-
అరవై రకాల పేర్లు.. అడ్డగోలు వసూళ్లు
► ‘ఆకర్షణీయ’ పేర్లతో ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందా ► 3,487 పాఠశాలలను గుర్తించిన విద్యా శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాల సందడి మొదలు కాబోతోంది. ఇప్పటివరకు వివిధ రకాల పేర్లతో తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు వాటిని మరింతగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకటో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ అంటూ ‘ఆకర్షణీయ’పేర్లతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అనేక విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చేసినా, ఆ పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపట్టారని విద్యా శాఖను హైకోర్టు ప్రశ్నించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఫీజుల నియంత్రణ విషయంలో పక్కాగా లేని విధానాలు, మామూళ్లకు అలవాటు పడిన కొందరు అధికారుల కారణంగా ఫీజుల నియంత్రణ నీరుగారిపోయింది. ప్రవేశాల సీజన్ మొదలు కానుండటంతో ప్రైవేటు స్కూళ్ల వ్యవహారంపై విద్యా శాఖ దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ని ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయో లెక్క తేల్చింది. ఆకర్షణీయ పేర్లు పెట్టుకుని అడ్డగోలుగా ఫీజులను పెంచుతున్న స్కూళ్ల వివరాలను సేకరించింది. ప్రస్తుతం ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని భావిస్తున్న విద్యా శాఖ.. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలలపైనా కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో 10,799 ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. అందులో 3,487 పాఠశాలలు 62 రకాల ‘ఆకర్షణీయ’పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచి వసూలు చేస్తున్నాయని అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణ నిబంధనల్లో ఆకర్షణీయ పేర్లను తొలగించేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇదో ఆకర్షణీయ దందా... ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర.. వంటి పేర్లతో రూ.లక్షల్లో ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నారుు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును కూడా ఆశ్రరుుంచారు. వన్టైమ్ స్పెషల్ యాక్టివిటీ పేరుతో కొన్ని పాఠశాలలు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యా శాఖ ఉన్నత స్థారుు కమిటీని ఏర్పాటు ప్రముఖ పాఠశాలల్లో తనిఖీలు చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయట పడ్డారుు. ఏసీ క్లాస్ రూమ్లు, ఐఐటీ ఫౌండేషన్ శిక్షణల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వసూలు చేస్తున్న ఫీజులకు, విద్యా బోధనకు సంబంధం లేదని వెల్లడైంది. ఐఐటీ ఫౌండేషన్ గతంలో ఆరో తరగతి నుంచి మొదలైతే ఇప్పుడు ఒకటో తరగతి నుంచే చెబుతామంటూ అనేక స్కూళ్లు వెలిశాయి. ఐఐటీ, ఒలంపియాడ్.. తదితర ఆకర్షణీయ పేర్లు పెట్టడానికి వీల్లేదని, వాటిని వెంటనే తొలగించాలని జిల్లా విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ గతంలోనే ఆదేశించినా ఎక్కడా అమలు కాలేదు. పాత జిల్లాల ప్రకారం రంగారెడ్డి జిల్లాలోఆకర్షణీయ పేర్లతో స్కూళ్లు అత్యధికంగా ఉన్నట్లు వెల్లడి కాగా, నల్లగొండలో తక్కువ సంఖ్యలో ఉన్నట్లు విద్యా శాఖ అధ్యయనంలో తేలింది. -
ఐఐటీ శిక్షణకు ఆదిలోనే ఆటంకం
- మంత్రి సొంత విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులతో ఐఐటీ శిక్షణ - వ్యతిరేకించిన యూటీఎఫ్, తదితర ఉపాధ్యాయ సంఘాలు - బాయ్కాట్ చేసిన ఉపాధ్యాయులు నెల్లూరు, సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ తరగతులు నిర్వహించాలనే ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఆదేశాల ప్రకారం నెల్లూరులో ఈ కార్యక్రమం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ తరగతుల నిర్వహణ పై ఏర్పాటు చేసిన ఉపాధ్యాయల శిక్షణ కార్యక్రమం రసాభాసగా ముగిసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ మాటమార్చారు. తన సొంత ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహించే వారితో మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఐఐటీ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సన్నద్ధం అయ్యారు. ఈ క్రమంలో శనివారం కావలి, గూడూరు, నెల్లూరు నగర పాలక సంస్థ పాఠశాలల్లో పని చేసే ప్రధాన ఉపాధ్యాయులకు మెసేజ్లు ద్వారా ఆదివారం ఐఐటీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిజిక్స్, మ్యాధ్స్, బయాలజీ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా రావాలని సూచించారు. మద్రాసుబస్టాండు సమీపంలోని శింకు చెంగన్న మున్సిపల్ పాఠశాల్లో ఆదివారం ఉదయం కావలి, గూడూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన 75 మంది మున్సిపల్ పాఠశాల ఉపధ్యాయులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారిచే ఐఐటీ శిక్షణ తరగతులు బోధించడం గురించి మంత్రి వ్యవహరించిన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపరిచేలా మంత్రి వ్యవహరించారని శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉపాధ్యాయులు బాయ్కాట్ చేసి నిరసన తెలిపారు. ఆదివారం కూడా క్లాసుల పేరుతో ఉపాధ్యాయుల పై ఒత్తిడి తీసుకుని రావడం సరైందికాదన్నారు. ఇప్పటికే ఈ ఏడాది మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మంచి మార్కులు సాధించారని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని కోరారు. -
ఏపీలో ఐఐటీ ఫౌండేషన్ కోర్సుపై శిక్షణ
మున్సిపల్ స్కూళ్లలో 24 నుంచి శ్రీకారం చిత్తూరు: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉన్నత విద్యావంతుల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఆదివారం చిత్తూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. మున్సిపల్ పాఠశాలలకు, విద్యాశాఖకు సమన్వయం లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. ఇక నుంచి మున్సిపల్ పాఠశాలల పూర్తి బాధ్యత కమిషనర్లదేనన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement