-
కామెర్ల వ్యాధి రకాలు: లివర్ని కాపాడే బెస్ట్ ఫుడ్ ఇదిగో!
మన బాడీలో పవర్ హౌస్ లివర్. లివర్ పనితీరు దెబ్బ తింటే అనే అనారోగ్యాల బారిన పడతాం. కాలేయం దెబ్బతింటే వచ్చే కామెర్ల వ్యాధి నాలుగు రకాలుగా ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా మాత్రం ఈ వ్యాధిని నిర్ణయిస్తారు. వ్యాధి నిర్దారణ ఆధారంగా చికిత్స ఉంటుంది. ప్రీహెపాటిక్: రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరిగితే, దానిని ప్రీహెపాటిక్ కామెర్లు అంటారు. హెపాటిక్ : కాలేయం బిలిరుబిన్ను ఉత్పత్తి చేయలేకపోతే దానిని హెపాటిక్ కామెర్లు అంటారు. పోస్ట్థెపాటిక్: బిలిరుబిన్ పేరుకుపోవడం, శరీరం తొలగించలేకపోవడాన్ని పోస్ట్థెపాటిక్ కామెర్లు అంటారు. అబ్స్ట్రక్టివ్:.పాంక్రియాటిక్ వాహిక మూసుకుపోయినపుడు వచ్చిన కామెర్లను అబ్స్ట్రక్టివ్ కామెర్లుగా పిలుస్తారు. నవజాత శిశువులు కూడా జాండిస్ బారిన పడతారు. దీనికి ‘ఫోటోథెరపీ’ ట్రీట్మెంట్ ద్వారా నయం చేస్తారు లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు లివర్ ఆరోగ్యాన్ని సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రందించాలి. టీ: బ్లాక్ టీ, గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల లివర్కి బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది లివర్ ఫ్యాట్ కూడా కరుగుతుంది. రోజూ ఒక కప్పు కాఫీ తీసుకున్నా మంచిదే. టోఫు : సోయాతో తయాయ్యే టోఫు కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సోయా బీన్స్తో సొయా నట్స్ వంటివి కూడా తీసుకోవచ్చు. పండ్లు : ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్, ద్రాక్ష వంటివి తీసుకుంటే లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్లో కొవ్వు పేరుకుపోకుండా విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ వంటివి కూడా తీసుకోవచ్చు. ఓట్స్ , నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా బీన్స్, గింజలు వంటివి కూడా తీసుకో వచ్చు. విటమిన్-ఇ సమృద్ధిగా నట్స్తో ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. కూరగాయలు : బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర కూరలతో లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా నాన్-ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య నుండి కూడా బయట పడొచ్చు. పాలకూర వంటి వాటిలో గ్లూటాతియోన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నోట్: లక్షణాలు చూసి బయపడిపోకుండా, వైద్యులను సంప్రదించి, రక్త, మూత్రం, తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షల ఆధారంగా చికిత్స తీసుకోవాలి. సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మద్య పానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. -
ఆల్కహాల్ తాగని వారిలోనూ లివర్ సమస్యలు.. అదొక్కటే పరిష్కారం
కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇది సక్రమంగా పనిచేస్తేనే శరీరం కూడా అదుపు తప్పకుండా ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం సహాయపడుతుంది. అందుకే కాలేయ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి, కాలేయాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అన్నది ఈ స్టోరీలో చదివేద్దాం. మన శరీరావయవాల్లో పునరుత్పత్తి అయ్యే ఒకేఒక అవయవం కాలేయం. అందుకే వైద్యులు దీనిని ఫ్రెండ్లీ ఆర్గాన్ అని పిలుస్తారు. అటువంటి కాలేయాన్ని మనం ఒక మంచి స్నేహితుడిలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఏం కాదులే అని అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ప్రమాదం దాపురించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత్లో ప్రతి ఏటా దాదాపు పది లక్షల మంది లివర్ సమస్యల బారిన పడుతున్నారు. వారిలో లివర్ సిర్రోసిస్ కేసులు కూడా ఉంటున్నాయని వైద్యులు చెపుతున్నారు. ఆహారపు అలవాట్లు కారణంగా ప్రతి వంద మందిలో 60 మందికి ఫాటీ లివర్ ఉంటుండగా, 15 శాతం మందిలో గాల్బ్లాడర్లో రాళ్లు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. లివర్ సిర్రోసిస్కు గురైన వారిలో ఆల్కహాల్ తాగే వారితో పాటు, ఆల్కాహాల్ తాగని వారు సైతం ఆ వ్యాధికి గురవడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి లివర్ సమస్యలు ఎక్కువగా మధుమేహులు, హోపోథైరాయిడ్ ఉన్న వారు, హెపటైటీస్ సి, రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలు అబ్నార్మల్గా ఉన్న వారిలో వస్తున్నాయి. ఫాటీలివర్ కామన్గా భావించి అశ్రద్ధ చేస్తుండటంతో అది కాస్తా సిర్రోసిస్కు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫాటీలివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చునని, కానీ సిర్రోసిస్కు దారితీస్తే లివర్ గట్టిపడి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదని, లివర్ ఫంక్షన్లో తేడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ఒక్కటే మార్గమని అంటున్నారు. 40ఏళ్లు దాటితే.. శారీరక శ్రమలేని జీవన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. దానికి తోడు ఫాట్ ఎక్కువగా ఉన్న జంక్ఫుడ్స్ తింటున్నారు. దీంతో శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి, లివర్పై ప్రభావం చూపుతున్నాయి. వయస్సు 40 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలస్ట్రాల్ లెవల్స్, థైరాయిడ్, షుగర్ పరీక్షలతో పాటు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించుకుంటే మంచిది. ఇప్పుడు లివర్ పనితీరును కచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రో స్కాన్ అందుబాటులోకి వచ్చింది. ఆయా పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు. లివర్ వ్యాధులకు కారణాలివే... శ్రమ లేని జీవన విధానం ఆహారపు అలవాట్లు పెరుగుతున్న మధుమేహులు ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినడం ఆల్కహాల్ వ్యసనం ఫాటీ లివర్ను అశ్రద్ధ చేయొద్దు పెరుగుతున్న లివర్ సిర్రోసిస్ కేసులు ఏడాదికోసారి పరీక్షలు తప్పనిసరి వీటికి దూరంగా ఉండాలి ►మంచి పోషకాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ► మద్యానికి దూరంగా ఉండాలి. అతిగా ఆల్కహాల్ తాగేవారిలో కాలేయం త్వరగా పాడవుతుంది. ► కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనెలో బాగా వేయించిన పదార్థాలు అతిగా తినొద్దు. ► చేపలు, అవిసె గింజలు, అక్రోట్లు,పొట్టుతీయని ధాన్యాలు వంటివి డైట్లో ఉండేలా చూసుకోవాలి. ► చక్కెర ఎక్కువగా ఉండే కూల్డ్రింకులు, పానీయాలకు దూరంగా ఉండాలి. ► ప్రాసెస్ చేసిన పిండి, ధాన్యాలను అస్సలు తీసుకోవద్దు. ఇవి పాటిస్తున్నారా? వాల్ నట్స్, ఆలీవ్ ఆయిల్, అవకడోస్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది నీరు ఎక్కువ తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు,గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లివర్ సమస్యలు పెరిగాయి ఇటీవల కాలంలో కాలేయ సమస్యలతో వస్తున్న వారిని ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు ఆల్కహాల్ తాగే వారిలోనే లివర్ సిర్రోసిస్ వ్యాధి సోకేది. కానీ ఇప్పుడు కొలస్ట్రాల్ కారణంగా నాన్ ఆల్కహాలిస్టుల్లో కూడా సిర్రోసిస్ చూస్తున్నాం. ప్రతిరోజూ వ్యాయామంతో పాటు, ఆహార నియమాలు పాటిస్తూ, శరీరంలో కొలస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. – డాక్టర్ బీఎస్వీవీ రత్నగిరి, అసోసియేట్ ప్రొఫెసర్, గాస్ట్రో ఎంట్రాలజీ -
బాలిక లివర్ మార్పిడికి సీఎం సహాయ నిధి సాయం
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని డిప్యూటీ సీఎం అంజద్బాషా సోదరుడు, హరూన్ గ్రూప్ సంస్థల ఎండీ ఎస్బి అహ్మద్బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కడప నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక సయ్యద్ షబానా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సీఎం సహాయ ని«ధి నుంచి మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి అందజేశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న సయ్యద్ షబానా చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారని చెప్పారు. అంత ఖర్చు భరించలేని బాలిక కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం అంజద్బాషాను ఆశ్రయించడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడి సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స వ్యయం రూ.17.50 లక్షలు మంజూరు చేయించారన్నారు. డిప్యూటీ సీఎం అందుబాటులో లేనందున ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి తాను అందిస్తున్నట్లు వివరించారు. షబానా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తన లివర్ను దానం చేస్తున్న బాధితురాలి తల్లితోపాటు శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలియచేశారు. -
పసి ప్రాణానికి అండగా ‘సీఎం సహాయనిధి’.. రూ.10 లక్షలు మంజూరు
గన్నవరం రూరల్: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ అండగా నిలిచింది. గంటల వ్యవధిలోనే ఆపరేషన్కు అవసరమైన రూ.10 లక్షలు మంజూరు కావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడేనికి చెందిన మెట్లపల్లి రాఘవరావు వ్యవసాయ కూలీ. అతని భార్య నాగలక్ష్మి గృహిణి. వీరికి గతేడాది నవంబర్ 6న మగబిడ్డ జన్మించాడు. అయితే బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించి చివరికి హైదరాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, రూ.10 లక్షలకు పైగానే ఖర్చవుతుందని, వెంటనే చేయకపోతే ప్రమాదమని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం ఇక చేసేది లేక చంటి బిడ్డతో ఇంటికి తిరిగొచ్చేశారు. సోమవారం గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామ వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రూ.10 లక్షలు మంజూరు వైఎస్సార్సీపీ నేతలు బాలుడి విషయాన్ని ఫోన్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రెయిన్బో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి చిన్నారి చికిత్సకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి వివరాలు పంపి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. కేవలం గంటల వ్యవధిలో చిన్నారి చికిత్సకు రూ.10 లక్షలు మంజూరు కావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంజూరైన రూ.10 లక్షల చెక్కును బుధవారం వీరపనేనిగూడెం గ్రామ సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మేచినేని బాబు, పడమట సురేష్, కైలే శివకుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్రాణి, సర్పంచ్ జేజమ్మ, ఎంపీటీసీ పద్మావతి, ఉప సర్పంచ్ నాగసాంబిరెడ్డి, సహకార బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు బాధిత కుటుంబానికి అందించారు. -
ఆస్పత్రిలో దృశ్యం దర్శకుడు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ని మొదలుపెట్టారాయన. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్కి దర్శకత్వం వహించారు నిషికాంత్. ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారాయన. అంతేకాదు.. ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. జాన్ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ సినిమాలో విలన్ గానూ కనిపించారాయన.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement