-
ఎర్రకోట వద్ద ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూకశ్మీర్(ఐఎస్జేకే) ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్చేశారు. ఎర్రకోట సమీపంలోని జామా మసీదు బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పర్వేజ్(24), జంషీద్(19)లను అరెస్ట్ చేసినట్లు స్పెషల్ సెల్ డీసీపీ కుష్వాహా తెలిపారు. కశ్మీర్లోని షోపియాన్ జిల్లాకు చెందిన వీరిద్దరి నుంచి రెండు .32 పిస్టల్స్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు తమ రాకపోకలకు ఢిల్లీని కేంద్రంగా మాత్రమే వాడుతున్నారనీ, ఇక్కడ దాడులకు ఎలాంటి ప్రణాళికలు రచించలేదని కుష్వాహా తెలిపారు. పర్వేజ్ యూపీలోని గజ్రోలా పట్టణంలో ఉన్న ఓ కళాశాలలో ఎంటెక్ చదువుతుండగా, జంషిద్ డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నాడు. పర్వేజ్ సోదరుడిని భద్రతాబలగాలు ఈ ఏడాది జనవరిలో షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చాయన్నారు. 2016, జూలైలో తన తమ్ముడు, హిజ్బుల్ ఉగ్రవాది ఫిర్దౌస్ను భద్రతాబలగాలు కాల్చిచంపడంతో పర్వేజ్ ఉగ్రబాట పట్టాడని పోలీసులు వెల్లడించారు. జంషిద్ ఆయుధాలను యూపీ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
మహిళలపై ఐఎస్ఐఎస్ హత్యాచారాలు
బాగ్దాద్ : ఇరాక్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నరమేధం కొనసాగుతోంది. కానీ ఆ నరమేధం ఈ సారి సభ్యసమాజం తలదించుకునేలా సాగింది. తమ లైంగికవాంఛ తీర్చలేదని... మహిళలపై తుపాకులు ఎక్కుపెట్టి విచక్షణరహితంగా కాల్చారు. ఆ కాల్పుల్లో ఒకరా ఇద్దరా.. ఏకంగా 150 మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. అందుకు అడ్డు వచ్చిన 91 మంది పురుషులను అతి కిరాతికంగా చంపిశారు. అనంతరం వారందరినీ సామూహికంగా ఖననం చేసినట్లు సమాచారం. ఈ ఘటన ఫాజుల్లా పట్టణంలో చాలా రోజుల క్రితం చోటు చేసుకుందని, ఈ దారుణానికి అల్ అన్బర్ ప్రావిన్స్లోని జీహాదీ నేత అబూ అనాస్ అలి లిబి నేతృత్వంలో వహించారని పాక్ మీడియా కథనాలను ప్రచురించింది. ముస్లిమేతర తెగలలో ముఖ్యంగా యాజిదీ తెగకు చెందిన వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు. జీహాదీలను పెళ్లి చేసుకోవాలని, బానిసల్లా పడి ఉండాలని ఆ వర్గానికి చెందిన మహిళలపై అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. యాజిదీ తెగలో మగవారిని చంపుతూ మహిళలను బానిసలుగా చేస్తున్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలు తట్టుకోలేక ఫాజుల్లా ప్రాంత ప్రజలు ఇళ్లు విడిచి ఎడారి ప్రాంతాలకు తరలిపోతున్నారని మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా వెళ్లిన వారిలో చిన్నారులు చలి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారని మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement