-
‘సచిన్ ఏడుస్తూనే ఉన్నాడు’
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే భావోద్వేగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది గాయంతో బాధపడుతూనే అద్భుత బ్యాటింగ్తో విజయానికి చేరువగా తీసుకొచ్చి వెనుదిరిగితే, ఆపై జట్టు ఓటమిపాలైతే ఆ బాధ ఎలా ఉంటుంది... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1999లో చెన్నైలో పాకిస్తాన్తో జరిగిన టెస్టులో ఇలాంటి వేదనే అనుభవించాడు. రెండో ఇన్నింగ్స్లో విజయం కోసం 271 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ బరిలోకి దిగింది. తీవ్ర వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నా... సచిన్ 136 పరుగులతో చెలరేగాడు. అయితే నయన్ మోంగియా (52) మినహా సహచరులంతా విఫలం కావడంతో సచిన్ చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. అయితే 254 పరుగుల వద్ద సచిన్ ఏడో వికెట్గా వెనుదిరిగాడు. మరో 4 పరుగులకే మిగిలిన 3 వికెట్లు కోల్పోయిన భారత్ చివరకు 12 పరుగులతో ఓడింది. దీనిని గుర్తు చేసుకుంటూ నాటి భారత కోచ్ అన్షుమన్ గైక్వాడ్... ‘సక్లాయిన్ బౌలింగ్లో అవుటై పెవిలియన్ తిరిగి వచ్చాక సచిన్ నిరాశ పడ్డాడు. భారత జట్టు ఓడిపోయిందని తెలిసిన తర్వాత అతను బయటకే రాలేదు. ఒక టవల్ను అడ్డుగా పెట్టుకొని అతను ఏడుస్తూనే ఉన్నాడు. సచినే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. అయితే అతను దానిని తీసుకునేందుకు వెళ్లలేదు. వేదికపైనున్న రాజ్సింగ్ దుంగార్పూర్ సచిన్ ఎక్కడ అంటూ అడిగినా అతని జాడే లేదు. బహుమతి ప్రదాన కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా టెండూల్కర్ తన సీటులోనే స్తబ్దుగా ఉండిపోయాడు. చివరకు నేను సముదాయించాల్సి వచ్చింది. అతను ఇలా భావోద్వేగాలు ప్రదర్శించడం ఎప్పుడూ చూడలేదు’ అని నాటి ఘటనను వివరించారు. ప్రేక్షకుల మధ్య ఆడితే ఆ మజాయే వేరు ఏ ఆటలోనైనా ప్రేక్షకులు కూడా భాగమే. మీకు అనుకూలంగా అయినా వ్యతిరేకంగా అయినా వారి ప్రోత్సాహం, కేకలు క్రీడలో చాలా అవసరం. మైదానంలో ఖాళీ స్టేడియాల మధ్య ఆడటం క్రీడాకారులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ప్రేక్షకులకు ఆటగాళ్లు స్పందించే ఘటనలు కోకొల్లలు. నేను ఏదైనా మంచి షాట్ ఆడినప్పుడు ప్రేక్షకులు అభినందిస్తే మరింత ఊపు వస్తుంది. బౌలర్ కూడా అద్భుతమైన స్పెల్ వేసినప్పుడు అభిమానులు అభినందిస్తుంటే బ్యాట్స్మన్పై ఒత్తిడి పెరిగిపోతుంది. కరోనా తర్వాత ఆటలో సహజంగానే మార్పులు వస్తాయి. సహచరుల మధ్య కౌగిలింతలు, అభినందనలు కొంత కాలం కనిపించకపోవచ్చు. ఇక బంతి మెరుపు పెంచేందుకు ఉమ్మిని వాడాలంటే భయపడతారు. ఒకటి మాత్రం స్పష్టం. క్రికెట్ జరగాలని నేనూ కోరుకుంటాను. అయితే అంతా బాగుందని, ఆరోగ్యాలకు ప్రమాదం లేదని భావించినప్పుడే మళ్లీ ఆట మొదలు పెట్టాలి. ఇలాంటి విపత్కర పరిస్థితిని దాటిన తర్వాతే ఐపీఎల్, టి20 వరల్డ్కప్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం వీటిపై అసలు చర్చించడమే నా దృష్టిలో అనవసరం. –సచిన్ టెండూల్కర్ వేడుకలు లేవు... కోవిడ్–19 కారణంగా దేశంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోరాదని సచిన్ నిర్ణయించుకున్నాడు. ‘సంబరాలకు ఇది సరైన సమయం కాదని సచిన్ భావిస్తున్నాడు. కరోనాపై పోరులో ముందున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, ఇతర సిబ్బందికి మనం అండగా నిలవడం మనందరికీ ముఖ్యమని అతను చెప్పాడు. సహాయనిధికి ఇచ్చిన డబ్బు మాత్రమే కాకుండా ఇతర రూపాల్లో కూడా సహాయక కార్యక్రమాల్లో సచిన్ పాలపంచుకుంటున్నాడు’ అని అతను సన్నిహితుడొకరు వెల్లడించారు. మీకు తెలుసా... సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 989 మంది క్రికెటర్లతో కలిసి ఆడాడు. ఇందులో 141 మంది టీమిండియా సహచరులు కాగా... 848 మంది ప్రత్యర్థి జట్లకు చెందినవారు. -
సోదరుడే చాపెల్ను నమ్మలేదు
న్యూఢిల్లీ: కెప్టెన్గా సౌరవ్ గంగూలీ, కోచ్గా గ్రెగ్ చాపెల్ మధ్య విభేదాలు, అవి భారత క్రికెట్పై చూపిన ప్రభావం మీద ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చాయి. కెప్టెన్సీతో పాటు, జట్టు నుంచి కూడా తప్పించడంపై గంగూలీ పలుసార్లు గ్రెగ్పై విమర్శలు చేశాడు. తాజాగా ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లోనూ గంగూలీ ఆ సంగతులను ప్రస్తావించాడు. భారత కోచ్గా గ్రెగ్ చాపెల్ నియామకంపై అతడి సోదరుడైన ఇయాన్ చాపెల్ కూడా నాడు ఏమంత సానుకూలంగా లేడని చెప్పుకొచ్చాడు. ఆత్మకథలో ఇంకా ఏమన్నాడంటే... ‘2005లో ఈ ఉదంతంపై ఇయాన్తో పాటు సునీల్ గావస్కర్ కూడా నన్ను హెచ్చరించారు. అయినా వాటిని విస్మరించాను. అంతకుముందు తనతో జరిగిన భేటీల్లో విస్తృత క్రికెట్ పరిజ్ఞానంతో గ్రెగ్ నన్ను ఆశ్చర్యపరిచాడు. మన జట్టును నంబర్ వన్గా నిలిపేందుకు అతడు సరైనవాడని భావించాను. నా అభిప్రాయాన్ని దాల్మియాకు వివరించాను. కానీ గ్రెగ్తో మున్ముందు ఇబ్బందులు తప్పవని, అతడి కోచింగ్ రికార్డు గొప్పగా ఏమీ లేదని గావస్కర్ హెచ్చరించారు. అయినప్పటికీ నేను ముందుకెళ్లా. విజయవంతమైన కెప్టెన్ను, అంతకుముందు టెస్టు సిరీస్లో సెంచరీ చేసిన నన్ను అకారణంగా తొలగించారు. చరిత్రలో ఇలా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. భారత క్రికెట్లో దీంతో పోల్చదగిన ఘటనలు గతంలోను, ఇకపైనా జరగకపోవచ్చు’ అని పేర్కొన్నాడు. -
కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని..!
స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే భారత్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి కెప్టెన్ విరాట్ కోహ్లియే కారణమని అంతా భావిస్తున్న సంగతి తెలిసిందే. కుంబ్లేను అవమానకరరీతిలో పదవి నుంచి తప్పుకునేలా చేసిన కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఓ అభిమాని భావించాడు. అందుకే, వృత్తిపరంగా మెకానికల్ ఇంజినీర్ అయినప్పటికీ, భారత్ క్రికెట్ కోచ్ పదవికి అతను దరఖాస్తు చేశాడు. ఓ నిర్మాణ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తున్న 30 ఏళ్ల ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి తాజాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. 'అహంకారి అయిన కోహ్లిని సరైన దారిలో పెట్టేందుకే' తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు అతను తెలిపాడు. బీసీసీఐ వెబ్సైట్లోని ఈమెయిల్ఐడీ ఆధారంగా అతను ఈ దరఖాస్తు చేశాడు. కోచ్ పదవి నుంచి కుంబ్లేను తొలగించడానికి కోహ్లియే కారణమని దేశంలోని కోట్లాదిమంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నట్టే తాను భావిస్తున్నట్టు అతను తన దరఖాస్తులో తెలిపాడు. 'లెజండరీ క్రికెటర్ అనిల్కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో నేను ఈ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించాను. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి లెజండరీ క్రికెటర్లు కోచ్గా అవసరం లేదు. బీసీసీఐ ప్రకటన ప్రకారం మరోసారి మాజీ క్రికెటర్ను కోచ్గా ఎంపిక చేసినా.. కుంబ్లే తరహాలోనే ఆయనను కూడా కోహ్లి అవమానిస్తాడు. కాబట్టి ఎలాంటి క్రికెట్ నైపుణ్యం లేకున్నా నేనే కోచ్ పదవికి పర్ఫెక్ట్ చాయిస్. అహంకార పూరిత వైఖరితో నేను సర్దుకోగలను. మెల్లగా కోహ్లిని నేను సరైన దారిలోకి తీసుకొస్తాను. అప్పుడు బీసీసీఐ ఓ లెజండ్ క్రికెటర్ను కోచ్గా నియమించుకోవచ్చు' అంటూ బ్రహ్మచారి తన దరఖాస్తులో సరదాగా కామెంట్ చేశాడు. -
విండీస్ పర్యటనకు కుంబ్లేనే కోచ్
న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్గా అనిల్ కుంబ్లేను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ పరిపాలకుల కమిటీ ( సీఓఏ) సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల చివర్లో భారత జట్టు పర్యటించే వెస్టిండీస్ సిరీస్ వరకు కుంబ్లేనే కోచ్గా ఉంటాడని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఈ నెల 20 తో కుంబ్లే కోచ్పదవి కాలం ముగియనుండటంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కుంబ్లేకు భారత కెప్టెన్ కోహ్లీకి విభేదాలు తలెత్తడంతో మార్పు అనివార్యమని అందరూ భావించినా బీసీసీఐ కుంబ్లే పదవి కాలన్ని పొడిగించింది. అంతకు ముందు సచిన్, గంగూలీ, లక్ష్మణ్తో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ కోచ్గా అనిల్ కుంబ్లేనే కొనసాగించాలని బీసీసీఐకి సూచించినట్లు వార్తలు వచ్చాయి. -
సెహ్వాగ్ రెజ్యూమ్.. బిత్తరపోయిన బీసీసీఐ!
సెహ్వాగ్ అంటే సెహ్వాగే. మైదానంలో చెలరేగి ఆడినా, ట్విట్టర్లో కితకితలు పెట్టే జోక్స్ పేల్చినా అతని స్టైల్ అతనిదే. అదే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. ప్రతిష్టాత్మకమైన భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి అతడు పంపించిన రెజ్యూమ్ చూసి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) బిత్తరపోయింది. కేవలం రెండంటే రెండే లైన్లలో కోచ్ పదవి కోసం వీరేందర్ సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. ‘ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు మెంటర్, కోచ్గా ఉన్నాను. ఈ (టీమిండియా) బాయ్స్ అందరితో ఆడాను’ అంటూ సెహ్వాగ్ తన రెండు లైన్ల అప్లికేషన్లో పేర్కొన్నాడు. ఈ దరఖాస్తు చూసి విస్తుపోయిన బీసీసీఐ అధికారులు.. పూర్తి వివరాలతో కూడిన బయోడేటాను, రెజ్యూమ్ను పంపించమంటూ అతన్ని బతిమిలాడుకొని ఒప్పించారు. ‘సెహ్వాగ్ రెండులైన్ల దరఖాస్తును పంపించాడు. దానికి అనుబంధంగా రెజ్యూమ్ కూడా పంపలేదు. దీంతో దరఖాస్తుతోపాటు రెజ్యూమ్ కూడా పంపాల్సిందిగా మేం అతన్ని అడిగాం. అతను ఈ పదవి కోసం తొలిసారి ఇంటర్వ్యూ హాజరవుతున్నాడు’ అని బీసీసీఐకి చెందిన విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రస్తుత కోచ్ అనిల్కుంబ్లేతోపాటు సెహ్వాగ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్, సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్, డొమెస్టిక్ వెటరన్ లాల్చంద్ రాజ్పుత్ తదితరులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. కుంబ్లేతో సహా వీరంతా సీఏసీ ఎదుట ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement