-
కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల..
సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. ఇవి చదవండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం! -
9 రోజుల్లో తీసిన 'క్రాంతి' సినిమా రివ్యూ
టైటిల్: క్రాంతి నటీనటులు: రాకేందు మౌళి, ఇనయ సుల్తానా, శ్రావణి, యమునా శ్రీనిధి, కార్తిక్, భవాని తదితరులు డైరెక్టర్: వి.భీమ శంకర్ ఎడిటర్: కేసీ హరి మ్యూజిక్ డైరెక్టర్: గ్యాన్ సింగ్ సినిమాటోగ్రాఫర్: కిషోర్ బొయిదాపు ప్రొడ్యూసర్: భార్గవ్ మన్నె బ్యానర్: స్వాతి పిక్చర్స్ విడుదల తేదీ: మార్చి 3, 2023 రాకేందు మౌళి నటుడు మాత్రమే కాదు సింగర్, రైటర్, లిరిసిస్ట్ కూడా! నిఖిల్ 'కిరిక్ పార్టీ', నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', సూపర్ ఓవర్ సినిమాల్లో అతడు సపోర్టింగ్ యాక్టర్ గా చేసి మెప్పించాడు. అటు హీరో గాను కొన్ని సినిమాలు చేశాడు. తాజాగా ఆయన వి. భీమ శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'క్రాంతి'. భార్గవ్ మన్నే నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఆహా'లో మార్చి 3న విడుదలైంది. మరి ఈ సినిమా జనాలను ఏమేరకు మెప్పించిందో చూద్దాం.. కథ 'రామ్'(రాకేందు మౌళి) చురుగ్గా ఉండే వ్యక్తి. భవిష్యత్తులో పోలీస్ కావాలనేదే తన లక్ష్యం. రామ్ ప్రేయసి 'సంధ్య'(ఇనయా సుల్తానా) తన తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడమని కోరుతుంది. పెళ్లి సంబంధం కోసం బయలుదేరిన రామ్.. సంధ్య మృతదేహం చూసి తల్లడిల్లిపోతాడు. కట్ చేస్తే ఏడాది తరువాత 'రామ్ కుటుంబానికి' తెలిసిన 'రమ్య' (శ్రావణి) అమ్మాయి మిస్ అవుతుంది. ఒకప్పుడు ఆమె రామ్ చేతికి రాఖీ కూడా కట్టింది. అప్పటికే కొంత మంది అమ్మాయిలు కాకినాడలో కనిపించడం లేదని కంప్లైంట్స్ వస్తాయి. ఆ విషయం తెలిసిన రామ్ ఏం చేశాడు? మహిళలు ఎలా మిస్ అవ్వుతున్నారు? ఈ మిస్సింగ్ కేసుల వెనుక పెద్ద మనుషులు ఎవ్వరైనా ఉన్నారా? అనేది మిగతా సినిమా. విశ్లేషణ గత కొన్ని సంవత్సరాలు నుంచి ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎన్ని థ్రిల్లర్ సినిమాలు వచ్చినా సగటు ఆడియన్ను మెప్పించడం అంటే అంత ఆషామాషీ కాదు. పైగా వెబ్ సిరీస్లకు అలవాటు పడిన ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటున్నారు. క్రాంతి ప్రారంభ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపించినా, ఎప్పుడైతే హీరో రామ్(రాకేందు మౌళి) రమ్య మిస్సింగ్ కేసు ప్రారంబిస్తాడో కథలో వేగం మొదలవుతుంది. అక్కడక్కడా వచ్చే సెన్సిటివ్ డైలాగ్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా 'కడుపు నొప్పి వస్తే కంగారు పడే మగాడు గొప్పా? పురిటినొప్పులు భరించే ఆడది గొప్పా?' వంటి డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి. 'క్రాంతి' సినిమాలోని ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్లో ఇచ్చే సందేశం బాగుంటుంది. దర్శకుడు 'భీమ శంకర్' ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ పలు సన్నివేశాల్లో బడ్జెట్ పరంగా రాజీ పడ్డాడని అనిపిస్తోంది. పైగా తొమ్మిది రోజుల్లోనే ఇంత అవుట్పుట్ ఇచ్చాడు. అలాగే కొన్ని సీన్స్లో కాస్త తడబడినట్టు అనిపించినా కథను చెప్పడంలో డైరెక్టర్ కొంత సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి తన అనుభవాన్నంతా రామ్ పాత్రలో కనిపించేలా చేశాడు. ఇనయ సుల్తానా మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చాలా సాంప్రదాయంగా పక్కింటి అమ్మాయి పాత్రలో గుర్తుండిపోయేలా నటించింది. శ్రావణి శెట్టి, యమునా శ్రీనిధి తమ పాత్రల పరిధి మేర నటించారు. తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వొచ్చు అని ఈ సినిమాతో దర్శకుడు ప్రూవ్ చేశాడు. కానీ కాస్త ఎక్కువ సమయం తీసుకునైనా కొన్ని సీన్ల మీద మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది. 