-
కళా కృషీవలుడు కానూరి
తొంభైతొమ్మిది దాటితే నూరులో ప్రవేశించినట్లే. 1916లో పుట్టిన కానూరి వెంకటేశ్వ రరావు - కానూరితాత ఖమ్మంలో 2015 మార్చి 10వ తేదీన కన్నుమూశారు. 1915లో గురజాడ కన్నుమూసిన ఏడాదికి కళ్లు తెరచిన కానూరి వరంగల్లో తాను రాసిన గుర జాడపై ‘మహోదయం’ బుర్రకథతోనే నాకు పరిచయమయ్యారు. అట్లూరి, కానూరి, కాశీవిశ్వనాథంల కుటుం బాలు, కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో 1956లో ములుగు ఘనపురానికి భూములు కొనుక్కొని వచ్చినారు. ములుగు ప్రాంతపు పోరాట యోధుడు రామనర్సయ్య సహకారంతో ఈ కుటుంబాలన్నీ ములుగు ఘనపురంలో వ్యవసాయ జీవితంలో స్థిరపడి రామనర్సయ్య రాజకీయాలతోపాటు మార్పువైపు పయనిస్తూ వచ్చాయి. కానూరి దమయంతమ్మ దంపతులను ఎప్పుడు చూసినా నాకు ఆ బాల్యంలో మనసుమీద నిలిచిపోయిన రైతుల ముఖాలే గుర్తుకొచ్చేవి. అయితే మమ్మల్ని గాఢానుబంధంలోకి తెచ్చింది వ్యవసాయ విప్లవం, విరసం. కానూరి విప్లవ సాంస్కృతిక రంగంలో క్రమశిక్షణ గల నికార్సయిన కార్యకర్తగా కనిపించడమే కాదు, ఆఖరిశ్వాస దాకా రుజు వు చేశాడు. పాటలు, గేయరూపకాలు, నాటకాలు, నాటికలు రాయ డం, పాడడం, శిక్షణ ఇవ్వడంలో ఆయనకు ఐక్య కమ్యూనిస్టు పార్టీ నేర్పిన దృఢమైన, సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. ఆయ నకు ప్రముఖ కమ్యూనిస్టు నేతలతో, ప్రజానాట్య మండలి నాయకులతో కలిసి పని చేసిన అపారమైన అనుభవం ఉండేది. ‘కృష్ణ’ పేరుతో కేఎస్ రాసిన ‘ప్రజానాట్య మండలి’ అనుభవాలు ఆయనకు చాలా ఇష్టమైన పుస్తకం. వరంగల్ విరసంకు కానూరి సాంస్కృతిక సేనానిగా ఒక పెద్ద దిక్కయ్యాడు. 1970 జూలై 4న హైదరాబాద్లో విరసం ఏర్పడగానే నిండు హృదయంతో స్వాగతం పలికి అక్టోబర్లో ఖమ్మం పాణిగ్రాహినగర్లో ప్రథమ మహాసభలకు వచ్చి కానూరి, అట్లూరి, కాశీలు విరసంలో చేరిపోయారు. 1985లో డాక్టర్ రామనాథం హత్యదాకా పదిహేనేళ్లు మేము రెడ్డికాలనీలో, కుమార్పల్లిలో నిత్య సాంస్కృతిక సహ బాటసారులం. డాక్టర్ రామనాథంగారి హత్యతో వరంగల్లో విప్లవ, ప్రజాస్వామిక బుద్ధిజీవుల కుటుంబాలు చాలా వర కు చెల్లాచెదురయ్యాయి. వెంటనే నేను, నా కుటుంబం 90లో వరంగల్ వదిలేయాల్సి వచ్చింది. 1985లోనే కానూరి విరసం నుంచి కూడా నమ్ము మొదలైన వారితోపాటు వెళ్లిపోయాడు. అరుణోదయ సాంస్కృ తిక సమాఖ్య స్థాపన నుంచి తాను కన్నుమూసే దాకా ఆయనే దానికి చుక్కాని. విరసంకు జనసేన, చెరబండరాజు, ఎన్కేలతోపాటు ఒక గాయక, సాంస్కృతిక కాణాచి కానూరి. అంతేకాదు గంగిరెడ్డి రాసిన ‘నాంది’ తర్వాత, అంటే 1972 తర్వాత మళ్లా బుర్రకథలు, నాటికలు, నాటకాలు విరసం సభ్యులకెందరికో నేర్పి ‘ప్రగతి బాగోతం’ ప్రదర్శన లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పించినవాడాయనే. కమ్యూనిస్టు రాజకీయాలకు 70 ఏళ్లు, విప్లవ రాజకీయాలకు 45 ఏళ్లు కళా సాంస్కృతిక రంగాల్లో ప్రచారం చేసిన ఏకైక సాంస్కృతిక యోధుడాయన. భారతదేశంలో కష్టజీవికి వ్యక్తీకరణ కానూరి. ప్రేమ్ చంద్ నవలల్లోని రైతువలె కనిపిస్తాడు. నిరాడంబరుడు. కావి రంగు బట్టలు. ముక్కుసూటి మనిషి. కాళోజీకి వలెనే ముక్కు మీద కోపం. అంతట్లోనే వర్షం వెలిసిన ఆకాశంలోని ఎరడా లువలె నిష్కల్మషమైన స్నేహం. 1946 నుంచి 51 దాకా నిషే ధింప బడిన కమ్యూనిస్టు పార్టీ సంబంధాల వలన అజ్ఞాత జీవితం, అరెస్టు, చిత్రహింసలు. తోటివారందరూ తళనియప్పన్ హంతకచర్య లకు బలి అయిపోతే కింది అధికారులు కళాకారుడనే సానుభూతితో కానూరిని మృత్యుముఖం నుంచి కాపాడారు. 1956లో మళ్లా ఘనపు రంలో ప్రారంభమైన వ్యవసాయ జీవితం నుంచి రామనర్సయ్య సాన్ని హిత్యం ఆయనను మళ్లీ 1968 నుంచీ విప్లవంలోకి లాగింది. విరసం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, గత ముప్పైఏళ్లుగా పూర్తికాలపు విప్లవ సాంస్కృతిక జీవితం ఇంచుమించు దేశ సంచారంలో పార్టీ ఆఫీ సులో గడిచిపోయింది. ఖమ్మంలో న్యూడెమోక్రసీ ఆఫీసులో చనిపోయి నప్పుడు సంచీలో మిగిలిన సాహిత్యమే ఆయన మిగిల్చుకొని సాంస్కృ తిక వారసులకు ఇచ్చిన ఆస్తి. (నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కానూరి సంస్మరణ సభ) వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు : సెల్:9676541715 -
‘కానూరి తాత’ కాలధర్మం
నివాళి తెలుగునేల సృష్టించుకున్న జానపద అద్భుతం-బుర్రకథ. ఉద్యమ వ్యాప్తికీ, సామాజిక చైతన్యానికీ అదొక ఆయుధం. దానికి మరింత పదును పెట్టిన ప్రజా కళాకారుడు కానూరి. ‘మహాత్యాగుల జీవితగాథల మనన జేతుమమ్మా! మహాభారత స్వాతంత్య్రవీరుల మదిని తలచరమ్మా!’ అంటూ బుర్ర కథ ద్వారా ధన్యజీవులను ప్రజానీకానికి పరిచయం చేసిన కానూరి తాత (వెంకటేశ్వరరావు) ఇకలేరు. తెలంగాణ సాయుధ పోరాటంలో సాంస్కృతిక కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి, ఏడు దశాబ్దాల పాటు సాంస్కృతికోద్యమానికి సేవలు చేసిన కానూరి తాత శుక్రవారం (10-4-2015) ఖమ్మంలోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో కన్నుమూశారు. నిండా నూరేళ్లు జీవించి, మూడు తరాల కళాకారుల మధ్య వారథిగా నిలిచారు. వేలాది కవులకూ, కళాకారులకూ ఆయన మార్గదర్శి. తెలుగునాట వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ పండించి అవకాశవాద రాజకీయా లను తూర్పారా పట్టారు. బుర్రకథ, హరికథ, చిందు భాగవతం, పిట్టలదొర -ఇలా ఎన్నో రకాల కళారూపాలను ప్రజలను చైతన్య పరచ డానికి ప్రయోగించారు. కానూరి స్వగ్రామం కృష్ణాజిల్లా కోడూరు గ్రామం. మాణిక్యమ్మ, సిద్ధయ్య దంపతులకు 1916లో జన్మించారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ వేళ పుట్టిన కానూరి విప్లవోద్యమాలతో ప్రేరణ పొంది ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీవైపు మొగ్గారు. 1944లో ప్రజా నాట్యమండలి ద్వారా బుర్రకథ కళాకారునిగా రంగప్రవేశం చేసి 70 ఏళ్లు అలరించారు. వంత గాడిగా, వ్యాఖ్యాతగా తనదైన శైలిని ఆవిష్క రించారు. శ్రీకాకుళ పోరాటాన్ని కళ్లకు కట్టే ఆయన ‘జనగానం’ ఎంతో ప్రసిద్ధి. ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్సింగ్ చరిత్రలను కూడా బుర్రకథలుగా మలిచారు. కేవీ రమణారెడ్డి రాసిన ‘మహోదయం’ ఆధారంగా గురజాడ జీవిత చరిత్రను బుర్రకథ రూపంలోకి తెచ్చారు. వ్యంగ్యాన్ని మేళవించి వర్తమాన రాజకీయాలపై ఆయన రాసిన పాటలు ఎంతో ఖ్యాతి చెందాయి. సింగరేణి కార్మికుల వెతలకు అద్దంపడుతూ రాసినది ‘బాయి భాగోతం’. దీనిని అరుణోదయ కళాకారులు వందలాది పర్యాయాలు ప్రదర్శించారు. కానూరి ‘విప్లవ సింహం’ (రామనరసయ్య జీవితచరిత్ర బుర్ర కథ), ‘వెలుగురే ఖలు ’ (నీలం రామచంద్రయ్య జీవితం ఆధారంగా రాసిన హరికథ) వినని వారు ఉండరు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో పాటు, అరసం, విరసం, ప్రజా రచయితల సంఘం వంటి సంస్థలలో ఆయన పనిచేశారు. (వ్యాసకర్త అరుణోదయ సభ్యుడు) మొబైల్: 94418 64514 -
'అరుణోదయ సంస్థ' కానూరి కన్నుమూత
ఖమ్మం : తొలితరం ప్రజానాట్యమండలి కళాకారులు,అరుణోదయ సంస్థ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రుణోదయ సంస్థ ప్రతినిధులతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కానూరి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం అయిదు గంటలకు ఖమ్మంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement