-
వరంగల్ రాజకీయాలలో కాకా పుట్టిస్తున్న.. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ
-
ఆన్లైన్.. విద్యకు లైఫ్ లైన్: గవర్నర్
సాక్షి, కాజీపేట: ఆన్లైన్ విద్యాబోధన కరోనా నేపథ్యంలో లైఫ్లైన్గా మారిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కాజీపేటలోని నిట్లో మంగళవారం ‘ఆన్లైన్ విద్య – అవకాశాలు – సవాళ్లు’ అంశంపై జాతీయ స్థాయి వెబినార్ను నిర్వహించారు. ఈ వెబినార్ను హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ద్వారా గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. కరోనా విజృంభన విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో విద్యాబోధనను ఆన్లైన్లో కొనసాగిస్తున్నా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో విద్యాలయాలు మరింత కృషి చేయాలని సూచించారు. ఆదర్శంగా తెలంగాణ కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఆన్లైన్ విద్యాబోధన అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్కు వాక్సిన్ వచ్చేంత వరకు నేరుగా తరగతి గదుల్లో విద్యాబోధన సాధ్యం కాదని, ఆన్లైన్ బోధనే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, విజ్ఞానం, నైపుణ్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో నిట్ ముందంజలో నిలుస్తోందని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. దేశంలో నిర్వహించిన సర్వేలో వరంగల్ నిట్ ప్రథమంగా నిలిచిందని వెల్లడించారు. వెబినార్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆనంద్కిషోర్, నిట్ రిజిస్ట్రార్ ఎస్.గోవర్దన్రావు, ప్రొఫెసర్లు శ్రీనివాస్, హీరాలాల్, గంగాధరన్తో పాటు వివిధ ప్రాంతాల నుండి వెయ్యి మంది ఆన్లైన్ ద్వారా వెబినార్లో లో పాల్గొన్నారు. మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై -
కవలలపై కీచక తండ్రి అఘాయిత్యం
సాక్షి, కాజీపేట అర్బన్ : కంచె చేను మేసిన చందంగా కన్న తండ్రి, మేనమామ కలిసి మైనర్లు అయిన కవలలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇది. దీనికి సంబంధించి వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా షీ టీమ్స్ ఏసీపీ బాబురావు శుక్రవారం రాత్రి వివరాలు వెల్లడించారు. వరంగల్ కాశిబుగ్గలోని శ్రీనివాసకాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల కవలల కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి తండ్రి, మేనమామ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడేళ్ల నుంచి మేనమామ, ఏడాది కాలంగా తండ్రి బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అయితే, ఎవరికైనా చెబితే ఏమవుతుందోనన్న భయంతో బాలికలు లోలోపల కుమిలిపోతున్నారు. ఇటీవల వేధింపులు తీవ్రంగా కావడంతో తాము చదువుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు విషయాన్ని వెల్లడించారు. దీంతో ఉపాధ్యాయులు షీ టీంకు సమాచారం ఇవ్వగా.. నిందితులను అదుపులోకి తీసుకుని ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. మామ లైంగిక వేధింపులు.. కోడలి ఆత్మహత్య నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం మామునూరు: అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిపై 58 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన శుక్రవారం మధ్యా హ్నం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. తిమ్మాపురం గ్రామంలోని ఓ కాలనీకి చెందిన దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరి ఇంటి పక్కన ఉన్న పొలంలో ఐనవో లు మండలం గర్నెపల్లికి చెందిన చిదురాల యాకయ్య(58) పాలేరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా మొక్కజొన్న కంకులు ఇస్తానని చేనులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించా డు. ఇంతలోనే పానను పిలుస్తూ తల్లి రాగా యాకయ్య పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆయనను బాలిక తల్లిదండ్రులు పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించా రు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో నకిలీ టీసీ హల్చల్
సాక్షి, కాజీపేట రూరల్: సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో ఆదివారం ఓ నకిలీ టీసీ ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. అంతేకాకుండా బ్లేడ్తో ఒక ప్రయాణికుడిని గాయపరచిన ఘటన ప్రయాణికులలో, రైల్వేశాఖలో కలకలం రేపింది. కాజీ పేట జీఆర్పీ ఎస్సై జితేందర్రెడ్డి కథనంప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన గుండే టి రాజేష్(30) భువనగిరిలో కట్టెకోత మిషన్లో పనిచేస్తున్నాడు. సాయంత్రం భాగ్యనగర్లో భువనగిరికి చేరుకోగా మద్యం సేవించి ఉన్న రాజేష్ ఇంటికి వెళ్లేందుకు రైలెక్కాడు. నేను రైల్వే టీసీనంటూ బోగీల్లో టికెట్ లేని వారు జరిమానా కట్టాలని లేదంటే జైలుకు వెళ్తారని బెదిరించి డబ్బులు వసూల్ చేశాడు. అతడి వద్ద బ్లేడ్ను చూపిస్తూ ఒక ప్రయాణికుడిని గాయపరిచాడు. రైలు కాజీపేట జంక్షన్కు చేరుకోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచా రం ఇవ్వగా అతడిని అదుపులోకి తీసుకుని జీఆర్పీ పోలీస్స్టేషన్కు తరలించారు. సోమవారం రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. -
ఒకే ఇంట్లో ముగ్గురికి డెంగీ
కాజీపేట: ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలకు డెంగీ సోకిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని సోమిడి ఎస్సీ కాలనీకి చెందిన మురికిపుడి వినయ్కుమార్ ఇద్దరు పిల్లలు, అతని తమ్ముడు విక్రం కుమార్ కుమారుడికి నాలుగు రోజుల కింద తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ పిల్లలు డెంగీ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ధృవీకరించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై సోమిడి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి అర్చనను వివరణ కోరగా.. ఒకే ఇంట్లో ముగ్గురికి జ్వరాలు వచ్చిన మాట వాస్తవమేనని, మెరుగైన చికిత్స అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement