-
అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన సింగర్స్
-
మహేష్ సినిమాతో హాలీవుడ్ పై కన్నేసిన జక్కన్న
-
డయానా పోలికలు
ప్రిన్సెస్ డయానా పుట్టిన ముప్పైఏళ్లకు జన్మించిన క్రిస్టెన్ స్టెవార్ట్ ఇప్పుడు తన ముప్పై ఏళ్ల వయసులో డయానా ముప్పై ఏళ్ల వయసులోని పాత్రను పోషించబోతున్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సరళంగా చెప్పాలంటే... ప్రిన్స్చార్లెస్తో తన దాంపత్యం సవ్యంగా లేదని డయానా గ్రహించిన ఒకనాటి వీకెండ్ చుట్టూ కథను నిర్మించుకుని చిలీ దర్శకుడు పాబ్లో లారెయిన్ తీస్తున్న ‘స్పెన్సర్’ అనే చిత్రంలో క్రిస్టెన్ కథానాయికగా నటిస్తున్నారు. 20 ఏళ్ల వయసులో ప్రిన్స్ చార్లెస్తో డయానాకు పెళ్లయింది. తర్వాత పదేళ్ల కన్నా తక్కువ కాలంలోనే భర్తతో మానసికంగా ఆమె బంధం తెగిపోయింది. తెగిందని రూఢీ అయిన ఆ శని, ఆది వారాలలో డయానా మానసిక స్థితిని ఈ సినిమాలో క్రిస్టెన్ ప్రతిఫలింప జేయబోతున్నారు. బ్రిటన్ యువరాణిగా అభినయించనున్న ఈ అమెరికన్ నటి తన అత్యద్భుతమైన ప్రదర్శనను అలవోకగా ఇవ్వగలదని లారెయిన్ నమ్ముతున్నారు. బహుశా ఆ నమ్మకం రెండు కారణాల వల్ల ఆయనకు కలిగి వుండొచ్చు. ఒకటి స్టీవెన్ నైట్ స్క్రిప్టు ఇంకోటి క్రిస్టెన్ నవ్వు. ఆమె నవ్వితే అచ్చు నవ్వీనవ్వకుండా డయానా నవ్వినట్లే ఉంటుంది. -
కరోనాకు బలైన హీరోయిన్ తండ్రి
లండన్ : ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్(67) కరోనా బారిన పడి కన్నుమూశారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కొద్దిరోజుల కిత్రం కరోనా సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇతర వ్యాధుల కారణంగా కోలుకోలేకపోయిన ఆయన శనివారం మరణించారు. తండ్రి మరణించిన విషయాన్ని సోఫియా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ ఆర్ఐపీ పీటర్ మైల్స్ . మా నాన్న కొన్ని గంటల క్రితమే మరణించారు. కరోనా వైరస్ కారణంగానే ఆయన చనిపోయార’ని పేర్కొన్నారు. తండ్రి పీటర్ మైల్స్తో సోఫియా ఆసుపత్రిలో తండ్రి మృతదేహం వద్ద దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. తండ్రి ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా అభిమానులకు తెలియజేస్తున్న ఆమె కొద్దిరోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. ‘అందరినీ హెచ్చరిస్తున్నాను. కరోనా వ్యాధి సోకిన మా నాన్న ప్రత్యేక వార్డులో ఉంచబడ్డారు. అక్కడ అందరూ కరోనా బాధితులే. ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. వారిలో అందరూ వృద్ధులే. దయచేసి కరోనాను సీరియస్గా తీసుకోండ’ని ఆ వీడియాలో విజ్ఞప్తి చేశారు. కాగా, యూకేలో ఇప్పటివరకు 5,018 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 233 మంది మరణించారు. -
మరో ముగ్గురికీ కరోనా
హాలీవుడ్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఐదు రోజుల క్రితం స్టార్ కపుల్ టామ్ హ్యాంక్స్, రీటా విల్సన్ తమ కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. మరో తార ఓల్గా కురిలెంకో కూడా కరోనా బారిన పడ్డారు. సోమవారం ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. మంగళవారం నటుడు క్రిస్టోఫర్ హివ్జు కూడా తన బ్లడ్ శాంపిల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ‘ది వెండీ ఎఫెక్ట్’, ‘ది లాస్ట్ కింగ్’, ‘ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్’, ‘డౌన్హిల్’ తదితర చిత్రాల్లో నటించారు క్రిస్టోఫర్. టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో చేసిన టోర్ముండ్ పాత్ర ద్వారా క్రిస్టోఫర్ చాలా పాపులర్. ‘‘నేను, నా కుటుంబ సభ్యులు ప్రస్తుతం మా అంతట మేం గృహనిర్భందంలో ఉన్నాం. అందరం ఆరోగ్యంగా ఉన్నాం. నాకు కొంచెం జులుబు ఉంది. కరోనా లక్షణాలు కనిపించాయి. కోవిడ్–19 ప్రమాదకరమైన వైరస్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి’’ అన్నారు క్రిస్టోఫర్ హివ్జు. నటుడు ఇద్రిస్ ఎల్బా కూడా కోవిడ్ 19 వైరస్ సోకినట్లు తెలిపారు. ‘లూథర్’, ‘ది వైర్’ తదితర చిత్రాల్లో నటించారు ఎల్బా. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇంటి నుంచి బయటకు రావడంలేదని పేర్కొన్నారు. వైరస్ ఉన్న వ్యక్తికి సమీపంగా ఉండటం వల్ల తనకు కూడా సోకిందేమోననే అనుమానంతో టెస్ట్ చేయించారట ఎల్బా. పాజిటివ్ రావడంతో ఇంటికి పరిమితం అయ్యారు. ‘‘ఇది మనిషికీ మనిషికీ దూరం పాటించాల్సిన సమయం’’ అని పేర్కొన్నారు ఇద్రిస్ ఎల్బా. ‘ఫ్రోజెన్ 2’, ‘హ్యాపీ డెత్’ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ తార రేచెల్ మాథ్యూస్ తనకు కోవిడ్ 19 టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘వైరస్ సోకిందని తెలియగానే వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాను. ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే డాక్టర్లు చెప్పేవరకూ ఇంటి నుంచి బయటకు రాకూడదనుకుంటున్నాను. ఈ వ్యాధి గురించి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడగండి. ఎందుకంటే కరోనా బారిన పడ్డాను కాబట్టి ఈ స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు’’ అన్నారు రేచెల్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement