-
తిక్కన సినిమా శ్రీశ్రీ తీస్తే!
1969 ఫిబ్రవరి 16. నెల్లూరు టౌన్హాల్లో వర్ధమాన సమాజం ఏర్పాటు చేసిన తిక్కన జయంతి సభ. ‘మహాత్మ కథ’ కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరిని గాంధీజీ శతజయంతి సందర్భంగా తిక్కవరపు రామిరెడ్డి సన్మానిస్తున్నారు. ఈ సభాధ్యక్షులెవరనుకున్నారు? విప్లవ కవి శ్రీశ్రీ! విచిత్రంగా లేదూ! నెల్లూరు పత్రికలు శ్రీశ్రీ ఉపన్యాసాన్ని వివరంగా రిపోర్టు చేశాయి. తిక్కనను ప్రజాకవిగా శ్రీశ్రీ అభివర్ణించాడు. ప్రజాకవి కనుకనే ‘ఆంధ్రావళి మొదముం బొరయ’ మహాభారతం రచించానని తిక్కన అనగలిగాడన్నాడు. నన్నయ శైలితో భారతానువాదం ఆరంభించి క్రమంగా తిక్కన శైలిలాగా పరిణమించేటట్లు ఎర్రన భారతశేషం పూరించాడని, ఇదొక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ అని శ్రీశ్రీ మెచ్చుకొన్నాడు. తిక్కన అనువాదంలో 75 శాతం తెలుగు పదాలే వాడాడని, నన్నయ అర్జునుణ్ణి ఇంద్రనందనుడు, శ్వేతవాహనుడు, సక్రందన నందనుడు అని పేర్కొంటే, తిక్కన కవ్వడి, వివ్వచ్చుడు, కర్రి వంటి తెలుగు పదాల్లో చెప్పాడని శ్రీశ్రీ అన్నాడు. పద్మవ్యూహాన్ని ‘తమ్మిమొగ్గరం’ అని తిక్కన మాత్రమే అనగలడని, తిక్కన వాడిన తెలుగు పదాలు పరిశీలిస్తే ఎంత క్లిష్టమైన భావాన్నయినా తెలుగులో చెప్పవచ్చని, తెలుగు పదసంపద గొప్పదని శ్రీశ్రీ అన్నాడు. నన్నయది పొయెట్రీ దట్ ఈజ్ సంగ్ అని, తిక్కన్నది పొయిట్రీ దట్ ఈజ్ స్పోకెన్ అని శ్రీశ్రీ వర్ణించాడు. తిక్కనలో నన్నయ కవితలోని చమత్కృతులు, తళుకుబెళుకులు ఉండవు. తిక్కన కవిత్వంలో డ్రమెటిక్ ఇన్సైట్ ఉంటుంది. కృష్ణుడు రాయబారం వెళ్లే సమయంలో తన తలవెంట్రుకలను చూపి, ‘‘ఇవి దుస్ససేను వ్రేళ్ళం/ దవిలి సగము త్రెవ్విపోయి తక్కినయవి’’ అని ద్రౌపది అంటుంది. ఈ ఘట్టంలో తిక్కన ఎక్స్ట్రీమ్ క్లోజప్లో ఆమె కురులను చూపుతాడు. విరుద్ధభావాల సంఘర్షణ లోంచి వెలువడిన ఒక సమన్వయభావాన్ని తిక్కన తన కవిత్వంలో ప్రతిపాదించాడని శ్రీశ్రీ భావించాడు. హరిహరుల నిద్దరినీ కలిపి ఒక కాంపోజిట్ ఇమేజ్గా– హరిహరనాథ స్వామిగా రూపకల్పన చేయడంలో ఈ ప్రక్రియ తనకు గోచరించిందన్నాడు. శ్రీశ్రీ తన ఉపన్యాసంలో తిక్కన జీవితం మీద తాను రాసిన స్క్రీన్ప్లే గురించి వివరించాడు. మనుమసిద్ధి మహారాజు భారతానువాదం పూర్తి చేయించాలనే దీక్షతో, నన్నయ పద్యాన్ని ఒక తాటాకు మీద రాయించి, అటువంటి పద్యమే ఇంకొకటి రాయమని కవులందరికీ పంపాడట. వెలయాలి ఇంట్లో ఊయల మీద కూర్చొని విలాసంగా తాంబూల చర్వణం చేస్తున్న తిక్కన వద్దకు ఈ తాళపత్రాన్ని తెచ్చి చూపించారట. తిక్కన పద్యం రాసి పంపకుండా ఆ తాళపత్రం మీద తాంబూలం వేసుకొన్న నోటితో ఉమ్మి వేశాడట! భటులు ఆ పత్రాన్ని మనుమసిద్ధికి చూపించారు. ఆగ్రహంతో ఉన్నపళంగా తిక్కనను పిలిపించి సంజాయిషీ అడిగాడు రాజు. నన్నయ్య ఉచ్చిష్టంతోనే కదా భారతం పూర్తిచెయ్యగలిగేది, నేను తాంబూల రాగంతో కాస్త మెరుగులు దిద్దగలనని సూచించాను తప్ప, అవమానించడానికి కాదని తిక్కన అన్నట్లు శ్రీశ్రీ ఆ దృశ్యాన్ని రాశాడట. తిక్కన సంసార జీవితాన్ని త్యాగం చేసి జీవితాన్ని భారతానువాదానికే వినియోగించినట్లు, వృద్ధాప్యంలో భారతం పూర్తయిన తర్వాత, ఆ రాతప్రతిని భార్య చేతిలో పెట్టి ‘దీన్ని నీ బిడ్డగా భావించు’ అని తిక్కన అనివుంటాడని శ్రీశ్రీ ఊహ చేశాడు. -కాళిదాసు పురుషోత్తం (సౌజన్యం: పెన్న ముచ్చట్లు) -
జీవితం ఒక గుజరాతీ నాటకరంగం
ఈ చివరి సన్నివేశం రోతగా ఉందని కొందరు విమర్శకులన్నారు గానీ, నిర్దిష్ట సమయంలో ఒకపాత్ర ఎట్ల ప్రవర్తిస్తుందో రచయిత తనదైన పద్ధతిలో భావిస్తాడు. తన భార్య మరణ వార్త తెచ్చిన బావమరిదిని ‘అపూ’ సాచి లెంపకాయ కొడ్తాడు. విమర్శకులకు సమాధానమిస్తూ అపూ ఆ క్షణంలో అట్లానే చేసి ఉంటాడని తన బుద్ధికి తోచిందంటాడు సత్యజిత్ రాయ్. ‘‘ఒరేయ్ కుంటివాడా! నీకు పులగం వద్దా? ఏమి తింటావురా?’’ సాయుధుడైన సిపాయి గద్దించాడు. ‘‘నేను రైతు బిడ్డను. నాకీ బిచ్చం అక్కర్లేదు’’ కాళా సమాధానం. ‘‘పటేలూ, ఏమికథ? నీకు పులగం అక్కర్లేదా?’’ సుందర్ సేఠ్ అడిగాడు. కాళా ఏమి జవాబిస్తాడు. వాళ్ళకు రైతు హృదయం తెలియదు. ‘‘ఈ ధాన్యం అంతా మేము పండించిందే అంటే తుపాకులతో బెదిరిస్తారు. ఈ తుపాకులన్నీ నాశనం చేయడానికి చెయ్యెత్త గలిగితే బాగుండును.’’ కాళా మనసులోనే అనుకుంటాడు. ‘‘మీరు రైతులు, భూమిని పాలించేవాళ్లు. మిమ్మల్ని మేం రక్షించగలమా? పిచ్చివాడా, ప్రకృతి ముందు మనమెంత వాళ్ళం. శక్తి హీనులం. రేపటినుంచి నువ్వు ఇక్కడ పని చెయ్యి. శ్రమ చేసి తినడంలో తప్పేమీ లేదు గదా.’’ సుందర్ సేఠ్ అనునయంగా అంటాడు. ఏడు దశాబ్దాల కిందట(1947) పన్నాలాల్ పటేల్ గుజరాతీ భాషలో రచించిన ‘మానవీనీ భవాయీ’ నవల చివరి భాగంలోది ఈ సన్నివేశం. ఆత్మాభిమానాన్ని త్యాగం చెయ్యలేక ఆత్మత్యాగానికైనా సిద్ధపడే రైతు మనస్తత్వాన్ని చాలా ఉదాత్తంగా ఈ నవలలో చిత్రించారు. ఉత్తర గుజరాత్ను అతలాకుతలం చేసిన మహాక్షామం(1899–1901) వరకు పాతికేళ్ళ కాళా జీవితాన్ని ఈ నవల చిత్రించింది. పేదరైతుల ఆశనిరాశలు, కష్టనష్టాలు, ప్రతి