-
ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ధన ప్రవాహాన్ని నిలువరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బ్యాంకుల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) డేగ కన్నేసింది. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు లావాదేవీల సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు అందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల సమాచారాన్ని అన్ని బ్యాంకులు వెంటనే ఐటీ శాఖకు అందజేయాలని సూచించింది. ఒక్క రోజులో రూ.10 లక్షలు అంత కన్నా ఎక్కువ ఉపసంహరణ, డిపాజిట్లు, నెలరోజుల్లో రూ. 50 లక్షలకు పైగా ఉపసంహరణ, డిపాజిట్లపై రోజువారీ నివేదికలను ఐటీ శాఖకు అందజేయాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలవారీగా బ్యాంకులన్నీ ఈ నివేదికలు పంపాలని స్పష్టం చేసింది. రూ. 2,000 కన్నా ఎక్కువగా డిజిటల్ బదిలీల సమాచారాన్ని కూడా ఐటీ శాఖకు పంపాలని తెలిపింది. ఒక ఖాతా నుంచి పలు ఖాతాలకు డిజిటల్ చెల్లింపులు, ఒక మొబైల్ నుంచి పలు మొబైల్ నంబర్లకు నగదు బదీలీల సమాచారాన్ని కూడా ఇవ్వాలని సూచించింది. వీటిపై క్షేత్రస్థాయిలో బ్యాంకుల సిబ్బందికి అవగాహన కల్పిచాలని తెలిపింది. ఎటువంటి అనధికార కార్యకలాపాలకు పాల్పడకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నగదు తరలింపును నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ శాఖలతో కలిపి 105 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం తనిఖీలు చేస్తోంది. -
ఏపీలో ఐటీని అభివృద్ధి చేసింది ఎవరు ?..ఈ నిజాలు రాసే దమ్ముందా రామోజీ
-
ఏపీలో ఐటీ రంగంలో అభివృద్ధిని ఓర్చుకోలేకపోతోన్న రామోజీ
-
వావ్..విశాఖ!
సాక్షి, అమరావతి : పాలనా రాజధానిగా సర్వ హంగులూ సమకూర్చుకుంటున్న విశాఖ ముఖచిత్రం మారుతోంది. ఐటీ రంగంలో ఇప్పటివరకూ బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్సోర్సింగ్(బీపీవో) కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన ఈ నగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్మెంట్ సెంటర్ను విశాఖలో ఏర్పాటుచేయడంతో.. అదే బాటలో మరికొన్ని సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాక ఎప్పటి నుంచో విశాఖ కేంద్రంగా బీపీవో సర్వీసులు నడిపిస్తున్న విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. లావండర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ డెవలప్మెంట్ సెంటర్లో విశాఖ కేంద్రంగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఇంతకాలం విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లను ఆకర్షించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్తో పాటు మరికొన్ని.. ఇప్పటివరకు బీపీవోల కేంద్రంగా ముద్ర ఉన్న విశాఖకు ఇన్ఫోసిస్ రాకతో ఆ ముద్ర చెరిగి.. డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(అపిటా) గ్రూప్ సీఈవో ఎస్.కిరణ్కుమార్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థలు డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పగా, తాజాగా ఇన్ఫోసిస్ 1,000 సీటింగ్ సామర్థ్యంతో క్యాంపస్ను ఏర్పాటుచేసింది. రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా విప్రో కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. అలాగే, అదానీ డేటా సెంటర్ కూడా ఏర్పాటుకానుండటం.. సింగపూర్ నుంచి సముద్రమార్గం ద్వారా ఫైబర్నెట్ కనెక్షన్ ఏర్పాటవుతుండటం.. పారిశ్రామిక రంగంలో నాలుగో తరం ఆవిష్కరణలను ప్రోత్సహించేలా దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ.. కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటుచేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటెక్స్, డేటా ఎనలిటిక్స్ వంటి వాటిపై పరిశోధనలను ప్రోత్సహించేలా ఆంధ్రా వర్సిటీలో మరో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ ఏర్పాటుకావడంతో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు ఆసక్తిచూపుతున్నాయి. అతి తక్కువ వ్యయంతో పుష్కలమైన మానవ వనరులున్న నగరాల్లో విశాఖ ముందంజలో ఉందని తాజాగా నాస్కామ్–డెలాయిట్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం కూడా విశాఖకు కలిసివస్తోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉండటంతో విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు పలు సంస్థలు చర్చలు జరుపుతున్నాయని, వీటిలో చాలా సంస్థలు స్టాక్ఎక్సే్ఛంజ్లలో నమోదు కావడం వల్ల వాటి వివరాలను అప్పుడే చెప్పలేమని ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ చెప్పారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానుండటం, రహేజా గ్రూపు ఇన్ఆర్బిట్ మాల్ను ఏర్పాటుచేస్తుండటంతో విశాఖ త్వరలోనే పూర్తిస్థాయి కాస్మోపాలిటన్ నగరంగా మారనుంది. దీంతో ఐటీ నిపుణులు పనిచేసేందుకు విశాఖను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయని పల్సస్ గ్రూపు సీఈవో గేదెల శ్రీనుబాబు వివరించారు. బీచ్ ఐటీ డెస్టినీగా విశాఖ.. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో.. ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ విశాఖ రావడం వలన మరిన్ని ఐటీ పరిశ్రమలు ఇక్కడకు వచ్చే అవకాశముందని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాక్సెంచర్, సీడాక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పలు ఐటీ సంస్థలు రాష్ట్రంలో శాఖల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, ఈ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంతో పాటు, ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలు తీర్చడంపై దృష్టిసారించినట్టు శశిధర్ వెల్లడించారు. -
హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి..!
-
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే
తుర్కయాంజాల్: రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని మున్సిపల్, ఐటీ, చేనేత శాఖ మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. ఆ సంకీర్ణ సర్కారులో తమ పాత్ర తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో సోమవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేనేత గురించి, నేత కార్మికుల గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. నేతన్నల కష్టాలను స్వయంగా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో వారికి ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు ఇప్పటివరకు అందిస్తున్న పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. హ్యండ్లూమ్ బోర్డు, పవర్లూమ్ బోర్డు, మహాత్మాగాంధీ బీమా బంకర్ యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి పథకాలను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. చేనేత వద్దు–అన్నీ రద్దు అనే నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని విమర్శించారు. సంకీర్ణంలో ఉంటే రాష్ట్రానికి సంస్థలు, అదనపు నిధులు.. కేంద్రంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంటేనే రాష్ట్రంలో ఇంటీరియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఏర్పాటు ద్వా రా చేనేతకు మంచి రోజులు సాధ్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా నిధులు తెచ్చుకోవచ్చన్నారు. ఉప్పల్ భగాయత్లో నిర్మించనున్న కన్వెన్షన్, ఎక్స్పోలో ఏడాదంతా చేనేత ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కష్టకాలంలో చేనేత కార్మికులను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే నేత కార్మి కుల బతుకుల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. నేత కార్మికులకు వరాలు... చేనేత మిత్ర పథకంలో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికీ రూ. 3 వేలు అందిస్తామని, 75 ఏళ్లలోపున్న చేనేత కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని, రూ. 25 వేల పరిమితితో హెల్త్ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గుంట మగ్గాల స్థానంలో 10,652 ఫ్రేమ్లూమ్స్ మగ్గాలు తెస్తామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ. 40.50 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. చేనేత, అనుబంధ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు ఇస్తున్న రూ. 12,500 మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచుతామని చెప్పారు. డీసీసీబీల సహకారంతో పెట్టుబడి సాయం అందిస్తామని, ఇంటి వెనక మగ్గాల షెడ్ ఏర్పాటు చేసుకొనేందుకు గృహలక్ష్మి పథకంలో అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కులవృత్తులకు జీవం... నేతన్నకు, గీతన్నకు అవినాభావ సంబంధం ఉందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులు పూర్తిగా నష్టపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవం పోసుకుంటున్నాయని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తోందని శాసనమండలి సభ్యుడు ఎల్.రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్తోపాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఉప్పల్ భగాయత్లో చేనేత భవన్కు భూమిపూజ ఉప్పల్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ భగాయత్లో చేనేత భవన్ నిర్మాణంతోపాటు హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితో కలసి మంత్రి కేటీఆర్ సోమవారం భూమిపూజ చేశారు. 2,576 చదరపు గజాల్లో నిర్మించనున్న చేనేత భవన్కు దాదాపు రూ. 50 కోట్ల వ్యయం కానుండగా 500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న మ్యూజియానికి రూ. 15 కోట్లు ఖర్చు కానుంది. కాగా, ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి కారిడార్ పనులు త్వరలో పూర్తి చేయాలని, ఉప్పల్ భగాయత్లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాలు కేటాయించాలని, 100 పడకల అసుపత్రి నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్కు బేతి సుభాష్ రెడ్డి వినతిపత్రం అందించారు. -
AP: ఐటీ ఎగుమతుల్లో బూమ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు గత నాలుగేళ్లుగా వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. స్టాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), వీసెజ్ల్లో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా 2022–23లో రాష్ట్రంలో రూ.1,649.25 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగినట్లు ఐటీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఎస్టీపీఐలో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా రూ.972.43 కోట్ల ఎగుమతులు జరగగా వీసెజ్ కంపెనీల ద్వారా రూ.676.82 కోట్ల ఎగుమతులు జరిగాయి. రూ.5,000 కోట్లపైనే! 2019–20లో ఏపీ నుంచి రూ.1,087.4 కోట్ల ఐటీ ఎగుమతులు నమోదు కాగా నాలుగేళ్లలో 34 శాతం పెరిగాయి. నాలుగేళ్లలో ఎస్టీపీఐ కంపెనీల ద్వారా ఎగుమతులు రూ.846.77 కోట్ల నుంచి రూ.972.43 కోట్లకు పెరిగితే వీసెజ్ ద్వారా ఎగుమతులు రూ.240.63 కోట్ల నుంచి రూ.676.82 కోట్లకు చేరుకున్నాయి. ఇంకా పలు ఐటీ కంపెనీల ఆడిటింగ్ పూర్తికాలేదని, ప్రాథమిక సమాచారం మేరకు 2022–23 ఐటీ ఎగుమతుల అంచనాలను రూపొందించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రం నుంచి భారీగా ఎగుమతులు జరుగుతున్నా వాటి ప్రధాన కార్యాలయాలు ఇక్కడ లేకపోవడంతో మన రాష్ట్ర పరిధిలోకి రావడం లేదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రం నుంచి కనీసం రూ.5,000 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరుగుతున్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్నెళ్లలో వరుసగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ కంపెనీలు విశాఖతోపాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కి ముందు రాష్ట్రంలో ఐటీ కంపెనీల సంఖ్య 178 కాగా ఇప్పుడు 372కి చేరుకోవడం గమనార్హం. గత ఆర్నెళ్ల వ్యవధిలో అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, బీఈఎల్, ఇన్ఫోసిస్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్వేర్, టెక్బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ లాంటి డజనుకుపైగా ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటైనట్లు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిటా) గ్రూపు సీఈవో ఎస్.కిరణ్ కుమార్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇవికాకుండా మరికొన్ని కీలక ఐటీ కంపెనీలతో చర్చలు తుది దశలో ఉన్నట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీల ద్వారా అదనంగా 20,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు. విస్తరిస్తున్న కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుండటంతో ఇప్పటికే ఏర్పాటైన పలు ఐటీ కంపెనీలు భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా విశాఖకు పరిమితమైన టెక్ మహీంద్రా తాజాగా విజయవాడలో కార్యకలాపాలను ప్రారంభించింది. గన్నవరం మేథా టవర్స్లో 120 మంది సీటింగ్ సామర్థ్యం ఉన్న కార్యాలయాన్ని టెక్ మహీంద్రా ప్రారంభించింది. హెచ్సీఎల్ విజయవాడ నుంచి విశాఖకు విస్తరించగా, విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్, పల్ససెస్ ఐడీఏ లాంటి 30కిపైగా ఐటీ, ఐటీ ఆథారిత సేవల కంపెనీలు విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది. 2012లో కేవలం 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు డబ్ల్యూఎన్ఎస్ సీఈవో కేశవ్.ఆర్.మురుగేష్ ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీలతోపాటు విస్తరణ ద్వారా గత మూడేన్నరేళ్లలో రాష్ట్రంలో 23,000 మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించింది. 2019 నాటికి రాష్ట్రంలో 35,000గా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 58,000కి చేరినట్లు (అపిటా) గ్రూపు సీఈవో కిరణ్కుమార్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఐటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖలో మిలియన్ టవర్ రెండో దశ నిర్మాణ పనులు పూర్తి కాగా తాజాగా రూ.300 కోట్లతో ఐస్పేస్ బిజినెస్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి అదనంగా అదానీ డేటా సెంటర్లో ఐటీ పార్క్ను అభివృద్ధి చేస్తోంది. -
రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ. 2.20 లక్షల కోట్లు!
రాష్ట్ర ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.2 లక్షల కోట్లు దాటుతున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరగగా.. 2022–23లో ఇది 20 శాతానికిపైగా వృద్ధిరేటు సాధించినట్టు ఐటీశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ రంగం పురోగతికి సంబంధించిన నివేదికను ఆ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి జూన్ మొదటి వారంలో నివేదికను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో వృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనలోనూ మంచి పురోగతి సాధించామని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో 1.53 లక్షల ఉద్యోగాల కల్పన జరగగా.. ఈసారి ఆ సంఖ్య రెండు లక్షలకు చేరి ఉంటుందని పేర్కొంటున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5లక్షల ఉద్యోగాల కల్పన జరగ్గా.. అందులో మూడో వంతు హైదరాబాద్ నుంచే ఉందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరు, పుణె, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలను హైదరాబాద్ అధిగమించిందని అంటున్నాయి. ఐటీ రంగ కార్యకలాపాల విస్తరణ వల్లే.. కోవిడ్ నేపథ్యంలో పెరిగిన డిజిటలైజేషన్, తద్వారా వచి్చన కొత్త అవకాశాలను అందుకోవడంలో హైదరాబాద్లో ముందు వరుసలో ఉందని.. అందువల్లే శరవేగంగా వృద్ధి సాధ్యమవుతోందని ఐటీశాఖ వర్గాలు చెప్తున్నాయి. 1,500కుపైగా ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాల కంపెనీలతో హైదరాబాద్ ఐటీ హబ్గా మారిందని అంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించడంలో భాగంగా.. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్లలో ఐటీ హబ్లను ప్రారంభించిందని గుర్తు చేస్తున్నాయి. హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో రూపొందించిన గ్రిడ్ పాలసీ ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని అంటున్నాయి. టీహబ్తోపాటు పలు ప్రైవేటు ఇంక్యుబేషన్ సెంటర్ల కార్యకలాపాలు ఊపందుకోవడంతో.. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ వృద్ధి ఇదే వేగంతో కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి వేగంగా.. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57,258 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2021–22 నాటికి రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. అప్పట్లో 3.23 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2021–22 నాటికి 7.78లక్షలకు చేరింది. అంటే ఎనిమిదేళ్లలో కొత్తగా 4.54 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2035 నాటికి రూ.2.09లక్షల కోట్లకు చేరుతాయని గతంలో నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఒక్కటే, 2022–23 నాటికే ఈ అంచనాలను దాటుతుండటం గమనార్హమని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో 2026 నాటికి ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అంతకన్నా ముందే ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఐటీ శాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల సంఖ్య ఏడాది ఐటీ ఎగుమతులు (రూ.కోట్లలో) ఉద్యోగాలు 2013–14 57,258 3,23,396 2014–15 66,276 3,71,774 2015–16 75,070 4,07,385 2016–17 85,470 4,31,891 2017–18 93,442 4,75,308 2018–19 1,09,219 5,43,033 2019–20 1,28,807 5,82,126 2020–21 1,45,522 6,28,615 2021–22 1,83,569 7,78,121 -
ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ శాఖకు చెందిన 86 మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులకు సోమవారం బదిలీ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురికి పదోన్నతులు సైతం కల్పించింది కేంద్రం. హైదరాబాద్ ఐటీ చీఫ్ వసుంధర సిన్హాను ముంబైకి బదిలీ చేసింది సీబీడీటీ. హైదరాబాద్ కొత్త ఐటీ చీఫ్గా శిశిర్ అగర్వాల్ను నియమించింది. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
ఎన్డీటీవీ వాటా కొనుగోలు: కొనసాగుతున్న వివాదం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో గల వాటాను గతంలో ఐటీ అధికారులు తాత్కాలిక అటాచ్మెంట్ చేపట్టిన నేపథ్యంలో ఈక్విటీ మార్పిడికి ఐటీ శాఖ నుంచి అనుమతులు పొందవలసి ఉంటుందని ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఆదాయపన్ను శాఖ అధికారులకు దాఖలు చేస్తున్న అప్లికేషన్కు జత కలవమంటూ అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ను ఆహ్వానించింది. అయితే ఈ వివాదాన్ని వీసీపీఎల్ తప్పుపట్టింది. చెల్లించని రుణాలకుగాను వారంట్లను వెనువెంటనే ఈక్విటీగా మార్పు చేయమంటూ ఆర్ఆర్పీఆర్ను మరోసారి డిమాండ్ చేసింది. వారంట్లను ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ 99.5 శాతం వాటాను పొందేందుకు నిర్ణయించుకుంది. తద్వారా మీడియా సంస్థ ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను సైతం ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరలో రూ. 493 కోట్లు వెచ్చించేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. -
పల్లెకు పోదాం చలో చలో.. రివర్స్ మైగ్రేషన్కు మోడల్గా నిలిచిన మన్దీప్ కౌర్
పట్టణాల్లో ఉపాధి వెదుక్కుంటూ చాలామంది పట్నం బాట పడుతుంటే, పల్లెకళ మాయమవుతోంది. ఏ మూల చూసినా నిరుపేద నిశ్శబ్దం. అలాంటి పల్లెల్లో పంజాబ్లోని తంగ్రా కూడా ఒకటి. ఒకప్పుడు ఈ మారుమూల గ్రామం గురించి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు తెలుసో తెలియదుగానీ మన్దీప్కౌర్ పుణ్యమా అని ఇప్పుడు చాలా ప్రసిద్ధి పొందింది. ‘రివర్స్ మైగ్రేషన్’కు మోడల్గా నిలిచింది. ‘రూరల్ ఐటి మోడల్’ కాన్సెప్ట్కు అపారమైన బలాన్ని ఇచ్చింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మన్దీప్ చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది. ‘మన జీవితాలు మారాలంటే చదువు తప్ప మరోదారి లేదు’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన మన్దీప్కు రహేజా గ్రూప్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం పాతికవేలు. ఆ తరువాత... బ్యాంకాక్కు చెందిన ప్రసిద్ధనగల కంపెనీలో ఉద్యోగం చేసింది. అక్కడ మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది. వివాహం తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో పాటు అమెరికా వెళ్లింది కౌర్. భర్త ఐటీ ప్రొఫెషనల్. అక్కడ ఉన్నప్పుడు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేసింది. తన ఆలోచనను భర్తతో పంచుకుంటే ఆయన సానుకూలంగా స్పందించారు. అలా ‘శింబాక్వార్జ్’ రూపంలో తొలి అడుగుపడింది. ఈ ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ సక్సెస్ అయింది. కొన్ని సంవత్సరాల తరువాత స్వదేశానికి తిరిగివచ్చిన కౌర్ తన స్వగ్రామం తంగ్రాలో ‘శింబాక్వార్జ్’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. పల్లెటూరిలో ఐటీ కంపెనీ ఏమిటి! అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకురాలేదు. మౌలిక వసతుల లేమి అనేది మరో సమస్య. అయితే ఆమె సంకల్పబలానికి ఇవేమీ అడ్డుకాలేదు. తన సేవింగ్స్తో కంపెనీ మొదలుపెట్టింది. ప్రారంభంలో ముగ్గురు ఉద్యోగులు ఉండేవారు. ఐఐటీ, ఐఐఎంఎస్ క్యాంపస్లలో నుంచి చురుకైన స్టూడెంట్స్ను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్నారు. తంగ్రా గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువతీ,యువకులు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తమ ఊళ్లోనే, తమ దగ్గరి ఊళ్లోనే ఐటీ కంపెనీ మొదలైందని తెలిసి కొద్దిమంది చేరారు. అలా కంపెనీ ప్రస్థానం మొదలైంది. కొద్దికాలంలోనే మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, కన్సల్టేషన్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్...మొదలైన విభాగాల్లో ‘శింబాక్వార్జ్’ దూసుకుపోయింది. ఉద్యోగుల సంఖ్య వందకు పెరిగింది. కంపెనీ పుణ్యమా అని ఊళ్లో సందడి పెరిగింది. కొత్త కళ వచ్చింది. అయితే కరోనా కఠోర సమయంలో పెద్ద సవాలు ఎదురైంది. పెద్ద పెద్ద కంపెనీలే ఉద్యోగులను తొలిగిస్తూనో, జీతాలు బాగా తగ్గిస్తూనో ఉన్న కాలం అది. ‘శింబా’ కంపెనీ సంక్షోభంలోకి వెళ్లింది. ‘అలాంటి కఠిన సమయంలోనూ ఏ ఒక్క ఉద్యోగిని కంపెనీ నుంచి తీసివేయాలని, జీతం తగ్గించాలనుకోలేదు. ఎందుకంటే నన్ను నమ్మి ఎన్నో కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. అవసరం అయితే జీరో నుంచి మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్. గడ్డుకాలం పూర్తయిన తరువాత... కంపెనీ మళ్లీ ఊపందుకుంది. ‘స్మైల్స్ కేర్’ అనే స్వచ్చంద సంస్థను నెలకొల్పి గ్రామాలలోని అట్టడుగువర్గాల ప్రజలకు సేవ చేస్తుంది కౌర్. మరోవైపు మోటివేషనల్ స్పీకర్గా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖాముఖీ సమావేశం అయిన మన్దీప్కౌర్, ఆయన నుంచి ప్రశంసలు అందుకుంది. -
‘గ్రిడ్’తో రాజధాని అంతటా ఐటీ గుబాళింపు
దేశానికి ఐటీ హబ్గా ఎదు గుతూ ప్రపంచస్థాయి సంస్థల గమ్యస్థానంగా మారుతోంది హైదరాబాద్ నగరం. ఈ నేప థ్యంలో నగరం నలుదిశలా అభివృద్ధి చెందేందుకు ‘గ్రోత్ ఇన్ డిస్పర్షన్ ’(గ్రిడ్) పాలసీకి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం మాదా పూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రాం గూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే 90 శాతానికి పైగా నెల కొని ఉంది. ఫలితంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కూడా ఇలాగే అభివృద్ధి చేయడం కోసం ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలను స్థాపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రిడ్ పాలసీకి రూపకల్పన చేసింది. హైదరాబాద్ ఒకప్పుడు పరిశ్రమలకు కేంద్రంగా ఉండేది. అయితే, కాలక్రమంలో వీటిలో కొన్ని మూత బడ్డాయి. ఇలా మూతబడిన పరిశ్రమలు ఉన్న స్థలా లన్నీ గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ఈ స్థలాల్లో ఐటీ సంస్థల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా ఔటర్ రింగ్ రోడ్డు బయట ఏర్పాటు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. నగరం బయటకు వెళ్లిన పరిశ్రమల స్థానం లోనూ ఐటీ సంస్థల ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. నగరంలోని 11 పారిశ్రామికవాడలను ఐటీ పార్కులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలి, కాటేదాన్, పటాన్చెరు, రామచంద్రాపురం, సనత్ నగర్, బాలానగర్, గాంధీనగర్, కూకట్పల్లి పారిశ్రా మిక ప్రాంతాలను క్రమంగా ఐటీ పార్కులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రిడ్లో భాగంగా ఏర్పాటయ్యే సంస్థలకు ప్రోత్సాహకంగా విద్యుత్ పైన సబ్సిడీగా యూనిట్ ఇన్సెంటివ్స్ ఇస్తోంది. 500 కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే యూనిట్లను యాంకర్ యూనిట్లుగా పరిగణించి యాంకర్ ఇన్సెంటివ్లను అందిస్తోంది. 50 శాతం భూమిని ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల ఏర్పాటుకు, మిగతా 50 శాతం భూమిని నివాస, వాణిజ్య అవసరా లకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. హైదరాబాద్ తూర్పు వైపున ఐటీ, ఐటీ అను బంధ రంగాల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో ఇప్పటికే పలు సంస్థలు ఉండగా ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఉప్పల్ కేంద్రంగా నగరానికి తూర్పు వైపున ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉప్పల్కు మెట్రో కనెక్టివిటీ ఉంది. కొత్తగా భారీ స్కైవే నిర్మాణం జరుగుతోంది. అధునాతన స్కైవాక్ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రభుత్వ కృషితో సమీప భవిష్యత్తులోనే ఉప్పల్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రూపు రేఖలు మారనున్నాయి. అలాగే హైదరాబాద్ ఉత్తరం వైపున ఉన్న కొంపల్లి, బహదూర్పల్లి, పటాన్చెరు, బౌరంపేట, కండ్లకోయ ప్రాంతాల్లో కూడా ఐటీ సంస్థల ఏర్పా టుకు అనువైన పరిస్థితులను కల్పిస్తోంది ప్రభుత్వం. కండ్లకోయలో 10.11 ఎకరాల విస్తీర్ణంలో గేట్వే ఐటీ పార్క్ పేరుతో రెండు భారీ ఐటీ టవర్ల నిర్మాణం జరగనుంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ దీనికి శంకు స్థాపన చేశారు. ఇక్కడ 10 వేల మంది యువతకు ఐటీ, దాని అనుబంధ రంగాల్లో ఉపాధి లభించ నుంది. ఇదే విధంగా హైదరాబాద్ దక్షిణ వైపున ఆదిభట్ల, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో నగరం నలువైపులా ఐటీ వెలుగులు విరజిమ్మనున్నాయి. వ్యాసకర్త: ఎన్. యాదగిరిరావు జీహెచ్ఎమ్సీ అదనపు కమిషనర్ మొబైల్: 97044 05335 -
తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం: సీఎం జగన్
-
ఐటీశాఖ, డిజిటల్ లైబ్రరీపై సీఎం వైస్ జగన్ సమీక్ష
-
తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ, డిజిటల్ లైబ్రరీపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్తోపాటు.. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు ఉండాలని అధికారులకు సూచించారు. డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులతోపాటు.. అన్ని రకాల పోటీల పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్ ఉండాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలకూ ఇంటర్నెట్ సదుపాయం అందించాలని, నిరంతరం ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆగస్టు 15న పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈలోగా స్థలాలు గుర్తించి హ్యాండోవర్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నాటికి డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా.. ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు సీఎం జగన్కు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి గౌతమ్రెడ్డి, ఐటీ, ఫైబర్ నెట్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఐటీశాఖ 2020-21 7వ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. '' విపక్ష , స్వపక్ష అనే తేడా లేకుండా అందరినీ సమ దృష్టితో చూడాలి. రాష్ట్రాలను కలుపుకుని పోతేనే అభివృద్ధి సాధ్యం. కరోనా వల్ల పారిశ్రామిక రంగం దెబ్బతింది. ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇక 2020-21కి సంబంధించిన ఐటీశాఖ వార్షిక నివేదికను పారదర్శకత కోసం విడుదల చేశాం. క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి సాధించాం.అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాం. జాతీయ వృద్ధిరేటుతో పోల్చితే తెలంగాణ వృద్ధిరేటు రెండింతలు అధికం. ప్రస్తుత ఏడాది రూ.1,45,500 కోట్ల ఎగుమతులు చేశాం'' అని తెలిపారు. చదవండి: భాష వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందన ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా? -
‘వారు ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదు’: కేటీఆర్
ఖమ్మం: ‘కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు పెద్దగా సహకారం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. విభజన చట్టంలో ఎన్నో మాటలు చెప్పారు. కానీ, ఏ ఒక్క మాటా నిలుపు కోలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాజీ పేటలో కోచ్ ఫ్యాక్టరీ కావొచ్చు.. మన రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు కావొచ్చు. మన దగ్గర నుంచి తీసుకోవడమే తప్ప.. తిరిగి ఇచ్చింది లేదు. ఇన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్లో.. సీఎం నేతృత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే.. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ఖమ్మం నగరంలో రూ.25 కోట్లతో ఆధునిక బస్టాండ్ను నిర్మించుకున్నాం. దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం ఉండ టంతో దేశవృద్ధి రేటు కన్నా రెట్టింపు వేగంతో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ ఎగుమతులు రూ.58 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.1.49 లక్షల కోట్లకు పెరిగాయి’అని మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరం, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో రూ.423.26 కోట్లకు సంబంధించి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, నిర్మాణం చేయనున్న పనులకు శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం నగరంలో నూతన ఆర్టీసీ బస్టాండ్, 1,004 డబుల్ బెడ్రూం ఇళ్లు, వైకుంఠధామం, మిషన్ భగీరథ కింద ఏర్పాటు చేసిన 45 వేల మంచినీటి కనెక్షన్లతోపాటు ఇంటింటికీ ప్రతి రోజూ మంచినీటి సరఫరా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. రెండో ఐటీ హబ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లి నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్స వం చేయడంతోపాటు వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట రవాణా మంత్రి పువ్వాడ అజయ్, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఐటీ హబ్ ప్రాంతం, నూతన బస్టాండ్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఐటీ దిగ్గజాలు హైదరాబాద్ బాట.. దేశంలోనే బెంగళూర్, చెన్నై, కోల్కతా, పుణే వంటి నగరాలను కాదని ఐటీ కంపెనీలు హైదరాబాద్ బాట పడుతున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలైన ఖమ్మం, కరీంనగర్, నిజామా బాద్, మహబూబ్నగర్ జిల్లాలకు ఐటీ హబ్లు వచ్చాయని, త్వరలో నల్లగొండ, సిద్దిపేట, రామగుండం ప్రాంతాల్లో ఐటీ హబ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువత హైదరాబాద్కో.. బెంగళూరుకో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టీ ఫైబర్ ప్రాజె క్టుతో రాష్ట్రంలోని కోటి ఇళ్లకు రానున్న కాలంలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కామర్స్, ఎడ్యుకేషన్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం స్వయంగా పూనుకుని ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. ఆర్టీసీ లాభాల బాట పట్టేలా కృషి చేస్తున్నారన్నారు. ఖమ్మం వచ్చి నేర్చుకోవాలి.. ఏ ప్రభుత్వమైనా, ప్రజాప్రతినిధి అయినా కోరుకునేది ప్రజల కోసం తపించడమేనని, మంత్రి పువ్వాడ కూడా అలాగే చేస్తున్నారన్నారు. ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చి నేర్చుకోవాలన్నారు. ముందు చూపుతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, దీంతో ఖమ్మం రూపురేఖలే మారాయన్నారు. మిగిలిన పనులు కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని చెప్పారు. మంచి చేసే వారిని ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారన్నారు. చేసిన పనిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు మనం చేసిన పనులు చెప్పుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మ, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, లావుడ్యా రాములునాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
లండన్ను వెనక్కినెట్టిన బెంగళూరు
సాక్షి, బెంగళూరు : బెంగళూరు.. భారతదేశ ఐటీ రాజధాని. ఈ పేరును ఉద్యాన నగరి మరోసారి సార్థకం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఐటీ రంగం వృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఐటీ రంగం అభివృద్ధి విషయంలో యూరోపియన్ నగరాలు లండన్, మ్యూనిచ్, బెర్లిన్లను సైతం వెనక్కి నెట్టి బెంగళూరు అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. బెంగళూరు తర్వాత దేశీ నగరాల్లో ముంబై ఆరోస్థానంలో ఉంది. డీల్రూమ్.సీవో సమాచారాన్ని ది మేయర్ ఆఫ్ లండన్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, పెట్టుబడుల ఏజెన్సీ సంస్థ లండన్ అండ్ పార్టనర్స్ విశ్లేషించి ఈ ర్యాంకింగులను ప్రకటించింది. 2016 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించి బెంగళూరుకు అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. 2016–2020 మధ్య కాలంలో బెంగళూరులో ఐటీ పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగాయి. 2016లో 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉండగా 2020 నాటికి 7.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. చదవండి: ఇద్దరు సీఎంల మధ్య భూవివాదం మహారాష్ట్ర ముంబైలో 1.7 రెట్లు మేర పెట్టుబడులు పెరిగాయి. 2016లో 0.7 బిలియన్ డాలర్లు ఉన్న పెట్టుబడులు ఆ తర్వాత 2020 నాటికి 1.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక లండన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 2016లో 3.5 బిలియన్ డాలర్లు ఉండగా 2020లో 10.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. లండన్లో వృద్ధి రేటు మూడు రెట్లుగా ఉంది. ప్రపంచ సాంకేతికత వెంచర్ క్యాపిటలిస్టు (వీసీ) పెట్టుబడుల్లో కూడా బెంగళూరు దూసుకుపోతుండడం విశేషం. వీసీ పెట్టుబడుల్లో బెంగళూరులో ప్రపంచంలోనే ఆరోస్థానంలో నిలిచింది. అయితే వీసీ పెట్టుబడుల ర్యాంకింగుల్లో బీజింగ్, శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షాంఘై, లండన్ నగరాలు బెంగళూరు కన్నా ముందుగా ఉన్నాయి. ఇక ముంబై ఈ విషయంలో 21వ స్థానంలో ఉంది. -
పబ్జీ ‘ఆట’కట్టు
-
పబ్జీ ‘ఆట’కట్టు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా కవ్వింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా మొబైల్ యాప్లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పబ్జీ మొబైల్ లైట్, బైదు, బైదు ఎక్స్ప్రెస్ ఎడిషన్, అలీపే, వాచ్లిస్ట్, వీచాట్ రీడింగ్, కామ్కార్డ్తో పాటు పలు గేమింగ్ యాప్లు నిషేధానికి గురైన వాటిలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ కేంద్రం వీటిపై కొరడా ఝళిపించింది. పబ్జీ గేమ్ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్లో పబ్జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు. లద్దాఖ్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29న కేంద్ర ప్రభుత్వం... అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్టాక్, యూసీ బ్రౌజర్తో సహా మొత్తం 59 చైనా యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. తర్వాత మరో 47 యాప్లను నిషేధిత జాబితాలో చేర్చింది. బుధవారం వేటుపడిన వాటితో కలిపితే ఇప్పటిదాకా భారత్ మొత్తం 224 చైనా యాప్లపై నిషేధం విధించింది. భారత్ లాంటి పెద్దమార్కెట్లో ఉనికి కోల్పోవడం ఈ చైనా కంపెనీలకు ఆర్థికంగా పెద్దదెబ్బే. టిక్టాక్పై భారత్ నిషేధం విధించాక... అమెరికా కూడా అదేబాటలో నడిచిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15కల్లా టిక్టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మివేయాలని, లేని పక్షంలో నిషేధం అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. దేశ భద్రతకు ముప్పు... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు– 2009 పరిధిలో ఈ 118 యాప్లను నిషేధించింది. అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా ఆయా మొబైల్ యాప్లు భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, ప్రజాభద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున వాటిపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖకు వివిధ వర్గాల నుంచి ఆయా యాప్లపై అనేక ఫిర్యాదులు అందాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్లను దుర్వినియోగం చేయడం, వినియోగదారుల డేటాను దొంగిలించడం, అనధికారికంగా భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా పంపించడం చేస్తున్నట్టు కేంద్రం గ్రహించింది. ఈ డేటా సంకలనం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను చివరికి జాతీయ భద్రతను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే విషయమని, దీనిని నిరోధించే తక్షణ చర్యలో భాగంగా ఈ యాప్లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ హానికరమైన మొబైల్ యాప్స్ నిరోధించటానికి సమగ్రమైన సిఫారసు పంపింది. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి కూడా వీటిని నిషేధించాలన్న డిమాండ్ ఉందని కేంద్ర ఐటీ శాఖ వివరించింది. -
ఐటీ వృద్ధిరేటు రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర ఐటీ రంగం అద్భుత ప్రగతిని సాధించిందని, జాతీయ సగటుకు మించి ఐటీ సేవలను ఎగుమతి చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు జాతీయ సగటు 8.09 శాతం మాత్రమే ఉండగా, రాష్ట్రం 17.97 శాతం వృద్ధిని సాధించిందన్నారు. రాష్ట్రానికి ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు సైతం వచ్చాయన్నారు. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని, మైక్రాన్ తన అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించాయని గుర్తుచేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగ విస్తరణకు ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతమయ్యాయని, టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీలు వరంగల్లో తమ కేంద్రాలను ప్రారంభించాయన్నారు. వరుసగా ఆరో ఏడాది శనివారం ఆయన ఇక్కడ రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక ప్రగతి నివేదిక–2019–20ను ఆ విష్కరించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ఐటీ శాఖ కీలక సేవలందిం చిందని కేటీఆర్ ప్రశంసించారు. కరోనా రో గులతో కాంటాక్ట్లోకి వచ్చిన వారిని గుర్తించే ందుకు, హోమ్ క్వారంటైన్లో ఉన్న వారిపై నిఘా ఉంచేందుకు, వలంటీరింగ్ వంటి విషయాల్లో ఐటీ శాఖ సాంకేతిక సేవలందించిందని, పలు డిజిటల్ సొల్యూషన్లు అందించేందుకు భాగస్వామిగా నిలిచిందన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. ► 2018–19తో పోలిస్తే 2019–20లో దేశ ఐ టీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.61 % నుంచి 11.58 శాతానికి పెరిగింది. ► ఐటీ ఉద్యోగాల వృద్ధిరేటు జాతీయ సగటు 4.93 శాతం ఉండగా, తెలంగాణలో 7.2%గా నమోదైంది. ► తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఆధ్వర్యంలో మీ–సేవ కేంద్రాల ద్వారా రోజూ లక్షమంది 600కుపైగా సేవలు పొందుతున్నారు. ► ఆన్లైన్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు, ఇతర సేవల కోసం తీసుకొచ్చిన టీ–యాప్ఫోలియో మొబైల్ యాప్ను 7లక్షలకుపైగా మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీని ద్వారా 225 రకాల సేవలను 32 శాఖల భాగస్వామ్యంతో అందిస్తున్నారు. -
ఐటి అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది
-
విశాఖ కేంద్రంగా డిజిటల్ విప్లవం
విశాఖపట్నం: రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని ప్రకటన తరువాత ప్రముఖ ఐటీ కంపెనీల చూపు గ్రేటర్ విశాఖపై పడింది. ఐటీతో పాటు ఐటీయేతర రంగానికి వేదికయ్యేందుకు సిటీ ఆఫ్ డెస్టినీ వడివడిగా అడుగులేస్తోంది. మెట్రో నగరాలకు దీటుగా డిజిటల్ మార్కెటింగ్ విప్లవానికి కేంద్రంగా నిలవనుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం ఏర్పడనుంది. రాష్ట్రంలోనే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యకలాపాలకు విశాఖ వేదిక కానుంది. ఇప్పటి వరకు ఐటీ, ఐటీయేతర రంగాలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్లు కేంద్రంగా ఏర్పాటవుతున్నాయి. ఆర్థిక రంగ అభివృద్ధికి ఈ సంస్థలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. మానవ వనరులను తీర్చిదిద్దే పనిలో.. వాస్తవానికి విశాఖలో ఐటీ రంగ పురోభివృద్ధికి అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం జిల్లాకు శాపంగా పరిణమించింది. తాజాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. పారిశ్రామిక నగరంగా పేరుపొందిన విశాఖను ఐటీ హబ్గా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. విశాఖ వేదికగా పెట్టుబడులు పెట్టాలని అనేక బహుళ జాతి ఐటీ, ఐటీయేతర సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఉత్పాదక పరిశ్రమల కారణంగా కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో పాటు దేశానికే కాకుండా రాష్ట్రాభివృద్ధికి ఐటీ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖలో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తోంది. అయితే స్థానికంగా ఐటీ నిపుణుల కొరత ఉండే అవకాశం ఉండడంతో ముందుగా అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు, మరోవైపు ప్రభుత్వానికి కూడా డిజిటల్ మార్కెటింగ్ చుక్కానిలా కనిపిస్తోంది. మానవ వనరులు లేని కారణంగా విశాఖ నుంచి విప్రో వంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో లేకుండా అనేక ఐటీ సంస్థలకు అవసరమైన మానవ వనరులను విశాఖ ద్వారా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆన్లైన్ ద్వారానే వ్యాపారాలు.. ప్రపంచంలో నిన్న మొన్నటి వరకు పర్సన్ టు పర్సన్ మార్కెటింగ్ జరిగేది. వినియోగదారులే మార్కెట్కి వెళ్లి తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసేవారు. ఇపుడు అంతా డిజిటల్ మార్కెటింగ్ విప్లవం పుంజుకుంది. అంతా ఆన్లైన్ ద్వారానే వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. చాలా వరకు డిజిటల్ ప్లాట్ఫారంలో ఉంటున్న వినియోగదారుల వద్దకే వస్తువులు, ఉత్పత్తులను తీసుకువెళ్లే సౌకర్యం ఏర్పడింది. ఈ మార్కెటింగ్ నైపుణ్యం ఉన్న వారు ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉన్నారని సంస్థలు పేర్కొంటున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి.. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి వేలాది మంది విద్యార్థులు ప్రతి ఏటా బయటకు వస్తున్నారు. వీరు ఉపాధి, విద్యావకాశాల కోసం మెట్రో నగరాలకు వలస Ðవెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విశాఖలో డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అందుకు అనుగుణంగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో విద్యార్థులను నిపుణులుగా తయారు చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆలోచిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ విద్యార్థులను మార్కెటింగ్ నిపుణులుగా తీర్చిదిద్దవచ్చని భావిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ.. డిజిటల్ మార్కెటింగ్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 550 డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఆన్లై¯న్లోనే కాకుండా ఆఫ్లైన్ ద్వారా కూడా నేరుగా ప్రత్యేక ట్రైనర్ ద్వారా విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ అందిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇన్ఫోసిస్, విప్రో, టెక్మహీంద్ర, ఇతర ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్లు సైతం లభించాయి. భవిష్యత్తు ‘డిజిటల్’పైనే ఆధారం.. ఈ రంగంలో వాస్తవానికి కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఒకరికొకరికి సంబంధం ఉండదు. తెలియాల్సిన, నేరుగా కలవాల్సిన అవసరం లేదు. అయితే వారి మధ్య అనుసంధానకర్తగా ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్లదే కీలక పాత్ర. భవిష్యత్తు వ్యాపారం మొత్తం డిజిటల్ ప్లాట్ఫారంపైనే జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. డిజిటల్ రంగంలో విద్యార్థులకు శిక్షణ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్న సుమారు 550 డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో ఆన్లైన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ తరగతులు నిర్వహించాం. రిమోట్ ప్రాంతాల్లో సుమారు 220 డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఆన్లైన్లో శిక్షణ తరగతులను సది్వనియోగం చేసుకోలేకపోవడంతో మూడు నెలల కిందట ఆఫ్లైన్ తరగతులను సైతం ప్రారంభించాం. ప్రత్యేక ట్రైనర్ నేరుగా కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో అనేక మందికి బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి. – చల్లా మధుసూదనరెడ్డి, చైర్మన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 25 వేల మందికి ఉద్యోగావకాశాలు ఇప్పటికే పల్సస్ ఆధ్వర్యంలో నగరంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటైంది. దీని ద్వారా 25 వేల మందికి ఉద్యోగాలు కలి్పంచే అవకాశం ఉంది. ఈ ప్రొగ్రాంకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా సహకారం కూడా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రతి ఏటా 25 వేల మంది విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయి బయటకు వస్తున్నారు. వీరిలో ఎంసీఏ, ఎంబీఏ, ఎం ఫార్మసీ వంటి కోర్సులు చేసిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరికి డిజిటల్ మార్కెటింగ్ రంగంలో నైపుణాభివృద్ధి íశిక్షణ అందించగలిగితే స్థానికంగా ఉద్యోగాలు కలి్పంచవచ్చు. అందుకే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ క్యాంపస్ను ఏర్పాటు చేశాం. ఇక్కడే చదవి, ఇక్కడే ఉంటూ నైపుణ్య శిక్షణ తీసుకొని, ఎక్కడో విదేశాల్లో ఉన్న కంపెనీలకు ఇక్కడి నుంచే ఉద్యోగ సేవలు అందించే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాం. – డాక్టర్ గేదెల శ్రీనుబాబు, పల్సస్ ఐటీ కంపెనీ అధినేత -
‘మార్గాలు అన్వేషించాలి’
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, దొనకొండ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమగ్రాభివృద్ధి జరిగే విధంగా పారదర్శక పాలసీ విధానం తీసుకురావాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులకు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాలసీని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఐ.టీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి విడివిడిగా సమీక్ష నిర్వహించారు. మార్గాలు అన్వేషించాలి.. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ఇచ్చే ప్రాధాన్యతలు, రాయితీలను అవగాహన చేసుకుని, మన రాష్ట్రానికి అత్యధిక నిధులు, పరిశ్రమలు తరలివచ్చేందుకు అనువైన మార్గాలను అన్వేషించాలని మంత్రి తెలిపారు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణమున్న ఆంధ్రప్రదేశ్ కు ..కేంద్రం సహకారం, పాలసీలు బాగుంటే పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ తయారు చేసే పరిశ్రమలతో పాటు, ఆ విడి భాగాలు కూడా ఇక్కడే తయారు చేసే పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు వీలుగా పాలసీ ఉండాలన్నారు. పరిశ్రమలకు కావలసిన మెటీరియల్, యూనిట్లకు సంబంధించినవన్నీ ఒకే చోట ఉంటే పారిశ్రామికవేత్తలకు కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు. తద్వారా మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి అన్నారు.(చదవండి: ఏపీ వైపు.. పారిశ్రామిక వేత్తల చూపు) బాధ్యతను మరిచిపోకూడదు.. ఐ.టీ పాలసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆ శాఖ మంత్రి ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఐ.టీ ప్రమోషన్ పై దృష్టి సారించాలన్నారు. ఐ.టీ రంగానికి అత్యాధునిక సదుపాయాలు, అందుబాటులో వనరులు ఏమేం ఉన్నాయో చూసుకుని వాటికి మరింత ప్రాధాన్యతనిస్తూ పాలసీ తయారు చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఐ.టీ, పరిశ్రమలను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే బాధ్యతను మరచిపోకుండా పాలసీని తయారు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి మేకపాటి స్పష్టమైన సూచనలు చేశారు. పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, ఏపీఐఐసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు కృష్ణ గిరి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఐ.టీ శాఖ సమీక్షా సమావేశంలో ఈ-ప్రగతి సీఈవో బాలసుబ్రహ్మణ్యం, ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సీఈవో పవనమూర్తి, ఐ.టీ సలహాదారులు, తదితరులు హాజరయ్యారు. -
టైర్ 2 పట్టణాల్లో ఐటీ విస్తరణకు వైఎస్ఆర్ బాటలు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement