-
ప్రిన్స్ మహేష్తో కలిసి సినిమా చేస్తా..
అరసవల్లి శ్రీకాకుళం : ‘మా బావ ప్రిన్స్ మహేష్బాబుతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం కోసం ఎప్పటి నుంచో వేచిచూస్తున్నాను. త్వరలోనే మంచి కథతో ఆయనతో కలిసి సినిమా చేస్తా..’’ అని వర్ధమాన సినీ హీరో పోసాని సుధీర్బాబు అన్నారు. ‘నన్ను దోచుకుందువటే..’ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఆయన ఆదివారం ఉదయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి : ఆదిత్యుని దర్శనంపై మీ అనుభూతి...! సుధీర్బాబు: దేశంలోనే ఖ్యాతి గల అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నాను.. ఇప్పటికి స్వామి దయ కలిగింది. సాక్షి : ఇంతవరకు సినీ ప్రస్థానం ఎలా ఉంది? సుధీర్బాబు: ప్రస్థానం అంటే పెద్ద మాట. ఇప్పటి వరకు నేను కేవలం 8 సినిమాలే చేశాను. కానీ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, ప్రిన్స్ మహేష్బాబు బావగా ప్రత్యేకత ఉండడం కూడా ప్రస్తుత ఇమేజ్కు కారణమని భావిస్తున్నాను. నాకంటూ గుర్తింపు తెచ్చుకునేలా మంచి కథలనే ఎంచుకుని సినిమాలను చేయడానికి కృషి చేస్తున్నాను. చిన్న సినిమాలైనా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సాక్షి : డ్రీమ్ రోల్ ఏదైనా..! సుధీర్బాబు : డ్రీం అని ఏమీ లేదు. కానీ నాకు ఎంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ గేమ్ బ్యాక్డ్రాప్గా సినిమా చేయాలని అనుకున్నాను. ఊహించని విధంగా జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ బయోపిక్లో నటించే అవకాశం నాకు వచ్చింది. సాక్షి : మీరు కూడా చాంపియన్ కదా... సుధీర్బాబు : నిజమే..బ్యాడ్మింటన్ జూనిర్ వరల్డ్ కప్ చాంపియన్షిప్కు ప్రోపబుల్స్లో చోటుదక్కింది. పూర్వపు చాంపియన్ ప్రకాష్ పదుకొనే వద్ద శిక్షణ తీసుకున్నాను. ఇదే తరుణంలో ఒక గేమ్లో డబుల్స్లో పార్టనర్గా గోపిచంద్తో కలిసి ఆడాను కూడా.. సినిమాల్లో బిజీ అయ్యాక రూటు మారింది. నా కుమారుడు ఛరిత్ను మాత్రం బ్యాడ్మింటన్లో మంచి క్రీడాకారునిగా తయారుచేయాలనేది నా కోరిక. సాక్షి : ఛరిత్ బాలనటుడిగా అరంగ్రేటంపై ఎలా ఫీలవుతున్నారు..? సుధీర్బాబు : నిజంగా సంతోషంగా ఉంది. భలేభలే మగాడివోయ్లో చిన్నతనంలో నాని, విన్నర్లో చిన్నప్పుడు సాయిధరమ్తేజ్ పాత్రలో నటించాడు. మహేష్బాబు కూడా బాల నటుడిగా ఎదిగి ఈ రోజు స్టార్ అయ్యాడు. ఆయన కుమారుడు గౌతమ్ కూడా బాల నటుడిగా ఆరంగ్రేటం చేసేశాడు. సాక్షి : ఇక మీ సినిమాల సంగతేంటి..? సుధీర్బాబు: ‘శివ మనసులో శృతి’ (ఎస్ఎంఎస్) చిత్రంతో హీరోగా పరిచయమయ్యాను.‘ ప్రేమ కథా చిత్రమ్’ చిత్రంతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల సమ్మోహనం భారీ హిట్ అయ్యింది. మంచి కథలతో, చిన్న బడ్జెట్తో మంచి విజయాలు సాధించవచ్చునని నిరూపించిన చిత్రాలివి. త్వరలోనే ‘నన్ను దోచుకుందువటే..’ సినిమా రిలీజ్ కానుంది. విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. సాక్షి : శ్రీకాకుళంలో ఘట్టమనేని ఫ్యాన్స్ మీ పేరిట సేవాకార్యక్రమాలను చేపడుతున్నారు. దీనిపై మీ స్పందన? సుధీర్బాబు: నిజంగా మంచి ఫ్యాన్స్ నాకు ఉండటం నా అదృష్టం. సేవా కార్యక్రమాలే సామాజికంగా మనకు స్థానం కల్పిస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలోనే నా సినిమాలు బాగా ఆడుతాయి. ఇక్కడి ప్రేక్షకులకు నిజంగా రుణపడిఉన్నాం. అభిమానం పేరుతో డబ్బులు వృథా చేయవద్దు, ఫ్యాన్స్తో సుధీర్బాబు అభిమానం పేరుతో డబ్బులు వృథాగా ఖర్చు పెట్టవద్దని సినీ నటుడు సుధీర్బాబు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరానికి వచ్చిన ఆయన స్థానిక హోటల్లో ఫ్యాన్స్తో మాట్లాడారు. తన పుట్టినరోజు నాడు ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం నగరానికి వచ్చినట్లు తెలిపారు.శ్రీకాకుళం ప్రేక్షకులు కథతో కూడిన చిత్రాలను ఆదరించడం అభినందనీయమన్నారు. త్వరలో రానున్న తన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం మహేష్బాబు సేవాసమితి అధ్యక్షుడు ఉంకిలి శ్రీనువాసరావు కుమార్తె ఉంకిలి ప్రవళికా సుధీర్బాబుకు రాఖీ కట్టింది. కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. -
మరో హీరో కొడుకు ఎంట్రీ...
తెలుగు తెరకు మరో నట వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ ప్రిన్స్ మహేష్ బాబు, నాన్న హీరో సుధీర్ బాబు నుంచి నట వారసత్వాన్ని అంది పుచ్చుకుని ఈ బుల్లి నటుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో సుధీర్ బాబు తన పెద్ద కొడుకు చరిత్ మానస్ను వెండితెరకు పరిచయం చేశారు. తన తాజా చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రంలో ఓ చిన్న పాత్రలో చరిత్ నటించినట్లు హీరో సుధీర్ బాబు వెల్లడించారు. క్రైమ్, కామోడీతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే చరిత్ నటించిన విషయాన్ని సుధీర్ బాబు సినిమా రిలీజ్ అయ్యేవరకూ గోప్యంగా ఉంచటం విశేషం. 'చరిత్ మాసన్కు సినిమాలంటే చాలా ఇంట్రస్ట్, మావాడు చేసే జిమ్నాస్టిక్స్లో కొన్నింటిని నేను కూడా చేయలేను. మామయ్య మహేష్ బాబు సినిమాలో సాంగ్స్కు మూడు, నాలుగు గంటల పాటు అలిసిపోకుండా డాన్స్ కూడా చేస్తారు. ఇక స్కూల్లో అన్నింటిలోనూ ఫస్టే' అని కొడుకు గురించి చెబుతూ సుధీర్ బాబు మురిసిపోతున్నారు. లక్ష్మీనరసింహా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో సుధీర్ బాబుకు జంటగా నందిని నటించింది. కాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement