబాధ, పంటలు ఎండిపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడలేదని తాను అనడం లేదని.. అవన్నీ విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు. గురువారం మంత్రి హైదరాబాద్లోని ఉద్యానవన శిక్షణ కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘నా నియోజకవర్గంలో గంగారాం అనే రైతు చనిపోయాడు. కుటుంబ సమస్యల వల్ల చనిపోయాడని అక్కడివారు చెప్పారు. కానీ పంట లు ఎండిపోవడం వల్లే ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెల్లారి పేపర్లో వచ్చింది. నా బంధువు ఒకాయన కుటుంబ సమస్యల వల్ల చనిపోతే దాన్ని కూడా పంటలు ఎండిపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇలా అన్నింటినీ రైతు ఆత్మహత్యలుగా చూపడం తగదు. విచారణలోనే అన్నీ బయటపడతాయి..’’ అని పోచారం చెప్పారు. విద్యుత్, నీళ్లు లేకపోవడమే ఆత్మహత్యలకు కారణమైతే.. కాంగ్రెస్, టీడీపీలదే ఆ బాధ్యత అన్నా రు. భవిష్యత్లో రైతుల ఆత్మహత్యలు జరగకుండా చేస్తామని, బడ్జెట్లో వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించామని తెలిపారు. రూ. 240 కోట్లతో మెగా డెయిరీ.. పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామని మంత్రి తెలి పారు. స్త్రీనిధి, నాబార్డు ద్వారా గేదెలు, ఆవులను అందజేస్తామన్నారు. రూ. 240 కోట్లతో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో మెగా డెయిరీ ఏర్పాటుకోసం కేంద్రానికి ప్రతిపాదన పంపామని చెప్పారు. గొర్రెల పెంపకం కోసం మహబూబ్నగర్ జిల్లాలో రూ. 63 కోట్లతో ఒక ప్రాజెక్టు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. డెయిరీ రైతులకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చే అంశం సీఎం పరిశీలనలో ఉందన్నారు. ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత.. త్వరలో రెగ్యులర్ విధానంలో సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను భర్తీ చేస్తామని పోచారం వెల్లడించారు. 4,442 పోస్టుల్లో 400 మందిని ఉద్యానవనానికి కేటాయిస్తామని, వారు మండల అధికారులుగా ఉంటారని చెప్పా రు. జిల్లాల్లో చిన్ననీటి పారుదల, ఉద్యానవనా న్ని కలిపి ఒక జేడీఏను కేటాయిస్తామన్నారు. ప్రతీ మండలంలో చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్లో 50 చోట్ల ఆ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement