-
నగరంలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో జరిగిన తనిఖీలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు దాడులు ప్రారంభించాయి. కోకాపేటలోని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తోడల్లుడు, రియల్ ఎస్టేల్ వ్యాపారి గిరిధర్రెడ్డి ఇంట్లో సోదాలు చేశాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్హౌసుల్లో తనిఖీలు చేపట్టాయి. బాలాపూర్లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో, బాలాపూర్ గణపతి లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. సీఆర్పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఇవి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో ఇద్దరి ఇళ్లపై దాడి తుక్కుగూడ సమీపంలో కేఎల్ఆర్ అక్బర్ ఫాం హౌస్లోని ఇంట్లో, ఆయన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాసానిగూడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో, చర్లపల్లి, మొయినాబాద్ ఫామ్ హౌసుల్లో, గచ్చిబౌలి ఎన్సీసీలోని విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం ఐదు గంటలకు మూడు ప్రైవేటు వాహనాల్లో ఐటీ అధికారులు కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. కొద్దిపాటి నగదు సహా కీలక డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. కేఎల్ఆర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందడంతో పాటు, ఆదాయం, పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం కనిపించడం, ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా, నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లో ఉన్న కుమార్తె నుంచి మొబైల్ ఫోన్ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇంట్లో లభించిన బ్యాంక్ పాస్బుక్కులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. మరోవైపు కొందరు అధికారులు మేయర్ను తిరుపతిలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా సాయంత్రానికి నగరానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.56కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నర్సింహారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు. గత కొంతకాలంగా వారు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. కాగా మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో పారిజాత కూడా ఉన్నారు. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాతల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కోకాపేట హిడెన్ గార్డెన్లో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తోడల్లుడు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గిరిధర్రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని హిడెన్ గార్డెన్లో ఆయన నివాసం ఉంటున్నారు. గిరిధర్ రెడ్డి గత కొంతకాలంగా చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరోవైపు బాలాపూర్కు చెందిన వ్యాపారవేత్త వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగాయి. ఈ సమయంలో లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు.. లక్ష్మారెడ్డి అన్న కొడుకు 3 రోజుల క్రితం మరణించడంతో అస్తికలు గంగలో కలిపేందుకు బయలుదేరుతున్నారు. దీంతో లక్ష్మారెడ్డితో కొద్దిసేపు మాట్లాడిన అధికారులు ఓ కాగితంపై సంతకం తీసుకుని ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిసింది. రాజకీయ కక్షలో భాగంగానే..: కేఎల్ఆర్ ♦ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇల్లు, కార్యాలయాలు, తన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించిన తరువాత, ఉద్దేశపూర్వకంగా ఈ సోదాలు చేస్తున్నారని చెప్పారు. మంత్రి సబిత ప్రోద్బలంతోనే..: మేయర్ పారిజాత కాంగ్రెస్ పార్టీ బీ ఫాం కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది. మంత్రిగా ఆమె వేల కోట్లు సంపాదించారు. ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆమె ఇంటిపై దాడులు చేయకుండా కేవలం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నాపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?. -
చంద్రబాబు మద్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం
-
ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్: ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో నిర్మించిన పీఆర్టీయూ సంఘ భవనాన్ని ఎమ్మెల్సీ కె.జనార్దన్రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయని, ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయో అని ఆలోచించటం సరైంది కాదన్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి దళితబంధు ప్రవేశపెడితే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. -
‘మంచి పాలనకు నిదర్శనాలు ఇవే’
సాక్షి, విశాఖపట్నం: మద్య సేవనం మనిషిలో పశుత్వాన్ని నిద్రలేపుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గాంధీసెంటర్, జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో విశాఖ ద్వారకానగర్ గ్రంథాలయంలో శుక్రవారం మద్య విమోచన ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ మద్య విమోచన కమిటీ ఛైర్మన్ వి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ‘మద్యం వద్దు.. కుటుంబం ముద్దు పోస్టర్’ను ఈ సందర్భంగా మంత్రి అవంతి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్య నిషేధం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పడిపోయినా లెక్క చేసేది లేదని.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సృష్టం చేశారు. మద్యపాన నిషేధానికి అంతా సహకరించాలి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎన్ శర్మ పిలుపునిచ్చారు. నగరంలో మద్యం బ్లాక్ విక్రయాలపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. మద్యం విక్రయాలకు ఆధార్తో అనుసంధానం చేస్తే మైనర్లకు మద్యం అందే అవకాశం ఉండదని సూచించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రస్తుతించారు. మహోద్యమం కావాలి.. విశ్రాంత డీజీపీ వాసుదేవరావు మాట్లాడుతూ.. మద్య విమోచన ఉద్యమం మహోద్యమం కావాలని పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలన, మద్యపాన నిషేధం వంటి నిర్ణయాలు వైఎస్ జగన్ చేస్తోన్న మంచి పాలనకు నిదర్శనమన్నారు. వీటినే సామాన్యులు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, గాంధీ సెంటర్ అధ్యక్షులు ప్రొఫెసర్ బలమొహన్ దాస్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి, మత్స్యకార నేత జానకి రామ్, ఎక్సైజ్ డీసీ శ్రీనివాసరావు, న్యాయ సలహాదారు రామకృష్ణ రావు, సమన్వయ కర్త సురేష్ బేత తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో అందుబాటులోకి ఎయిమ్స్ సేవలు
సాక్షి, హైదరాబాద్: సాధ్యమైనంత వరకు నిర్ణీత గడువు కంటే ముందే ఎయిమ్స్ వైద్య సేవలు రాష్ట్ర ప్రజలకు అందుతాయని వైద్య, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మా రెడ్డి పేర్కొన్నారు. ఎయిమ్స్ సేవలను వేగంగా అందించేందుకే దాదాపు నిర్మాణం పూర్తయిన బీబీ నగర్ నిమ్స్ ఆçస్పత్రిని ఎయిమ్స్కి అప్పగించామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించిందని, సీఎం కేసీఆర్, ఎంపీలు, నాడు మంత్రిగా తాను అనేక సందర్భాల్లో చేసిన ప్రయత్నాల ఫలితం గా ఎయిమ్స్ వచ్చిందని గుర్తుచేశారు. ఎయి మ్స్కి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్రానికి, ప్రధానిని కలసి తీవ్రంగా ప్రయత్నించిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎయిమ్స్ని ప్రకటించిన కేంద్రం తెలంగాణను విస్మరించిందని పేర్కొన్నారు. దీంతో అప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డాలను కలిశానని గుర్తు చేశారు. నడ్డా ఇక్కడకు వచ్చిన సమయంలోనూ ఎయిమ్స్ కోసం లేఖలు ఇచ్చామని తెలిపారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి తెలంగాణ ఎయిమ్స్ కోసం విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ఎయిమ్స్ ఇవ్వాలని అనేక సందర్భాలలో పట్టుబట్టారని గుర్తుచే శారు. కేంద్ర మంత్రివర్గం సోమవారం బీబీనగర్ నిమ్స్ ఉన్న చోటే ఎయిమ్స్కి పచ్చజెండా ఊపడంపై సంతోషం వ్యక్తం చేశారు. తొలిదశ పనులు ఈ ఏడాదిలోపే ప్రారంభమవుతాయని, ఈ లోగా ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దీని కోసం నోటిఫికేషన్ వేశారని, ఓపీనీ త్వరగా ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement