-
ఇదేం ఖర్మ, ఇదేం ప్రచార యావ?
నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద జరిగిన దుర్ఘటన విచారకరం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ఒక కార్యక్రమం చేపట్టి వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కందుకూరు వెళ్లారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సభలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేతలు ఎలా స్పందించాలి? అసలు ఈ ఘటనకు కారణం ఏమిటి? ఇందులో పోలీసుల తప్పు ఏమైనా ఉందా? లేక నేతల అతి తెలివి వల్ల ఇంతమంది బలయ్యారా? రాజకీయ ప్రచారం ఇరుకు రోడ్లపై పెడితే ఆ పార్టీకి ఏమైనా కలిసి వస్తుందా? జనం సరిపడ రాకపోతే, వెలితిగా కనిపించి పార్టీకి నష్టం జరుగుతుందని ఇలా చేస్తుంటారా? ఇలాంటి వాటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఒక అవగాహనకు రావాలి. ప్రజల ప్రాణాలతో ఆటలా? మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం కందుకూరులో మరో పెద్ద సర్కిల్ ఉన్నప్పటికీ, చిన్న ప్రదేశంగా ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ ను తెలుగుదేశం ఎందుకు ఎంపిక చేసుకుంది? టీడీపీ అధిష్టానం సూచనల మేరకే ఎక్కడ సభ ఏర్పాటు చేయాలన్నది నిర్ణయిస్తారు. కొన్ని కధనాల ప్రకారం తెలుగుదేశం అధినాయకత్వం అనండి.. చంద్రబాబు లేదా.. లోకేష్ వంటివారు ఇలా కాస్త చిన్న , చిన్న రోడ్లపై మీటింగ్ లు పెడితే తక్కువ జనం వచ్చినా.. పత్రికలలోను, టివీలలోను జనం బాగా వచ్చారని ప్రచారం చేసుకోవచ్చన్న యావతో ఇలా చేస్తున్నారట. ఏ పార్టీ ఇలా చేసినా మంచిది కాదు. నిజానికి ప్రజల మద్దతు తమకు ఉందని భావించే ఏ పార్టీ కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు పొడవాటి రోడ్లను, ఉన్నంతలో విశాలమైన రోడ్లను ఎంపిక చేసుకుని అనుమతి తీసుకుని , అందుకు తగ్గ ఏర్పాట్లను ముందుగానే చేసుకుని సభ నిర్వహించేవారు. కానీ చంద్రబాబు సభలకు అలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శ ఉంది. సన్నని సందు ఉంటే ఫోటో బాగా వచ్చి విశేష సంఖ్యలో జనం వచ్చారని రాష్ట్రం అంతటా నమ్మించవచ్చన్నది వారి ఆలోచన అట. అలాంటి దిక్కుమాలిన ఐడియా వల్ల ఇప్పుడు కందుకూరులో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. దీనికి ఎవరు బాద్యత వహించాలి? ఈ వీడియో చూడండి.! మీరే నిర్ణయించుకోండి తెలుగుదేశం అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఉన్న కందుకూరు వీడియోను చూడండి. సంఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు.. వీడియోలో 17వ నిమిషం దగ్గర చూడండి. చాలా చిన్న దారిలో సభ ఏర్పాటు చేశారు, అక్కడే లైవ్ కవరేజ్ కోసం వ్యాన్ పెట్టారు. 17వ నిమిషం నుంచి 19వ నిమిషం వరకు చంద్రబాబు ఏం మాట్లాడారో పరిశీలిస్తే.. జనం ఎక్కుతున్నందున తన లైవ్ ప్రసారాలకు ఆటంకం ఏర్పడుతుందన్నదే తన ఆందోళనగా కనిపించింది. ఆ వ్యాన్కు అత్యంత సమీపంలోనే తొక్కిసలాట జరిగింది. నిజానికి జనాన్ని సరిగా సమన్వయం చేసుకుంటే .. పరిస్థితి మరోలా ఉండేది. లైవ్ ప్రసారాలు బాగా రావాలన్నా తాపత్రయం తప్ప.. జనాన్ని క్రమ పద్ధతిలో ఉంచాలన్న అంశాన్ని విస్మరించినట్టు అనిపిస్తుంది. పాపం.. పచ్చ ప్రకోపం దీని ప్రభావాన్ని తగ్గించడానికి ఈనాడు వంటి టీడీపీ మీడియా సంస్థలు చాలా పాట్లు పడినట్లు వారు రాసిన కథనాలు చదివితే అర్దం అవుతుంది. వాస్తవ విశ్లేషణతో నిమిత్తం లేకుండా పోలీసులు తక్కువగా ఉన్నారని ఒక వార్త ఇచ్చారు. పోలీసులు ఎక్కువమంది ఉంటే అప్పుడు తొక్కిసలాట జరగకుండా వారు ఎలా ఆపగలుగుతారు? పోలీసులు ఎక్కువ మందిని పెడితే జనాన్ని రాకుండా పోలీసులు అడ్డుపడ్డారని అప్పుడు రాసేవారు. అసలు ఇరుకు రోడ్డులో సభ పెట్టడమేమిటని ఈ మీడియా ప్రశ్నించాలి. పైగా చంద్రబాబు ముందు నుంచీ జాగ్రత్తలు చెపుతూనే వున్నాడు అంటూ ఓ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎల్లో మీడియా. వ్యాన్ దిగండి, లేకపోతే లైవ్ టెలికాస్ట్ ఆగిపోతుందని చంద్రబాబు చెప్పారు కానీ, అంత మంది ఒకే చోట గుమ్మిగూడితే ప్రమాదం , జాగ్రత్త అని చెప్పలేదు, హెచ్చరించలేదు. చేయాల్సిన పని చేయకపోగా, గతంలోను ఇలాంటి ఘటనలు జరిగాయని ఒకసారి జగన్ సభలో గోడ కూలి ఒకరు, పవన్ సభలో ఒకరు, కుప్పం సభలో మరొకరు మరణించారంటూ కందుకూరు విషాదం తీవ్రతను తగ్గించే యత్నం చేశారు. బాబుకు ఇవి కొత్తేం కాదు ఇది చూశాక ఒక విషయం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలు జరిగాయి. తనకు కేటాయించిన ఘాట్ లో కాకుండా సామాన్య భక్తుల ఘాట్లో చంద్రబాబు తన కుటుంబంతో సహా స్నానాలు చేయడం, ఈ కార్యక్రమం ప్రచారం కోసం కెమెరాలు పెట్టడం, ఓ స్టార్ డైరెక్టర్ను తెచ్చి షూటింగ్ ఏర్పాట్లు చేయడం, ఆ క్రమంలో భక్తులందరిని గేటు వద్ద నిలిపివేయడం, తదుపరి ఒక్కసారిగా గేటు తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు వేల మంది పోలీసులు చంద్రబాబు భద్రతకు, పుష్కరాల నిమిత్తం ఉన్నారు. అయినా అంతమంది ఎలా చనిపోయారు? పైగా ఆ ఘటన నేపధ్యంలో చంద్రబాబు ఏమన్నారు? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో జరగలేదా? అని ఎదురు ప్రశ్నించి అంత విషాదాన్ని అపహాస్యం చేశారు. పైగా ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ అంటూ హడావిడి పెట్టి ఫైల్ మూసేశారు. చంద్రబాబు కుటుంబ స్నానాల వల్లే ఆ ఘటన జరిగిందని కలెక్టర్ ఇచ్చిన నివేదికను తొక్కేశారు. తప్పెవరిదో తెలుసా బాబు.? ఇప్పుడు చంద్రబాబు మరో ప్రకటన చేశారట. ప్రభుత్వంపై అవేశంతో ఎక్కువ మంది వచ్చారట. అది నిజమో,కాదో, ఆయనకు తెలుసు.సభలకు జనాన్ని ఎలా సమీకరిస్తారో, అందులో చంద్రబాబు స్టైల్ ఏమిటో, ఒక్కో సభకు ఎంత ఖర్చు చేస్తారో పార్టీ వారిని రహస్యంగా అడిగితే అంతా చెబుతారు. పాపం.. కొంతమంది డబ్బుకు ఆశపడి ఇలా సభలలోకి వస్తుంటారు. కొందరు మద్యం కోసం వస్తుంటారు. ఎలాగైనా రానివ్వండి.. అది వేరే విషయం. కాని వారు ఇలాంటి విషాద ఘటనలో మరణించడం మాత్రం బాధాకరం. నిజంగానే ప్రజలలో ప్రభుత్వంపై అంత ఆవేశం ఉందని టీడీపీ భావిస్తుంటే పెద్ద సభా స్థలి తీసుకునో, ఏ కాలేజీ మైదానమో తీసుకుని సభ జరిపితే వారికి మైలేజీ వచ్చేది కదా? వేలాది మంది వచ్చారని చెప్పుకునే అవకాశం ఉండేది కదా! మరి ముప్పై అడుగుల పట్టి,పట్టని రోడ్డు, అందులోను మళ్లీ తోపుడు బండి , లైవ్ వాన్ అన్నీ ఆ సందులోనే.. ఇదంతా కచ్చితంగా నిర్వాహకుల తప్పిదం. దానిని అనుమతించిన చంద్రబాబు నాయుడి తప్పిందం అన్నది తెలుస్తూనే ఉంది. తనంత సీనియర్ లేరని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన సభలను ఇలా చిన్న రోడ్లపై ఎందుకు పెడుతున్నారు? వీటిని డ్రోన్ ల ద్వారా చిత్రీకరిస్తున్నారు. నిజమే. ఏ సభకైనా ప్రచారం కోరుకుంటారు. తప్పు లేదు. కానీ ఆ ప్రచార యావలో ఇలా మనుషులను బలి తీసుకునే పరిస్థితి మంచిదికాదు. ఇప్పుడు జనం ఏమనుకోవాలి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కాదు .. తెలుగుదేశం సభలకు వెళ్లినవారికని ప్రజలు అనుకోరని ఎవరైనా భావించగలమా! -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తీరనున్న కల.. హైవే.. లైన్ క్లియర్
కందుకూరు వాసులను ఐదు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న 167–బి జాతీయ రహదారి నిర్మాణం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి కందుకూరు మీదుగా వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తారు. ఇప్పటికే భూసేకరణను పూర్తి చేసిన అధికారులు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కందుకూరు ప్రజల జాతీయ రహదారి కల తీరనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): కేంద్ర ప్రభుత్వం పలు ప్రధాన రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2017 సంవత్సరంలో రాష్ట్రంలో మూడు రోడ్లను జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. వాటిలో 167–బి ఒకటి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి (చెన్నై టు కోల్కతా – ఎన్హెచ్ 16) కడప జిల్లా మైదుకూరు వరకు (ఎన్హెచ్ 67) ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి 195 కి.మీల మేర పదిమీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు సింగరాయకొండ, కందుకూరు, పోకూరు, వలేటివారిపాళెం, మాలకొండ, పామూరు, సీఎస్పురం, డీజీపేట, అంబవరం, టేకూరుపేట, రాజాసాహెబ్పేట, వనిపెంట మీదుగా మైదుకూరు వరకు సాగనుంది. దీనికి 2018 కేంద్రమంత్రి నితిన్గడ్కరీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ కారణాలతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పనులను మొదలు పెట్టేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తొలి ప్యాకేజీ కింద వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు వేస్తున్నారు. మొదటి ప్యాకేజీ పనులిలా.. మొదటి ప్యాకేజీ కింద ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని మాలకొండ వరకు 45 కి.మీ. మేర రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.263 కోట్లను ఇప్పటికే కేటాయించారు. సింగరాయకొండ, కందుకూరు, వలేటివారిపాళెం మండలాల్లోని పలు గ్రామాల్లో భూసేకరణను పూర్తి చేశారు. మొత్తం 150 ఎకరాలను సేకరించి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని కూడా జమ చేశారు. గతేడాది ఆగస్టులోనే టెండర్లు పిలిచారు. 32 శాతం తక్కువకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తర్వాత పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో దానిని రద్దు చేసిన ఎన్హెచ్ అధికారులు కొత్తగా టెండర్లు పిలిచారు. అది త్వరలో ఫైనల్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే మొదటి ప్యాకేజీ పనులు ప్రారంభించనున్నారు. అలాగే మాలకొండ నుంచి సీఎస్ పురం వరకు రెండో ప్యాకేజీగా, సీఎస్ పురం నుంచి నెల్లూరు, కడప అడ్డరోడ్డు వరకు మూడో ప్యాకేజీగా, కడప అడ్డరోడ్డు నుంచి మైదుకూరు వరకు నాలుగో ప్యాకేజీగా టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తీరనున్న కల నిన్నటి వరకు అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా పేరు ప్రఖ్యాతలు పొందిన కందుకూరు పట్టణానికి భారీ స్థాయిలో రహదారి సౌకర్యం ఇప్పటివరకు లేదు. ప్రస్తుతం 167–బి నిర్మాణంతో కందుకూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి కొరత తీరనుంది. మొదటి దశలో 45 కి.మీ. రహదారి నిర్మాణంలో నాలుగైదు కిలోమీటర్లు మినహా మిగిలింది మొత్తం కందుకూరు నియోజకవర్గంలోనే జరుగుతుంది. ప్రధానంగా పట్టణానికి దక్షిణం వైపు భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే పోకూరు, వలేటివారిపాళెం వంటి ప్రాంతాల్లోనూ ఊరిబయటి నుంచి హైవే వెళ్తుందని భావిస్తున్నారు. ప్రవిత్ర పుణ్యక్షేత్రం మాలకొండకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడనుంది. -
సెల్ఫీ వీడియో..ఆపై ఆత్మహత్య
కందుకూరు: తనను పోలీసులు వేధిస్తున్నారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బూడిపాలేనికి చెందిన సయ్యద్ జహీర్ (31)కి పన్నెండేళ్ల క్రితం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన జరీనా అనే యువతితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కందుకూరు పట్టణంలోని బూడిపాలెంలో నివాసం ఉంటున్నారు. జరీనా వడ్డీ వ్యాపారం చేస్తూ భర్త జహీర్కు తెలియకుండా అప్పులు చేసింది. ఈ విషయమై భార్యా, భర్తల మధ్య వివాదం ఏర్పడింది. జరీనా పుట్టింటికి వెళ్లి తన భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి పోలీసుల నుంచి జహీర్కు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.పెద్దలు రాజీకి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా జరీనా సోదరులు, తండ్రి జహీర్ను దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన జహీర్ తనను బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు వేధిస్తున్నారని, భార్య తరఫు కుటుంబ సభ్యులు దూషిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి బూడిపాలెంలోని తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆదివారం పోలీసులు వచ్చి అతని సెల్ఫోన్ను పరిశీలించగా ఉరికి ముందు తన ఆత్మహత్యకు గల కారణాలను చెబుతూ తీసిన సెల్ఫీ వీడియో కనిపించింది. ఉరివేసుకుంటున్నట్లు భార్యకు సందేశం జహీర్ తాను ఉరేసుకునేందుకు చేసుకుంటున్న ఏర్పాట్లను వీడియో తీసి భార్యకు పంపి, ఫోన్లో కూడా మాట్లాడినట్లు సమాచారం. దీన్ని జరీనా పట్టించుకోలేదు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునే విషయం తమకు ఏమాత్రం తెలిసినా కాపాడుకునే వాళ్లమని జహీర్ తండ్రి ఆరీఫ్ విలపించాడు. -
కందూకురులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కందుకూరులో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement