-
కేరళ: హెచ్సీఎల్ లైఫ్కేర్లో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, తిరువనంతపురం: కేరళలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువనంతపురంలోని హిందుస్తాన్ లాటెక్స్ లిమిటెడ్(హెచ్సీఎల్ లైఫ్కేర్) ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు.. డంపింగ్ యార్డ్ నుంచి మొదలైన మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఉపశమనమిచ్చే విషయం. కాగా అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ.700 కోట్ల పెట్టుబడికి రూ.2,223.9 కోట్ల రాయితీలు
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ‘చారాణా కోడికి బారాణా మసాలా’ తరహాలో ఉందని అధికారులు, పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హెచ్సీఎల్ కంపెనీపై చూపుతున్న వల్లమాలిన ప్రేమే అందుకు నిదర్శనమంటున్నారు. 12 ఏళ్లలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఈ సంస్థకు సర్కారు రూ.2,223.9 కోట్ల దాకా రాయితీలు ప్రకటించడం గమనార్హం. పోనీ ఒప్పందం ప్రకారం 7,500 మందికి ఉపాధి కల్పిసుదని చెబుతున్నారు. పెట్టుబడికి మూడు రెట్లు అదనంగా ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ పాలసీ 2014–20 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఇప్పుడు వీటికి అదనంగా హెచ్సీఎల్కు భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానికి మూడు రెట్లు కంటే ఎక్కువగా రూ.2,223.9 కోట్ల రాయితీలను ప్రభుత్వం కల్పించనుండటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే హెచ్సీఎల్ పూర్తిగా ప్రభుత్వ సొమ్ముతో నడిచే సంస్థలా ఉందటూ ఐటీ శాఖలోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భూమి ద్వారానే రూ.728.9 కోట్ల లబ్ధి విజయవాడకు సమీపంలో గన్నవరం ఎయిర్పోర్టుకు ఎదురుగా హెచ్సీఎల్కు 49.86 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మొదటి దశలో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 29.86 ఎకరాలు, రెండోదశలో రూ.50 లక్షలు చొప్పున మరో 20 ఎకరాలను ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎల్అండ్టీ మేధా టవర్స్ పక్కనే ఉన్న స్థలం కావడంతో ఇప్పుడు అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.15 కోట్లు పైనే పలుకుతోంది. అంటే 49.86 ఎకరాల భూమి విలువ రూ.747.9 కోట్లు ఉంటుంది. కానీ ఇంత ఖరీదైన భూమిని కేవలం రూ.19 కోట్లకే కేటాయిచడం ద్వారా హెచ్సీఎల్ కంపెనీకి ప్రభుత్వం రూ.728.9 కోట్ల మేర ప్రయోజనాన్ని కల్పించింది. ఇతర చోట్ల పనిచేసే సంస్థ ఉద్యోగులే విజయవాడకు తరలింపు హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెండు దశల్లో 7,500 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. మొదటి దశలో ఏడేళ్లల్లో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టి 4,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఐదేళ్లలో రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 3,500కి ఉపాధి కల్పించనుంది. ఉపాధి కల్పించిన ప్రతి ఉద్యోగికి లక్ష రూపాయల చొప్పున ఈ కంపెనీకి ప్రభుత్వం ఒకేసారి రాయితీగా చెల్లించనుంది. అంటే 7,500 మందికి లక్ష రూపాయల చొప్పున లెక్కిస్తే రూ.75 కోట్లు కంపెనీకి రాయితీ రూపంలో అందనున్నాయి. కానీ ఇక్కడ కూడా ఓ మతలబు ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిని ఇక్కడకు తరలిస్తామని హెచ్సీఎల్ పేర్కొంది. హెచ్సీఎల్ కేంద్రాల్లో 6,700 మంది తెలుగువారు పని చేస్తుండగా 627 మంది విజయవాడ వచ్చేందుకు ఆసక్తి చూపినట్లు సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి వి.వి.అప్పారావు తెలిపారు. అంటే ఇప్పటికే వివిధ చోట్ల పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులను విజయవాడ తరలించి కొత్త ఉద్యోగాల కల్పన పేరుతో రాయితీలను కంపెనీ అప్పనంగా పొందనున్నట్లు తేలిపోతోంది. శిక్షణ రాయితీలు రూ.144 కోట్లు.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత అంతర్గత శిక్షణ ఇవ్వడం పరిపాటి. కానీ హెచ్సీఎల్లో ఇలా శిక్షణ ఇస్తున్నందుకుగాను ప్రతి ఉద్యోగికి నెలకు రూ.5,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి చెల్లించనుంది. ఇందుకోసం 1,000 సీట్ల సామర్థ్యంతో హెచ్సీఎల్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శిక్షణ ఆర్నెళ్లు ఉంటుందనుకున్నా ఏటా కనీసం రెండు వేల మంది ఈ కేంద్రంలో శిక్షణ పొందనున్నారు. అంటే 12 ఏళ్లలో 24,000 మంది చొప్పున లెక్కిస్తే సుమారు రూ.144 కోట్లు హెచ్సీఎల్కు శిక్షణ రాయితీలు కింద లభించనున్నాయి. తమ సంస్థలోకి తీసుకున్న వారికి మాత్రమే ఇందులో శిక్షణ ఇవ్వనున్నట్లు హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ తెలిపారు. ఇతర రాయితీల కింద మరో వంద కోట్లు ఇవికాకుండా బ్యాంకుల నుంచి తీసుకునే రుణంపై 5% వడ్డీ రాయితీ చొప్పున మొత్తం 12 ఏళ్లలో గరిష్టంగా రూ.76 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. ఐటీ పాలసీ 2014–015 కింద స్టాంప్ డ్యూ.టీ, రిజిస్ట్రేషన్ ఫీ, వ్యాట్, సీఎస్టీ, జీఎస్టీల నుంచి 100% మినహాయింపు, 24 గంటల విద్యుత్ సరఫరా కోసం 33 కేవీ–133 కేవీ ప్రత్యేక ట్రాన్స్మిషన్ ఏర్పాటు, తక్కువ ధరకు యుటిలిటీ సర్వీసులు, రవాణా వంటి అదనపు సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటే హెచ్సీఎల్కు ఏటా కనీసం రూ.100 కోట్ల వరకు ప్రయోజనం కలగనుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 12 ఏళ్లకు రూ.1,200 కోట్ల మేర ప్రయోజనం దక్కనుంది. మొత్తంగా రాయితీలు, ఇతర ప్రయోజనాల కింద హెచ్సీఎల్ రూ.2,223.9 కోట్ల మేర లబ్ధిపొందే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
అమరావతి, విజయవాడలో హెచ్సీఎల్ క్యాంపస్లు
సాక్షి, అమరావతి: అమరావతి, విజయవాడలో సుమారు 50 ఎకరాల్లో హెచ్సీఎల్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తామని హెచ్సీఎల్ కంపెనీ చైర్మన్ శివనాడార్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. మంగళవారం సచివాలయంలో శివనాడార్ సీఎంతో సమావేశమై రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న హెచ్సీఎల్ క్యాంపస్లపై చర్చించారు. విజయవాడ విమానాశ్రయం సమీపంలో నిర్మించే కొత్త భవన డిజైన్లపై ఆయన ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కలంకారీ నేత, కొండపల్లి బొమ్మలు ప్రతిబింబించేలా హెచ్సీఎల్ కొత్త భవంతులను నిర్మిస్తామన్నారు. రూ.750 కోట్లతో రెండు దశల్లో నిర్మాణం చేపడతామని, 7,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 2019 జూన్కు విజయవాడ క్యాంపస్ సిద్ధమవుతుందన్నారు. -
వచ్చే ఏడాది జూన్ కల్లా హెచ్సీఎల్ ప్రారంభం
- ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడి - నోయిడాలో హెచ్సీఎల్ చైర్మన్ శివ నాడార్తో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడలో వచ్చే ఏడాది జూన్ కల్లా హెచ్సీఎల్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం నోయిడాలో హెచ్సీఎల్ చైర్మన్ శివ నాడార్తో సమావేశమై.. విజయవాడ, అమరావతిలో సంస్థ ఏర్పాటుకు హెచ్సీఎల్తో మార్చి 30న కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు చెందిన పత్రాలను లోకేశ్ అందజేశారు. అనంతరం హెచ్సీఎల్ వైస్ ప్రెసిడెంట్ పవన్ ధన్వార్తో కలసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రూ. 500 కోట్ల పెట్టుబడులతో ఐటీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, జీపీవో పరిశ్రమలను హెచ్సీఎల్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. అమరావతితో తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నామని, వచ్చే ఏడాది జూన్లో మొదటి విడత కార్యాలయాన్ని ప్రారంభిస్తామని స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పిస్తామని పవన్ ధన్వార్ తెలిపారు. కాగా హెచ్సీఎల్ సంస్థ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరవల్లిలో 17.86 ఎకరాల్లో మొదటి కేంద్రాన్ని ప్రారంభించనుందని, రెండో కేంద్రాన్ని ఐనవోలు గ్రామంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. -
ఆ కంపెనీకి 45 రోజుల్లోనే అనుమతులు: లోకేశ్
అమరావతి: హెచ్సీఎల్ కంపెనీకి కావాల్సిన భూమితో సహా అన్ని అనుమతులు కేవలం 45 రోజుల్లోనే ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీ రంగం గడ్డు పరిస్ధితి ఎదుర్కొంటుందని, ఇలాంటి సమయంలో హెచ్ సీఎల్ కంపెనీ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం ఐటీకి ఒక చరిత్రగా నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడు అమరావతికి హెచ్సీఎల్ కంపెనీ రావడం ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి నూతన అధ్యాయం కాబోతుందని పేర్కొన్నారు. 125 రోజుల్లోనే మొదటి భవనం నిర్మాణం పూర్తి చేస్తామని హెచ్సీఎల్ చెబుతోందని, 2018 జూన్ నాటికి మొదటి ప్రాజెక్ట్ పూర్తవనున్నట్టు తెలిపారు. కంపెనీ ఏర్పాటులో భాగంగా హెచ్సీఎల్ రూ.500 కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు. 5 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాల్లో కాలేజీల్లో ఉండగానే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మంత్రి లోకేశ్ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement