రూట్ మార్చిన మారుతి
టాలీవుడ్ లో యూత్ సినిమాల స్పెషలిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు మారుతి.. చేసినవి తక్కువ సినిమాలే అయినా తన కంటూ ప్రత్యేక మైన గుర్తింపు సంపాదించుకున్నాడు. మారుతి మార్క్ సినిమా అంటే సీన్స్ నుంచి డైలాగ్స్ వరకు అన్నింట్లో కాస్త హద్దుల దాటుతుంటారన్న టాక్ ఉంది. అందుకే ఇప్పటి వరకు ఈ బ్రాండ్ మీద వచ్చిన సినిమాలను ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే ఆదరిస్తూ వస్తున్నారు.
అయితే తాజాగా మారుతి రూట్ మార్చాడు. ఇన్నాళ్లు తన మీద ఉన్న అపవాదు చెరిపేసుకోవలని భావిస్తున్నాడు.. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన కొత్త జంట సినిమా సమయంలోనే ఈ ప్రయత్నం చేసిన ఆ సినిమా సక్సెస్ కాకపోవటంతో పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో తాజాగా నాని హీరోగా తెరకెక్కిన భలే భలే మొగాడివోయ్ సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నాడు.
అందుకే ఈ సినిమాలో ఎలాంటి అభ్యంత్రకర సన్నివేశాలు, డైలాగ్ లు లేకుండా చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు. దీంతో మారుతి కెరీర్ లోనే తొలిసారిగా ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ ను ఇచ్చింది సెన్సార్ బోర్డ్.. తెలుగు సినిమాను గౌరవంగా చూడాలనుకుంటున్న వారికి ఇది మంచి వార్తే అయినా, ఇన్నాళ్లు మారుతి మార్క్ సినిమాలను ఎంజాయ్ చేస్తున్న వారిని మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే విషయమే.