విషయాన్ని సమదృష్టిలో స్వీకరించే స్థితప్రజ్ఞత నవలలో పడుగు పేకల్లా అల్లుకుపోయాయి. పన్నాలాల్ నవలలన్నింటి మీద గాంధీజీ విచారధార ప్రభావం కూడా కన్పిస్తుంది. ఈ నవల తొలి భాగానికి వేమూరి ఆంజనేయశర్మ ‘జీవితం ఒక నాటకరంగం’ పేరుతో చేసిన అనువాదాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1971లో ప్రచురించింది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పన్నాలాల్ పటేల్ మూడు కథా సంకలనాలు, అరవై పై చిలుకు పౌరాణిక, సాంఘిక నవలలు రచించినా, వారి పేరు చాలా ఆలస్యంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. ‘మానవీనీ భవాయి’ నవలకు జ్ఞానపీఠ బహుమతి లభించినా, కావ్యశిల్పం దృష్టిలో ఆయన ‘మళేలా జీవ్(1941) నవలను పరిపూర్ణమైన విషాదాంత ప్రేమకావ్యంగా విమర్శకులు ప్రశంసించారు. పన్నాలాల్కు ఇష్టమైన రచన ఇదే. కులాంతర వివాహాలు ఊహకు గూడా అందని కాలంలో కన్జీ పటేల్, మంగలి కులంలో పుట్టిన జీవ్ ప్రేమించుకుంటారు. కన్జీకి అన్నకుటుంబం పోషించే బాధ్యత ఉంటుంది. తన మిత్రుడు సూచించిన ఉపాయం ప్రకారం ప్రియురాలు జీవ్ను ఊరి మంగలికిచ్చి పెళ్ళిచేస్తాడు గానీ పరిణామం వికటిస్తుంది. అనుమాన పిశాచియైన భర్త పెట్టే హింస భరించలేక జీవ్ తన ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పొరపాటుగా విషం తాగిన భర్త మరణించగా మతిభ్రమించిన జీవ్ బాధ్యత కన్జీ స్వీకరించడంతో నవల ముగుస్తుంది. ‘మళేలా జీవ్’ నవలలో మాదిరిగా సర్వాంగణమైన శిల్పం ‘మానవీనీ భవాయీ’లో లేకపోయినా, రచనలో కన్పించే జీవితం అందులోని బలహీనతలను కమ్మి వేసింది. పరిపూర్ణ నవలా శిల్పం కొరవడినా నవల ఇతివృత్తం నవలను గొప్ప రచనగా నిల్పుతుందనడానికి ఈ నవలే నిదర్శనం. పచ్చిగా, మొరటుగా ఉందని ముద్రపడకుండా, ఉత్తర గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవహారంలో ఉండే పదాలను, అభివ్యక్తిని పన్నాలాల్ తన సరళశైలిలో ఇముడ్చుకోగలిగారు. సంపన్నవర్గాల జీవితాలను ఆదర్శీకరించి కృతకమైన ఉద్వేగాలు, నిర్హేతుకమై భావావేశాలతో, సంస్కృత పద భూయిష్ఠమైన కావ్యశైలిలో అప్పటివరకు సాగిన గుజరాతీ కాల్పనిక సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన అపర భగీరథుడు, రైతుబిడ్డ, సహజ కథకుడు పన్నాలాల్ పటేల్. తెలుగు పాఠకులు ఈ నవలను చదువుతున్నప్పుడు అల్లం రాజయ్య నవలలు తప్పక గుర్తుకు వస్తాయి. ‘మానవీనీ భవాయీ’ కాళా, రాజు పాత్రలచుట్టూ పరిభ్రమిస్తూ గుజరాత్ పల్లీయుల జీవితాలకు అద్దం పడుతుంది. కాళా నిమిత్త మాత్రుడు. కాలమే కథను ముందుకు నడుపుతుంది. సడలని మనోధైర్యం, పట్టుదల తల్లి రూపా నుంచి, ఎంత దుఃఖాన్నైనా అధిగమించి ఆశావహంగా జీవించడం తండ్రి వాలాపటేల్ నుంచి పుణికి పుచ్చుకున్న కాళా పాత్ర కాలంతో పాటు పరిణతి చెందుతుంది. బక్కరైతు వాలా పటేల్ అరవయ్యో ఏట భార్య రూపా కాళాకు జన్మనిస్తుంది. వాలాపటేల్ మీది అభిమానంతో మంత్రగత్తెగా పేరుపడ్డ పుతామా నాలుగేళ్ల కాళాకు మూడేళ్లు గూడా నిండని రాజుతో పెళ్ళి నిశ్చయిస్తుంది. ఆమెకు ఎదురు చెప్పడానికి ఎవరు సాహసించరు. వాలా తన నాలుగేళ్ళ బిడ్డ కాళాను అన్న పరమా చేతుల్లో పెట్టి కన్నుమూస్తాడు. గయ్యాళి భార్య మాతా ముందు పరమా మంచితనం కొరగాకుండా పోతుంది. ఈ నవలలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న పాత్ర రూపాది. గ్రామీణుల విశ్వాసాలను తృణీకరిస్తూ, తాను వెంట ఉండి ఎనిమిదేళ్ల కాళా చేతికి మేడి పట్టించి పొలం దున్నిస్తుంది రూపా. ఆడది అరక పట్టినందువల్లే వర్షాలు పడలేదని మాతా, ఆమె కొడుకులు రణచోడుడు, నానా పంచాయితి పెట్టించి పొలంలో రూపాను పడుకోబెట్టి పైన ఎడ్లు తోలాలని తీర్పు చెప్పిస్తారు. రూపా నదురు బెదురు లేకుండా శిక్షకు సిద్ధ పడుతుంది. పొలంలో పడుకుంటుంది. కానీ ఎద్దుల్ని ఆమెపై తోలే లోపలే పెద్ద వర్షం కురిసి ‘‘రూపా పిన్ని మహిమాన్వితురాలు’’ అని జనం ప్రశంసలు పొందుతుంది. పన్నాలాల్ ఈ నవలలో గ్రామీణుల అంధవిశ్వాసాలను చిత్రిస్తునే, ధిక్కరించిన రూపాను వీరవనితగా ప్రదర్శించారు. అసూయాపరురాలు, జిత్తులమారి మాతా కాళా రాజుల పెళ్ళి సంబంధాన్ని చెడగొట్టి రాజును తన కొడుకు నానాకు రెండో భార్యగా చేయడానికి ఎన్ని కుతంత్రాలు పన్నుతుందో! చివరకు గ్రామ పంచాయతీ పెద్దలు కాళా పెళ్ళిని ఠాకూర్వాలా గ్రామంలోని భలీ అనే అమ్మయితోనూ, రాజు పెళ్లి భలీ అన్నతోనూ చేయాలని తీర్మానిస్తారు. కాళా రాజుల జీవితాలతో విధి ఆడిన ఆట ఇది. తాను కాపురానికి వెళితే తప్ప కాళా భార్య కాపురానికి రాదని గ్రహించి రాజు అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గూడా రాజు వివాహబంధం భగ్నం చేయడానికి కంకణం కట్టుకొన్న మాతాని ఆమె కొడుకులను రాజు ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ కుట్రలను తిప్పి కొడ్తుంది. కాళా వల్ల భార్యకు ఎటువంటి సంతోషమూ లేదని గ్రహించి, అతడు సన్యాసుల్లో కలిసిపోకుండా ఉండేట్టు ఓదారుస్తుంది. ‘‘అనుకుంటే’ అన్నీ ఉన్నవి’’ అని భావనా ప్రపంచంలో తన ప్రేమను సాగించవచ్చునని ‘‘మనుసులోనే నెమలిని ఆడించి’’ ఆనందించవచ్చునని కాళాకు హితవు చెబుతుంది. కరువొస్తుంది. భిల్లులు ఉళ్ళమీద పడి దోచుకుంటారు. కాటకం బీదా బిక్కి, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడాలు నిర్మూలించి అందర్నీ సమానం చేసింది. ఇప్పుడు రణచోడుడు, నానా, మొత్తం ఊరూ కాళా నాయకత్వం కిందికి వచ్చింది. ‘‘ఆకలి చెడ్డది. మనిషి చెడ్డవాడు కాడు! ఊరు ఆకలి బాధలో అలమటిస్తోంటే దోపిడీ చేయడం తప్పుకాదని కాళా తీర్మానిస్తాడు. గ్రామం మీదుగా వెళుతున్నా వడ్డీ వ్యాపారి ధాన్యం బండ్ల మీద దాడి చేస్తారు. ఈ కరువు దాడిలో కాళా కుడిభుజం తూటా దెబ్బలు తిని పనికిరాకుండా పోతుంది. బ్రతుకు దెరువుకోసం ప్రజలందరూ ‘డేగడియా’ గ్రామానికి వలస పోతారు. అక్కడ గౌరవ మర్యాదలు వదులుకొని కూలీనాలీ చేస్తారు. భలీ, రూఖీ వంటి స్త్రీలు రొట్టె ముక్కల కోసం మానం పణం పెడ్తారు. రెండేళ్ళయినా చినుకు రాలదు. కాళాలో జీవితాశ నశిస్తుంది. శక్తినంతా కూడ దీసుకొని బయల్దేరుతాడు. రాజు అతణ్ని అనుసరిస్తుంది. ‘‘ఇక అడుగు ముందుకు వేయలేను, మృత్యువు తప్పదు’’ అని హీన స్వరంతో అంటూ కాళా కుప్పకూలిపోతాడు. కాళా (మానసిక) దాహాన్ని తీర్చడానికి రాజు తన రొమ్ము అతని నోటికందించి ధైర్యం చెబుతుండగా ఈశాన్య దిక్కున మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో వాన చినుకులు పడుతాయి. ‘‘లే, పద. చీకటి పడుతోంది’’ రాజు అంటుంది. ‘‘ఇక నా కాళ్లు తడబడవు’’ కాళా సమాధానం. కాళా అంతరాత్మ మాట్లాడుతున్నట్లు రాజు గ్రహిస్తుంది. ఈ చివరి సన్నివేశం రోతగా ఉందని కొందరు విమర్శకులన్నారు గానీ, నిర్దిష్ట సమయంలో ఒకపాత్ర ఎట్ల ప్రవర్తిస్తుందో రచయిత తనదైన పద్ధతిలో భావిస్తాడు. తన భార్య మరణ వార్త తెచ్చిన బావమరిదిని అపూ సాచి లెంపకాయ కొడ్తాడు (అపూ సంసార్–సినిమా). అపూ ఆ క్షణంలో అట్లానే చేసి ఉంటాడని తన బుద్ధికి తోచిందంటాడు సత్యజిత్ రాయ్. ‘‘శరచ్చంద్రుడు ప్రతిష్ఠించిన స్త్రీ గౌరవం’’ రాజు పాత్రలో మూర్తీభవించింది. ఆమె పాత్ర నవల ఇతి వృత్తానికి ఆత్మ అని భావిస్తే కాళా జీవితాన్ని ప్రభావితం చేసిన రెండు శక్తులు రాజు, క్షామం. గుజరాత్లో వీధి భాగవతం వంటి జానపద కళా రూపాన్ని ‘భవాయీ’ అంటారు. కాళా జీవితం భవాయీ నృత్యం వంటిదే. ఈ నవలకు కొనసాగింపుగా పన్నాలల్ రెండు మూడు భాగాలు రాశారు గానీ మొదటి భాగానికి వచ్చిన పేరు ప్రఖ్యాతలు వాటికి రాలేదు. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం 9247564044
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement