-
వైఎస్సార్ ఫౌండేషన్కు అందిన విరాళాలు
13-11-14 వరకు వైఎస్సార్ ఫౌండేషన్కు అందిన విరాళాలు -
బాధితుల దరికి ‘ఆపన్న హస్తం’
జగ్గంపేట : గూడు చెదిరి, గుండె చెదిరిన హుదూద్ తుపాను బాధితులకు లక్ష కిలోల బియ్యం పంపిణీ చేయాలని కంకణం కట్టుకున్న ‘వైఎస్ జగన్ ఆపన్న హస్తం’ స్వచ్ఛంద సేవాసంస్థ లక్ష్యాన్ని సాధించింది. విశాఖ జిల్లాలో తుపాను బాధితుల కడగండ్లకు చలించిన సంస్థ అధ్యక్షుడు, జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్కుమార్ వారి కోసం తలపెట్టిన ఈ బృహత్కార్యానికి అనేకులు సహకరించారు. అనుకున్న మేరకు లక్ష కిలోల బియ్యం సేకరణ పూర్తి కావడంతో 20 కిలోల చొప్పున 5 వేల కుటుంబాలకు అందించేందుకు ప్యాకెట్లలో నింపారు. వాటితో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట నుంచి గురువారం విశాఖ జిల్లాకు బయల్దేరిన పది లారీలకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జెండా ఊపారు. వాటిని యలమంచిలి, అరకు, పాడేరు తదితర ప్రాంతాలలో బాధితులకు అందజేస్తామని సంస్థ అధ్యక్షుడు నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ తుపాను బాధితులను ఆదుకోవాలన్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు భారీ ఎత్తున సేకరించిన బియ్యాన్ని గిరిజన బాధితులకు ఎక్కువగా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలోని పార్టీ నాయకులు, అభిమానులు, దాతలు బియ్యం సమకూర్చారని, ఒక్క జగ్గంపేట నియోజకవర్గం నుంచే నాలుగు లారీల బియ్యం వచ్చిందని చెప్పారు. డ్వాక్రా మహిళల కన్నీటి ఫలితమే ‘హుదూద్’ విధ్వంసం ఆడపడుచు కన్నీరు పెట్టుకుంటే అనర్థమని హైందవ ధర్మం చెబుతుందని, రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారని ఇది మంచిది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి నెహ్రూ అన్నారు. ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం హుదూద్ తుపానుకు దెబ్బ తినడానికి ఆడపడుచుల కన్నీరే కారణన్నారు. డ్వాక్రా, రైతు రుణాలు తక్షణమే మాఫీ చేయాలని తాము నిర్వహించిన ధర్నాలకు అనూహ్య స్పందన లభిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, సుంకర చిన్ని, అల్లు రాజబాబు, కత్తిపూడి శ్రీను, సీల రమణ, సోమవారం రాజు, రమణారెడ్డి, జనపరెడ్డి బాబు, జీను మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, ఒమ్మి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. అచ్యుతాపురంలో బియ్యం పంచిన నవీన్ అచ్యుతాపురం(విశాఖ జిల్లా) : ‘వైఎస్ జగన్ ఆపన్న హస్తం’ స్వచ్ఛంద సంస్థ తరఫున తూర్పు గోదావరి జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో సేకరించిన లక్ష కిలోల బియ్యం గురువారం విశాఖ జిల్లాకు చేరింది. అందు లో 30 టన్నుల బియ్యం యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తరఫున విశాఖ జిల్లాలో పలు ప్రాంతాలకు సహాయం అందిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రకటనలు చేయడం మినహా నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ప్రగడ మాట్లాడుతూ గ్రామాల్లో బాధితులను గుర్తించి సాయం అందిస్తామన్నారు. అచ్యుతాపురానికి చెందిన కొందరు బాధితులకు నవీన్ చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులు జమీల్, జంగారెడ్డి జేమ్స్, జంపన రవివర్మ, మండల వైఎస్సార్ సీపీ నాయకులు లాలం రాంబాబు, శ్రీనుబాబు, కోన లచ్చన్నాయుడు, పిన్నంరాజు వాసు, నర్మాల కుమార్, ద్వారపురెడ్డి బాపు, కొరుప్రోలు చిన్నారావు, దాసరి లక్ష్మణరావు పాల్గొన్నారు. -
విశాఖ-భీమిలి మధ్య నాలుగు లేన్ల మార్గం
విజయనగరం జిల్లా పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి చిపురుపల్లి: విశాఖపట్నం-భీమిలి మధ్య నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు గురువారం విజయనగరం జిల్లాకు వచ్చిన ఆయన గుర్ల మండలం గుజ్జంగివలసలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే ఎన్హెచ్-16 రహదారి, విశాఖ-భీమిలి మధ్య కొత్తగా ఏర్పాటు చేయబోయే నాలుగులేన్ల రహదారుల మధ్య పరిశ్రమలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. సముద్రం చిన్నచూపు చూస్తే దానిని సవాల్గా తీసుకుంటానన్నారు. గత ప్రభుత్వాలు ఇవ్వనంతగా తుపానుల కాలంలో తాను ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చానని చెప్పారు. తుపాను బాధితులకు 70 వేల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం రైతులకు ఎంతో అవసరమైన తోటపల్లి కుడిప్రధాన కాలువ పనులు ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. అలాగే అదే తోటపల్లి ప్రాజెక్టులో పవర్గ్రిడ్ ఏర్పాటు చేసి జిల్లా వాసులకు తాగునీటి కష్టాలు తీరుస్తానని అన్నారు. తుపాను నష్టాలను అంచనాలు వేస్తున్న అధికారులు పక్కాగా నష్టాలు పరిశీలించాలన్నారు. తప్పు చేసే అధికారులు ఎవరైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. పింఛన్లు, రుణమాఫీ మాటేమిటి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో పింఛన్లు, రుణమాఫీ కోసం పలువురు వృద్ధ మహిళలు, రైతులు ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి నుంచి సరైన సమాధానం లభించలేదు. గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధ మహిళలు తమకు పింఛను తొలగించారంటూ ఆయన ముందుకు వెళ్లి అడిగారు. దీంతో అక్కడే ఉన్న కలెక్టర్ వారిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరోవైపు రుణమాఫీ ఏదంటూ పలువురు రైతులు సభలో పలుమార్లు గళమెత్తారు. -
కష్టాలు వింటూ..భరోసా ఇస్తూ..
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట నాశనమైంది. పిల్లల చదువులకు, ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు ఉపయోగపడుతుందని ఆశలు పెట్టుకున్న కొబ్బరితోట నేలపాలైంది. ఇంటి పోషణకు దోహదపడుతున్న అరటి పంట, ఆదాయాన్నిచ్చే బొప్పాయి కుప్పకూలాయి. తీపినందించే చెరుకు పైరు ధ్వంసమైంది. చేపల వేటే ఆధారమైన మత్స్యకారుల పడవలు, వలలు కొట్టుకుపోయాయి. నష్టాలను కళ్లారా చూసి.. రైతులు, మత్స్యకారుల గోడు విన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండె తరుక్కుపోయింది. హుదూద్ తుపానుతో ఎంత కష్టం వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, పునరావాస సహాయమేదీ అందలేదంటూ బాధితులు మొర పెట్టుకున్నప్పుడు మరింత ఆవేదనకు లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్న బాధితులను చూసి చలించిపోయారు. వివరాలు 2లో ఠ సాక్షి ప్రతినిధి, విజయనగరం/ విజయనగరం కంటోన్మెంట్/ విజయనగరం మున్సిపాల్టీ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. సోమవారం రాత్రి జిల్లా పర్యటన ముగించి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించారు. విజయనగరం పట్టణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి నుంచి రెండో రోజు జిల్లా పర్యటన ప్రారంభించిన జగన్మోహన్రెడ్డిని పట్టణంలోని జొన్నగుడ్డివాసులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తుపాను ధాటికి ఇళ్లన్నీ ఎగిరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సాధకబాధకాలు విన్న జగన్ అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. అనంతరం విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్లే జమ్ము జంక్షన్ వద్ద సుబేధా అనే వృద్ధురాలు తనకు ఉండటానికి ఇల్లు లేదని చెప్పింది. ‘నిన్ను ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నా.. చూసేశా’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అనంతరం నాతవలస జంక్షన్ వద్ద గల హైవేపై మహిళలు, వృద్ధులు, విద్యార్థులను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా బమ్మిడి గంగమ్మ అనే వృద్ధురాలు ‘నా భర్త చనిపోయాడు.. కన్న ఇద్దరు కూతుళ్లు మనువాడి వెళ్లిపోయారు. మొన్న తుపానుతో ఉన్న గుడిసే ఎగిరిపోయింది’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది. అక్కడి నుంచి భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామంలోకి వెళ్లిన జగన్మోహన్రెడ్డికి పోతుల అచ్చియ్యమ్మ అనే వృద్ధురాలు పింఛను రావటం లేదని చెప్పగా.. కమల, దిండిరాణి తదితర మహిళలు తమ తాటాకు ఇళ్లు కూలిపోయాయని తెలిపారు. అనంతరం గూడపువలస, దల్లిపేట, బెరైడ్డిపాలెం, రెడ్డికంచేరు, దిబ్బలపాలెం, పిన్నింటిపాలెం, బోయపాలెం, ఎర్రముసలయ్యపాలెం, తోటపల్లి గ్రామాల మీదుగా తీర ప్రాంతమైన ముక్కాం గ్రామానికి జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ‘ప్రభుత్వం బాధితులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని చెప్పినా ఇప్పటికీ రాలేదు’ అంటూ వాపోయారు. పది రోజులవుతున్నా పిల్లలకు పాల ప్యాకెట్ కానీ, తాగేందుకు మంచి నీటి ప్యాకెట్లు కానీ సరఫరా చేయలేదంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దిబ్బలపాలెంలో కొబ్బరి రైతులను, మత్స్యకారులను ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. వారితో మమేకమై కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులకు పరామర్శ... అక్కడి నుంచి ముక్కాం చేరుకున్న జగన్మోహన్రెడ్డి సముద్ర అలలకు పడవలు, వలలు, ఇళ్లు కొట్టుకుపోయిన మత్స్యకారులను పరామర్శించారు. కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోగాపురం, నాతవలస జంక్షన్, కోనాడ జంక్షన్, కొప్పెర్ల, నడిపల్లి, కిలుగుపేట, వెల్దూరు మీదుగా పూసపాటిరేగ మండలం తిప్పలవలస చేరుకున్నారు. మార్గమధ్యంలో కొప్పెర్ల వద్ద పలువురు మహిళలు తమ గోడు వ్యక్తం చేశారు. ‘నాయనా పేదా రోదా అంతా ఒక్కటై ఏడుస్తున్నారు. నేను కోఆపరేటివ్ బ్యాంకు సభ్యురాలిని. నా ఇల్లు కూలిపోయింది. పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లోనే నచ్చిన సరకులిస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన నాలాంటి వాళ్లు ఎందరో కనీసం వాటర్ ప్యాకెట్కు కూడా నోచుకోలేదు నాయనా..’ అంటూ శంకాబత్తుల గోవిందమ్మ తదితర బాధితులు జగన్ చేతులు పట్టుకుని భోరున ఏడ్చేశారు. ‘మాదసలే తీరప్రాంత గ్రామం ఇక్కడకు కనీసం ఏ వాహనం రాలేదు. బయటకు వెళ్దామంటే చెట్లు కూలిపోయాయి. మాకు మంచినీళ్లు కూడా దొరకలేదు. ఎలా ఉన్నారోనని పట్టించుకునేవారే కనిపించలేద’ని వెల్దూరుకు చెందిన మహిళలు జగన్మోహన్రెడ్డి చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. ‘తిప్పలవలస, కొత్తూరు, మద్దూరు గ్రామాల్లో మూడువేల మందిమి నివసిస్తున్నాం.. మాకు బియ్యం కూడా పంపిణీ చేయలేదు’ అని బాధితులు జగన్ ముందు కన్నీరుమున్నీరయ్యా రు. అనంతరం పూసపాటిరేగ, రణస్థలం మీదుగా చీపురుపల్లి మండలం అలక నారాయణపురం, చిన నడిపల్లి, పెద్ద నడిపల్లి, పి.కె.వలసలో జగన్ పర్యటించారు. రాత్రయినా.. విద్యుత్ లేక చీకట్లు కమ్ముకున్నా.. తన పర్యటన కొనసాగించారు. బాధిత రైతులతో మమేకమయ్యారు. వారి బాధలు తెలుసుకున్నారు. పోరాడితే కానీ ప్రభుత్వం దమ్మిడీ ఇచ్చే పరిస్థితి లేదు : జగన్ బాధితుల కన్నీళ్లను, వారి ఆవేదననూ విన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి బాధలు చూసి చలించిపోయారు. వెంటనే మనందరం పోరాడదాం. పోరాడితే కానీ ఈ ప్రభుత్వం దమ్మిడీ ఇచ్చేట్టు కనిపించటంలేదు. ప్రతి అవసరాన్నీ వినిపించినా వినని ప్రభుత్వంతో పోరాడి మనకు న్యాయం జరిగేలా చేద్దాం. ఎవరూ అధైర్య పడకండి.. నేనున్నానని వారికి భరోసా ఇచ్చారు. ఆయన మాటలతో కొండంత ధైర్యం వచ్చిన జనం ఆయనవెంట నడిచారు.ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బేబీనాయన, పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, జమ్మాన ప్రసన్నకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమల వెంకటరమణ, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల శ్రీరాముల నాయుడు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, మార్క్ఫెడ్ డెరైక్టర్ సూర్యనారాయణరాజు, ఇతర నాయకులు కందుల రఘుబాబు, అవనాపు విక్రమ్, వర్రి నర్సింహమూర్తి, గర్భాపు ఉదయభాను, గొర్లి వెంకటరమణ, మజ్జి అప్పారావు, మజ్జి వెంకటేష్, రావాడ బాబు, పతివాడ అప్పలనాయుడు, బర్రి చిన్నప్పన్న, మలకుర్తి శ్రీనివాసరావు, ఎస్ఈ రాజేష్, ఆశపు వేణు, మామిడి అప్పలనాయుడు, ఇతర జిల్లాల నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి, కాళ్ల గౌరీశంకర్, నడిపేన శ్రీను, బొద్దాన అప్పారావు, పట్నాల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement