-
‘అనంత’ ఫ్యాక్షన్ ముగిసినట్లేనా..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’ ఫ్యాక్షన్తో రెండు తరాలు అంతమైనా ‘రక్తచరిత్ర’ మాత్రం ఆగలేదు. పరిటాల శ్రీరాములు హత్యతో ఆరంభమైన ఈ ఫ్యాక్షన్ 2011 జనవరి 3న జరిగిన మద్దెల చెరువు సూర్యనారాయణరెడ్డి(సూరీ) హత్యతోముగిసిందని ‘అనంత’ వాసులు భావించారు. కానీ సూరి హత్య జరిగిన రెండునెలల లోపే సూరి అనుచరుడు తగరకుంట కొండారెడ్డి హత్య జరిగింది. దీంతో ఒక్కసారిగా మళ్లీ ‘అనంత’ ఫ్యాక్షన్ జడలు విప్పుకున్నట్లయింది. దీంతో పరిటాల ప్రత్యర్థులంతా అప్పట్లో వణికిపోయారు. ఆపై ‘అనంత’లో అక్కడక్కడా రాజకీయ హత్యలు జరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో సూరి హత్య కేసుకు సంబంధించి మంగళవారం తీర్పు వెలువడటంతో ఇక్కడి ఫ్యాక్షన్పై విస్తృత చర్చ నడుస్తోంది. అసలు ఈ ఫ్యాక్షన్ ఎలా మొదలైంది? ఇప్పటికైనా ముగిసినట్లేనా? లేదంటే భవిష్యత్తులో మరిన్ని హత్యలు జరుగుతాయా? అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ‘అనంత’ ఫ్యాక్షన్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆరంభం ఇలా... కొన్నేళ్ల కిందటి నుండి 1968 దాకా పరిటాల శ్రీరాములు, మద్దెలచెర్వు నారాయణరెడ్డి ఇద్దరూ స్నేహితులు. అయితే 1968లో జరిగిన ఓ సంఘటన ఇరు కుటుంబాల మధ్య చిచ్చును రేపింది. శుత్రుత్వాన్ని రగిల్చింది. అప్పట్లో పరిటాల శ్రీరాములు పీపుల్స్వార్లో చేరారు. దీంతో నారాయణ రెడ్డికి, పరిటాల కుటుంబానికి అభిప్రాయ భేదాలతో పాటు ఆధిపత్య పోరు ఆరంభమైంది. ఈక్రమంలో 1975లో పరిటాల శ్రీరాములును ప్రత్యర్థులు నరికి చంపారు. ఇదే ‘అనంత’ ఫ్యాక్షన్లో తొలి హత్య. ఈ హత్యతో వారి రెండు కుటుంబాల ఆధిపత్యపోరు జిల్లా అంతటికి సోకింది. శ్రీరాములు హత్య తర్వాత నాలుగేళ్ల పాటు అంతర్గత విభేదాలు అణిగిఉన్నాయి. ఆ తర్వాత 1979లో శ్రీరాములు పెద్ద కుమారుడు పరిటాల హరిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి ఎన్కౌంటర్కు ప్రతీకారంగా 1983లో మాజీ ఎమ్మెల్యే మద్దెలచెర్వు నారాయణరెడ్డిని అనంతపురంలోని అన్నపూర్ణ లాడ్జి వద్ద పరిటాల శ్రీరాములు వర్గీయులు చంపేశారు. నారాయణరెడ్డిని వెంటాడి, వేటాడి కిరాతకంగా నరికి చంపిన సంఘటన నేటికీ జిల్లా వాసులు మరవలేదు. ఒక తరం అంతం... మలి తరం ఆరంభం పరిటాల శ్రీరాములు, పరిటాల హరి, మద్దెలచెర్వు నారాయణరెడ్డి హత్యలతో ఒక తరం పెద్దలు బలయ్యారు. అప్పటికి నారాయణరెడ్డి కుమారులు సూర్యనారాయణరెడ్డి, రఘునాథరెడ్డిలు చిన్నపిల్లలు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి సమీప బంధువైన సానే చెన్నారెడ్డి అండగా నిలిచారు. 1989లో పెనుకొండ నియోజకవర్గం నుంచి సానే చెన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పరిటాల రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటల్లో కొండపల్లి సీతారామయ్య వర్గంలో దళసభ్యులుగా ఉన్న పోతుల సురేష్కు రవి పరిచయమయ్యారు. వీరితో చమన్ కలిశారు. పరిటాల రవి, పోతలు సురేశ్, చమన్ల త్రయం వీరి వైరీ వర్గీయులను హతమార్చేందుకు పథకం రచన చేశారు. దీంతో జిల్లాలో తిరిగి ఫ్యాక్షన్ జడలు విప్పుకుంది. ఈ క్రమంలో పెనుగొండ ఎమ్మెల్యే సానె చెన్నారెడ్డిని 1991 మే 7న ఆయన స్వగృహంలోనే కాల్చి చంపారు. దీంతో నరమేథం ఆరంభమైంది. చెన్నారెడ్డి వర్గీయులను వారు తుదముట్టించారు. ఈ క్రమంలోనే పరిటాల రవి వర్గం టీవీ బాంబు కుట్రపన్నింది. 1993 అక్టోబరు 24న, మద్దెలచెర్వు సూరి ఇంట్లో టీవీ బాంబును పెట్టి పేల్చివేసింది. ఈ ఘటనలో మద్దెలచెర్వు సూరి తల్లి సాకమ్మ, సోదరుడు రఘునాథరెడ్డి, సోదరి పద్మావతి, చంద్రశేఖర్(7), నారాయణప్పలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సానె చెన్నారెడ్డి కుమారులు ఓబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమణా రెడ్డి కూడా శత్రువుల చేతిలో హతమయ్యారు. ఆర్వోసీతో ఊచకోత పీపుల్స్వార్ నుండి బయటకు వచ్చిన పోతుల సురేష్ రీఆర్గనైజింగ్ కమిటీ(ఆర్వోసీ)ను ప్రారంభించారు. ఆర్వోసీ అండతో పరిటాల రవి తన శత్రువర్గాన్ని ఊచకోత కోశారు. క్రమంలో సూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపై 1997 నవంబర్ 19న హైదరాబాదులో పరిటాల రవిని హత మార్చేందుకు కారు బాంబు ప్రయోగించారు. ఈ ఘటనలో పరిటాల రవి తృటిలో తప్పించుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మద్దెలచెర్వు సూరి 13 ఏళ్లు జైలుశిక్షను అనుభవించారు. ఆ తర్వాత 2005 జనవరి 24న జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట పరిటాల రవిని ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఆ తర్వాత రవి సతీమణి పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2005 నుండి ఎలాంటి గొడవలు లేకుండా జిల్లా ప్రశాంతంగా ఉంది. 2009 డిసెంబరు 29న జైలు నుండి విడుదలైన సూరీ కూడా తాను ఫ్యాక్షన్ చేసే స్థితిలో లేనని, ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నానని పదేపదే వెల్లడించారు. ఈ క్రమంలో ఆర్వోసీ నేత పోతుల సురేశ్ 2010 అక్టోబరు 17న కోర్టుకు లొంగిపోయారు. 2011 జనవరి 3న మద్దెల చెర్వు సూరీని హైదరాబాద్లో కాల్చి చంపారు. పరిటాల రవి, సూరి హత్యలతో రెండో తరం అంతమైంది. ఇలా పరిటాల శ్రీరాములు నుంచి మద్దెల చెరువు సూరీ హత్య వరకూ ఈ రెండు కుటుంబాల మధ్య రేగిన ఫ్యాక్షన్ చిచ్చులో 973మంది బలైన ట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇలా రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ పోరులో వందలమంది ప్రాణాలు కోల్పోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమేమో!! సూత్రధారులతో పాటుపాత్ర ధారులనూశిక్షించాలంటున్న భానుమతి సూరి హత్య తర్వాత భాను కిరణ్ కొన్ని నెలలు కన్పించకుండా వెళ్లిపోయారు. భానునే సూరిని హత్య చేశారని అప్పట్లో పోలీసులు, సూరి అనుచరులు భావించారు. అయితే పరిటాల రవి పెద్దకుమారుడు పరిటాల శ్రీరామ్, విజయవాడకు చెందిన టీడీపీ నేత వల్లభనేని వంశీలే తన భర్త హత్యకు కారకులని సూరీ సతీమణి గంగుల భానుమతి ఆరోపించారు. ఆపై మంగళవారం తన భర్త హత్య కేసు తుదితీర్పు అనంతరం కూడా పరిటాల కుటుంబంపై భానుమతి ఆరోపణలు చేశారు. భానుకు యావజ్జీవశిక్ష విధించడంపై తాను అసంతృప్తిగా ఉన్నానని, ఉరిశిక్ష విధించాలని అన్నారు. అలాగే పాత్ర దారులతో పాటు కుట్రదారులకు కూడా శిక్ష పడాలన్నారు. అంటే పరిటాల కుటుంబీకుల పాత్ర కూడా ఉందని, వారికి శిక్షపడాలని చెప్పకనే చెప్పారు. దీంతో సూరీ హత్యతో పరిటాల కుటుంబీకుల పాత్ర ఉందనే భానుమతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికైనా ‘అనంత’ ఫ్యాక్షన్కు ముగింపు పలకాలని, ఇప్పటి వరకూ సాగిన దారుణకాండ చాలని, అంతా ప్రశాంత జీవితాన్ని కోరుకోవాలని జిల్లా వాసులు కాంక్షిస్తున్నారు. -
నేడే మద్దెలచెర్వు సూరి హత్య కేసులో తీర్పు
సాక్షి, హైదరాబాద్: గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. 2011, జనవరి 3న సూరి, అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్ మధు జూబ్లీహిల్స్ నుంచి సనత్నగర్ వెళ్తుండగా నవోదయ కాలనీ సమీపంలో సూరిపై పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరిపి హతమార్చారు. కేసులో ప్రధాన నిందితుడిగా భానుకిరణ్ అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీగా ఉం టున్నాడు. కేసు దర్యాప్తు చేసిన సీఐడీ ఫోరెన్సిక్ ఆ«ధారాలతోపాటు డ్రైవర్ మధు వాంగ్మూలం ఆధారంగా వాదిస్తోంది. భానుకిరణే సూరిని హత్యచేశాడని, పరిటాల రవి కుటుంబం హస్తం ఉందని సూరి సతీమణి గంగుల భానుమతి ఆరోపిస్తోంది. -
సూరి హత్యకేసు నిందితుడు భానుపై మరోకేసు
సాక్షి, సిటీబ్యూరో : మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్కు 2009 నాటి అక్రమ ఆయుధాల కేసులో శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. ఇతడితో పాటు రాజశేఖర్రెడ్డి, శివప్రసాద్రెడ్డి, వినోద్లనూ దోషులుగా తేల్చి శిక్ష విధించింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు. అసాంఘిక ముఠాలకు అక్రమ ఆయుధాలను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు 2009 మార్చ్ 11న పట్టుకున్నారు. వీరి నుంచి 20 తుపాకులు, 42 తూటాలు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరెస్టు అయిన వారిలో ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్, పదవీ విరమణ చేసిన ఆర్మీ జవాన్తో మద్దెలచెరువు సూరికి అనుచరుడిగా వ్యవహరించిన భాను కిరణ్ సైతం ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం రాంపల్లికి చెందిన పొరెడ్డి రాజశేఖర్రెడ్డి ఈ ముఠాకు నాయకుడు. ఇతను 2007లో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అగ్రికల్చరల్ బీఎస్సీ చేస్తున్న సమయంలో ఫిరోజాబాద్కు చెందిన ఆయుధాల స్మగ్లర్తో పరిచయమైంది. అతని సాయంతో అక్రమ ఆయుధాలు తక్కువ ధరకు సేకరించి, వాటిని రాష్ట్రానికి తరలించి అధిక ధరలకు విక్రయించడం ప్రారంభించాడు. దీనికోసం ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్కు ఓ వ్యక్తి ఆక్రమ ఆయుధం కలిగి ఉన్నాడనే సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ మధ్య మండల బృందం రంగారెడ్డి జిల్లా మాదాపూర్కు చెందిన సోలెం సుబ్బయ్య అలియాస్ సుబ్బును అరెస్టు చేసింది. ఇతని నుంచి ఓ కంట్రీమేడ్ పిస్టల్ను స్వాధీనం చేసుకుంది. సుబ్బును విచారిస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆయుధాలు అక్రమంగా ఎలా సరఫరా అవుతున్నాయనే విషయంపై చిన్న తీగ దొరికింది. దీని ఆధారంగా దర్యాప్తు చేసిన అప్పటి అధికారులైన టాస్క్ఫోర్స్ డీసీపీ వీబీ కమలాసన్రెడ్డి, ఇన్స్పెక్టర్ మద్దిపాటి శ్రీనివాసరావు, ఎస్సైలు ఎన్సీహెచ్ రంగస్వామి, బి.నవీన్రెడ్డి, కె.శ్రీనివాస్, జె.రాంబాబు తమ బృందాలతో నగర వ్యాప్తంగా జల్లెడపట్టారు. బేగంపేట రోడ్లో ఉన్న ట్రాన్సిస్ట్ హోటల్పై బుధవారం దాడి చేసి పొరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన సర్వేష్, సంజయ్ భరద్వాజ్, మహ్మద్ జఫార్, జహంగీర్ ఖాన్ అలియాస్ సమీర్లను పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి భాను కిరణ్, ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేసిన ఎర్ల మాధవయ్య, ముల్లా అబ్దుల్ రవూఫ్, కర్నూ లు జిల్లాకు చెందిన భంగిరాజు, బోనం వినోద్ అలియాస్ చక్రి, కడప జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ జవాన్ కర్ణ శివప్రసాద్రెడ్డిలను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సీఐడీకి బదిలీ అయింది. మొత్తం 13 మంది నిందితులు కాగా... బుధ వారం నలుగురిపై నేరం నిరూపణ అయింది. -
అక్రమంగా ఆయుధాల కేసులో భాను కిరణ్కు ఏడాది జైలు
-
భానుకిరణ్ బ్యారక్ మార్పు
హైదరాబాద్ సిటీ: అనంతపురం కాంగ్రెస్ నాయకుడు గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్డెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ను చర్లపల్లి జైలులో ఒక బ్యారక్ నుంచి మరొక బ్యారక్కు మార్చారు. ప్రస్తుతం ఉంటున్న మానస బ్యారక్ నుంచి మంజీరా బ్యారక్కు మార్చారు. మద్దెల చెరువు సూరి వెంటే నమ్మకంగా ఉంటూ 2010లో కారులో కాల్చి పరారైన సంగతి తెలిసిందే. తర్వాత మహారాష్ట్రలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న సంగతి విదితమే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి
సీఎస్కే బౌలర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో ప్లేయర్గా
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement