-
అతడి దెబ్బకు కన్ను వాచింది.. అలా ప్రతీకారం తీర్చుకున్నా: కోహ్లి
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి టెస్టుల్లో ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ పోరంటే ఈ రన్మెషీన్ మరింత జోరుగా బ్యాట్ ఝులిపిస్తాడు. ఇక 2014- 15లో తొలిసారిగా కంగారూ గడ్డ మీద భారత కెప్టెన్ హోదాలో ఆడిన కింగ్ కోహ్లి.. 692 పరుగులతో అదరగొట్టాడు. ఆ సిరీస్లో టీమిండియా బ్యాటర్లలో టాప్ స్కోరర్గా నిలిచి సత్తా చాటాడు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో వరుస సెంచరీలతో అదరగొట్టిన కోహ్లి.. తదుపరి బ్రిస్బేన్లో మాత్రం విఫలమయ్యాడు. అనంతరం మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మళ్లీ కమ్బ్యాక్ ఇచ్చి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే, ఆ సిరీస్లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తొలి రెండింటిలో గెలిచిన ఆస్ట్రేలియా.. ఆఖరి రెండు టెస్టులను డ్రా చేసుకుని ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ సందర్భంగా జరిగిన ఆసక్తికర ఘటన గురించి ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటూ.. ‘‘ఆ టూర్లో మొదటి మ్యాచ్లో తమ మొదటి బంతినే మిచెల్ జాన్సెన్ విసురుగా విసరడంతో.. నా తలకు దెబ్బ తగిలింది. అసలేం జరిగిందో కాసేపటి వరకు నాకేం అర్థం కాలేదు. దాదాపు 60 రోజుల పాటు.. అలా ఆడాలా.. ఇలా ఆడాలా అంటూ షాట్ల విషయంలో తికమకపడ్డా. దెబ్బ అంత గట్టిగా తగిలింది మరి! నా ఎడమ కన్ను వాపు వచ్చేది. కంటిచూపు కూడా కాస్త మందగించింది. అయితే, చాలా రోజుల వరకు నేను ఈ విషయాన్ని గమనించలేకపోయాను. ఇక ఆరోజు లంచ్ సమయంలో.. నా ముందు రెండే ఆప్షన్లు మిగిలి ఉన్నాయని ఫిక్సయ్యాను. ఒకటి ఫైట్.. రెండోది ఫ్లైట్. పట్టుదలగా నిలబడి ఆడాలి లేదంటే వెళ్లిపోవాలి.. బాగా ఆలోచించి పోరాడాలనే నిర్ణయించుకున్నా. ఇంతలో ఒకరు.. నిన్ను తల మీద కొట్టడానికి అతడికి ఎంత ధైర్యం అని నాతో అన్నారు. అందుకు బదులుగా..‘అతడి(బౌలింగ్)ని ఈ సిరీస్లో ఎంతలా చితక్కొడతానో చూడు’ అని చెప్పాను. అన్నట్లుగా అతడి బౌలింగ్ను తుత్తునియలు చేశాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 2014 -15లో ఆసీస్తో సిరీస్లో తొలి టెస్టుకు నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరం కాగా.. కోహ్లి సారథ్యం వహించాడు. ఇక రెండు, మూడో టెస్టులకు అందుబాటులోకి వచ్చిన ధోని.. ఆ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించగా.. నాలుగో మ్యాచ్ నుంచి కోహ్లి అధికారికంగా టీమిండియా కెప్టెన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ దిగ్గజాలు ఇద్దరూ ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. “Isko mein itna maarunga naa, and that’s exactly what I did” Kohli saab talking about the 2014 Australia tour and his battle against Mitchell Johnson 👑💪🏻 pic.twitter.com/geP35IUz08 — Aani⁷ ★彡 (@wigglyywhoops) April 11, 2024 చదవండి: అంపైర్తో గొడవపడ్డ పంత్.. తప్పెవరిది?.. మండిపడ్డ ఆసీస్ దిగ్గజం -
IND VS AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ హైఓల్టేజ్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్ల సిరీస్గా మారింది. ఈ సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్గా సాగనుంది. పింక్ బాల్తో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన టికెట్లు జూన్ 4 నుంచి ఆన్లైన్లో లభ్యమవుతాయి. ఇటీవలికాలంలో జరిగిన నాలుగు BGT సిరీస్లను వరుసగా కైవసం చేసుకున్న టీమిండియా.. ఐదో సిరీస్పై కన్నేసింది. భారత్ 2017, 2019, 2021, 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్.. నవంబర్ 22-26- పెర్త్ డిసెంబర్ 6-10- అడిలైడ్ ఓవల్ (డే అండ్ నైట్, పింక్ బాల్ టెస్ట్) డిసెంబర్ 14-18- గబ్బా డిసెంబర్ 26-30- మెల్బోర్న్ 2025 జనవరి 3-7- సిడ్నీ -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగాల్సి ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారైనట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) ప్రకారం ఈ టోర్నీ ఈ ఏడాది నవంబర్-వచ్చే ఏడాది జనవరి మధ్యలో జరుగనుంది. ప్రతిష్టాత్మక సిరీస్కు ఈ దఫా ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. సంప్రదాయానికి విరుద్దంగా ఈసారి నాలుగు మ్యాచ్ల సిరీస్ కాకుండా ఐదు మ్యాచ్ల సిరీస్ జరుగనుందని తెలుస్తుంది. ఇందులో ఓ డే అండ్ నైట్ మ్యాచ్ను కూడా యాడ్ చేశారని సమాచారం. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్ల్లో (BGT) భారత్ చారిత్రక విజయాలు సాధించిన విషయం తెలిసిందే. 2018-19, 2020-21 సిరీస్లను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై టెస్ట్ల్లో భారత్ సాధించిన తొలి విజయాలు ఇవే. ఇటీవల భారత్ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లోనూ భారత్దే పైచేయిగా నిలిచింది. ఈ సిరీస్లోనూ టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. భారత్లో జరిగిన 2016-17 సిరీస్లోనూ టీమిండియానే విజయం వరించింది. ఆ సిరీస్లో కూడా భారత్.. 2-1 తేడాతో ఆసీస్ను ఓడించింది. ఈ లెక్కన టీమిండియా ఆసీస్పై వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్ల్లో విజయాలు సాధించింది. అన్ని సిరీస్ల్లో టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను చిత్తు చేయడం విశేషం. ఈ నాలుగు సిరీస్ల్లో 2020-21 గబ్బా టెస్ట్కు చాలా ప్రత్యేకత ఉంది. అప్పటిదాకా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్కు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. రాబోయే సిరీస్ 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా చాలా కీలకం కానుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్పై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేదికలను లాక్ చేసినట్లు సమాచారం. తొలి టెస్ట్: పెర్త్ రెండో టెస్ట్: అడిలైడ్ (డే అండ్ నైట్) మూడో టెస్ట్: గబ్బా నాలుగో టెస్ట్: మెల్బోర్న్ ఐదో టెస్ట్: సిడ్నీ -
ఓడినా పర్వాలేదు.. ఛాంపియన్స్లా ఆడారు: ఇషాంత్ శర్మ
అండర్-19 ప్రపంచకప్ టైటిల్ను ఆరోసారి ముద్దాడాలన్న టీమిండియా కల నేరవేరలేదు. ఆదివారం బెన్నోని వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తాశారు. ముఖ్యంగా భారత బ్యాటర్లు ఒత్తడిలో చిత్తయ్యారు. వరుసక్రమంలో పెవిలియన్కు క్యూ కడుతూ.. ఆసీస్కు నాలుగో సారి వరల్డ్కప్ టైటిల్ను అప్పగించేశారు. 254 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(47), మురుగణ్ అభిషేక్(42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. ఈ నేపథ్యంలో యువ భారత జట్టుకు టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ సపోర్ట్గా నిలిచాడు. ఫైనల్లో భారత్ ఓటమిపాలైనప్పటికీ టోర్నీ మొత్తం ఛాంపియన్స్లా ఆడిందని ఇషాంత్ కొనియాడాడు. "మన అండర్-19 జట్టు ఛాంపియన్స్లా ఆడింది. ఈ టోర్నమెంట్లో వారు పడిన కష్టాన్ని ఒక్క మ్యాచ్(ఫైనల్)తో పోల్చవద్దు. ఈ రోజు మనది కాదు. ఆటలో గెలుపుటములు సహజం. కానీ టోర్నమెంట్ అంతటా యువ ఆటగాళ్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు, పోరాట పటిమని చూసి యావత్తు భారత్ గర్విస్తోంది. మీరు తల దించుకోండి బాయ్స్.. అంతకంటే బలంగా తిరిగి రండి" అంటూ ఇషాంత్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. -
U19 WC Ind vs Aus: జగజ్జేతగా ఆసీస్ .. ఇలాంటివి లెక్కలోకి రావు!
ICC Under 19 World Cup 2024: క్రికెట్ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా మరో ఐసీసీ టైటిల్ సాధించింది. అండర్-19 వరల్డ్కప్-2024 ఫైనల్లో భారత యువ జట్టుపై గెలిచి నాలుగోసారి జగజ్జేగతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ను 79 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం అందుకుని ఏ ఫార్మాట్లోనైనా తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో సీనియర్ జట్టు మాదిరిగానే.. కుర్రాళ్లూ కంగారూల ధాటికి కంగారెత్తి ఒత్తిడిలో చిత్తయ్యారు. ఫలితంగా ఆరోసారి ప్రపంచకప్ గెలవాలన్న యువ భారత్ ఆశలు అడియాలసయ్యాయి. రోహిత్ సేన మాదిరే.. ఉదయ్ సహారన్ బృందం కూడా కీలక పోరులో ప్రత్యర్థి ముందు తలవంచడంతో మరోసారి ఆసీస్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇలాంటివి అసలు లెక్కలోకే తీసుకోరు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అండర్-19 స్థాయిలో క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలు పెద్దగా పరిగణనలోకి రావు. అయితే, ఈ టోర్నీలో సుదీర్ఘ ప్రయాణం ద్వారా భవిష్య క్రికెట్ స్టార్లు తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా పేపర్ మీద మాత్రమే కాదు.. మైదానంలో కూడా మెరుగ్గానే కనిపించింది’’ అని కైఫ్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పటికైనా కైఫ్ బాయ్ ఆస్ట్రేలియా ప్రదర్శనను మెచ్చుకున్నాడు’’ అని కొంతమంది.. ‘‘అండర్-19 వరల్డ్కప్లోనూ మనం ఓడిపోయాం కాబట్టే.. ఈ విజయం లెక్కలోకి రాదంటున్నాడు కైఫ్’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు పేపర్ మీద మనమే బెస్ట్ అంటూ.. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. ‘‘అత్యుత్తమ జట్టు టైటిల్ గెలిచిందంటే నేను అస్సలు ఒప్పుకోను. పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కైఫ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా వల్ల.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మూడుసార్లు పరాభవం ఎదురైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్కప్ ఫైనల్, అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్లో ఆసీస్.. భారత క్రికెట్ జట్లను ఓడించి.. టైటిల్స్ ఎగురేసుకుపోయింది. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! At u-19 level team results don't matter much. Future stars learn lesson that help them in long journey.. Well played India. This time have to say Australia good on pitch, and on paper 😊#U19WorldCup2024 — Mohammad Kaif (@MohammadKaif) February 11, 2024
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement