-
Nalco: రెండేళ్లలో పూర్తి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్ (మిధానీ)లు సంయుక్తంగా రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రెండేళ్లలోగా పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాల్కో, మిధానీల సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. రూ.5,500 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఇది ఏర్పాటవుతోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 60 వేల మెట్రిక్ టన్నులు. దీని ద్వారా దాదాపు 1000 మందికి ఉపాధి లభిస్తుంది. నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిధానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన సీఎం.. మౌలిక సదుపాయాలపై తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రక్షణ అనుబంధ రంగాల పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్ను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించగా అందుకు సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యం
సాక్షి, నెల్లూరు(కొడవలూరు): పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజం సిగ్గు పడేలా ఉన్న ఈ ఘటన మండలం తలమంచి ఎస్సీ కాలనీలో సోమవారం వెలుగుచూసింది. కోవూరు సీఐ కె.రామకృష్ణారెడ్డి సమాచారం మేరకు.. ఆ కాలనీకి చెందిన ఈశ్వరయ్యకు ఇద్దరు కుమారులున్నారు. అయితే ఈశ్వరయ్యను భార్య వదిలేసి వెళ్లిపోవడంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆయనతో సహజీవనం చేస్తున్న మహిళకు మొదటి భర్తకు జన్మించిన పన్నెండేళ్ల కుమార్తెతో పాటు మరో కుమారుడున్నారు. ఈశ్వరయ్య ఇద్దరు కుమారులు, ఆ మహిళ ఇద్దరు పిల్లలు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వరయ్యతో సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తె (12)పై ఈశ్వరయ్య పెద్ద కుమారుడు (19) కొంత కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. గిరిజనులు కావడంతో మౌనంగా ఉండిపోయారు. అయితే ఆ బాలికకు 9 నెలలు నిండాయి. దీంతో కాన్పు నిమిత్తం ఆ బాలికను నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అంత చిన్న వయస్సులో బాలిక గర్భం దాల్చడంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారించిన సీఐ రామకృష్ణారెడ్డి ఈశ్వరయ్య పెద్ద కుమారుడు (19)పై అత్యాచారం, ఫోక్సో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: (హోంగార్డు హత్య.. మద్యం మత్తులో యువకుల దాష్టీకం) -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
కొడవలూరు: మహిళ హ్యాండ్ బ్యాగ్లోని బంగారు, వెండి నగలు చోరీ చేసిన కేసులో నిందితుడైన బిట్రగుంటకు చెందిన గుర్రంకొండ రాజేష్ అలియాస్ బుడ్డను ఆదివారం కొడవలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉ న్నాయి. తిరుపతికి చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సూర్యనారాయణ కుటుం బసభ్యులతో కలిసి జనవరి 23వ తేదీన గుంటూరుకు వెళ్లాడు. అనారోగ్యంతో ఉన్న బంధువులను పరామర్శించి తిరిగి తిరుపతికి వస్తూ రాత్రి కావడంతో కమ్మపాలెం వద్ద కారును ఆపి నిద్రకు ఉపక్రమించారు. సూర్యనారాయణ భార్య హ్యాండ్ బ్యాగ్ను నిందితుడు దొంగిలించి అందులో ఉన్న బంగారు చైన్, వెంకటేశ్వరస్వామి డాలర్, రెండు జతల వెండి కాళ్ల పట్టీలు అపహరించాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు గుర్రంకొండ రాజేష్ అని నిర్ధారిం చారు. ఆదివారం కోవూరు బస్టాండ్లో ఉన్న అతడిని అరెస్ట్ చేశారు. బంగా రు, వెండి నగలను స్వాధీనం చేసుకోవడంతోపాటు జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు హెడ్కానిస్టేబుల్ జీపీపీ రామరాజు తెలిపారు. -
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
స్టేటస్కోను ధిక్కరించి ఆక్రమణ తొలగింపు ఖండించిన ప్రసన్న నార్తురాజుపాళెం (కొడవలూరు): హై కోర్డు స్టేటస్కో ఉత్తర్వులున్నా ధిక్కరించి ఆక్రమణ తొలగించిన సంఘటన నార్తురాజుపాళెంలో గురువారం చోటు చేసుకుంది. అయితే వైఎస్సార్ సీపీకి చెందిన వారివి మాత్రమే తొలగించడం అధికారుల పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది. నార్తురాజుపాళెం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను బుధవారం నుంచి తొలగిస్తుండటం విదితమే. అయితే గురువారం నాటి తొలగింపులో అధికారులు హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేశారు. ఆక్రమణదారుల్లో కె.శ్రీనివాసులు, మల్లికార్జున, వెంకటలక్ష్మి హైకోర్టు నుంచి స్టేటస్కో ఉత్తర్వులు (యథా స్థితిని కొనసాగించడం) తెచ్చుకున్నారు. ఉత్తర్వులు గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, నాయకుడు ఫజురుల్లా స్థానిక తహసీల్దార్ రామకృష్ణకు అందజేశారు. అయినప్పటికీ అధికారులు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఆక్రమణలను కూల్చేశారు. హై డ్రామా : ఉత్తర్వులను ఆర్అండ్బీ అధికారులకు అందజేయాల్సి ఉండగా, సర్వేయర్ పత్తాలేకుండా పోయారు. స్టేటస్కో ఉత్తర్వులు తనకందలేదంటూ ఆర్అండ్బీ జేఈ కృష్ణ ఆక్రమణను కూల్చివేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే హైడ్రామా నడిచిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ధిక్కారమే : హైకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అధికారులు హైడ్రామా నడిపి కూల్చడం కోర్టు ధిక్కారమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. ఆయన గురువారం కూల్చివేతను స్వయంగా పరిశీలించారు. ఆర్అండ్బీ జేఈ, సర్వేయర్లను పిలిచి మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులున్నా ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చెబితే ఏమైనా చేస్తారా? కోర్టును కూడా ధిక్కరిస్తారా అంటూ వారిపై మండి పడ్డారు. కోర్టు ధిక్కారణ కేసు పెడితే అధికారులే సమాధానం చెప్పుకోవాలని హెచ్చరించారు. అధికార ప్రతినిధి చలపతిరావు మాట్లాడుతూ అధికారుల వైఖరిపై కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
యల్లాయపాలెం(కొడవలూరు) : బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన మండలంలోని యల్లాయపాలెంలో శనివారం రాత్రి చోటుచేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మసీదు వీధికి చెందిన ఓ బాలికకు (15) మేనమామ వరుసైన వ్యక్తితో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 26వ తేదీన పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. వివాహ శుభలేఖలు ముద్రించి పంపిణీ ప్రారంభించారు. వివాహ విషయం ఐసీడీఎస్ సూపర్వైజర్ సాయికుమారి దష్టికి వెళ్లడంతో ఆమె ఐసీపీఎస్ అధికారిణి సుజాతతో కలిసి శనివారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేశారు. బాల్య వివాహం చట్ట రీత్యా నేరమని, అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేసి వివాహం జరిపితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహం రద్దు చేసుకునేందుకు అంగీకరించి అందుకు కట్టుబడి ఉంటామని అధికారులకు ఒప్పంద పత్రం రాసిచ్చారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement