-
రుణమాఫీపై మరో డ్రామా
రుణమాఫీ జరగని రైతులతో ప్రభుత్వం మరోమారు చెలగాటం ఆడనుంది. తనిఖీల పేరుతో తప్పులను చూపెట్టి వారి గొంతు నొక్కే ప్రయత్నానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారి కోపాన్ని చల్లార్చేందుకు ఇదో ఎత్తుగడగా ఎంచుకుంది. బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదాల వల్లే తాము అర్హత కోల్పోయామని రైతులు గగ్గోలు పెడుతున్నా సర్కారు చెవులకెక్కడం లేదు. కేవలం కారణాలను చూపి వెనక్కు పంపేందుకు మాత్రమే మరోసారి వినతుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. చిత్తూరు అగ్రికల్చర్: గత ఎన్నికల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ ప్రకటించి అధికారం చేపట్టింది. తీరా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక రుణమాఫీకి సవాలక్ష ఆంక్షలు విధించింది. నిబంధనలతో రైతులను ముప్పుతిప్పలు పెట్టింది. మాఫీ అవుతుందని కలలుగన్న రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. 2013 డిసెంబరు నాటికి జిల్లాలో 8,69,721 మంది రైతులు రూ.7,693.75 కోట్ల మేరకు బ్యాంకులకు రుణపడి ఉన్నారు. అందులో మాఫీకి విధించిన ఆంక్షల వడపోతలో 3,87,630 మంది రైతులకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని తేల్చింది. కేవలం రూ.1,430 కోట్ల మేరకే మాఫీ కిందకు తీసుకువచ్చింది. ఈ రుణాలను కూడా ఐదు విడతల్లో మాఫీ చేసేవిధంగా ప్రణాళికలు రూపొం దించింది. ఇప్పటివరకు మూడు విడతలుగా రూ.1,126 కోట్లు మాఫీ చేసింది. మరో రూ.304 కోట్లు చేయాల్సి ఉంది. అర్హత ఉన్నా.. రుణమాఫీలో అర్హత ఉన్నా బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాల వల్ల సగానికి పైగా రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. వారంతా ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం తప్పులుంటే సరిదిద్దుతామని చెప్పింది. రుణమాఫీ జాబితాలో లేని వారు వివరాలను అందించాలంటూ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను పెట్టింది. దీంతో రుణాలు మాఫీ అవుతాయని ఆశతో చాలామంది తమ వివరాలను అధికారులకు నివేదించారు. వీరి ఫిర్యాదులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రతి సోమవారమూ ప్రజావాణిలో రైతుల ఫిర్యాదులకూ ఇంతవరకు అతీగతీ లేదు. మరోమారు ఆశల ఎర.. రుణమాఫీ జరగక ఆగ్రహంతో ఉన్న రైతులలో సర్కారు మరోమారు ఆశలను రేకెత్తిస్తోంది. ఈ నెల 11, 12 తేదీల్లో మరోమారు వినతులివ్వాలని చెబుతోంది. ఇందుకోసం ప్రత్యేక ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. చిత్తూరులోని నాగయ్య కళక్షేత్రంలో నిర్వహించే కేంద్రానికి అమరావతి రైతు సాధికార సంస్థ నుంచి కొందరు సిబ్బంది హాజరవుతారు. ఫిర్యాదులను మరోమారు పరిశీలిస్తారని చెబుతున్నారు. గతంలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికా రుల తప్పిదాల వల్లే తాము రుణమాఫీ అర్హతకు దూరమయ్యామనే భావన రైతుల్లో ఉంది. నాలుగున్నరేళ్లుగా వాటిని సరిదిద్దిన పాపాన పోలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ తమలో ఆశలు కల్పించేందుకు ఈ కేంద్రం నిర్వహిస్తున్నారని కొందరు రైతులు విమర్శిస్తున్నారు. ఫిర్యాదుల కేంద్రంలో బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో తప్పులను సరిదిద్దాలని వీరు కోరుతున్నారు. ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోకుండా ఫిర్యాదు కేంద్రంలో బ్యాంకర్లు లేకుండానే రైతుల తప్పులను చూపెట్టి గొంతు నొక్కడమే పనిగా పెట్టుకుంది. ఇదో కంటితుడుపు చర్యగా ఇప్పటికే బాధిత రైతాంగం గుర్తించింది. మా ఊళ్లో ఎవరికీ వర్తించలేదు మా గ్రామంలో 2009లో 16మంది రూ.50వేలు లోపే పుంగనూరు ఎస్బీఐ బ్యాంకులో పం ట రుణాలు తీసుకున్నాం. ఒక్కరికీ రుణమాఫీలో అర్హత రాలేదు. నాలుగేళ్లుగా అధికారులకు విన్నవిన్తున్నాం. విజయవాడకు వెళ్లాం. రాష్ట్ర రైతు సాధికార సంస్థలో కూడా కోరాం. బ్యాంకర్లు, అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతున్నారే తప్ప మాఫీ చేయడం లేదు. వినతులకే ఒక్కొక్కరికి రూ.4వేలు చొప్పున ఖర్చు అయ్యింది. బి.నారాయణరెడ్డితో పాటు బాధిత రైతులు, పెద్దపంజాణి -
గిరిజనేతరుల రుణమాఫీకి వంద కోట్లు: సీఎం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజనేతరులకు రుణమాఫీ వర్తింప చేస్తామని, అందుకోసం రూ. 100 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీయిచ్చారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నకు సీఎం ఈ హామీ ఇచ్చారు. బంగారం రుణాలకు గాను ప్రభుత్వం డబ్బు చెల్లించినా బ్యాంకులు ఆ బంగారాన్ని ఆడపడుచులకు ఇవ్వడంలేదని రేవంత్రెడ్డి (టీడీపీ) చెప్పగా, విడిపించే ప్రయత్నం చేస్తామని కేసీఆర్ బదులిచ్చారు. సమావేశాలు ముగిసేలోగా కరవు మండలాలను ప్రకటిస్తామన్నారు. -
రైతుల కోసం కలసి పోరాడుదాం రండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఐ, సీపీఎం నాయకులను కోరారు. ఆంధ్రప్రదేశ్ సీపీఐ, సీపీఎం కార్యదర్శులు రామకృష్ణ, మధులతో జగన్ మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ సీపీ ఆందోళనలను నిర్వహించనుంది. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలపుడు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలో వచ్చాక షరతులు పెట్టిన సంగతి తెలిసిందే. ఒక్కో కుటుంబంలో ఎన్ని రుణాలున్నా లక్షన్నర వరకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని వైఎస్ఆర్ సీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement