-
అమెరికాలో చంద్రబాబు పర్యటన
ఎడిసన్, న్యూ జెర్సీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని బృందం అమెరికాలో పర్యటించనుందని నాట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 24 ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రతిష్టాత్మక సదస్సులో సుస్ధిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. గో ఏపీ సంస్థ ఆధ్వర్యంలో పలు కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. కొలంబియా యూనివర్సిటీలో సాంకేతిక యుగంలో పరిపాలన అనే అంశంపై జరిగే సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తారు. చికాగో యూనివర్సిటీతో ఎంఓయూలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. యుఎస్, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక నిర్వహించే సదస్సులో కూడా చంద్రబాబు పాల్గొంటారు. దీంతో పాటు యూఎస్ ఇండియా వాణిజ్య మండలి, సీఐఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే సమావేశంలో ఏపీలో పెట్టుబడుల పెట్టేందుకు ఉన్న అవకాశాలపై ప్రసంగిస్తారు. న్యూజెర్సీలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశం చేయనున్నారు. ఈ నెల 23న న్యూజెర్సీలో నిర్వహించే సభకు భారీగా ప్రవాసాంధ్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు మన్నవ మోహన కృష్ణ, కలపటపు బుచ్చి రామప్రసాద్ కోరారు. -
నాట్స్ చొరవతో.. ఆర్వో ప్లాంట్లు
ఉప్పలపాడు(ప్రకాశం): జన్మభూమి రుణం కొంత తీర్చుకునే క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రకాశం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తాగునీటితో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాలో తన వంతు సాయం చేసేందుకు నాట్స్ ముందుకొచ్చింది. అమెరికా నుంచి వచ్చిన నాట్స్ ప్రతినిధులు చీర్వాను ఉప్పలపాడు గ్రామంలో ఆర్వో ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు, నాట్స్ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యుద్ధప్రతిపాదికన మరి కొన్ని పల్లెల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న నాట్స్ ఆ దిశగా ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబుతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ప్లోరైడ్ బాధిత పల్లెల్లో ఈ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా నాట్స్ అడుగులు వేస్తోంది. బడికి నాట్స్ చేయూత..! ఆధునాతన సాంకేతిక పరిజ్జానాన్ని కూడా పల్లె బడులకు చేరువ చేయాలనే సంకల్పంతో నాట్స్.. డిజిటల్ తరగతుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.. ప్రకాశం జిల్లాలోని అమ్మనబ్రోలులో తొలి డిజిటల్ తరగతిని ఏర్పాటు చేసింది. దీనిని కూడా నాట్స్ ప్రతినిధులతో కలిసి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు ప్రారంభించారు. మరో 9 ప్రభుత్వ బడుల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు నాట్స్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోందని నాట్స్ ప్రతినిధులు తెలిపారు. పుస్తకాలతోనే పిల్లల మనోవికాసం జరుగుతుందని భావించే నాట్స్ పుస్తకాలతో స్నేహం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి అమ్మనబ్రోలు ఉన్నత పాఠశాలలో దానిపై చర్చను నిర్వహించింది. పుస్తక ప్రదర్శన కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 1500 మంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలోని 23 జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. నాలుగు ప్రభుత్వ బడుల్లో మరమ్మత్తులు, పునరుద్దరణ పనులు చేయించింది.. ప్రకాశం జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి జన విజ్జాన వేదిక ప్రతినిధి సీఏ ప్రసాద్, ఈఎన్ టీ వైద్యులు డా.సుధాకర్ తమ సహకారాన్ని అందించారని నాట్స్ తెలిపింది. అమ్మనబ్రోలు నాట్స్ చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో కృషి చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులకు అమ్మనబ్రోలు ఉన్నత పాఠశాల సిబ్బందికి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఎన్.ఆర్.ఐ సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ గుళ్ళపల్లి, కిరణ్ పోలినేని తమ వంతు సహాయం అందించారు. నాట్స్ ట్రెజరర్ శ్రీనివాస్ మంచికలపూడి ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement