-
మరో ప్రాజెక్ట్కు ఓకే చెప్పిన సుమంత్
సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా మళ్లీ హిట్ కొట్టాలని కొత్త కథలకు ఓకే చెబుతున్నాడు హీరో సుమంత్. మళ్లీ రావా తరువాత మళ్లీ ఆరేంజ్లో సక్సెస్కొట్టలేకపోయాడీ హీరో. తాజాగా ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కనున్న చిత్రానికి ఓకే చెప్పాడు. నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు సంతోష్ కుమార్ తెలిపారు. -
‘ఇదం జగత్’ ట్రైలర్ ఆవిష్కరణ
సుమంత్ నటిస్తోన్న వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అంజు కురియన్ కథానాయికగా పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడవి శేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా టీం అంతా నా ఫ్రెండ్సే. టీజర్, ట్రైలర్లో ‘ఇదం జగత్’ అనే టైటిల్ వచ్చినప్పుడు ఒకే రకమైన సంగీతం వస్తుంది. ఆ బ్రాండింగ్, కనెక్షన్ రెండింటికీ ఇవ్వడం శ్రీచరణ్లో నాకు నచ్చింది. ట్రైలర్ చాలా బాగుంది అలాగే సినిమా కూడా అందరికీ కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను' అన్నారు. నిర్మాతల్లో ఒకరైన పద్మావతి మాట్లాడుతూ ‘సుమంత్ గారు ఇలాంటి స్టోరీ యాక్సప్ట్ చేస్తారా అనుకున్నాం. కానీ ఆయన ఓకే చెప్పడమే సర్ప్రైజ్ అనిపించింది. సుమంత్ గారి కెరీర్లో ఇది డిఫరెంట్ మూవీ. ఈ సినిమాకు పైకి కనిపించే హీరో సుమంత్ గారైతే తెరవెనుక హీరో దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు హార్ట్. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ సంగీతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆయనకు థ్యాంక్స్. కెమెరా వర్క్ బాగుంది. ప్రతీ ఒక్కరి కృషి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’ అన్నారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ ‘అవకాశం ఇచ్చిన నిర్మాతలు పద్మావతి, శ్రీధర్ గార్లకు థ్యాంక్స్. ఇది టెక్నీషియన్స్ మూవీ. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ లాంటి అన్ని శాఖలు కలిస్తేనే ఈ సినిమా బాగా వచ్చింది. అందరికీ థ్యాంక్స్’ అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ‘మనిషిలో మంచి, చెడుతో పాటు అన్ని కోణాలు ఉంటాయి. ఇలాంటి పాత్ర కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. అందుకే ఈ క్యారెక్టర్ కోసం పెద్దగా కష్టపడలేదు. నన్ను అంతా ‘గోదావరి’ చిత్రంలో బోటు మీద శ్రీరామ చంద్రుడు క్యారెక్టర్లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. థ్రిల్లర్స్ పట్ల నాకు మొదట ఆసక్తి ఉండేది కాదు. రెండేళ్ల క్రితం నా మిత్రుడు అడవి శేష్ వల్ల ఆ ఆసక్తి పుట్టింది. అతను నటించిన క్షణం, గూఢచారి చిత్రాలు నాలో మార్పు తెచ్చాయి. నాకిప్పుడు థ్రిల్లర్ జానర్ అంటే పిచ్చి. అందుకే ఈ జానర్లో సినిమా చేశాను. థ్యాంక్స్ శేష్. ఈసినిమా కోసం నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. ‘మళ్లీరావా’ రిలీజ్కు ముందు నవంబర్లో ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమాలో చాలా కొత్తగా ప్రయత్నించాం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగా కుదిరాయి. హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం. విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. -
న్యూస్ను సృష్టిస్తే?
జ్ఞాపకం, ప్రేమ, చావు, స్నేహం ఇలా సమాజంలో ఇప్పుడు ప్రతిదీ న్యూసే. కానీ లేని న్యూస్ను సృష్టిస్తే? అది కూడా డబ్బు కోసం. అలా ఎవరు చేశారు? అలా తప్పు చేసిన వారు చట్టానికి ఎలా పట్టుబడ్డారు? అనే అంశాల ఆధారంగా రూపొందిన సినిమా ‘ఇదం జగత్’. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో సుమంత్, అంజు కురియన్ జంటగా నటించారు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్లు నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమాను డిసెంబర్ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘విడుదలైన టీజర్కు మంచి స్పందన లభిస్తోంది. కెరీర్లో తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు సుమంత్. సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కించాడు అనీల్. కథకు తగ్గ టైటిల్ కుదిరింది’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీచరణ్ పాకాల స్వరకర్త. -
డిసెంబర్ 14న ‘ఇదం జగత్’
మళ్ళీరావా సినిమాతో ఫాంలోకి వచ్చిన సుమంత్ హీరోగా నటిస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇదం జగత్. అంజు కురియన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించి డిసెంబర్ 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సారును పూర్తిచేసి డిసెంబర్ 14న చిత్రాన్ని ప్రేక్షకు ల ముందుకు తీసుకొస్తాం. ప్రామిసింగ్ చిత్రాల కథానాయకుడు సుమంత్ ఈ చిత్రంలో కెరీర్లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్ను సర్ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్గా నిలుస్తుంద’ని తెలిపారు. -
‘సుబ్రహ్మణ్యపురం’ షూటింగ్ పూర్తి!
‘మళ్లీ రావా’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు అక్కినేని హీరో సుమంత్. ఈ మూవీ తరువాత డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రాజెక్ట్లను పట్టాలెక్కిస్తున్నాడు. సుమంత్ ప్రస్తుతం ‘ఇదంజగత్’, ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలుచేస్తున్నాడు. వీటిలో ఇదంజగత్ టీజర్ రిలీజై వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా సుబ్రహ్మణ్యపురం షూటింగ్ కూడా పూర్తైనట్టు సుమంత్ తెలిపాడు. ఈ రెండు చిత్రాలే గాక బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తోన్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యపురం సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమంత్ 25వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు. #Subrahmanyapuram #ShootDone. Coming this November! Expect the unexpected... pic.twitter.com/oGbXojcAmm — Sumanth (@iSumanth) October 8, 2018
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
Advertisement