-
'అసలు యుద్ధాన్ని ఊహించనే వద్దు'
వాషింగ్టన్: భారత్-పాకిస్థాన్ మధ్య సమస్యకు యుద్ధం పరిష్కారం అవుతుందని తాను అనుకోవడం లేదని అమెరికాలో పాక్ రాయభారి జలీల్ అబ్బాస్ జిలానీ అన్నారు. కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం అవుతుందని, అయితే అలా చర్చించే అంశాల్లో కశ్మీర్ అంశం కూడా ఉండాలని చెప్పారు. 'యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు. ముఖ్యంగా అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య. అసలు యుద్ధాన్ని ఊహించకూడదు కూడా. అందుకే పాకిస్ధాన్ అంతర్జాతీయ న్యాయ సమాజం ప్రకారం కశ్మీర్ తో సహా ప్రతి సమస్యను చర్చ ద్వారానే పరిష్కరించుకోవాలని అనుకుంటోంది' అని జిలానీ చెప్పారు. -
పాక్ రాయబారితో మిషెల్లీ ఫొటోపై దుమారం!
అమెరికాలోని పాకిస్థాన్ ప్రధాన రాయబారి జలిల్ అబ్బాస్ జిలానీ ఇటీవల చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామాతో ఆయన, ఆయన భార్య దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్లో పెట్టడం అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించినట్టు కథనాలు వచ్చాయి. 'ఫ్లోటస్కు పాకిస్థాన్ హౌస్లో ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందం కలిగిస్తున్నది' అంటూ గత మే నెలలో జిలానీ ట్వీట్ చేశాడు. మిషెల్లీతో ఆయన, ఆయన భార్య కలిసి దిగిన ఫొటోను ఈ ట్వీట్కు జోడించారు. అమెరికా ప్రథమ పౌరురాలిని ఆంగ్ల సంక్షిప్త అక్షరాలతో కలిపి ఫ్లోటస్ అని సన్నిహితులు మాత్రమే పిలుస్తారు. అధికారికంగా ఇలా పిలువడాన్ని అనుమతించారు. ఈ నేపథ్యంలో కొంతసేపటికీ ఈ ట్వీట్ను ఆయన తొలగించారు. అయితే, ఈ విషయంలో పాక్ రాయబారిని తీవ్రంగా మందలిస్తూ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ తాజాగా ఓ లేఖ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. ఒబామా కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయం కలిగించేందుకు ఈ ఫొటోను జిలానీ ట్వీట్ చేశారని, ఇది సరికాదని వైట్హౌస్ పేర్కొన్నట్టు సమాచారం. పాక్ రాయబారి ఇంటికి మిషెల్లీ వెళ్లడం వ్యక్తిగత అంశమని, దీని నుంచి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే సరికాదని వైట్హౌస్ కూడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఒబామా కూతుళ్లు, పాక్ రాయబారి జిలానీ కొడుకు ఒకే పాఠశాలలో చదువుతుండటంతో, జిలానీ కొడుకు గ్రాడ్యుయేషన్ పార్టీకి మిషెల్లీ హాజరైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, తమ రాయబారిని మందలిస్తూ వైట్హౌస్ లేఖ రాసిందన్న వార్తలను పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. ఈ విషయంలో వైట్హౌస్ ఎలాంటి లేఖ రాయలేదని పేర్కొంది. -
యూఎస్లో పాక్ నూతన రాయబారిగా జిలానీ
అమెరికాలో పాకిస్థాన్ నూతన రాయబారిగా జలీల్ అబ్బాస్ జిలానీని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గత రాత్రి పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జలీల్ అబ్బాస్ జిలానీ పాక్ విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కావున డిసెంబర్ మాసంలో జిలానీ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. గతంలో జిలానీ పాక్ రాయబారిగా బెల్జియం, లక్సింబర్గ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో పని చేశారని ఈ సందర్భంగా తెలిపింది. అలాగే 1990 -1992 మధ్య కాలంలో పాక్ ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారని వెల్లడించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement