-
చుక్కల్లో బంగారం రేట్లు.. తక్కువ ధరలో ఎక్కువ నగలకు ప్రత్యామ్నాయం ఇదే!
పాత గుంటూరు: ఆభరణాలంటే మక్కువ చూపని వనితలు ఉండరు. ప్రతి మహిళకు వివిధ రకాల ఆభరణాలు ధరించి తోటి వారి ముందు హుందాగా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా పండుగలకు, పెళ్లిళ్ల సమయంలో ప్రత్యేక ఆభరణాలు వేసుకొని ముస్తాబవడానికి ఎంతో ప్రాధాన్య ఇస్తుంటారు. ధనవంతులు బంగారు, వెండి వస్తువులు కొనుగోలుకు ముందుకెళ్తుండగా ఆర్ధిక పరిస్ధితి అనుకూలించని వారు బంగారు ఆభరణాలు ధరించి ముచ్చట తీర్చుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. అది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకే మహిళలు ప్రత్యామ్నాయంగా రోల్డ్ గోల్డ్ వస్తువుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇవి కూడా అచ్చం బంగారు వస్తువుల్లాగే కనిపించడంతో చాలా మంది వివిధ రకాల మోడళ్ల వస్తువులను కొనుగోలు చేసి ముచ్చట తీర్చుకుంటున్నారు. ధనవంతులు కూడా బంగారంతో పాటు రోజువారీ కోసం రోల్డ్ గోల్డ్ వస్తువులపై మొగ్గు చూపుతున్నారు. మహిళల అభిరుచిని దృష్టిలో వుంచుకొని వ్యాపారులు కూడా లేటెస్ట్ మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పలు గోల్డ్ షోరూమ్లలో సైతం రోల్డ్ గోల్డ్ ఆభరణాలను విక్రయిస్తున్నారు. దీంతో వీరి వ్యాపా రం మూడు చైన్లు, ఆరు నెక్లెస్ల్లా వెలిగిపోతోంది. (చదవండి: ఇంట్లో ఈ గాడ్జెట్ ఉంటే కీటకాలు పరార్!) పండుగ సమయాల్లో విక్రయాల జోరు పండుగ సమయాల్లో రోల్డ్ గోల్డ్ ఆభరణాల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. నగరంలోని ప్రతి దుకాణం వినియోగదారులతో కళకళలాడుతుంది. చిన్నారులు, యువతులు, పెద్దవారు ఇలా అంతా వారి కి కావల్సిన వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వ్యాపారస్తులు కూడా వివిధ రకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే కార్యక్రమాల్లో విద్యార్ధినులు లేటెస్ట్ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ వేసుకుని సందడి చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా దుకాణాలు... ప్రస్తుతం బంగారం, వెండి ధరలు చుక్కలను అంటుతున్న సమయంలో రోల్డ్ గోల్డ్ వన్గ్రామ్ బంగారు వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలో 50 వరకు రోల్డ్ గోల్డ్ దుకాణాలు ఉన్నాయి. వాటిలో ఒరిజినల్ బంగారు వస్తువులను మైమరిపించే రీతిలో రోల్డ్ గోల్డ్ వన్గ్రామ్ బంగారు ఆభరణాలు అందుబాటులో దొరుకుతున్నాయి. ముఖ్యంగా అన్ని వర్గాల మహిళలు వినియోగించే చైన్లు, చెవిదుద్దులు, నెక్లెస్లు, హారాలు, గాజులు, తదితర వస్తువులు లభ్యమవుతున్నాయి. సాధారణ రోజుల్లో నెలకు రూ.50 లక్షలు వరకు వ్యాపారం జరుగుతుండగా, పెళ్లిళ్లు, పండుగల సీజన్లో కోటికి పైగానే వ్యాపారం జరుగుతుంది. ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వన్గ్రామ్ గోల్డ్ వస్తువులు వివిధ రకాలలో ఉంటాయి. వాటి నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి. చెవిబుట్టలు రకాన్ని బట్టి రూ. 250 నుంచి 2500 వరకు ఉంటాయి. నెక్లెస్లు రూ. 50 నుంచి 5 వేల వరకు ఉంటుంది. చైన్లు రూ.100 నుంచి 20 వేల వరకు, గాజులు రూ.100 నుంచి 3వేల వరకు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అవసరమయ్యే వడ్డానాలు రూ.400 నుంచి 10 వేల వరకు ఉంటాయి. (చదవండి: CM Jagan: థాంక్యూ సీఎం సార్ !) వ్యాపారం బాగా పెరిగింది రోల్డ్ గోల్డ్ వ్యాపారం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దుకాణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఒకప్పుడు జిల్లా కేంద్రానికి చెందిన మహిళలే ఎక్కువగా వచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా ఈ ఆభరణాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. సీజన్ బట్టి మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. – రమణారెడ్డి, షోరూం మేనేజరు -
రూ. 900 డ్రెస్ను 50 రూపాయలకే కొన్నా: నిహారిక
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్.. నిహారిక కొణిదెల. తెర పరిచయానికి ముందే ఫ్యాషన్ ఐకాన్గా గ్లామర్ ప్రపంచానికి ఆమె సుపరిచితం. ఆమె ఫ్యాషన్ సెన్స్ను ప్రతిబింబించే బ్రాండ్సే ఇవి.. కలశ ఫైన్ జ్యూయెల్స్.. కేవలం రూ. 40 పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు కోట్ల సామ్రాజ్యంగా మారింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో వీరిది 118 సంవత్సరాల అనుభవం. 1901లో శ్రీచంద్ర అంజయ్య పరమేశ్వర్ పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి, నెలకు రూ. 15 జీతంతో ఓ బంగారు ఆభరణాల దుకాణంలో చేరాడు. తర్వాత నలభై రూపాయలు పోగుచేసి స్వయంగా వ్యాపారం ప్రారంభించాడు. అందమైన ఆభరణాల డిజైన్స్ అందిస్తూ వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధించాడు. అప్పటి వరకు ‘చంద్ర అంజయ్య పరమేశ్వర్’ పేరుమీద ఉన్న దుకాణాన్ని ఈ మధ్యనే 2017లో ‘కలశ ఫైన్ జ్యూయెల్స్’గా మార్చారు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతరం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడల్లో బ్రాంచీలు ఉన్నాయి. ప్రత్యూష గరిమెళ్ల.. హైదరాబాద్కు చెందిన ప్రత్యూష గరిమెళ్ల.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. అనంతరం 2013లో హైదరాబాద్లో తన పేరుమీదే ఓ బొటిక్ ప్రారంభించింది. అతి సూక్ష్మమైన అల్లికలతో వస్త్రాలకు అందాన్ని అద్దడమే ఆమె బ్రాండ్ వాల్యూ. జర్దోసీ, సీక్వెన్స్, గోటా పట్టి వంటి అల్లికలు ప్రత్యూష డిజైన్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ను చేసింది. ధర కూడా డిజైన్ను బట్టే. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. బేరం బాగా ఆడతా.. ఒకసారి టెన్త్క్లాస్లో ఢిల్లీ ట్రిప్కు వెళ్లినప్పుడు ఖాన్బజార్లో రూ. 900 డ్రస్ను రూ. 50కే కొన్నా. అది కూడా గంటసేపు బేరం ఆడి. ఇప్పుడు బేరం ఆడటం కొంచెం తగ్గించా. – నిహారిక కొణిదెల డ్రెస్ డిజైనర్: ప్రత్యూష గరిమెళ్ల ధర:రూ. 44,800 జ్యూయెలరీ కలశ ఫైన్ జ్యూయెల్స్ ధర:ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
బంగారం దుకాణాలు కళకళ
-
పెళ్లి సందడి
‘పెళ్లి కళ వచ్చేసిందే బాల... పల్లకీని తెచ్చేసిందే బాల.. హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా.. ముచ్చటగా మేళం ఉందా ఆజా ఆజా.. తద్దినక తాళం ఉంది ఆజా ఆజా.. మంటపం రమ్మంటుంది ఆజా ఆజా.. జంటపడు వేళయ్యింది ఆజా ఆజా’.. ప్రేమించుకుందాం రా సినిమాలోని ఈ పాట ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్మోగుతోంది. పెళ్లి సందడి మొదలు కాగా.. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు వేలాది వివాహాలు ఖరారయ్యాయి. ఇప్పటికే ఫంక్షన్ హాళ్ల బుకింగ్ క్లోజ్ కాగా.. పెళ్లి సామగ్రి కొనుగోళ్లతో ఆయా షాపులు కిటకిటలాడుతున్నాయి. సాక్షి, వరంగల్ రూరల్: కార్తీక మాసం మొదటి పక్షం రోజులు గురుపాఢ్యమి ఉండటంతో వివాహ ముహూర్తాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ నెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలకు అనువైన రోజులుగా వేదపండితులు చెబుతుండటంతో జిల్లాలో పెళ్లిసందడి మొదలైంది. డిసెంబర్ 1 నుంచి 2018 ఫిబ్రవరి 16వ వరకు శుక్రపాఢ్యమి కొనసాగుతుండటంతో పెళ్లి ముహూర్తాలు లేకుండా పోయాయి. దీంతో పెళ్లి సంబంధాలు ఒకే చేసుకున్న వారు ఈ నెల 30వ తేదీ వరకే చేయాలని నిర్ణయించుకున్నారు. అందులోనూ 23, 24, 25, 26, 29, 30 తేదీల్లో శుభ మూహూర్తాలు ఉండటంతో వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడు నెలల వరకు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ఎంత కష్టమైన పెళ్లి చేద్దాం.. అని కొంత మంది నిర్ణయించుకుంటున్నారు. సమయానికి డబ్బులు అందకున్న అప్పు తెచ్చి వివాహాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ముహూర్తాలలో దాదాపు వెయ్యి నుంచి 2 వేలకు పైగా వివాహాలు జరుగనున్నాయి. అన్నింటికీ డిమాండ్.. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు ఉండటంతో కల్యాణ మండపాలు, గార్డెన్లు, ఫంక్షన్ హాల్లు, క్యాటరింగ్, ఫొటో వీడియో, అయ్యగార్లకు, టెంట్ హౌజ్లకు డిమాండ్ పెరిగిపోయింది. జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రముఖ కల్యాణ మండపాలతో పాటు చిన్న, మ«ధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాల్స్, ట్రావెల్స్, ప్లవర్స్ డెకరేషన్ ట్రూప్స్, బ్యాండ్ వాలలను ముందుగానే రిజర్వు చేసుకున్నారు. చిన్న పెద్ద పెద్ద హోటల్స్ రూమ్స్ ఇప్పటికే హౌజ్ఫుల్ అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 150కి పైగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా ఉన్నాయి. పెళ్లి ముహూర్తాల రోజున బుక్ చేద్దామంటే డేట్స్ ఖాళీలేవని కస్టమర్లకు చెబుతున్నారు. ముచ్చటైన వేదికలు... పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లదే కీలక పాత్ర. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటల్స్ కాన్ఫరెన్స్ హాళ్లు ఇందుకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. పట్టణాల్లో ఇంక కొంత మంది అయితే పెద్ద గ్రౌండ్లను ఎంచుకుంటున్నారు. అపురూపమైన సెట్టింగ్లు, ఎక్కడలేని విధంగా ప్రత్యేకంగా డెకరేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కన్పిస్తోంది. ఇందుకు ఎంత ఖర్చు పెట్టడానికైన వెనుకాడటం లేదు. సెట్టింగ్లు వేసేందుకు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల నుంచి ఆర్ట్ డైరెక్టర్లను కూడ రప్పిస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, స్క్రీన్లు ఏర్పాటు చేసి, వివాహ వేడుకను దూరంగా కూర్చున్నవారు, డిన్నర్ హాల్లో ఉన్న వారు సైతం ఎంతో క్లోజ్గా వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులు, రైళ్ల పైనా.. పెళ్లిళ్ల ప్రభావం.. ఈ పెళ్లి ముహూర్తాలతో బస్సులు రైల్వే టికెట్లు ఇప్పటికే చాలా వరకు రిజర్వేషన్ అయిపోయాయి. రైళ్లు రద్దీగా నడుస్తున్నాయి. ఏదేమైనా శుభముహూర్తాల పుణ్యమా అంటూ ట్రావెల్స్ కార్లు బిజీ అయిపోయాయి. రెట్టింపైన ధరలు.. పెళ్లి ముహూర్తాలు ముంచుకురావడంతో అన్ని ధరలపై ప్రభావం పడింది. సాధారణంగా ఒక పెళ్లికి రూ. 10వేలు తీసుకునే బ్యాండ్, డీజే వారు ఈ నెల అధికంగా పెళ్లి ముహూర్తాలు ఉండటంతో బ్యాండ్ వాలా రూ. 13 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో పురోహితుడు రెండు నుంచి మూడు పెళ్లిళ్లు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమచారం. సాధారణ సమయాల్లో ఉన్నా ఫంక్షన్ హాల్ల అద్దె 25 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నారు. తర్వాత ముహూర్తాలు ఫిబ్రవరిలోనే.. అక్టోబర్ 10వ తేదీ వరకు వివాహాలు జరిగాయి. మళ్లీ ఈ నెల 23, 24, 25, 26, 29, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఉన్నాయి. శుక్రపాఢ్యమి వచ్చింది. అందుకే ముహూర్తాలు లేవు. జిల్లాల్లో దాదాపు వెయ్యికి పైగా జంటలు ఒకటి కానున్నారు. – రాజ్కుమార్ శాస్త్రి, వరంగల్ వివాహాలకు అనువైన రోజులివి.. ఈ నెల 23 నుంచి వివాహాలకు మంచి ఘడియలు ఉన్నాయి. 30వ తేదీ నుంచి 2018 ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రపాఢ్యమి కొనసాగుతుంది. అందుకే చాలా మంది ఈ నెలలోనే వివాహం జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. – వి. రామచంద్రయ్యశర్మ, పురోహితులు బంగారం కొనుగోళ్లు పుంజుకున్నాయి... వివాహ ముహూర్తాలు వరుసగా ఉండటంతో బులియన్ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు పుంజు కున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధించిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో చాలా కాలం నుంచి బంగారం కొనుగోళ్లు సన్నగిళ్లాయి. అయితే కార్తీకమాసం అనంతరం పెళ్లిళ్లు, శుభ ముహూర్తాలు ఉండటంతో కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈనెల 23 నుంచి వరుసగా కళ్యాణాలు ఉండటంతో బంగారం అమ్మకాలు జరుగుతున్నాయి. – పోకల లింగయ్య, పోకల లింగయ్య జువెలర్స్ యజమాని, బులియన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, జనగామ. ముందే బుకింగ్... ఈ నెల 23, 24 తేదీలకు నెల రోజుల ముందే ఫంక్షన్ హాల్ బుకింగ్ అయింది. హాల్ కోసం చాలా మంది తిరిగి పోతున్నారు. నెల పది రోజుల సమయం తరువాత పెళ్లిళ్లు అవుతుండటంతో డిమాండ్ బాగా ఉంది. – రమేష్ రెడ్డి, భారత్ ఫంక్షన్ హాల్, భూపాలపల్లి ఎనిమిది కార్డులు వచ్చాయి.. ఈ నెల 23, 24 తేదీలకు సంబంధించిన పెళ్లి కార్డులు 8 కార్డులు వచ్చాయి. ఇంక దాదాపు 10 మంది దూరపు బంధువులు ఫోన్లు, వాట్సప్ ద్వారా ఆహ్వానించారు. అన్నింటికి అటెండ్ కావడం అంటే కొంత కష్టంగానే ఉంది. కానీ తప్పని పరిస్థితిలో అందరు దగ్గరి బంధువులు, స్నేహితులు కావడంతో నేను, మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వేరు చేసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇంక సమయం ఉంది. కాబట్టి మరికొన్ని కార్డులు వచ్చే అవకాశం ఉంది. – ఆడెపు రవీందర్, వరంగల్ -
బంగారు దుకాణంలో చోరీకి యత్నం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని ట్రంకురోడ్డులోని కుమార్ జ్యువెలరీస్లో శనివారం వేకువన గుర్తుతెలియని దుండగుడు చోరీకి యత్నించాడు. షట్టర్ను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగుడు ఆభరణాలను వెతికే క్రమంలో అలారమ్ మోగడంతో పరారయ్యాడు. పోలీసుల సమాచారం మేరకు....కామాటివీధికి చెందిన దేవిశెట్టి వెంకటసురేంద్రకుమార్ ట్రంకురోడ్డులో కుమార్ జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నారు. దుకాణంలో అధునాతన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, మోషన్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సీసీ కెమెరాల పరిధిలో కదలికలు, తాళాలు పగులగొట్టే ప్రయత్నాలు జరిగితే రికార్డు కావడమే కాకుండా అలారమ్ మోగుతుంది. రోజూలాగే గురువారం రాత్రి 10గంటలకు దుకాణం మూసివేశారు. వాచ్మెన్ వెంకటకృష్ణయ్య దుకాణం బయట విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం వేకువన 2.30 నుంచి 3 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుడు షాప్పైన(మూడోఫ్లోర్) షట్టర్ను కటింగ్ప్లేయర్, సుత్తి, స్పానర్ల సాయంతో పగులగొట్టాడు. అనంతరం కొంతభాగం పైకెత్తి లోనికి ప్రవేశించాడు. అనంతరం ప్రతి గదిని సోదా చేస్తూ కింద ఫ్లోర్లో ఆభరణాలు విక్రయించే కౌంటర్ వద్దకు వచ్చేసరికి అలారమ్ మోగింది. దీంతో వాచ్మెన్ వెంకటకృష్ణయ్య అప్రమత్తమై పెద్దగా కేకలువేయడం గమనించిన దుండగుడు దుకాణం పైభాగానికి చేరుకుని షట్టర్ కింద నుంచి పరారయ్యాడు. అలారం మోగిన ఘటనపై వాచ్మెన్ అందించిన సమాచారంతో సురేంద్రకుమార్, ఆయన సోదరుడు హుటాహుటిన షాపు వద్దకు చేరుకున్నారు. తలుపులు తెరచి చూడగా బంగారు, వెండి ఆభరణాలు ఎక్కడివి అక్కడే ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. చోరీకి యత్నంపై మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే అలారం మోగడంపై సమాచారం అందుకున్న రాత్రి గస్తీ సిబ్బంది నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ కుమార్ జ్యువెలరీస్ దుకాణాన్ని నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, మూడో నగర, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు బీ పాపారావు, షేక్ బాజీజాన్సైదా పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్టీం వేలిముద్రలను సేకరించింది. అనంతరం పోలీసు అధికారులు సీసీఫుటేజ్లను పరిశీలించారు. ïఫుటేజ్ల్లో నిందితుడు రెండు చేతులకు గ్లౌజ్లు ధరించి సెల్ఫోను లైట్ సాయంతో చోరీకి యత్నించడం కనిపించింది. దీంతో మూడో నగర పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని దుకాణాలపై నుంచి నిందితుడు కుమార్ జ్యువెలరీస్ సమీపంలోని మూడో దుకాణంపై నుంచి షాపు వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా నిందితుడు రెక్కీనిర్వహించి చోరికి యత్నించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పాతనేరస్తుడే జ్యువెలరీస్ దుకాణంలో చోరీకి యత్నించిన నిందితుడు విశాఖపట్నానికి చెందిన పాతనేరçస్తుడిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితుడితో పాటు అతని సోదరుడు గతంలో ఈ తరహానేరాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లినట్లు తెలిసింది. గతంలోనూ నిందితుడు ఇదే తరహా నేరానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం చోరీకియత్నించిన దుకాణానికి ఆనుకుని ఉన్న పీటర్ఇంగ్లాడ్ షోరూమ్లోనూ దొంగతనానికి యత్నించినట్లు సమాచారం త్వరితగతిన నిందితుడ్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
బాబుకు గుర్తు గుబులు
హరీష్ రావు ఎమోషనల్
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
Advertisement