'గ్యాన్ సింగ్' ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ బొయిదాపు మంచి విజువల్స్ అందించాడు. కేసీ హరి ఎడిటింగ్కు ఇంకాస్త పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు మరింత మెరుగ్గా ఉండాల్సింది. -
అమెరికాలో రోడ్డుప్రమాదం.. అన్నారం యువకుడి మృతి
సాక్షి, మిర్యాలగూడ టౌన్: అమెరికాలో ఈనెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి క్రాంతి కిరణ్రెడ్డి(24) మృతిచెందడంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సారెడ్డి శ్రీనివాస్రెడ్డి–అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు సారెడ్డి చంద్రకాంత్రెడ్డి, సారెడ్డి క్రాంతి కిరణ్రెడ్డి. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు క్రాంతికిరణ్రెడ్డి హైదరాబాద్లోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీ.టెక్ పూర్తి చేశాడు. అదే సమయంలో టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు 2021 జూలై 23వ తేదీన సారెడ్డి క్రాంతి కిరణ్రెడ్డి వెళ్లాడు. ఆ తర్వాత తన అన్న సారెడ్డి చంద్రకాంత్రెడ్డి 2021 నవంబర్లో వెళ్లాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే దగ్గర ఉంటూ ఎంఎస్ చదువుతున్నారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు ఈ నెల 7వ తేదీన తన స్నేహితులతో కలిసి క్రాంతికిరణ్రెడ్డి బయటికి వెళ్లగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయాన్ని వెంటనే చెబితే తన తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని భయపడి.. అన్న చంద్రకాంత్రెడ్డి మంగళవారం ఈ సమాచారం అందించాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే సారెడ్డి క్రాంతి కిరణ్రెడ్డి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పరిసరాల ప్రజలు పెద్దఎత్తున వారి ఇంటికి తరలివచ్చారు. తల్లి అరుణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. చదవండి: (పెళ్లి సంబధాలను చేడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని..) మా కుమారుడి మృతదేహాన్ని తీసుకురండి.. క్రాంతికిరణ్రెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మృతుడి తల్లిదండ్రులు సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. తన కుమారుడి మృతదేహాన్ని తమకు అప్పగిస్తే కళ్లారా చూసుకుంటామని బోరునవిలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు స్పందించి విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మృతదేహం తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని తెలిపారు. -
పాములను పట్టేందుకు సొంత ఖర్చులతో
పాము కనపడగానే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో దానిని చంపేయాలని చూస్తాం. మరోవైపు పాము కాటుకు అనేక మంది మృత్యువాత పడుతుండటం చూస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి అనే యువకుడికి పాము నుంచి మనిషికి, మనిషి నుంచి పాముకు రక్షణ కల్పించాలనే ఆలోచన కలిగింది. దీంతో అతను స్నేక్ సేవియర్గా మారాడు. జంగారెడ్డిగూడెం: క్రాంతి జనావాసాల మధ్యకు వచ్చిన వేలల్లో పాములను పట్టుకుని రక్షించాడు. ఇతను స్నేక్ సేవియర్స్ సొసైటీ స్థాపించి నాలుగేళ్లు పూర్తయింది. క్రాంతి ప్రస్థానాన్ని చూస్తే.. పేరంపేటకు చెందిన కూలీలైన చదలవాడ రాజారావు, వెంకాయమ్మ దంపతుల కుమారుడు క్రాంతికుమార్. తల్లితండ్రుల అండతో అతను బీఎస్సీ పూర్తిచేశాడు. చిన్ననాటి నుంచి వన్య ప్రాణులపై మక్కువ ఎక్కువ. దీంతో 2008లో పాములను పట్టుకోవటంలో శిక్షణ పొందాడు. శిక్షణ అనంతరం విశాఖపట్టణంలోని స్నేక్ సేవియర్స్ సొసైటీలో పాములపై పరిశోధన చేశాడు. అతి తక్కువ కాలంలోనే పాములను సురక్షితంగా పట్టుకోవడంలో అనుభవం గడించాడు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా ప్రజలు వారి ప్రాణాలు ఎలా రక్షించుకోవచ్చనే విషయంపై అనేక గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాడు. 2016 డిసెంబర్ 30న స్నేక్ సేవియర్స్ సొసైటీని క్రాంతి స్థాపించారు. ఇప్పటివరకు అతను జనావాసాలు, ఇళ్లలోకి వచ్చిన 10,900 పాములను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. జిల్లాలో అనేక మండలాల్లో ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాము కనిపిస్తే గుర్తుకొచ్చేది క్రాంతి పేరు. ఫోన్ చేయగానే ఆ ప్రాంతానికి వెళ్లి పామును పట్టుకుని అటవీ శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమక్షంలో అటవీ ప్రాంతాల్లో విడిచి పెడుతుంటాడు. దూర ప్రాంతాలకు పాములను పట్టేందుకు సొంత ఖర్చులతో వెళుతుంటాడు. పామును పట్టినందుకు ఫోన్ చేసిన వ్యక్తులు ఖర్చులకు డబ్బులు ఇస్తే తీసుకుంటాడేగానీ డిమాండ్ మాత్రం చేయడు. క్రాంతి చేస్తున్న ఈ పనికి ప్రజలతోపాటు అటవీశాఖాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. స్నేక్ సేవియర్స్ సొసైటీ వార్షికోత్సవంలో భాగంగా పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతున్నాడు క్రాంతి. కార్యాలయానికి స్థలం కేటాయించండి ఆర్థిక వనరుల విషయంలో స్నేక్ సేవియర్స్ సొసైటీకి ఇబ్బందులున్నా అధిగమిస్తూనే ఇంతకాలం సంస్థను ముందుకు తీసుకెళుతున్నాం. ప్రభుత్వ సహకారం ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందించటానికి సిద్ధంగా ఉన్నా. స్నేక్ సేవియర్స్ సొసైటీ కార్యాలయ భవనానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నా. కార్యాలయం ఏర్పడితే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. పాము కనిపిస్తే 83869 84869, 80998 55153 నంబర్లకు ఫోన్ చేయండి. – చదలవాడ క్రాంతి, డైరెక్టర్, స్నేక్ సేవియర్స్ సొసైటీ -
దర్శకత్వం అంటే పిచ్చి
క్రాంతి, కె. సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పిచ్చోడు’. హేమంత్ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ –‘‘మాది కామారెడ్డి. ఇంతకుముందు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాను. దర్శకుడిగా ఇదే నా తొలి సినిమా. జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిని ఇష్టాన్ని మించి ప్రేమిస్తారు. నాకు డైరెక్షన్ అంటే పిచ్చి. మా సినిమాలో హీరోకి తన కోసం పుట్టిన సోల్మేట్ను వెతుక్కోవడమే పిచ్చి. అందుకే ‘పిచ్చోడు’ అనే టైటిల్ పెట్టాం. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాను. ప్రేక్షకులకు చిన్న సందేశం కూడా ఉంది. ఈ సినిమా నిర్మాణంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది. కొన్ని కథలు రాసుకుంటున్నాను. ఓ మల్టీస్టారర్ కథ కూడా ఉంది’’ అని అన్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
Advertisement