-
మిట్టల్కు నైట్హుడ్ పురస్కారం
లండన్/న్యూఢిల్లీ: భారతీయ టెలికం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత బ్రిటన్ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్–3 నుంచి ఈ అవార్డ్ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించారు. బ్రిటన్, భారత్ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్హుడ్(కేబీఈ) అవార్డ్తో మిట్టల్ను గౌరవించింది. భారత్లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్టెల్కు 66 ఏళ్ల మిట్టల్ వ్యవస్థాపక చైర్మన్గా కొనసాగుతున్నారు. బ్రిటన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్ కమాండర్ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు. -
ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్కు నైట్హుడ్.. ఇకపై "సర్" స్టువర్ట్ బ్రాడ్గా..!
కొద్ది రోజుల కిందట క్రికెట్కు గుడ్బై చెప్పిన ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్కు అత్యున్నత గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్కు, ముఖ్యంగా ఇంగ్లండ్ క్రికెట్కు చేసిన సేవలకు గాను బ్రాడ్కు నైట్హుడ్ ఇవ్వాలని యూకే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల పత్రిక డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. యూకే ఎంపీలంతా బ్రాడ్కు నైట్హుడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. క్రికెట్ అభిమానులు, సాధారణ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుందట. బ్రాడ్ నైట్హుడ్కు అర్హుడని యూకే ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ కూడా తీర్మానించిందట. ఇందుకు ఆ దేశ ప్రధాని రిషి సునక్ కూడా సుముఖంగా ఉన్నాడట. ఈ విషయాలను డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. ఒకవేళ బ్రాడ్కు నైట్హుడ్ ఇస్తే.. అతని పేరుకు ముందు "సర్" వచ్చి చేరుతుంది. క్రికెట్లో అతి తక్కువ మందికి ఈ గౌరవం దక్కింది. సర్ బిరుదు తొలుత ఇంగ్లండ్ ఆటగాడు ఫ్రాన్సిస్ ఎడెన్ లేసీ (1895-1946)కి దక్కింది. ఆతర్వాత క్రికెట్ దిగ్గజం, ఆసీస్ ఆటగాడు డాన్ బ్రాడ్మన్, జాక్ హాబ్స్ (ఇంగ్లండ్), లెన్ హటన్ (ఇంగ్లండ్), రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్), గ్యారీ సోబర్స్ (విండీస్), కర్ట్లీ ఆంబ్రోస్ (విండీస్), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లండ్) వంటి పలువురు క్రికెట్ దిగ్గజాలు నైట్హుడ్ దక్కించుకున్నారు. భారత క్రికెటర్లలో విజయనగరం మహారాజ్కుమార్కు నైట్హుడ్ దక్కినప్పటికీ, అతనికి క్రికెటేతర కారణాల చేత ఈ గౌరవం దక్కింది. కాగా, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్, మూడో రోజు ఆట సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి 2 టెస్ట్లు ఓడిపోయి వెనుకపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ విజయాల్లో బ్రాడ్ కీలకపాత్ర పోషించాడు. 22 వికెట్లతో సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. బ్రాడ్ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న చివరి బంతిని సిక్సర్గా, తాను సంధించిన చివరి బంతిని వికెట్గా మలిచి ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఓవరాల్గా బ్రాడ్ టెస్ట్ల్లో ఐదో అత్యధిక వికెట్ టేకర్గా (604), ఓవరాల్గా ఏడో అత్యధిక వికెట్ టేకర్గానూ (847) రికార్డుల్లో నిలిచాడు. -
బ్రిటన్ మాజీ ప్రధాని బ్లెయిర్కు ‘నైట్హుడ్’
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ను బ్రిటన్ రాణి ఎలిజబెత్ నైట్హుడ్ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లెయిర్.. ‘ఆర్డర్ ఆఫ్ గార్డర్’ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్హుడ్ హోదాతో గౌరవిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపై టోనీ బ్లెయిర్ను ‘సర్ టోనీ’ అని గౌరవంగా సంబోధిస్తారు. 68 ఏళ్ల టోనీ బ్లెయిర్ 1997 నుంచి పదేళ్లపాటు బ్రిటన్కు ప్రధానిగా సేవలందించారు. బ్రిటన్ మాజీ మంత్రి, నల్ల జాతీయురాలు బరోనెస్ వలేరీ అమోస్(67)కు సైతం నైట్హుడ్ హోదా దక్కింది. గృహ హింస, లైంగిక వేధింపులపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న తన కోడలు కమిల్లాను ‘రాయల్ కంప్యానియన్’గా నియమిస్తూ ఎలిజబెత్ రాణి నిర్ణయం తీసుకున్నారు. -
ఇక నుంచి ‘సర్’ లూయిస్ హామిల్టన్...
ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ను ఇక నుంచి ‘సర్’ లూయిస్ హామిల్టన్గా పిలవనున్నారు. ఎఫ్1 చరిత్రలో అత్యధికంగా 103 విజయాలు సాధించిన 36 ఏళ్ల హామిల్టన్ను బ్రిటన్ ప్రభుత్వం నైట్హుడ్ పురస్కారంతో గౌరవించింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా హామిల్టన్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. 2007 నుంచి ఎఫ్1లో ఉన్న హామిల్టన్ ఇప్పటివరకు 288 రేసుల్లో పాల్గొన్నాడు. చదవండి: Ruturaj Gaikwad: 4 సెంచరీలు... 603 పరుగులు... సంచలన ఇన్నింగ్స్.. అయినా పాపం! -
శంకర్ సుబ్రమణియన్ కు అరుదైన గౌరవం
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్, డీఎన్ఏ పరిశోధకుడు శంకర్ సుబ్రమణియన్(50)ను బ్రిటన్ ప్రభుత్వం నైట్హుడ్ హోదాతో సత్కరించింది. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నారు. జీవశాస్త్రం, వైద్యశాస్త్రంలో గొప్ప ముందడుగుగా భావించే తరువాతి తరం డీఎన్ఏ అనుక్రమణాన్ని కనుగొన్న పరిశోధకుల్లో ఒకరిగా శంకర్కు గుర్తింపు ఉంది. ‘సొలెక్సా సీక్వెన్సింగ్గా పిలిచే ఈ విధానం ద్వారా 1000 పౌండ్ల కన్నా తక్కువ ఖర్చుతో కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే జన్యువు అనుక్రమణాన్ని పూర్తిచేయొచ్చు. గతంలో మానవ జన్యువు అనుక్రమణానికి బిలియన్ పౌండ్ల వ్యయంతో పాటు కొన్నేళ్ల సమయం పట్టేది. ఆయన పరిశోధనంతా అధునాతన బయోఇన్ఫార్మాటిక్స్లోనే కొనసాగిందని’ ఆయనకిచ్చిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!?
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
Advertisement