-
ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా విషాదం చోటుచేసుకుంది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద బ్రిడ్జిపై నుంచి ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఏపీ 39 హెచ్ఆర్0907 నెంబర్ గల బలేనో కారు ఏజెన్సీ మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. జిల్లాకు చెందిన 10 మంది స్నేహితులు రెండు కార్లలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. రుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఓ కారు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. స్థానికంగా ఉండే పాత, కొత్త వంతెనల మధ్యలోని కాల్వలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు మృతిచెందారు. మృతులను ఉదయ్ కిరణ్, హర్ష వర్ధన్, హేమంత్గా గుర్తించారు. గాయపడిన మిగతా ముగ్గురిని రాజమంత్రి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురు యువకులు ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో బీ టెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. -
ఊరంతా కళాకారులే.. పౌరాణిక పాత్రలకు కేరాఫ్ శ్రీరంగపట్నం
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: రామాంజనేయ యుద్ధం, కురుక్షేత్రం, బాలనాగమ్మ, చింతామణి.. నాటకం ఏదైనా వారి నటనాచాతుర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాళికా మాత, దుర్గమ్మ, శ్రీరాముడు, కృష్ణుడు, శివుడు, ఆంజనేయుడు, వెంకన్నబాబు, రాక్షసుడు, అఘోరాలు.. ఇలా వేషమేదైనా పరకాయ ప్రవేశం చేయడమే వారి ప్రత్యేకత. తాతల కాలం నుంచి సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుని మరీ వారు రంగస్థలంపై, జాతర్లలో సత్తా చాటుతున్నారు. నటనపై మక్కువతోనే జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణకు వ్యవసాయం చేసినా ప్రదర్శనలను మాత్రం విస్మరించరు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం పౌరాణిక నాటకాలకు కేరాఫ్ అడ్రస్గా విరాజిల్లుతోంది. ఊరంతా కళాకారులే తూర్పు గోదావరి జిల్లా కళాకారులకు పెట్టింది పేరు. తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం ఖ్యాతి గడించింది. కేవలం నగరం ఒక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కళాకారులు వేల సంఖ్యలో ఉన్నారు. శ్రీరంగపట్నంలో అయితే ఊరంతా కళాకారులే దర్శనమిస్తారు. మేజర్ పంచాయతీ అయిన ఈ గ్రామ జనాభా 12,500. కుటుంబాలు 3,165 ఉన్నాయి. వీరిలో 400 మంది పౌరాణిక నాటకాలు వేసే కళాకారుల కుటుంబాలకు చెందిన వారే ఉన్నారంటే నాటకాలపై వారికున్న మక్కువ ఏమిటో అర్థమవుతోంది. వ్యవసాయ పనులతో జీవనం సాగించే కళామతల్లి ముద్దుబిడ్డలు వివిధ పండగలు, జాతర సమయాల్లో కళాకారులుగా రూపుదాలుస్తారు. ప్రజలను అలరించే ప్రదర్శనలు ఇస్తారు. వీరి నట విశ్వరూపానికి దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉంది. శ్రీరంగపట్నం కళాకారులంటే ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల ప్రజలు అమితంగా ఇష్టపడుతూంటారు. రాష్ట్రవ్యాప్తంగా బెంగళూరు, చిత్తూరు, విజయవాడ తదితర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకూ వేలాది ప్రదర్శనలు వారి సొంతం. ఫలితంగా ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, గ్రామ దేవతల జాతరల సమయంలో కళా ప్రదర్శనలతో సందడి వాతావరణం తీసుకువస్తారు. వివిధ వేషధారణలతో అలరిస్తారు. రూ.500తో మొదలై.. 1988లో ఒక్కో బృందంలో సభ్యుడికి కళాప్రదర్శనకు రూ.500 అందేది. ఇవి ఖర్చులకు కూడా సరిపోకపోయినా కళామతల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది ఉన్న బృందంలో ఒక్కో కళా ప్రదర్శనకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకూ అందుతోంది. ఏ పాత్ర కావాలన్నా.. గ్రామంలో 20 నాటక బృందాలున్నాయి. ఒక్కో బృందంలో 20 మంది చొప్పున 400 మంది కళాకారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరాణిక కళాబృందాలున్నా.. పాత్రకు అనువైన కళాశారులు దొరకడం కష్టం. కానీ శ్రీరంగపట్నం మాత్రం అందుకు భిన్నం. ఏ పాత్రయినా.. ఏ నాటకమైనా అందుకు తగిన కళాకారులను సమకూర్చడం ఈ ఊరి ప్రత్యేకత. పౌరాణిక పాత్రల్లో అత్యంత ప్రాధాన్యమైన అన్నమయ్య, రాముడు, లక్ష్మణుడు వంటి విభిన్న పాత్రల్లో నటించే వారు కేవలం ఇక్కడే ఉండటం విశేషం. వీటితో పాటు కాళికాదేవి, నెమలి కోబ్రా డ్యాన్స్, నక్షత్రకుడు, హరిశ్చంద్రుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, తాండ్ర పాపారాయుడు వంటి వేషధారణలకు కేరాఫ్గా ఈ గ్రామం ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ లేని కళాకారులు లేరంటే అతిశయోక్తి కాదు. నాటక ఘట్టం సందర్భంగా వీరు వేసే పాత్రలు, నృత్య ప్రదర్శనలు వీక్షకులను కట్టి పడేస్తుంటాయి. తమ తాతలను, తండ్రులను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం వారి సంతానం నాటక రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రదర్శనలపై ఉన్న మక్కువతో ఈ రంగంలోనే స్థిరపడిపోతూ కళకు జీవం పోస్తున్నారు. 34 ఏళ్లుగా.. 1988 నుంచి ప్రదర్శనలు ఇస్తున్నా. నాటక రంగంపై ఉన్న ప్రేమతో నేటికీ కళామతల్లి బిడ్డగా కొనసాగుతున్నా. రామాంజనేయ యుద్ధంలో నా నటనకు ప్రశంసా పత్రాలు, అవార్డులు దక్కాయి. నాడు ఒక్కో ప్రదర్శనకు రూ.500 గౌరవ వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.2 వేలు పైగా అందుతోంది. డ బ్బులు ఎంత వచ్చాయన్నది కాకుండా.. కళను బతికించాలన్న తాపత్రయంతోనే కొనసాగుతున్నాం. – బాసెట్టి జగ్గారావు, కళాకారుడు రాక్షసుడే వచ్చినట్టు.. బాలగౌరి కళాకారుల సంఘ సభ్యుడైన తనకాల నాని మిమిక్రీ ఆర్టిస్ట్. నాటక రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. నల్లకాళికాదేవి, వేపాలమ్మ పాత్రలకు జీవం పోస్తున్నాడు. తన నటనకు గుర్తింపుగా ఇటీవల పుష్ప–2 సినిమాలో అవకాశం దక్కింది. ఆవేశం.. ఈ వేషం.. నాన్న కీబోర్డ్ ప్లేయర్. బాబాయ్ సింగర్. వారిని స్ఫూర్తిగా తీసుకున్న కళాకారులు సతీష్ లేడీ ఓరియంటెడ్ గెటప్లో అలాగే ఒదిగిపోతాడు. బుల్లితెరపై స్టాండప్ కామెడీ రోల్ చేస్తున్నా.. నాటక ప్రదర్శన ఉందంటే చాలు వాలిపోతాడు. వేషమేదైనా.. కళాత్మకమే.. అఘోరా నృత్యం చేయడం అంత సులభం కాదు. కానీ ఆ పాత్రకు జీవం పోస్తాడు ఎం.సంపత్. అతను నాట్యం చేస్తూంటే అఘోరాలే ఔరా! అంటూ ఆశ్చర్య పోవాల్సిందే. పార్వతీ దేవి పాత్రకు సైతం న్యాయం చేస్తాడు. అబ్బాయే.. అమ్మాయిలా.. మరో కళాకారుడు రాంబాబు అమ్మవారు, లేడీ గెటప్, రుక్మిణీదేవి వేషధారణల్లో అలరిస్తుంటారు. ఇలా ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో పాత్రకు న్యాయం చేయడంతో కీలక భూమిక పోషిస్తారు. (క్లిక్ చేయండి: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు) -
బుల్లి భగవద్గీత.. చదరపు సెంటీమీటరు పుస్తకంలో..!
మధురపూడి: కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న పుస్తకంలో భగవద్గీతను లిఖించి ఆశ్చర్యపరిచాడు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన విద్యార్థి బాలశివతేజ. రాజమహేంద్రవరంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న శివతేజ కొన్నాళ్లుగా స్మాలెస్ట్ హ్యాండ్ రైటింగ్లో సాధన చేస్తున్నాడు. ఇందులో భాగంగా భగవద్గీతలోని 240 శ్లోకాలను, 50 చిత్రాలను కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న 240 పేజీల పుస్తకంలో లిఖించాడు. దీనిని అతడు కేవలం 2 గంటల 50 నిమిషాల 23 సెకండ్లలో పూర్తి చేయడం అబ్బురపరుస్తోంది. దీనికి స్థానిక పంచాయతీ కార్యదర్శి జగ్జీవన్రావు, హైస్కూల్ ఉపాధ్యాయుడు సాంబశివరావు పరిశీలకులుగా వ్యవహరించారు. అరుదైన ప్రతిభను కనబరచిన శివతేజను పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మిరాకిల్ వరల్డ్ రికార్డు సాధన కోసం ఒంగోలు పంపారు. -
ఎల్లో మీడియాతో రోజుకో పుకారు పుట్టిస్తున్నారు
-
అదే జరిగితే టీడీపీకి డిపాజిట్లు గల్లంతే: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. మోసపూరితమైన మ్యానిఫెస్టో పేరుతో మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో 54 పేజీలతో కూడా ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు నాయుడు విడుదల చేశారని.. కానీ అధికారంలోకి వచ్చాక అవేవీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ఈసారి అబద్ధాలతో కూడిన 34 పేజీల మ్యానిఫెస్టో రూపొందించారని ఆయన అన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పినట్లు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, మద్యపాన నిషేదం, పంటలకు గిట్టుబాటు ధర వంటి అనేక హామీలను విస్మరించారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కుట్ర చేస్తున్నారని, ఆయన పాలనపై చర్చ జరిగితే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదలకు ఏవిధంగా మేలు జరుగుతుందో.. తమ పార్టీ మ్యానిఫెస్టోలో వివరించామని వైఎస్ జగన్ తెలిపారు. టీడీపీలా తమది పేజీలకొద్ది అబద్ధాల పుస్తకం కాదని..కేవలం రెండే పేజీల రూపంలో ప్రజలకు అర్థమైయ్యే విధంగా వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజానగరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా, రాజమండ్రి లోక్సభ అభ్యర్థి మార్గని భరత్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నది పక్కనే ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీరు దొరకడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పాదయాత్రలో ఈ జిల్లాలోని ప్రజలు పడుతున్న కష్టాలన్నీ నేను దగ్గర నుంచి చూశాను. ప్రభుత్వ సహాయం అందక, సంక్షేమ పథకాలు అమలుకాక ఎంతో మంది పేదలు కష్టాలు పడుతున్నారు. వారందరికీ నేను ఉన్నానని హామీ ఇస్తున్నాను. రైతులకు గిట్టుబాటు ధర ఉండదు. రుణమాఫీ కూడా కాలేదు. దీంతో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. 2017 నాటికే పోలవరం పూర్తి చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ పునాదులు దాటలేదు. ప్రాజెక్టుల పేరుతో దోచుకోవాలనే ఆరాటంతో అంచనాల వ్యయ్యాన్ని ఇష్టం వచ్చినట్టు పెంచారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు సబ్ కాంట్రక్టర్గా దోచుకుంటున్నారు. పురుషోత్తంపట్నం కూడా ఇదే పరిస్థితి ఉంది. గతంలో కడియం స్కీం ద్వారా దివంగత వైఎస్సార్ 48 గ్రామాలకు నీరు అందించారు. చంద్రబాబుకు అది కూడా చేతకావడంలేదు. అనేక ప్రాంతాల్లో ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసి ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు వంద కోట్లకు పైగా దొచుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 వాగ్ధానాలను అమలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి మరోసారి సీఎంగా మనకు అవసరమా?. ఎన్నికల సమీపిస్తున్న వేళ డబ్బుల మూటలు పంచుకుని గ్రామాల్లోకి వస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే మూడువేలు తీసుకుని మోసపోవద్దు. వచ్చేది మన ప్రభుత్వమే. అందరినీ ఆదుకుంటాం. డ్వాక్రా రుణాల పూర్తిగా మాఫీచేసి.. సున్నా వడ్డీకే రుణాలు అందిస్తాం. రైతుల పెట్టుబడికి మేలో రూ.1250 ఇస్తాం. ఆర్థికంగా వెనుకబడిన ప్రతి పేదవాడిని ఉచితంగా చదవిస్తాం. నవరత్నాలు ద్వారా ప్రతి పేదవాడి బతుకులు మారతాయి. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది’’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కొత్తిల్లు కొన్న రజనీ కూతురు.. గృహప్రవేశ వేడుక
పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!
చేజారిన కెప్టెన్సీ.. ఎట్టకేలకు మౌనం వీడిన రోహిత్ శర్మ
సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ
అందుకే ‘ఓటుకు నోటు’ విచారణ బదిలీ కోరుతున్నాం
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు
పిరియా విజయ పల్లె నిద్ర
Amethi: స్మృతి ఇరానీపై కేఎల్ శర్మ పోటీ.. ఎవరీయన?
తప్పక చదవండి
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
Advertisement