-
ఒక్క నిజమైన చెప్పారా?
సాక్షి, విజయవాడ: జన్మభూమి పేరుతో రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవాస్తవాలు, అసత్యాలతో జన్మభూమి సందేశం ఉందని తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు తీసుకునే ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని తాము డిమాండ్ చేశామన్నారు. వైఎస్సార్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాయన్నారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. జన్మభూమి కార్యక్రమంతో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసినన్ని కుంభకోణాలు ఎవరైనా చేశారా అని నిలదీశారు. భూకబ్జా కేసులో జైలుకు వెళ్లిన దీపక్రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని అనంతపురం జన్మభూమిలో నీతులు చెబుతారా అని అడిగారు. టీడీపీ పచ్చ చొక్కాల సంక్షేమం కోసమే జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇది జన్మభూమి కాదు... జాదుభూమి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జన్మభూమిలో ఒక్క నిజమైన చెప్పారా? ఆయన చెప్పినవన్నీ నిజాలని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను భోగి మంటల్లో తగలబెడతారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కాదు, చంద్రబాబు కుటుంబ సంక్షేమం కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. -
పించన్లు, రేషన్ కార్డులు.. భారీగా అడుగుతున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల సందర్భంగా అందిన అన్ని అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇన్నాళ్లూ అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా జన్మభూమి సభల్లో జనం నిలదీతలు, నిరసనలతోపాటు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తుండటంతో మాట మార్చారు. తాను స్వయంగా నిర్వహించిన సర్వే ప్రకారం పింఛన్లు, రేషన్ కార్డులు ఇంకా ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోందని జన్మభూమి నిర్వహణ తీరుపై గురువారం కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులుతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి 3,00,570 ఆర్జీలు అందినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు తెలిపారు. ఇందులో అత్యధికం ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లకు సంబంధించినవేనని తెలిపారు. సీఎం నిజాలను ఒప్పుకోవటానికి కారణం సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటమేనని రాజకీయ విశ్లేషకులతోపాటు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
గృహాల నిర్మాణం త్వరగా చేపట్టండి
పెద్దారవీడు: ఎన్టీఆర్ పథకం ద్వారా మంజూరైన గృహాలను వెంటనే నిర్మంచుకోవాలని మార్కాపురం గృహా నిర్మాణశాఖ ఈఈ కె బసవయ్య పేర్కొన్నారు. మంగళవారం పెద్దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో పలు గ్రామాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మించుకోని లబ్దిదారుల పేర్లను తొలగించి నిబంధనల ప్రకారం అర్హులైన కొత్త లబ్దిదారులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికి పెద్దదోర్నాల మండలంలో 45, పెద్దారవీడు మండలంలో 135 గృహాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. మిగత లబ్దిదారులు వీలైనంత త్వరగా గృహా నిర్మాణాల పనులు చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ పథకంలో మొత్తం రూ 1.50 లక్షలు, వీటిలో ఉపాధి హామీ పథకం రూ 58 వేలు, ఆ నిధులలో ప్రభుత్వం నుంచి 80 బస్తాలు సిమెంట్ ఇస్తుందని, లభ్ధిదారుని వాటా 18 వేలు లోను కట్టాల్సి ఉంటుందని, మిగత డబ్బులు పూర్తిగా సబ్సిడీ వర్తిస్తుందని, పిఎంజివై పథకంలో రూ 2 లక్షలు వాటిలో ఉపాధి హామీ పథకంలో రూ 61,260 వేలు, ఈ నిధులలో 100 బస్తాలు సిమెంట్ ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. బేస్మింట్ లెవెల్, రూప్ లెవెల్, రూఫ్ కాస్టెడ్, కంప్లీట్, మరుగుదొడ్డి దశల వారిగా బిల్లులు మంజూరు చేస్తామని, నిర్మించుకున్న లబ్దిదారులకు వెంటనే బిల్లులు చేస్తున్నమన్నారు. త్వరలో జన్మభూమిలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి నియోజకవర్గానికి 2200 గృహాలు మంజూరు కావచ్చన్నారు. ఆయన వెంట పెద్దారవీడు ఏఈ నిరీక్షణబాబు ఉన్నారు. -
‘జన్మభూమి’ పాపం.. కార్యదర్శులకు శాపం
దెందులూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో మృతులకు పింఛన్లు ఇస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని కొందరు మృతులకు పింఛన్ మంజూరు చేయడంతో పాటు పంపిణీ చేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారు. రూ.1.79 లక్షలు అవకతవకలు జరిగినట్టు సోషల్ ఆడిట్లో అధికారులు గుర్తించారు. పెదవేగి మండలంలో రూ.1.15 లక్షలు, దెందులూరు మండలంలో రూ.39 వేలు, ఏలూరు మండలంలో రూ.22 వేలు, పెదపాడు మండలంలో రూ.3 వేలు దుర్వినియోగమైనట్టు నిర్దారించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, పింఛన్లు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే గుడ్డిగా అందిస్తుండటంతో ముగ్గురు కార్యదర్శులు బలయ్యారు. దెందులూరు మండలంలోని దోసపాడు, కేఎన్ పురం, గాలాయిగూడెం గ్రామ కార్యదర్శులు శరత్, ప్రసాద్, అవినాష్ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పల్లచింతలపూడి గ్రామ కార్యదర్శిపై చర్యలకు పంచాయతీరాజ్ కమిషనర్కు నివేదించారు. పై నాలుగు మండలాల్లో జన్మభూమి కమిటీ సభ్యుల సమక్షంలో నిధులు దుర్వి నియోగం జరిగినా దెందులూరు మండలంలో ముగ్గురిపై మాత్రమే వేటు వేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జన్మభూమి కమిటీల ఒత్తిడి మేరకే గ్రామ కార్యదర్శులు మృ తులకు పింఛన్లు మంజూరు చేశారనే విమర్శలూ ఉన్నా యి. ఏలూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో నిధులు దుర్వినియోగానికి కారకులైన గ్రామ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లపై చర్యలకు అధికారులు ఆదేశించినట్టు తెలిసిం ది. దుర్వినియోగమైన మొత్తంలో 90 శాతం నగదును రాబట్టి ట్రెజరీకి జమచేశామని ఎంపీడీఓలు చెబుతున్నారు. ప్రతి పైసా రికవరీ చేస్తాం గ్రామ పంచాయతీల్లో మృతులకు పెన్షన్ సొమ్ము మంజూరు చేసి దుర్వినియోగం చేసిన వ్యవహారంలో ప్రతిపైసా ప్రభుత్వ ఖాతాకు జమయ్యేలా రికవరీ చేస్తాం. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వపరంగా త్వరలోనే చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ, ఏలూరు చర్యలు ప్రారంభించాం దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో మృతులకు పెన్షన్లు మంజూరు చేసి నిధులు దుర్వినియోగం చేశారని సోషల్ ఆడిట్ అధికారులు ధ్రువీకరించారు. దెందులూరు మండలంలో ఇప్పటికే ముగ్గురు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. ఓ కార్యదర్శికి పెనాల్టీ విధించి చర్యల నిమిత్తం పంచాయతీరాజ్ కమిషనర్కు సమాచారం అందించాం. మిగతా మూడు మండలాల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం. – సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి -
మోసం తప్పా మేలేమి చేశారు!
- ఆయకట్టు రద్దుపై నోరు మెదపరెందుకు? - ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా? - మంత్రి సునీతపై తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం ఆత్మకూరు (రాప్తాడు) : అధికారం చేపట్టిన ఈ రెండున్నరేళ్లలో ప్రజలను టీడీపీ ప్రజాప్రతినిధులు మోసగించడమే తప్పా చేసిన మేలేమీ లేదని, ముఖ్యంగా పరిటాల సునీత మంత్రి పదవి చేపట్టినా నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడారు. గత మూడు విడతల జన్మభూమి అర్జీలను పరిష్కరించలేని మంత్రి సునీత.. నాల్గో విడత సభల్లో ప్రజలు తనను నిలదీయకుండా ఉండేందుకు విపక్ష నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వరుస కరువులతో రైతులు, కూలీలు వలసలు పోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలోనూ దాదాపు వంద కుటుంబాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస పోయాయని, ఇది మంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి.. నియోజకవర్గంలోని 20 వేల మంది యువతకు మొండి చేయి చూపారన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే వెయ్యి మంది రేషన్డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను అన్యాయంగా తొలగించారని వివరించారు. రైతాంగ సమస్యలపై మంత్రికి ఏ మాత్రమూ అవగాహన లేదని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఇలాంటి వైఖరి ఉన్న ఆమె ప్రజలకు ఎలా మేలు చేయగలరని ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. ఎకరాకు రూ. 15వేల ఇన్పుట్ సబ్సిడీ, సంపూర్ణ రుణమాఫీ, హంద్రీనీవా ద్వారా 74 వేల ఎకరాలకు నీటినిచ్చేందుకు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం వంటి రైతుల డిమాండ్లపై మంత్రి ఎక్కడా నోరు మెదపడం లేదన్నారు. ‘హెచ్చెల్సీ నుంచి దాదాపు 15 టీఎంసీల నీరు ప్రతి ఏటా మనకు రాకపోయినా... దాని గురించి మీరు గానీ, మీ ముఖ్యమంత్రి గానీ కర్ణాటక ప్రభుత్వంతో లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఈ 15 టీఎంసీల నీటిని అప్పర్‡భద్ర కాలువ ద్వారా హంద్రీనీవా ఎగువన ఉన్న బీటీపీకి, పేరూరు డ్యాంకు, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని చెరువులకు చేర్చే అవకాశం ఉన్నప్పటికీ మీరెందుకు ప్రయత్నం చేయరు’ అని మంత్రిని ప్రశ్నించారు. జీఓ నంబర్ 22 ద్వారా డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసినా, కుప్పంకు నీటిని తరలించడానికి రాప్తాడు ప్రాంత ఆయకట్టును ఫణంగా పెట్టినా మంత్రి నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు. 40 టీఎంసీలకు హంద్రీ- నీవా సామర్థ్యం పెంచి నీటిని కుప్పంకు తీసుకెళ్తే అర్థం ఉంది కానీ.. నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసి, తద్వారా మిగులు నీటిని తరలించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement