-
నెంబర్ 1 క్వాలిటీయే కావలె
బహిరంగ వేలంతో ఎర్రబంగారానికిపెరుగుతన్న డిమాండ్ చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో నుంచే రిమోట్ చేస్తున్న స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన వారే మేస్త్రీలు, కూలీలు అంతర్జాతీయ మార్కెట్లో రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న అత్యంత అరుదైన సహజసిద్ధ జీవ ఖనిజం ఎర్రచందనం. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనే ఎర్రచందనానికి జిల్లా పెట్టింది పేరు. అందుకే స్మగ్లర్మ కన్ను ఎప్పటి నుంచో శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనంపై పడింది. దీనికి తోడు ప్రభుత్వం ఎర్రచందనం బహిరంగ వేలాన్ని ప్రవేశ పెట్టడంతో నాణ్యమైన సరుకు కోసం ఎర్రదొంగలు దుంగల కోసం వేటను మరింత ముమ్మరం చేస్తున్నారు. భాకరాపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనాన్ని బహిరంగ వేలం వేయుడంతో అంతర్జాతీయుంగా డిమాండ్ ఏర్పడింది. స్మగ్లర్లు ఇక్కడ పెరిగే ఎర్ర చందనం వృక్షాలను విపరీతంగా నరికివేస్తూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. అడవికే వచ్చి నెంబర్ 1 క్వాలిటీ సరుకు తెచ్చే కూలీలకు స్మగ్లర్లు అధిక పారితోషికం ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదర్చుకుంటున్నారు. గత 20 ఏళ్ల క్రితం ఎర్రచందనం చె ట్లకు ఫారెస్టు శాఖ నెంబర్ ప్లేట్లు వేసింది. ప్రస్తుతం వాటినే కూలీలు నరకి వేస్తుండడంతో ఆ శాఖ ఏమీ చేయాలో దిక్కు తెలియని స్థితిలో ఉంది. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచే రిమోట్ చిత్తూరు,కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఎర్రచందనం ఎక్కువగా ఉండడంతో ఈ జిల్లాలకు చెందిన స్మగ్లర్లు అక్కడే ఉంటూ కూలీలను రిమోట్ చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. గతంలో కూలీలు చెట్లను 2 నుంచి 4 అడుగులు వరకు మొదుళ్లు వదలి నరికేవారు. ఇప్పుడు డివూండ్తో పాటు క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం వాటిపై కన్నుపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం అరికట్టడంలో విఫలం అరుుందనే చెప్పా లి. సాక్షాత్తు రాష్ట్ర వుుఖ్యవుంత్రి చంద్రబాబునాయుుడు సొంత జిల్లా వారే ఎర్రచందనం తరలించడంలో సిద ్ధహస్తులు. వీరిని వదలి తమిళనాడులో ఉండే కూలీలకు అవగాహన కల్పించడంపైనా వివుర్శలు వస్తున్నాయి. వేలం లో ఏ గ్రేడ్ ఎర్ర దుంగలు విలువ ఒక్కసారిగా అవూం తం టన్ను ధర రూ.1.40 కోట్లు పలకగా స్మగ్లర్లు టన్ను రూ.60 లక్షలకే సరఫరా చేస్తున్నా రు. దీంతో రాష్ట్రప్రభుత్వం పలు డిపోల్లో ఉన్న ఎర్రచందనం దుంగలకు డ్రెస్సింగ్ చేసి రేణిగుంట డిపోకు తరలించినట్లు సమాచారం . . అడవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాం అడవికి వెళ్లే వూర్గాల వద్దనే కాపు కాసి అడ్డుకుంటూ, నిరోధించేందుకు కృషి చేస్తున్నాం. గత రెండు నెలల్లోనే సువూరు 10 గ్రూపులను అడవిలోకి వెళ్లక వుుందే నిరోధించాం. అరుుతే పటిష్ట చర్యలు చేపట్టాం. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం కూడా చాలా సీరియుస్గా ఉంది. - రఘునాథ్, భాకరాపేట ఫారెస్టు రేంజర్ -
మత్తు దించుతాం
► సారా తయారీఅడ్డుకట్టకు సన్నాహాలు ► గంజాయి సాగు నిరోధానికి కార్యాచరణ ► డిఫెన్స్, విదేశీ మద్యంఅక్రమ నిల్వలపై దాడులు ► ‘సాక్షి’తో ఎక్సైజ్ డీసీ గోపాలకృష్ణ సాక్షి: తెలంగాణ నుంచి ఆంధ్ర కేడర్కు రావడం ఎలా ఉంది? డీసీ: ఆంధ్ర నా సొంత ప్రాంతం. విశాఖలో గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ పనిచేయడం కంఫర్ట్గా ఉంటుంది. సాక్షి: జిల్లాలో సారా జోరు ఎక్కువగా ఉంది...? డీసీ: అవును. బాధ్యతలు చేపట్టగానే తొలుత సారాను అరికట్టే అంశాన్నే తీసుకున్నాను. రాష్ర్ట ప్రభుత్వం దీని నియంత్రణకు ‘నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో సారా తయారీని అడ్డుకుంటాం. ము ఖ్యంగా అనకాపల్లి డివిజన్లో 243 గ్రామాల్లో సారా తయారు చేస్తున్నట్టు గుర్తిం చాం. 22 గ్రామాల్లో ఉధృతంగా ఉంది. అంచెలంచెలుగా దాడులు చేపడతాం. సాక్షి: గంజాయి సాగు, అక్రమ రవాణాకు విశాఖ ఏజెన్సీ ప్రధాన కేంద్రంగా మారిందనే వాదన ఉంది? డీసీ: సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సాగయ్యే గంజాయికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఏజెన్సీలో గంజాయి సాగు విస్తరించింది. వరంగల్ వంటి తెలంగాణ జిల్లాల్లోనే ఉండే గంజాయి సాగు జిల్లాకు విస్తరించడానికి కూడా ఇదే కారణం. దీని రవాణాను ఎంతగా అడ్డుకున్నా అది తక్కువే అవుతుంది. పంట సాగును నిరోధిస్తేనే ఫలితం ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ఇక్కడికి వచ్చి గిరిజనుల చేత పండిస్తున్నారు. వారిని పట్టుకోవాలి. ముఖ్యంగా పంట వేయకుండా ఉండాలంటే గిరిజనులకు గంజాయి విత్తనాలు దొరక్కుండా చేయాలి. ఇందుకు పోలీస్, ఫారెస్ట్, ఐటిడీఎ, ఎక్సైజ్ శాఖలో సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. మే నుంచి కొత్త పంట సాగు ప్రారంభమవుతుంది. ఈలోగా అన్ని విభాగా సమన్వయంతో అడ్డుకోవడానికి కార్యాచరణ మొదలుపెడతాం. సాక్షి: మద్యం దుకాణాలు నిబంధనలు పాటించేలా తీసుకుంటున్న చర్యలేమిటి? డీసీ: లెసైన్స్ కలిగిన మద్యం షాపులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఉల్లంఘిస్తే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నాం. అయితే అది తక్కువగా ఉంటోంది. జరిమానా మొత్తాన్ని పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. ఎక్కువ జరిమానా పడుతుందంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నాం. అదే విధంగా విదేశీ, డిఫెన్స్ మద్యం అక్రమ నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయి. డిఫెన్స్ మద్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని బ్రాండ్ల విదేశీ మద్యాన్ని మా ఏపీపీసీఎల్లో అందిస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
స్పైస్జెట్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠి సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.74 టార్గెట్ ధర: రూ.150 ఎందుకంటే: దాదాపు దివాళా స్థితిలో ఉన్న ఈ కంపెనీ పగ్గాలను గత ఏడాది జనవరిలో ఈ కంపెనీ మాజీ ప్రమోటర్ అజయ్ సింగ్ చేపట్టారు. కంపెనీ పునరుజ్జీవింపజేయడానికి కొత్త యాజమాన్యం పలు చర్యలు తీసుకుంది. సామర్థ్యాన్ని, ఆదాయాన్ని పెంచడం, విమాన సర్వీసుల హేతుబద్ధీకరణ, విమానాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కీలక మార్కెట్లలో విమాన సర్వీసుల పెంపు, వ్యయాల తగ్గింపు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. పెరుగుతున్న డిమాండ్కనుగుణంగా విమానాల సంఖ్యను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండడం విమానయాన రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం, వేతనాల పెరుగుదల, ఫస్ట్క్లాస్ రైల్వే చార్జీలతో పోల్చితే విమాన చార్జీలు ఒకింత చౌకగా ఉండడం వంటి అంశాల కారణంగా మొత్తం విమానయాన రంగమే టర్న్అరౌండ్ కానున్నదని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 32గా ఉన్న ఉన్న విమానాల సంఖ్య మరో రెండేళ్లలో 52కు పెంచుకోనున్నది. ప్రతి నెలా 90 శాతం లోడ్ ఫ్యాక్టర్ను సాధిస్తోంది. మొత్తం విమాన యాన సంస్థ వ్యయాల్లో 40 శాతంగా ఉంటే ఇంధన వ్యయాలు 40 శాతం తగ్గడంతో కంపెనీ మొత్తం ఆదాయంలో 46 శాతంగా ఉన్న ఇంధన వ్యయాలు 33 శాతానికి తగ్గాయి. గత ఏడాది జనవరిలో 9 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ షేర్ అదే ఏడాది నవంబర్లో 13 శాతానికి ఎగసింది. 2018 మార్చి కల్లా 18 శాతానికి పెరగగలదని అంచనా. వీటన్నింటి ఫలితంగా రెండేళ్లలో ఆదాయం 17 శాతం, ఇబిటా 41 శాతం, నికర లాభం 62 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. ఇండస్ఇంద్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.921 టార్గెట్ ధర: రూ.1,125 ఎందుకంటే: ముంబై కేంద్రంగా కమర్షియల్, ట్రాన్సాక్షనల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలనందిస్తోంది.1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిడ్ సైజ్ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 854 బ్రాంచీలు, 1,578 ఏటీఎంలతో ఖాతాదారులకు సేవలందిస్తోంది. లండన్, దుబాయ్, అబూదాబిల్లో ప్రాతినిధ్య కార్యాలయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర లాభం 30 శాతం వృద్ధి చెంది రూ.580 కోట్లకు పెరిగింది. రుణ వృద్ధి 29 శాతంగా ఉంది. రిటైల్ రంగ రుణాలు 27 శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధిని సాధించాయి. వాణిజ్య వాహన రుణాలు 31 శాతం పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 3.91 శాతానికి చేరాయి. కీలకమైన ఫీజు ఆదాయం 30 శాతం పెరిగింది. కార్పిరేట్ రుణ వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రుణ నాణ్యత స్థిరంగా ఉంది. మొండి బకాయిలు 1 శాతానికి దిగువనే ఉన్నాయి. మార్జిన్ల అధికంగా ఉండే రిటైల్ రంగ రుణాలపై దృష్టిసారిస్తోంది. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఆదాయ, నికర లాభాల వృద్ధి పటిష్టంగా ఉండడం, రుణ నాణ్యత నిలకడగా ఉండడం బ్యాంక్కు కలసివచ్చే అంశాలు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా రూ.1,125కు చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేస్తున్నాం. 2017 నాటికి బ్రాంచీల సంఖ్యను 1,200కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీసీఎస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.2,264 టార్గెట్ ధర: రూ.2,854 ఎందుకంటే: టాటా గ్రూప్కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీ భారత మల్టీ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీ. ముంబై కేంద్రంగా ఐటీ, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ అందిస్తోంది. 46కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్లో ఇదే టాప్ ఐటీ కంపెనీ. ఈ కంపెనీ క్యూ3 ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం అంచనాలను అందుకోలేకపోయినా, ఇబిటా, నికర లాభాలు అంచనాలను మించాయి. అంతర్జాతీయ వ్యాపారం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1 శాతం పెరిగింది. ఇబిటా మార్జిన్ 27 శాతం పెరిగింది. నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 0.9 శాతం వృద్ధితో రూ.6,110 కోట్లకు పెరిగింది. ఉద్యోగుల వినియోగం 85 శాతంగా ఉంది. ఐటీ సేవల్లో ఆట్రీషన్(ఉద్యోగుల వలస) 15%గా ఉంది. అధిక ఆదాయం వచ్చే ఇద్దరు క్లయింట్లు కలుపుకొని మొత్తం 9 మంది కొత్త క్లయింట్లు ఈ క్యూ3లో లభించినట్లు కంపెనీ పేర్కొంది.ఐటీ బడ్జెట్/వ్యయాలపై తమ క్లయింట్ల నుంచి ఎలాంటి ప్రతికూల లేదా తగ్గింపు సంకేతాలు అందలేదని కంపెనీ చెబుతోంది. రెండేళ్లలో కంపెనీ ఆదాయం డాలర్ టర్మ్ల్లో 10 శాతం, రూపాయి టర్మ్ల్లో 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.98గా ఉన్న షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.138కు పెరుగుతుందని భావిస్తున్నాం. కీలకమైన అమెరికా, యూరప్ల్లో మరిన్ని డీల్స్ సాధిస్తామని కంపెనీ ఆశావహంగాఉంది. ఇబిటా మార్జిన్లు 26-28 శాతం రేంజ్లో ఉంటాయని ధీమాగా ఉంది. రెండేళ్లలో కంపెనీ ఇబిటా 15 శాతం, నికర లాభం 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. -
వెనామీ.. జాగ్రత్త సుమీ..
యూజమాన్య పద్ధతులతో వెనామీ సాగు లాభదాయం వ్యాధులపై అప్రమత్తత అవసరం కైకలూరు : రొయ్యల సాగు ఒడిదుడుకుల్లో పడింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కలిగిన వెనామీ రొయ్యల సాగు జిల్లాలో ఇటీవల పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం 22 వేల ఎకరాల్లో సాగవుతోంది. సరైన శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడంతోనే నష్టాల బారిన పడుతున్నారు. రొయ్యల సాగు లాభాలొస్తే కుబేరుడిని, నష్టాలొస్తే బిచ్చగాడిని చేస్తుందని నానుడి. అందుకే రైతులు యూజమాన్య పద్ధతులు పాటించి పంటను కాపాడుకోవాలని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బీ రాజ్కుమార్ సూచిస్తున్నారు. చెరువును ఎండ బెట్టడం ఉత్తమం... రొయ్యల చెరువులో మట్టి తన సహజ లక్షణాలను కోల్పోతుంది. ఎండిన తర్వాత మూడు సార్లు దుక్కి దున్ని, దుక్కికి దుక్కికి మధ్య ఏడు రోజులు విరామం ఇవ్వాలి. నేలను రోలర్తో చదును చేయాలి. చెరువును బాగా ఎండబెట్టడంతో అడుగున చేపలు, నత్తలు వంటి జీవులు నశిస్తాయి. ఒకవేళ చెరువు పూర్తిగా ఎండని పక్షంలో టీ సీడ్ కేకు, కాపర్ సల్ఫేట్ను ఉపయోగించాలి. పూర్తిగా ఆరిన చెరువులో సూర్యరశ్మి వల్ల అడుగున ఉండే వ్యర్థాలు ఆక్సీకరణం చెంది, తొలగించడానికి సులువుగా ఉంటుంది. రొయ్యలు అడుగు భాగాన సంచరించే జీవులు కాబట్టి నేల స్వభావం రొయ్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీవభద్రత వ్యవస్థను పటిష్టం చేయాలి... వెనామీ రొయ్యల చెరువులో జీవ వాతావరణ వ్యవస్థ ఎంతో కీలకం. నేల, నీరు, సీడ్, గాలి, జంతువులు, మనుషులు ఇలా ఆరు మాధ్యమాల ద్వారా సూక్ష్మజీవులు చెరువులోకి ప్రవేశిస్తారుు. పీతలు, తాబేళ్లు, కప్పలు, పాములు, కుక్కలు, నక్కలు వంటివి రొయ్యల చెరువు వద్దకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీతలు, నత్తల బొరియల్లో గ్యాస్ బిల్లలు వేసి పూడ్చివేయాలి. చెరువులోకి నీటిని నింపేటప్పుడు 40 లేదా 60 నంబరు మెష్ హపాను కట్టాలి. నీటిని నింపిన తర్వాత 30 లేదా 40 పీపీఎంతో క్లోరినేషన్ చేసుకోవాలి. నత్తలు, పీతలు పైకి ఎక్కకుండా 30-50 సెంటీ మీటర్ల ఎత్తులో క్రాబ్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలి. ఆకాశంలో ఎగిరే పక్షులు వ్యర్థ పదార్థాలను పడవేసినా లోపలికి వెళ్లకుండా ఎరుపు వలలతో బర్డ్ ఫెన్సింగ్ నిర్మించుకోవాలి. రొయ్య పిల్లలను వదిలే ముందు మూడు సార్లు పీసీఆర్ టెస్టులు చేయించాలి. రొయ్యల చెరువుకు ఉపయోగించే వల, బకెట్, టబ్స్, పని చేసే సిబ్బంది చేతులు 100 పీపీఎం, అయోడిన్ ద్రావకంతో శుభ్రపర్చుకోవాలి. ఏరియేటర్లు కీలకం... రొయ్యలకు నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి. దీనికి ఏరియేటర్లను ఉపయోగిస్తారు. వీటిని ఏర్పాటు చేసేటప్పుడు నీటి ప్రవాహ దిశను బట్టి దాని పైపు భూమిలో బలంగా నాటాలి. నీటి ప్రవాహం వృత్తాకారంలో ఉండేలా తగిన మార్పులు చేసి బిగించాలి. ఏరియేటర్లతో చిన్న దశలో రొయ్య పిల్లలకు ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి చెరువు అడుగుభాగాన పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతోంది. బయోమాస్ ఆధారంగా హెచ్పీ మోటర్లు వినియోగించాలి. -
సరిహద్దులో పెట్రోల్కు డిమాండ్
ఏపీలో వ్యాట్ విధించడంతో కర్ణాటకకు వస్తున్న వాహనాలు బళ్లారి: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ విధించడం కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల పెట్రోల్ బంకుల యజమానులకు వరంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగినంతగా తగ్గించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాట్ రూపంలో ఆంధ్రాలో మరింత భారాన్ని రుద్దడంతో ఈ రెండు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీగా వ్యత్యాసం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక సరిహద్దుకు పెట్రోలు, డీజిల్ కోసం భారీగా వాహనాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ ప్రభావంతో పెట్రోల్ లీటరుకు రూ.4 పెరిగింది. గత పరిస్థితులకు భిన్నం ఆంధ్రప్రదేశ్లో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ లేదు. దీంతో ధరలు కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్లో లీటరుకు నాలుగు రూపాయలు తక్కువ ఉండేది. దీంతో పదేళ్లపాటు ప్రతి నిత్యం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని పెట్రోల్ బంకులకు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్లేవి. ప్రస్తుతం ప్రతి లీటరుకు నాలుగు రూపాయలు ఎక్కువగా ఉండడంతో ఏపీలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారు క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్లుతున్నారు. రైతులు ట్రాక్టర్లలో వచ్చి పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రజకులకు అండగా ఉంటాం
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement