-
పబ్జీ ప్రేమకథలో మరో ట్విస్టు.. నువ్వు మాకొద్దు..
ఇస్లామాబాద్: పబ్జీ కారణంగా పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ నుండి తన నలుగురు పిల్లలతో సహా వలసవచ్చిన మహిళ సీమా గులాం హైదర్ తిరిగి పాకిస్తాన్ వస్తే ఊరుకునేది లేదన్నారు ఆమె బంధువులు. హిందువైన యువకుడి కోసం వెళ్ళిపోయిన ఆమె ఇకపై ముస్లిం కాదని పిల్లల్ని మాత్రం వెంటనే పాకిస్తాన్ తిరిగి పంపించేయాలని డిమాండ్ చేశారు. కరోనా ప్రేమ.. కరోనా సమయంలో యావత్ప్రపంచమంతా బిక్కు బిక్కుమంటూ గడువుతోంటే పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, భారత్ కు చెందిన సచిన్ మీనా మాత్రం హాయిగా ప్రేమలో మునిగి తేలారు. పబ్జీ ద్వారా మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. అప్పటికే ఆ మహిళకు పెళ్ళై నలుగురు పిల్లలున్నా కూడా ప్రియుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చే సాహసం చేసింది. వెళ్ళను గాక వెళ్ళను.. జులై 4న గ్రేటర్ నోయిడాలోని ప్రియుడు సచిన్ మీనాను చేరుకున్న సీమా హైదర్ పై అక్రమ చొరబాటు కేసు నమోదైన విషయం, ఆ కేసులో ఆమెకు బెయిల్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి కథ సుఖాంతమవడంతో సీమా ఇకపై నేను హిందువునని, తిరిగి పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని తెగేసి చెప్పేసింది. మాక్కూడా నువ్వొద్దు.. తాజాగా ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ఎప్పుడైతే హిందువుని వెతుక్కుంటూ వెళిపోయిందో అప్పుడే ఆమెతో సంబంధం తెగిపోయిందని, తను ఇప్పుడు ముస్లిం కాదని చెప్పారు. కానీ నలుగురు పిల్లలను వంటనే వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో ఆమె నివాసమున్న ఇంటి యజమాని కుమారుడు నూర్ మహమ్మద్ మాట్లాడుతూ.. గులాం హైదర్ అనే వ్యక్తితో సీమాకు పదేళ్ల క్రితం పెళ్లయిందని, ఆయన సౌదీలో పనిచేస్తుంటాడని ఆమె మాత్రం మూడేళ్ళుగా ఇక్కడ పిల్లలతో ఒంటరిగా ఉండేదన్నారు. వాళ్ళ మామయ్యగారు ఇక్కడికి చాలా దూరంగా ఉంటారని తెలిపారు. ఇది కూడా చదవండి: అసలు పుట్టేవాళ్లే తక్కువ.. మళ్లీ నియంత్రణ గోల ఏంటి? -
ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్
సాక్షి, తాడేపలి: ప్రకాశం బ్యారేజీ వద్ద నర్సింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన తన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదన్నారు. మహిళలు అర్ధరాత్రి కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే.. నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు గట్టిగా నమ్మే వ్యక్తిని తానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల కోసం దిశ, అభయం యాప్లతో పాటు వారి రక్షణ కోసం దిశ చట్టం చేశాం అన్నారు సీఎం జగన్. మహిళల రక్షణకై దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించాం.. మహిళల కోసం ప్రత్యేకంగా 900 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే డీజీపీ డి.గౌతం సవాంగ్ను సీఎం జగన్ సోమవారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్ -
అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్/గుంటూరు ఈస్ట్: గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో శనివారం రాత్రి నర్సింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. డీజీపీ డి.గౌతం సవాంగ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు బాధితురాలిని పరామర్శించి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తానేటి వనితను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలావుండగా.. ఇప్పటికే పోలీస్ శాఖ ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఘటనపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందిస్తూ.. అత్యాచారం చేసినవారు ఎంతటి వారైనా గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. ఇటువంటి అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిందితులకు కఠిన శిక్ష తప్పదు కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సోమవారం పరామర్శించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అనేక చట్టాలు చేస్తున్నా ఉన్మాదులు బరి తెగిస్తున్నారన్నారు. పుష్కర ఘాట్లో నిఘా పెంచుతున్నామని, అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తానేటి వనిత మాట్లాడుతూ బాధితురాలిని పరామర్శించి భరోసా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమను పంపించారని తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాల్సిందిగా ఆదేశించారన్నారు. తమ శాఖ నుంచి రూ.50 వేలు ఇస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా.. బాధితురాలిని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తులో పురోగతి ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. సోమవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు కలిసి కొంతమంది అనుమానితులను విచారించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించామని చెప్పారు. తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ చేపట్టామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం వచ్చిందని, ఇందుకు కారణమైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసేంతవరకు వివరాలు వెల్లడించబోమని పేర్కొన్నారు. మరో 24 గంటల్లో కేసును పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. కృష్ణా తీరంలో గతంలోనే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, 19న పోలీసులందరూ హడావుడిగా ఉండటంతో అక్కడ ఆ రోజు నిఘా కొరవడిందన్నారు. గత 15 రోజుల వ్యవధిలో కృష్ణా తీరంలో మద్యం, గంజాయి సేవిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని చెప్పారు. పుష్కర ఘాట్లోకి రాత్రి 9 గంటల తరువాత ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఆహ్లాదకరమైనది కావడం, కృష్ణా నదిపై మూడు రైల్వే బ్రిడ్జిలు ఉండటం, నిర్జన ప్రదేశం కావడంతో అసాంఘిక శక్తుల కదలికలు ఎక్కువయ్యాయన్నారు. వారిని నివారించేందుకు రైల్వే పోలీసులతో సంయుక్త కార్యాచరణ రూపొందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు, యువతుల భద్రతకు సీఎం ఆదేశాలు నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఘటన కేసులో దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను గుర్తించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. దిశ చట్టంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిందితులను గుర్తించి శిక్ష పడేట్టుగా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని, ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారని వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నది పరిసరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారని తెలిపారు. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నానని.. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని డీజీపీ చెప్పారు. పాత నేరస్తుల పనేనా! పోలీసులు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులూ తాడేపల్లి ప్రాంతానికి చెందిన వారేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులు బ్రిడ్జి వద్ద రైళ్లు ఆగి.. బయలుదేరే సమయంలో ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు, మెడలో చైన్లు లాక్కొని పరారయ్యే బృందంగా తెలియవచ్చింది. ఇందులో ఓ యువకుడికి పడవ నడిపే అనుభవం ఉంది. మరో యువకుడు రెండేళ్ల క్రితం ఓ హత్య కేసులో నిందితుడని సమాచారం. పడవ నడిపే అనుభవం ఉన్న వ్యక్తి బందరు బీచ్లో ప్రేమ జంటపై దాడి చేయగా అక్కడ కూడా కేసు నమోదైనట్టు చెబుతున్నారు. చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం
సాక్షి, గుంటూరు/తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర్ ఘాట్ సమీపంలో శనివారం రాత్రి ఓ యువతి అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియుడితో కలిసి కృష్ణా నది ఒడ్డున సేదతీరేందుకు వెళ్లిన ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి జరిపారు. యువకుడిని బంధించి, యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు. విజయవాడ గాంధీనగర్లోని పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఓ యువకుడు, నర్సుగా పనిచేస్తున్న యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడింది. శనివారం రాత్రి 9 గంటలకు ఆ జంట కృష్ణా నది ఒడ్డున సీతానగరం రైల్వే బ్రిడ్జి దిగువన గల పుష్కర్ ఘాట్కు వచ్చి మాట్లాడుకుంటుండగా.. ఇద్దరు దుండగులు దాడికి పాల్పడి యువకుడిని బంధించి.. యువతిని పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం వారివద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకుని పడవలో నది మీదుగా పరారయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రేమజంట ప్రకాశం బ్యారేజి వద్దకు చేరుకుని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు విషయం చెప్పారు. అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు, మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి సీఐ శేషగిరిరావు రంగంలోకి దిగి.. బాధితురాలిని చికిత్సకు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. సెల్ టవర్ లొకేషన్స్, సీసీటీవీ ఫుటేజ్లు, బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోందని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. -
పెళ్లికి నిరాకరించిందని ప్రేమోన్మాది దారుణం
సాక్షి, జగిత్యాల క్రైం: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన యువతి(25), అదే గ్రామానికి చెందిన కట్కం రాజ్కుమార్ స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇంటర్ తర్వాత రాజ్కుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. యువతి ఇక్కడే ఉంటూ పీజీ చేస్తోంది. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. యువతి మెడకు తగిలిన గాయం ఇరవైరోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చి... ఇరవై రోజుల క్రితం రాజ్కుమార్ దుబాయ్ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. యువతిని కలిసేందుకు అతడు విఫలయత్నం చేశాడు. ఫోన్ చేసినా సరిగా స్పందించకపోవడమేకాకుండా తనతో పెళ్లికి నిరాకరించిందని కోపం పెంచుకున్నాడు. ఆగ్రహంగా ఉన్న రాజ్కుమార్ శనివారం మధ్యాహ్నం జాబితాపూర్కు చేరుకున్నాడు. యువతి ఇంట్లోకి వెళ్లి కత్తితో ఆమె మెడ, వీపుపై దాడి చేశాడు. యువతి తప్పించుకొని, కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చేసరికి అతడు అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రాజ్కుమార్ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన యువతి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడి సెల్ఫోన్లో ఉన్న మెసేజ్లు, కాల్డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నమ్మలేకపోతున్నాం... రాజ్కుమార్ మృతితో మేడిపల్లి మండలం మన్నెగూడెంలో విషాదం నెలకొంది. అందరితో కలిసిమెలిసి ఉండే యువకుడు క్షణికావేశానికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దీనిని తాము నమ్మలేకపోతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. రాజ్కుమార్కు ఒక సోదరి ఉంది. ఆమె వివాహం కాగా, తల్లిదండ్రులకు అతడు ఒక్కగానొక్క కొడుకు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement